-
నేడు వైఎస్సార్ పెన్షన్ కానుక
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుకను జూన్ ఒకటో తేదీన పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం 2,37,615 మంది వలంటీర్లు పెన్షనర్ల ఇళ్ల వద్దకే వెళ్లి సొమ్మును అందిస్తారు. ఇందుకోసం రూ.1,421.20 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసి ఆ మొత్తాన్ని పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ద్వారా రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు జమచేసింది. కాగా, వలంటీర్లు సోమవారం (జూన్ 1వ తేదీ) ఉదయం నుంచే పెన్షన్లను లబ్ధిదారులకు అందించనున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్ఐవి, డయాలసిస్ పేషంట్లకు డీబీటీ విధానంలో పెన్షన్ సొమ్మును జమచేస్తారు. -
వెలుగు ఉద్యోగుల్లో చీకట్లు!
విజయనగరం అర్బన్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చర్చనీయంగా మారింది. ఈ సంస్థను మూ సి వేయాలని ఇటీవల ప్రభుత్వానికి ఆర్థికశాఖ సిఫారసు చేయడం ఆ సంస్థలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. సెర్ప్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రధా న హామీగా ప్రకటించిన టీడీపీ, అధికారం చేతికొచ్చాక ఇలా వ్యవహరించడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘వెలుగు’(ప్రస్తుత సెర్ప్) పేరుతో రాష్ట్రంలో మహిళాభివృద్ధికి పునాదు లు వేసిన ఘనత తమదేనని, పార్టీ అధికారంలోకి వస్తే ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారం వచ్చా క ఇప్పుడు సెర్ప్ను మూసివేసేదిశగా అడుగు లు వేయడంపై ఈ సంస్థ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. 14 ఏళ్లుగా ఇదే సంస్థ ను నమ్ముకొని పనిచేస్తున్న తమను ఇలా నట్టేట ముంచడం దారుణమని వాపోతున్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థలో క్లర్క్ స్థాయి నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ స్థాయి వరకు జిల్లా వ్యాప్తం గా 270 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మంది ఉద్యోగులున్నారు. వీరేకాకుండా పంచాయతీకి ఒక్కరు చొప్పున జిల్లాలో మరో వేయిమంది వరకు విలేజ్ బుక్ కీపర్లు పనిచేస్తున్నారు. సంస్థ మూసివేస్తే వీరంతా వీధిన పడాల్సిందే. ఎందుకీ వివక్ష? మహిళా అభ్యున్నతి కోసం గ్రామస్థాయిలో ‘వెలుగు’ పేరుతో తొలుత 2000 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటుచేసింది. 14 ఏళ్లుగా ఈ సంస్థ ఉద్యోగులు అందించిన సేవలకు దేశవ్యాప్తంగా మంచిగుర్తింపు లభించింది. మహిళా స్వయం సహా యక సాధికారిత తీసుకురావడంలో ఉత్తమ ఫలితాలను సాధించడం వల్లే ఈ సంస్థను ఇతర రాష్ట్రాలకు రీసోర్స్ సెంటర్గా కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. గ్రామీణ ప్రాంతా ల మహిళాభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) ఆధ్వర్యంలో ఇతరరాష్ట్రాలకు అవగాహన కలిగించే రిసోర్స్సెంటర్గా మన రాష్ట్ర సెర్ప్సంస్థ తాజాగా వ్యహరిస్తోంది. జిల్లా నుంచి ఈ సంస్థ 40మంది మహి ళా గ్రూప్ సభ్యులను రిసోర్స్పర్సన్లగా ఎంపిక చేసి రాజస్థాన్, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు పంపింది. కేవలం 10వ తరగతి విద్యార్హత మాత్ర మే ఉన్న వీరు ప్రస్తుతం రోజుకు రూ.1,500 వరకు వేతనం పొందున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి సెర్ప్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ నేతలు ఎన్నికల సందర్భం గా ఇచ్చిన హామీని అమలు చేయాలని సెర్ప్ ఉద్యోగుల సంఘం జిల్లా కమి టీ అధ్యక్షుడు వై.హరేరాం కోరారు. సంస్థలో ఉద్యోగులను అవుట్ సోర్స్ విధానంలో భర్తీ చేసినప్పటికీ పక్కాగా అర్హత పరీక్షలు, రోస్టర్ విధానంతో ఎంపికయినట్టు చెప్పారు. శాశ్వతఉద్యోగానికి కూడా ఇలా పరీక్షలు నిర్వహంచరేమో అన్నట్లు నియామకాలు చేశారని పేర్కొన్నారు. అంతేస్థాయిలో సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చామని చెప్పారు. జీతాలు మాత్రం అరకొరగానే అందుకుంటున్నామని, తాజాగా ఆర్థిక మంత్రి ప్రకటనతో ఉద్యోగుల్లో ఆందోళన ఏర్పడిం దని తెలిపారు. ఇటీవల ఏర్పాటు చేసిన మంత్రుల సబ్కమిటీకి పలుమార్లు వినతి పత్రాన్ని అందజేశామని హరేరాం తెలిపారు. -
అనాథలకు అండ
ఫుట్పాత్ బతుకులకు ప్రభుత్వం అండగా నిలవనుంది. దిక్కూమొక్కూ లేక.. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేక రోడ్ల పక్కన, బస్టాండ్, హోటళ్ల ఎదుట, జంక్షన్లలో ఉంటున్న వారికి నీడ కల్పించేందుకు నిర్ణయించింది. వీరి సంక్షేమం కోసం జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్(ఎన్యూఎల్ఎం) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వీరిని గుర్తించి సకల సౌకర్యాలు కల్పించనున్నారు. జగిత్యాల అర్బన్ : అర్బన్ ప్రాంతాల్లో ఇల్లు లేకుండా ఉంటున్న ఇలాంటి వారి వివరాలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), మున్సిపాలిటీల ఆధ్వర్యంలో సేకరిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, జగిత్యాల మున్సిపాలిటీల్లో రాత్రి సమయంలో సర్వే చేస్తున్నారు. లక్ష జనాభా దాటిన పట్టణాల్లో ఈ పథకం వర్తింపజేస్తున్నారు. ఈ పథకం ద్వారా గుర్తించిన వారికి ప్రభుత్వం రేషన్, ఆధార్, గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రతీ 50 మందికి ఒక ఆశ్రయం కల్పించి జీవనోపాధి కల్పించనున్నారు. గోదావరిఖనిలో సర్వే కోల్సిటీ : రామగుండం నగరపాలక సంస్థలోని రోడ్లు, ఫుట్పాత్లు, బస్షెల్టర్లు, ఆలయాలు, బస్టాండ్ల వద్ద నివసించే యాచకులు, నివాసం లేని నిరుపేదల స్థితిగతులపై శనివారం అర్ధరాత్రి సిబ్బంది సర్వే నిర్వహించారు. రాత్రి 10.30 నుంచి నగరంలోని పలు ప్రాంతాలల్లో శానిటేషన్ విభాగంలోని టీం లీడర్లు సర్వే చేశారు. 13 మంది సిబ్బంది సర్వేలో పాల్గొనగా, ఏసీపీ శ్యాంకుమార్, పీఆర్పీ రాజ్కుమార్ పర్యవేక్షించారు. తెల్లవారుజాము వరకు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 37 మంది ఇల్లు లేని నిరుపేదలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆదుకుంటాం కరీంనగర్ అర్బన్ : అనాథలకు వసతి కల్పించేందుకు సరేవ చేస్తున్నట్లు మెప్మా ప్రాజెక్టు డెరైక్టర్ విజయలక్ష్మి అన్నారు. నగరంలోని వన్టౌన్ పోలీసుస్టేషన్ ఎదుట, బస్టాండ్, అంబేద్కర్ స్డేడియం, గీతాభవన్, మంచిర్యాల చౌరస్తా, కోర్టు చౌరస్తా, అపోలో రీచ్ ఏరియా, కార్ఖనాగడ్డ చౌరస్తాల్లో నిద్రిస్తున్న అనాథల వివరాలు సేకరించారు. గూడు లేక ఫుట్పాత్లను నమ్ముకున్న వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్యూఎల్యూ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం ద్వారా గుర్తించిన అనాథలకు రేషన్, ఆధార్, గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రతీ 50 మందికి ఒక ఆశ్రయం కల్పించి, జీవనోపాధి కల్పిస్తామన్నారు. వీధి వ్యాపారులకు గుర్తింపుకార్డులు జారీ చేస్తామని తెలిపారు. వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆమె వెంట తహశీల్దార్ జయచంద్రరెడ్డి, మెప్మా పీఆర్పీలు శ్రీవాణి, అనిత, రజని, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి ఉమాదేవి పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement