-
అభివృద్ధి చేస్తే భయమెందుకు?: తమ్మినేని
-పాలేరు అభ్యర్థిగా పోతినేని సుదర్శన్ ఖమ్మం ‘టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటోంది. దీనిని చూసి ప్రజలు మీకే ఓట్లు వేస్తారనుకుంటే.. పాలేరు ఉప ఎన్నికకు కేటీఆర్తో సహా ఐదుగురు మంత్రులు ఎందుకు? అభివృద్ధి చేస్తే ఇంత భయమెందుకు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. పాలేరు అభ్యర్థిగా తమ పార్టీ నుంచి పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ను బరిలో దింపుతున్నామని వివరించారు. ఖమ్మంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపఎన్నికలో అవినీతి, అవకాశవాద రాజకీయాలతో రూ.50 నుంచి రూ.70కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆరోపించారు. వామపక్షాలన్నీ తమకు మద్దతుగా నిలుస్తాయిని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు తమ పార్టీకి శత్రువులేనని.. బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ అశ్వాపురం : ప్రజాసంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని, పాలన పగ్గాలు చేపట్టి ఆరు నెలలు దాటినా కూడా ఏ ఒక్క విషయంలోనూ పురోగతి లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ విమర్శించారు. సీపీఎం పినపాక డివిజన్ మహాసభ ముగింపు స్థానిక వర్తక సంఘం కల్యాణ మండపంలో మంగవారం ముగిసింది. ముగింపు సమావేశంలో పోతినేని మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. సర్వేల పేరుతో కాలయాపనే తప్ప సాధించేదేమీ లేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరిని క్రమబద్ధీకరిస్తామన్న ఎన్నికల హామీని కేసీఆర్ విస్మరించాని విమర్శిచారు. ప్రజాసంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నరేంద్ర మోడి ప్రభుత్వం బహుళజాతి కంపెనీలకు అధిక ప్రాధాన్యమిస్తోందని, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని విమర్శించారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికులకు అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహాసభలో రాష్ట్ర నాయకుడు కాసాని ఐలయ్య, డివిజన్ కార్యదర్శి అన్నవరపు కనకయ్య, నాయకులు మధు, కాటేబోయిన నాగేశ్వరరావు, సర్గం బాలనర్సయ్య, పాయం భద్రయ్య, బీరం శ్రీనివాస్, సున్నం రాంబాబు, నిమ్మల వెంకన్న, గద్దల శ్రీనివాసరావు, సరోజిని తదితరులు పాల్గొన్నారు. -
స్తంభించిన రాకపోకలు
భద్రాచలం టౌన్, న్యూస్లైన్: పోలవరం ముంపుప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ముంపు మండలాల సరిహద్దు దిగ్బంధం విజయవంతం అయింది. భద్రాచలంలో అఖిలపక్షం నాయకులు ప్రదర్శనగా బ్రిడ్జి సెంటర్ వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై బైఠాయించి పట్టణం నుంచి వెళ్లే వాహనాలు, వచ్చేవాహనాలను అడ్డుకున్నారు. వివిధ పార్టీలు, ప్రజా, కుల, ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ‘ఖబడ్దార్ పాలకులారా ఇది ఆరంభం మాత్రమే’ అని నినదించారు. బ్రిడ్జి సెంటర్ వద్ద చేయి చేయి కలిపి రాస్తారోకో నిర్వహించారు. అరుణోదయ కళాకారులు, ఆదివాసీలు పోలవరం వ్యతిరేక పాటలను పాడుతూ లయబద్దంగా నృత్యం చేశారు. ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన మూడు రోజులలోనే మోడి ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేయటం దుర్మార్గమాన్నారు. ప్రాణాలు పోయినా మేం తెలంగాణాలోనే కొనసాగుతామని ఆదివాసీలు అరుస్తుంటే ప్రభుత్వాలు బలవంతంగా వారి హక్కులను, నోర్లను నొక్కి పరాయి రాష్ట్రాలకు తరిమేయాలని చూస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీజేపి నాయకులు వెంకయ్య నాయుడు పునరాలోచించి, ముంపు ప్రాంతాలను తెలంగాణాలోనే కొనసాగించేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలలో నెలకొని ఉన్న భయాందోళలను తొలగించాలని కోరారు. సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ...అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలపై ప్రేమ చుపూతూ ఆదివాసీలను మోసం చేసిందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తుల కోసమే ఆదివాసీల ప్రాణాలను తాకట్టుపెట్టి ఆర్డినెన్స్ను జారీ చేశారని దుయ్యబట్టారు. కొండరెడ్ల సంక్షేమ శాఖ అధ్యక్షుడు ముర్ల రమేష్ మాట్లాడుతూ.... ప్రభుత్వాలు ఒంటెత్తు పోకడలకు పోతే భంగపాటు తప్పదని హెచ్చరించారు. ప్రజల ఆభిప్రాయం మేరకు ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, తొలుత దిగ్బంధానికి అనుమతి లేదని పట్టణ సీఐ ఆంజనేయులు, ఎస్సై మురళీ అఖిల పక్షం నాయకులను అడ్డుకున్నారు. అనంతరం ఎస్పీ రంగనాథ్తో మాట్లాడటంతో నిరసనకు అనుమతిని ఇచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చెల రంగారెడ్డి, కల్పన, ముద్దా బిక్షం, టీఆర్ఎస్ జిల్లా నాయకులు టి. రాజేందర్, పినపాక నాయకులు డా. శంకర్ నాయక్, బీజేపి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కూరపాటి రంగరాజు, వెంకటపతి రాజు, టీజేఏసి డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావ ు, వెక్కిరాల శ్రీనివాస్, గెజెటెడ్ ఆఫీసర్ సంఘం నాయకులు సీతారాములు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కుంచాల రాజారాం, కాంగ్రెస్ నాయకులు కుంజా ధర్మా, బొలిశెట్టి రంగారావు, సరెళ్ల నరేష్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యలమంచి రవికుమార్, బండారు రవికుమార్, ఎంబీ నర్సారెడ్డి, శరత్ బాబు, తదితరులు పాల్గొన్నారు. చింతూరు మండల పరిధిలో.... దిగ్బంధంలో భాగంగా విజయవాడ, జగ్దల్పూర్ జాతీయ రహదారిలోని ఆంధ్రా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గల చింతూరు మండలం చిడుమూరు వద్ద రహదారిపై చెట్లు అడ్డంగా వేసి నాయకులు బైఠాయించారు. భద్రాచలం, రాజమండ్రి రహదారిలోని తులసిపాక వద్ద , భద్రాచలం, విశాఖపట్నం రహదారిలోని చింతూరు మండలం తూలుగొండ వద్ద రహదారిని దిగ్బంధించారు. దీంతో వందల సంఖ్యలో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ నిరసన కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టం నారాయణ, సీసీఎం జిల్లా నాయకులు ఏజే రమేష్, బ్రహ్మాచారి, ఆదివాసీసేన నాయకుడు గుండు శరత్, ఛత్తీస్గఢ్కు చెందిన ప్రజా ప్రతినిధులు బొడ్డు రాజా, సోయం భీమా తదితరులు పాల్గొన్నారు. వేలేరుపాడు, కుక్కునూరు పరిధిలో..... కుక్కునూరు, అశ్వారావుపేట మండలాల నడుమగల లంకాల పల్లి గ్రామం వద్ద ఆదివాసీలు విల్లంబులు చేతపట్టి నిరసన తెలిపారు. తెలంగాణంలోనే ఉంటాం...సీమాంధ్రకు వెళ్లం అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యవర్గ సభ్యుడు గోకినేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదేవిధంగా వేలేరుపాడు, అశ్వారావుపేటల మధ్య గల ఆంధ్రా, సరిహద్దు గ్రామం మేడేపల్లి గ్రామం వద్ద రహదారిని దిగ్బంధించారు. కాగా, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు లంకాలపల్లి వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ...పోలవరం ముంపుపేరుతో ఏడుమండలాలను తెలంగాణనుంచి విడదీయొద్దని చేతులు జోడించి ప్రధానమంత్రి మోడీని వేడుకున్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాటలు విని అమాయకులైన ఏడమండలాల గిరిజనులు, గిరిజనేతరులు, వారి సంస్కృతీ సంప్రదాయాలను ముంచొద్దని వేడుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement