-
అందరూ చూస్తుండగానే ..గుండెపోటుతో ఈకామర్స్ సంస్థ సీఈవో హఠాన్మరణం
అప్పటి వరకు నవ్వుతూ, సరదాగా ఉంటున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అందరితో కలివిడిగా ఉన్న వారు అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా, ప్రముఖ ఫర్నీచర్,హోమ్ డెకార్ ఈకామర్స్ సంస్థ పెప్పర్ ఫ్రై కో-ఫౌండర్ అంబరీష్ మూర్తి గుండె పోటుతో కన్నుమూశారు. అంబరీష్కు రైడింగ్ అంటే మహా ఇష్టం. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఢిల్లీ నుంచి లేహ్కు బైక్ రైడ్ చేస్తుండేవారు. ఈ క్రమంలో ఎప్పటిలాగా లేహ్కు వెళ్లిన ఆయన అక్కడ అందరు చూస్తుండగానే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హార్ట్ అటాక్తో ఆయన కన్నుమూసినట్లు పెప్పర్ ఫ్రై మరో కో-ఫౌండర్ ఆశిష్ ట్వీట్ చేశారు. Extremely devastated to inform that my friend, mentor, brother, soulmate @AmbareeshMurty is no more. Lost him yesterday night to a cardiac arrest at Leh. Please pray for him and for strength to his family and near ones. 🙏 — Ashish Shah (@TweetShah) August 8, 2023 2012లో అంబరీష్ మూర్తి, అశిష్తో కలిసి పెప్పర్ఫ్రైను స్థాపించారు. 2020 నాటికి ఆ సంస్థ విలువ 500 మిలియన్లుగా ఉంది. అదే ఏడాది 8 రౌండ్లలో 244 మిలియన్ల పెట్టుబడులన్ని సంపాదించింది. ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో గోల్డ్మన్ సాచ్స్, బెర్టెల్స్మాన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. క్రంచ్ బేస్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ పూర్తి చేశారు. ఐఐటీ కోల్కత్తా పూర్వ విద్యార్ధి. గ్రాడ్యుయేషన్ సమయం నుంచి ఎంట్రప్రెన్యూషిప్లో మెళుకువలు సంపాదించారు. కాలేజీకి వెళ్లే సమయంలో ఇంట్లో ట్యూషన్లు చెప్పడం ప్రారంభించారు. అదే సమయంలో పాఠశాల విద్యార్ధులకు టూటర్లను అనుసంధానం చేస్తూ ట్యూటర్స్ బ్యూరో అనే సంస్థను ప్రారంభించారు. రెండేళ్ల పాటు ఆ వ్యాపారాన్ని నిర్వహించారు. ఇదీ చదవండి : ఆనంద్ మహీంద్రాకు వేలకోట్లు అలా కలిసొచ్చాయ్! -
హైదరాబాద్లో..మరో పెప్పర్ఫ్రై స్టోర్!
• 6 నెలల్లో దేశంలో మరో 10 స్టోర్ల ఏర్పాటు • ఐదేళ్లలో రూ.1,000 కోట్ల నిధుల సమీకరణ • పెప్పర్ఫ్రై సీఎంఓ కశ్యప్ వాడపల్లి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై కేంద్రంగా ఆన్లైన్ హోం ఫర్నిషింగ్ సేవలందిస్తున్న పెప్పర్ ఫ్రై వచ్చే ఆరు నెలల్లో దేశంలో మరో 10 ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం బంజారాహిల్స్లో ఉన్న స్టోర్తో పాటు కొత్తగా గచ్చిబౌలిలో మరో స్టోర్ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కశ్యప్ వాడపల్లి చెప్పారు. మిగిలినవి బెంగళూరు, ముంబై, చండీగఢ్లలో రానున్నట్లు తెలిపారు. ‘పెప్పర్ ఫ్రై హోం ఫర్నీషింగ్ షాపింగ్ ట్రెండ్స్-2016’ను విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జూలైలో రూ.210 కోట్ల నిధులను సమీకరించామని, వీటితో కలిపి ఐదేళ్లలో రూ.1,000 కోట్ల నిధులను సమీకరించామని తెలియజేశారు. మరో 12-18 నెలల్లో బ్రేక్ ఈవెన్కు చేరుకుంటామన్నారు. ప్రస్తుతం దేశంలో హోం ఫర్నిషింగ్ మార్కెట్ 25 బిలియన్ డాలర్లుగా ఉందని.. ఇందులో సంఘటిత రంగ వాటా 10 శాతం కంటే తక్కువేనని తెలియజేశారు. ‘‘30 లక్షల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకున్నారు. మరో 10 లక్షల మందికి ఆర్డర్లను డెలివరీ చేయాల్సి ఉంది. ముంబై, జోధ్పూర్, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో గిడ్డంగులున్నాయి. అన్నీ ఆటోమేటెడ్వే. ప్రస్తుతం మా సంస్థలో 10 వేల మంది వ్యాపారులు నమోదై ఉన్నారు. వీరిలో 3 వేల మందే క్రీయాశీలంగా ఉన్నారు’’ అని వివరించారు. షాపింగ్ ట్రెండ్స్ సర్వే గురించి మాట్లాడుతూ.. తమ కస్టమర్లలో 35 ఆపైన వయసున్న వారే ఎక్కువగా ఉన్నారని.. అన్ని ఆర్డర్లూ రాత్రి 9 గంటల తర్వాతే వస్తున్నట్లు తేలిందని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఎక్కువగా కింగ్ సైజ్ బెడ్స్, చెన్నై నుంచి స్టైలిష్ ఫర్నిచర్, బెంగళూరు నుంచి స్టడీ ల్యాంప్స్, ఢిల్లీ నుంచి బ్రాండెడ్ ఫర్నిచర్, ముంబై నుంచి బార్ యూనిట్స్, కోల్కత్తా నుంచి బుక్ షెల్ఫ్స్, చండీగఢ్ నుంచి వాల్ షెల్ఫ్స్, గోవా నుంచి డైనింగ్ సెట్స్, మధురై నుంచి కాంటెంపరరీ ఫర్నిచర్, జైపూర్ నుంచి షాండ్లియర్స్ ఎక్కువగా కొనుగోలు చేసినట్లు సర్వేలో తేలిందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement