-
పెద్ది సుదర్శన్పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
వరంగల్: తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా.. ఎక్కడ లేని విధంగా నర్సంపేటలో తక్కువ ధరలో ఇంటి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి పెద్ది సుదర్శన్రెడ్డి కొత్త చరిత్ర సృష్టించారని రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నర్సంపేటలో పర్యటించిన కేటీఆర్ మాట్లాడుతూ.. కార్యకర్త నుంచి సర్పంచ్, జడ్పీటీసీ, ఎమ్మెల్యే అయి పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నాడని తెలిపారు. రూ. 100 కోట్ల పై చిలుకు నిధులను మంజూరు చేపించుకొని నర్సంపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. ఎక్కడ కలిసిన నర్సంపేట అభివృద్ధి గురించే ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతారని తెలిపారు.14 ఏళ్ల పాటు కొట్లాడి రోడ్లలకి ఎక్కి రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. బంగారు తెలంగాణ కోసం ఒక్కో అడుగు వేసుకుంటూ పోతున్నామని అన్నారు. 75ఏళ్ల భారత దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంటి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత మన తెలంగాణదని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక నర్సంపేటలో 2 ఇరిగేషన్ ప్రాజెక్టులను మంజూరు చేసుకొని రూ. 670 కోట్ల రూపాయలను వెచ్చించి 60 వేల ఎకరాలకి నీళ్లు ఇచ్చామని తెలిపారు. 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఒక్కో రైతుకి పెట్టుబడి సాయంగా రూ. 5000 ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తుచేశారు. నర్సంపేటలో పసుపు, పత్తి, మిర్చి బాగా పండుద్దని, వివిధ పంటల కోసం త్వరలో ఆహారశుద్ధి ఫ్యాక్టరీ ఇస్తామని తెలిపారు. మిగిలిపోయిన అభివృద్ధి పనుల కోసం త్వరలో రూ. 50 కోట్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. -
20న గ్రేటర్ అధ్యక్షుని ఎన్నిక: పెద్ది సుదర్శన్రెడ్డి
హైదరాబాద్: ఈ నెల 20న గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి పెద్ది సుదర్శన్రెడ్డి వెల్లడించారు. శనివారం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ మైనంపల్లి హన్మంతరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ క్రియాశీల, సాధారణ సభ్యత్వం 55.65 లక్షలకు చేరిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల కమిటీలకు అధ్యక్షులు, అనుబంధ సంఘాలకు ఎన్నికలు పూర్తైట్లు వివరించారు. మంత్రి మహేందర్రెడ్డి ఎన్నికల పరిశీలకునిగా హాజరవుతారని, మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement