-
తాగునీటి సమస్యకు చెక్
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకానికి జడ్చర్ల మున్సిపాలిటీని ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.47కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మరో 20ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా పనులు చేపట్టనున్నారు. మున్సిపాలిటీలోని కావేరమ్మపేట, జడ్చర్ల, బూరెడ్డిపల్లి, నాగసాల, నక్కలబండతండ, శంకరాయపల్లి తండాలు విలీనమయ్యాయి. విలీన గ్రామాల్లో కొంత నీటి సమస్య ఉంది. అమృత్ 2.0 పథకంలో మంజూరైన రూ.47కోట్ల ద్వారా అన్ని గ్రామాల్లోనూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. మున్సిపాలిటీలో లక్షా 10వేలకుపైగా జనాభా ఉండగా, 17వేలకుపైగా ఇళ్లున్నాయి. ప్రస్తుతం 9వేలకుపైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలో ప్రస్తుతం 20ట్యాంకులు ఉండగా, 200 కిలోమీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేశారు. సామాజిక కార్యకర్తకు సమాచారం.. పట్టణంలోని సామాజిక కార్యకర్త కంచుకోట ఆనంద్ పలు సమస్యలపై ఉన్నతాధికారులకు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాయటం పరిపాటిగా మారింది. ఆ లేఖల్లో నీటి ప్రాజెక్టు అమృత్ 2.0 ఒకటి. అయితే ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్లుగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ సెక్రెటరి పి.ఏ.లతిక సామాజిక కార్యకర్తకు లేఖను పంపించటం గమనార్హం. రియల్ వెంచర్లతో పెరుగుతున్న సమస్య మున్సిపాలిటీ పరిధిలో కొంతకాలంగా వెలుస్తున్న రియల్ వెంచర్ల వల్ల నీటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వాస్తవానికి వెంచరు దారులే ప్రతి ఇంటికి నీటి సౌకర్యం వసతి కల్పించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు వేయకపోవటంతో మున్సిపాలిటీపై భారం పడుతుంది. కొత్తకాలనీలకు నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి వల్లే మిషన్ భగీరథ పథకం అమలు చేస్తున్నప్పటికీ సమస్యలు వస్తూనే ఉన్నాయి. అమృత్ 2.0లోఇవీ ప్రతిపాదనలు.. అమృత్ 2.0 పథకం ద్వారా మంజూరైన నిధులతో మున్సిపాలిటీలో కింది పనులు చేపట్టనున్నారు. నూతనంగా 53 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల 6 ఓవర్హెడ్ ట్యాంకులు, 30వేల లీటర్ల సామర్థ్యం కల 1స్లంప్ నిర్మించనున్నారు. 2.5కి.మీటర్ల మేర ఫీడర్ పైప్లైన్ వేయనున్నారు. ఇంటింటికీ నీటిని సరఫరా చేసేందుకు గానూ 62.5 కి.మీటర్ల మేర పైప్లైన్ వేయనున్నారు. అదేవిధంగా 7,954 నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయటంతోపాటు టెండర్లు పిలిచారు. టెండరు ప్రక్రియ పూర్తికాగానే పనులు మొదలు పెట్టనున్నారు. -
ఏడాదిలో 2 లక్షల ఎకరాలకు నీరు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించి చేపట్టిన ప్యాకేజీ–21లోని పైప్లైన్ వ్యవస్థ నిర్మాణ పనుల వేగిరంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రాజెక్టులోని కీలక పనులన్నీ ముగింపు దశకు వస్తుండటం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి లభ్యత పెంచిన నేపథ్యం లో ఈ పైప్లైన్ పనులను వేగిరం చేసి ఏడాదిలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది. కనీసం 2 లక్షల ఎకరాల మేర సాగునీరు వృద్ధిలోకి వచ్చే అవకాశాలుండటంతో పనులను సత్వరమే పూర్తి చేసే లక్ష్యంగా ఇంజనీర్లను మార్గదర్శనం చేసేందుకు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ సోమ వారం ప్యాకేజీ–21 పరిధిలో పర్యటించనున్నారు. భూగర్భంలో పైపులైన్లు ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఫోర్షోర్ నుంచి నీటిని తీసుకుంటూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు కోరుట్ల ప్రాంతాలకు నీరిచ్చేలా కాళేశ్వరంలో ప్యాకేజీ–20, 21, 21(ఎ) పనులు చేపట్టా రు. ప్యాకేజీ–20లో ఎస్సారెస్పీ ఫోర్ షోర్ నుంచి అప్రోచ్ చానల్, 17.81 కి.మీ. టన్నెల్, 30 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న 3 మోటార్లతో పంప్హౌస్ నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. రూ. 892 కోట్ల తో చేపట్టిన ఈ పనులు 80% వరకు పూర్తయ్యా యి. ఇక్కడి నుంచి మాసాని చెరువులోకి నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి 2 పంప్హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోసి, పైప్లైన్ వ్యవస్థ ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా పనులు చేపట్టారు. సాధారణంగా కాల్వల నిర్మాణం చేపడితే భూసేకరణ 7 వేల నుంచి 8 వేల ఎకరాలు చేయాల్సి ఉంటుంది. అదే పైప్లైన్ వ్యవస్థ అయితే భూమిలో ఒకటిన్నర మీటర్ల కింద భూగర్భాన పైప్లైన్ను ఏర్పాటు చేస్తారు. ప్యాకేజీ–21 పనులను రూ.610 కోట్లతో చేపట్టగా, 30 శాతం పూర్తయింది. టన్నెళ్ల నిర్మాణం, కాల్వల పనులు పూర్తి చేయాలి. ప్యాకేజీ–21(ఎ) కీలకం కాగా దీన్ని రూ. 2,623 కోట్లతో చేపట్టారు. దీనిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. ఈ పనులు ఇప్పుడిప్పుడే పుంజుకున్నాయి. భూసేకరణ సమస్య వల్ల ఆటంకం ఎదురవుతోం ది. రెండు పంప్హౌస్ల నిర్మాణం, 10 నుంచి 8 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్ల ఏర్పాటు చేయాలి. ఈ పనులు వేగంగా చేయాల్సి ఉండగా, భూగర్భ పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయి. 90 కి.మీ. మేర పైప్లైన్ పూర్తి చేయాల్సి ఉండగా, ఇందులో కొంత పని పూర్తయింది. వీటిని వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. చిన్నచిన్న అవాంతరాలు, భూసేకరణ సమస్యలుండటంతో వాటి పరిష్కారానికి స్మితా సబర్వాల్ సోమవారం ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. పనుల వేగిరానికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శనం చేయనున్నారు. కన్నెపల్లిలో ‘స్పైరల్’ పనులు ముమ్మరం కాళేశ్వరం ప్రాజెక్టుకు రానున్న ఆరు మోటార్లు కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్హౌస్లో సీఎం కేసీఆర్ ఆదేశాలతో నీటి లభ్యతను బట్టి మరో టీఎంసీని అదనంగా ఎత్తిపోయడానికి సరిపడా మోటార్లు బిగించడానికి ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. పనులు త్వరగా పూర్తి చేయడానికి ఇంజనీర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించడానికి కన్నెపల్లి పంపుహౌస్లో 11 మోటార్లు బిగించి వెట్, డ్రై రన్లు పూర్తి చేశారు. ప్రస్తుతం నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీలో 85 గేట్లు మూసివేసి బ్యాక్వాటర్ను అక్కడి మోటార్లతో ఎత్తిపోస్తూ గ్రావిటీ కాల్వద్వారా అన్నారంలోని సరస్వతీ బ్యారేజీని నింపుతున్నారు. మరో టీఎంసీని తరలించడానికి అదనంగా 6 మోటార్లు బిగించడానికి పనులు సాగుతున్నా యి. ఇందులో స్పైరల్ కేసింగ్ పనులు 3 మోటార్లకు పూర్తికాగా, మరో 3 మోటార్ల పనులు జరుగుతున్నాయి. మొత్తం 6 మోటార్లకు 12 కి.మీ. వరకు పైపులైన్ నిర్మించాల్సి ఉండగా.. 9 కిలోమీటర్ల మేర పైపులైన్ పూర్తయింది. అదనపు టీఎంసీ తరలింపునకు ఆస్ట్రియా, ఫిన్లాండ్ దేశా ల నుంచి 6 మోటార్లను తెస్తున్నారు. ఇవి సకాలంలో వస్తే మార్చి చివ రికి 3 టీఎంసీల నీటిని తరలించవచ్చని అధికారులు చెబుతున్నారు. -
నిర్మల్ జిల్లా మోడల్ కాలనీలో లీకైన పైప్ లైన్
-
సాగు నీరివ్వాలని పైపును పగులగొట్టారు
పాలకుర్తి (రామగుండం): సాగునీరు ఇవ్వడంలేదని ఆవేదన చెందిన రైతులు ఏకంగా పైప్లైన్ జాయింట్ను తొలగించారు. దీంతో నీరు 50 మీటర్ల ఎత్తులో ఎగిసిపడింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలం నందిమేడారం చెరువుకు వెళ్లే ప్రధాన పైపులైన్ వాల్వ్ను పాలకుర్తి మండల పరిధిలోని మారేడుపల్లి గ్రామ శివారులో పగులగొట్టారు. వాల్వ్కవర్ బోల్టులను తీసివేయడంతో నీరు 60 ఎంహెచ్పీ వేగంతో దాదాపు 50 మీటర్ల ఎత్తులో ఎగిసిపడింది. సోమవారం వరకు నీటి ఉధృతి కొనసాగింది. విషయం తెలుసుకున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్ఈ విజయభాస్కర్రావు, ఇతర ఇరిగేషన్ అధికారులు మోటార్ల సరఫరా నిలిపివేసి మరమ్మతు చర్యలు చేపట్టారు. అక్కడకు చేరుకున్న రైతులు.. నీరు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని, సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్థానిక గ్రామాలకు నీరిచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని డిమాండ్ చేశారు. -
పైప్లైన్ లీక్ ,భారీగా నీరు వృథా
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement