-
పోడు భూములపై అటవీ సిబ్బంది దౌర్జన్యం
టేకులపల్లి : మండలంలోని చింతోనిచెలక పంచాయతీ చింతోనిచెలక తండాలో అటవీ శాఖాధికారులు ఓ గిరిజనుడి పంట చేనుపై గురువారం దాడికి పాల్పడ్డారు. ఆదివాసీ దినోత్సవం రోజే గిరిజనుడి పంటను ధ్వంసం చేసి ఆ కుటుంబాన్ని శోకంలో ముంచెత్తడం గమనార్హం. బాధిత రైతు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. చింతోనిచెలక తండాకు చెందిన సుమారు 26 మంది రైతులు కొన్నేళ్ళ క్రితం పోడు కొట్టుకుని సాగు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో రైతులందరూ పత్తి పంట వేశారు. మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇదే గ్రామానికి చెందిన మాలోత్ బాలాజీ గురువారం భార్య, తల్లితో కలిసి చేలో కలుపు తీస్తున్నారు. అటవీ అధికారులు, సిబ్బంది పది మంది బృందం మూకుమ్మడిగా బాలాజీ చేనులో దాడికి పాల్పడ్డారు. అధికారులను వేడుకున్నా.. హరితహారం మొక్కలు నాటాలని చెబుతూ చేను లో ఉన్న పత్తి మొక్కలన్నింటినీ పీకేశారు. బాధిత రైతు బాలాజీ, ఆయన భార్య, తల్లి అధికారుల కాళ్లపై పడి బతిమిలాడినా వినలేదు. వారిని పక్కకు నెట్టేసి మొక్కలను పీకేశారు. పంటను నాశనం చేయొద్దని , తమ కుటుంబానికి అదే జీవనాధారమని ఎంత వేడుకున్నా వినకుండా పత్తి పంటను ధ్వంసం చేశారు. ఇదే గ్రామానికి చెందిన రైతులందరి పోడు భూములు అక్కడే ఉన్నాయి. కేవలం బాలాజీ భూమిలోనే హరితహారం మొక్కలు నాటేందుకు పూనుకోవడం విశేషం. తమకు న్యాయం చేయాలని కోరుతూ రైతు బోడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీడియో తీయొద్దంటూ హుకుం.. ఫారెస్టు అధికారులు పత్తి పంటను నాశనం చేస్తున్న దృశ్యాన్ని బాధిత రైతు కుటుంబ సభ్యులు ఒకరు వీడియో తీస్తుండటంతో అక్కడే ఉన్న ఫారెస్టు అధికారి ఒకరు ఆవేశానికి గురయ్యారు. వెంటనే వీడియోను నిలిపివేయాలని సదరు యువకుడి వద్దకు వచ్చి హెచ్చరించాడు. మొబైల్ ఫోన్ గుంజుకోవడానికి ప్రయత్నించినట్లు బాధిత రైతు వాపోయాడు. -
ఆగని పోడు పోరు
వాజేడు: ఖమ్మం జిల్లా వాజేడు మండలం ఎర్రబోరు ప్రాంతంలో పోడు పోరు బుధవారమూ కొనసాగింది. ఈ భూమి విషయంలో కృష్ణాపురం గిరిజనులు, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరస్పరం ఘర్షణకు దిగడతంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది.గిరిజనులు ఈ భూమిని దున్నిన విషయం తెలుసుకొని పాల్వంచ, భద్రాచలం, వెంకటాపురం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు మండలాల అటవీశాఖ సిబ్బంది ఉన్నతాధికారులతో కలిసి పోలీస్శాఖ సమక్షంలో బుధవారం ఉదయం మొక్కలు నాటారు. ఆ మొక్కలను తొలగించేందుకు గిరిజనులు భారీ సంఖ్యలో వచ్చారు. వారిని పోలీసు, అటవీశాఖ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. గిరిజన మహిళలు ముందుకు రావడంతో కొంత వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో పోలీసులను దాటుకుంటూ గిరిజనులు పోడుభూమిలోకి చొచ్చుకువచ్చి అటవీశాఖ సిబ్బంది వేసిన మొక్కలను పీకివేశారు. ఓవైపున అధికారులు, గిరిజనులు వాదులాడుకుంటుంటే మరోవైపున మరికొంత మంది గిరిజనులు నాగళ్లతో పోడుభూమిని దున్ని విత్తనాలు చల్లారు. కొందరు గిరిజనులను పోలీసులు అదుపులోకి తీసుకొని జీపులోకి ఎక్కించగా, గిరిజన మహిళలు అడ్డుకున్నారు. కాగా, ఒకరిద్దరిపై కేసులు పెడితే ఊరుకునేది లేదని..కేసులు పెట్టాల్సి వస్తే అందరిపై పెట్టాలని భీష్మించుకు కూర్చున్నారు. తహశీల్దార్ వీరప్రకాశ్ వచ్చి అధికారులు, గిరిజనులతో మాట్లాడారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు గిరిజనులు, అటవీశాఖ సిబ్బంది భూమిలోకి రావద్దని ఆదేశించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయూయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement