-
డెంగీ బూచి.. రోగులను దోచి..
సాక్షి, నంద్యాల(కర్నూలు) : నంద్యాల పట్టణంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ పేరిట దోపిడీ సాగుతోంది. జ్వరమని వెళితే చాలు..ప్లేట్లెట్లు తగ్గాయని, డెంగీ ఉండొచ్చంటూ భయపెడుతున్నారు. రకరకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని వేలాది రూపాయలు దండుకుంటున్నారు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా విష జ్వరాలు ఎక్కువయ్యాయి. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగాన పల్లె, నందికొట్కూరు, ఆత్మకూరు నియోజక వర్గాల ప్రజలు ఎక్కువగా నంద్యాలకు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అనుమతి లేకున్నా.. వాస్తవానికి నంద్యాలలోని ఏ ఒక్క ప్రైవేటు ఆసుపత్రికీ డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయడానికి అనుమతి లేదు. పైగా ఏ ఆసుపత్రిలోనూ అందుకు అవసరమైన పరికరాలు కూడా లేవు. నంద్యాల, కర్నూలు ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే డెంగీ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. ఈ వైద్య పరీక్ష కిట్లు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఆగస్టులో 1,200 మందికి డెంగీ పరీక్షలు చేశారు. ఒక్కరికీ వ్యాధి నిర్ధారణ కాలేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా.. పట్టణంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు మాత్రం ‘డెంగీ నిర్ధారణ పరీక్ష చేశాం, మీకు పాజిటివ్ వచ్చిందం’టూ రోగులను బెంబేలెత్తిస్తున్నారు. రోగులు విధిగా ఆసుపత్రిలో చేరేలా, వారు చెప్పిన వైద్యపరీక్షలన్నీ చేయించుకునేలా ప్రేరేపిస్తున్నారు. ఐసీయూలో ఉంచి అడ్డంగా దోపిడీ కొన్ని ఆసుపత్రుల్లో దోపిడీ మరీ శ్రుతిమించుతోంది. జ్వరం తగ్గే వరకు రోగులను బలవంతంగా ఐసీయూలో ఉంచుతున్నారు. ఇందుకు గాను రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఐసీయూలో ఉంచిన తర్వాత ప్రత్యేక గదికి మార్చి.. అక్కడ కూడా కనీసం వారం రోజులు ఉంచుతున్నారు. అలాగే మందుల చీటీపై ఖాళీ ఎంత ఉంటుందో అన్ని రకాల ఔషధాలు రాస్తున్నారు. సదరు ఆసుపత్రి మెడికల్ స్టోర్లోనే కొన్పిస్తున్నారు. ఇలా రోగి స్థోమతను బట్టి ఎంత వీలైతే అంత గుంజుతున్నారు. ఒక్కో రోగి కనీసం రూ.30 వేల నుంచి రూ.లక్ష దాకా సమర్పించుకోవాల్సి వస్తోంది. ప్లేట్లెట్లు తగ్గినంత మాత్రాన.. సాధారణంగా మనిషి రక్తంలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల ప్లేట్లెట్లు ఉంటాయి. అనారోగ్యానికి గురైనప్పుడు ఇవి కొంతమేర తగ్గుతుంటాయి. సాధారణ జ్వరాల్లోనూ ఈ పరిస్థితి ఉంటుంది. డెంగీ బారిన పడితే మాత్రం బాగా తగ్గుముఖం పడతాయి. 20 వేల కంటే దిగువకు పడిపోయి.. కళ్లు, మూత్రంలో రక్తం రావడం, జ్వరం ఎంతకీ తగ్గకపోవడం, శరీరంపై దద్దుర్లు, తీవ్ర తల నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పించినప్పుడు మాత్రమే ఆందోళన చెందాల్సి ఉంటుంది. డెంగీ నిర్ధారణ ఇలా.. డెంగీ అనే అనుమానం ఉంటే ఎన్ఎస్–1, ఐజీఎం పరీక్షలు చేస్తారు. పాజిటివ్గా నివేదిక వస్తే ఎలిసా పరీక్ష చేసి..నిర్ధారిస్తారు. కొన్నిసార్లు మొదటి, రెండు పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా..ఎలీసా పరీక్షలో నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రైవేటు ఆసుపత్రికి డెంగీ అనుమానిత రోగి వెళ్తే వెంటనే జిల్లా వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలి. అలా కాకుండా ప్రైవేటు వైద్యులు కొందరు రోగులను భయపెట్టి వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ ఆర్థికంగా దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ అని నిర్ధారిస్తే చర్యలు నంద్యాల చుట్టుపక్కల ఏ ప్రైవేటు ఆసుపత్రికీ డెంగీ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే డెంగీ అనుమానితుల వివరాలను వెంటనే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు తెలియజేయాలి. వెంటనే అవసరమైన వైద్యపరీక్షలు చేయిస్తాం. ఎలిసా వంటి పరీక్షలు చేసి, పాజిటివ్ అని తేలితేనే డెంగీగా గుర్తిస్తాం. దాంతో పాటు రోగి నివాసం ఉండే పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని సంబంధిత విభాగాల అధికారులకు సూచిస్తాం. అలా కాకుండా కార్పొరేట్, ప్రైవేటు వైద్యశాలల్లో డెంగీగా నిర్ధారించినట్లు తేలితే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. నంద్యాల ఆసుపత్రిలో ఇంత వరకు ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. ప్లేట్లెట్లు తగ్గినంత మాత్రాన అది డెంగీగా భావించవద్దు. –డాక్టర్ రామకృష్ణారావు, డీసీహెచ్ఎస్, నంద్యాల వాస్తవాలు ఇవీ.. ⇔ నంద్యాలలో ఏ ప్రైవేటు ఆసుపత్రికీ డెంగీ నిర్ధారణ పరీక్ష చేయడానికి అనుమతి లేదు. ⇔ నంద్యాల, కర్నూలు ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. ⇔ నంద్యాల ప్రాంతంలో మూడు నెలలుగా ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. ⇔ ప్లేట్లెట్లు తగ్గినంత మాత్రాన డెంగీ కాదు. సాధారణ జ్వరపీడితుల్లోనూ ఈ లక్షణం కన్పిస్తుంది. దగ్గు, జ్వరానికే రూ.70 వేలు 247 ఏళ్ల వయస్సుండే ఓ ప్రైవేటు ఉద్యోగి దగ్గు, జ్వరంతో నంద్యాల వన్టౌన్ ఏరియాలోని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్లు శ్రీనివాస సెంటర్లోని ఓ ప్రైవేటు ల్యాబ్కు పంపి వైద్యపరీక్షలు చేయించారు. ప్లేట్లెట్లు 50 వేలు ఉన్నట్టు రిపోర్టు వచ్చింది. దీంతో వైద్యులు మూడు రోజుల పాటు ఐసీయూలో ఉంచి, అనంతరం మరో వారం రోజులు జనరల్వార్డులో ఉంచుకుని రూ.70 వేలు వసూలు చేశారు. మరో 10 రోజులకు మందులు రాసిచ్చి పంపారు. ప్లేట్లెట్లు తగ్గాయని రూ.40 వేల వసూలు 2నంద్యాల గిరినాథ్ సెంటర్ ప్రాంతంలో ఉండే పదేళ్ల బాలికకు పది రోజుల క్రితం జ్వరమొచ్చింది. రెండు రోజుల పాటు జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు సంజీవనగర్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ టైఫాయిడ్, మలేరియా, ప్లేట్లెట్ కౌంట్ పరీక్షలు రాశారు. ప్లేట్లెట్లు 60 వేలకు తగ్గకూడదని, మీ పాపకు 55 వేలు ఉన్నాయని, డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని భయపెట్టారు. చేసేది లేక చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించగా.. వారం రోజులు ఉంచుకుని రూ.40 వేల బిల్లు వేశారు. -
ఆపన్నుల ఆపద్బంధు విమ్స్ బ్లడ్ బ్యాంకు
బళ్లారి (తోరణగల్లు), న్యూస్లైన్ : రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి తీవ్ర రక్తస్రావమైంది. రక్తం ఎక్కిస్తేగాని బతకడని వైద్యులు తేల్చేశారు. మరో పసిపాపకు డెంగీ సోకింది. రక్తంలోని ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి. ప్లేట్లెట్స్ ఎక్కిస్తేగాని పాప కోలుకోని పరిస్థితి. ఓ గర్భిణీ ప్రసవానికి వచ్చింది. రక్తం ఎక్కిస్తే గాని ఆమె సురక్షితమైన కాన్పు అయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోగుల బంధువులు లబోదిబోమంటున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆపద్బాంధవుడిగా విమ్స్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకు నిలిచింది. రక్తదాన శిబిరాల ద్వారా దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ఎంతోమంది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రోగులకు ఇచ్చి అభయహస్తం అందించింది. 2012-13వ ఏడాదిలో అత్యధికంగా రక్తం యూనిట్స్ను సేకరించి రాష్ట్రంలో ద్వితీయస్థానంలోను, గుల్బ ర్గా జోన్లో ప్రథమ స్థానంలో ఈ బ్లడ్బ్యాంక్ నిలిచింది. దీనికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1న బెంగుళూరులోని చౌడయ్య హాలులో రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి యు.టి. ఖాదర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం కూడా దక్కింది. రాష్ట్రంలో ద్వితీయస్థానం 2012-13వ ఏడాదిలో విమ్స్ బ్లడ్బ్యాంకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 77 రక్తదాన శిబిరాల ద్వారా 3,417 యూనిట్ల (సీసా) రక్తాన్ని సేకరించి, గుల్బర్గా జోన్లో అత్యధిక రక్త సేకరణ బ్లడ్బ్యాంకుగా ప్రథమ స్థానాన్ని, రాష్ట్రంలో ద్వితీయస్థానాన్ని సాధించింది. గత మాసం జిందాల్లోని ఇందు ప్లాంట్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ద్వారా అత్యధికంగా 575 యూనిట్ల రక్తాన్ని సేకరించింది. 2013 జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు 65 శిబిరాల ద్వారా 8039 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఈ యేడాది రాష్ట్రంలో అత్యధికంగా యూనిట్లు సేకరించిన సంస్థగా నిలిచినట్లు విమ్స్ సంచాలకుడు డా.లక్ష్మినారాయణరెడ్డి, బ్లడ్బ్యాంకు వైద్య ప్రముఖులు డా.బిందు, డా.షఫి తెలిపారు. సేకరించిన రక్తాన్ని ప్యాక్డ్సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాజ్మా, క్రమోప్రిసిపేట్గా విభజించి ఆయా వ్యాధిగ్రస్తులకు అవసరమైన రక్తాన్ని అందిస్తున్నారు. ఐదు జిల్లాలకు ఆసరాగా విమ్స్ బ్లడ్ బ్యాంకు కర్ణాటకలోని బళ్లారి, కొప్పళ, రాయచూరు సరిహద్దులోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన రోగులకు విమ్స్ బ్లడ్ బ్యాంకు ఆపద్భాంధవుడిగా నిలిచింది. ఈ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రోగులు వస్తుండటంతో విమ్స్ బ్లడ్బ్యాంకు 24 గంటలు సేవలందించేలా చర్యలు చేపట్టాం. గుల్బర్గా జోన్లో ప్రథమ స్థానంలో, రాష్ట్రంలో ద్వితీయస్థానంలో నిలవడం మరింత గర్వంగా ఉంది. - డాక్టర్ లక్ష్మినారాయణరెడ్డి, విమ్స్ సంచాలకుడు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement