-
తొలిదశలో 75 గ్రామాల్లోనే..
* అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమికే పట్టాలు.. * నిరుపేద దళితులకు భూపంపిణీకి సర్కారు ఏర్పాట్లు * 15న నల్లగొండలో ప్రారంభం! సాక్షి, హైదరాబాద్: నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ పథకం తొలి దశను లాంఛనంగా ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రతి నియోజకవర్గానికి ఒక గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించాలని తొలుత నిర్ణయించినా.. ప్రస్తుతమది 75 గ్రామాలకే పరిమితమైంది. అర్బన్ నియోజకవర్గాలు దాదాపు 30 తీసేయడంతోపాటు భూపంపిణీ చేయడానికి అనువైన భూములులేని నియోజకవర్గాలను కూడా దీన్నుంచి మినహాయించారు. ఈ నెల 15న భూపంపిణీ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలో ప్రారంభించే అవకాశం ఉందని అధికారవర్గా లు వివరించాయి. వాస్తవానికి ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే, లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందున తొలుత నియోజకవర్గంలోని ఒక గ్రామంలో నిరుపేద దళితులకు భూ పంపిణీ చేయాలని నిర్ణయించింది. భూముల కొనుగోలు కోసం రూ.185 కోట్లు విడుదల చేస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చినప్పటికీ.. ఇప్పటికిప్పుడు భూముల కొనుగోలు సాధ్యమయ్యే పని కాదని.. అందువల్ల ప్రభుత్వ భూమి ఉన్న గ్రామాలను మాత్రమే ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. అయితే.. ఎంత మంది రైతులకు భూ పంపిణీ చేయాలన్న అంశంపై ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. అందుబాటులో ఉన్న సాగు యోగ్యమైన భూమి ఎంత అన్నదానిపై అధికారుల వద్ద కూడా స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఎంతమందికి ఇవ్వాలన్నదానిపై జిల్లాల్లో ఇంకా కసరత్తు కొనసాగుతోంది. ఈ పథకంలో భాగంగా కేవలం భూపంపిణీయే కాకుండా బోర్లు వేయడం, కరెంటు కనెక్షన్లతోపాటు సాగు వ్యయాన్ని కూడా వారికి అందించనున్నారు. మరోవైపు సాగుయోగ్యమైన భూమి లభిం చడం లేదని కలెక్టర్ల నుంచి నివేదికలు వస్తున్నట్లు సమాచారం. భూ సేకరణ చట్టం కింద భూములు తీసుకోవడం ఇప్పుడు కష్టసాధ్యంగా మారిందని చెబుతున్నారు. దళితులకు భూ పంపిణీ చేయడానికి భూ సేకరణ చేస్తున్నారనగానే.. భూముల ధరలూ పెంచారని అధికారవర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. -
నిరుపేద దళిత కుటుంబాలకే భూ పంపిణీ
గోపాలపురం (నిడమనూరు) :భూమిలేని నిరుపేలైన దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ యోగ్యమైన భూమి ప్రభుత్వం అందజేస్తుందని జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు. భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులను ఎంపిక చేసేందుకు ధర్మాపురం ఆవాసం గోపాలపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. భూమిలేకపోవడం వల్ల స్థిరం లేని మనుగడ సాగిస్తున్న దళితులను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనిచోట, ప్రైవేటు భూముల అమ్మకంలో సహకరించాలని కోరారు. గోపాలపురంలో 25 మంది దళిత కుటుంబాలకు గాను 13మందిని మొదటి కేటగిరీలో, ఐదుగురిని రెండవ కేటగిరీలో, ఇద్దరిని మూడవ కేటగిరీలో అర్హులుగా నిర్ణయించారు. మొదటి కేటగిరీలో ఉన్న 13కుటుంబాలకు 39ఎకరాలు ఇవ్వా ల్సి ఉండగా అక్కడ ఎలాంటి ప్రభుత్వ భూమీ అందుబాటులో లేదు. దీంతో విక్రయానికి సిద్ధంగా ఉన్న ధర్మాపురం గ్రామానికి చెందిన చింతరెడ్డి సైదిరెడ్డి వారి కుటుంబసభ్యుల 15ఎకరాల భూమిని జేసీ ప్రీతీమీనా పరిశీలించారు. గ్రామానికి దూరంగా ఉన్న భూముల వద్దకు రాళ్లబాటలో నడిచి వెళ్లారు. భూముల వద్ద విక్రయదారులతో జేసీ, ఆర్డీవో కిషన్రావు చర్చలు జరిపారు. వారు ప్రభుత్వం ప్రకటించిన ధరకు ఇవ్వలేమని, కొంతసమయం ఇవ్వాలని కోరారు. కాగా, రెండు రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్డీఓను జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో దామోదర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిషోర్, తహసీల్దార్ అంబేద్కర్, ఎంపీపీ నర్సింహ, జెడ్పీటీసీ సభ్యురాలు అంకతిరుక్మిణి, మల్లయ్య పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement