-
భావాలను నేరుగా వ్యక్తీకరించాలి
-
భావాలను నేరుగా వ్యక్తీకరించాలి
హైదరాబాద్ : ఆధునిక సమాజంలో చాలామంది తమ భావాలను నేరుగా వ్యక్తీకరించడం మరచి... టైప్ చేయడం, బొమ్మలతో వ్యక్తం చేయడం చేస్తున్నారని, ఇది సరికాదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మహాత్రియ రా పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లోని పార్క్ హోటల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో), హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్స్’పేరుతో ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ సభ్యులతో పాటు, వారి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్రియా రా మాట్లాడుతూ... భావ వ్యక్తీకరణ నేరుగా హావభావాలతో ఆచరణలో చూపించాలన్నారు. అప్పుడే అనుబంధాలు నాలుగు కాలాల పాటు ఉంటాయని తెలిపారు. కుటుంబం కోసం సమయం వెచ్చించాలని, కుటుంబసభ్యుల మధ్య నిందలు కాకుండా పొగడ్తలు మాత్రమే ఉండాలని చెప్పారు. దైవం మన ఇంట్లోనే ఉన్నారని, ఇంట్లో వారిని సంతోషానికి గురి చేయాలని చెప్పారు. వృత్తిలో కస్టమర్ మెప్పు కోసం ఏమైనా చేస్తామని.. అదే ఇంట్లోవారి కోసం కూడా చేయాలన్నారు. కుటుంబ వ్యవస్థలోని బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. కుటుంబ వ్యవస్థ పటిష్టతకు సంబంధ బాంధవ్యాలే పునాది అన్నారు. పిల్లలను స్పర్శ ద్వారా ప్రేమపూర్వకంగా దగ్గరికి తీసుకోవాలని తెలిపారు. ఇవి పాటిస్తే రాబోయే రోజుల్లో పుస్తకాలు చదివి సంబంధ బాంధవ్యాలు పెంచుకొనే దౌర్భాగ్య పరిస్థితి పట్టకుండా ఉంటుందన్నారు. ఎంతటి టెక్నాలజీ అభివృద్ధి చెందిన చేతిరాత మరవొద్దని, అది బ్రెయిన్ రైటింగ్ అని తెలిపారు. రాతను బట్టి అతని మనస్తత్వం చెప్పవచ్చని తెలిపారు. ఎఫ్ఐసీసీఐ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ ప్రియాంక గనెరివాల్ అరోరా మాట్లాడుతూ... ఆరు లక్షల రూపాయలు వెచ్చించి 1,000 మంది విద్యార్థినులకు హ్యాపీ ఉమెన్స్ కిట్స్ను త్వరలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్వో జాతీయ అధ్యక్షురాలు పింకీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో శిల్పాశెట్టి
-
శ్రీవారి సేవలో శిల్పాశెట్టి
తిరుమల: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం కల్యాణం విరామ సమయంలో వారు స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం శిల్పాశెట్టి, పింకీరెడ్డి లు ఆలయం వెలుపల సెల్ఫీలు తీసుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- షుగర్ పేషెంట్స్ పళ్లు తినకూడదా? తింటే ఏవి తినాలి?
- పవన్ కల్యాణ్కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
Advertisement