-
పార్టీల ఎజెండా ఏదైనా.. ‘జెండా’ సిరిసిల్లదే..!
సాక్షి, సిరిసిల్ల :ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో 1500 మంది ఉపాధి పొందుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి పార్లమెంట్ ఎన్నికల వరకు సిరిసిల్లలో సందడి నెలకొంది. ఏ పార్టీకి అయినా.. ఎజెండా లేకున్నా.. సరే కానీ ఆ పార్టీ జెండాలు లేకుంటే.. కుదరని పరిస్థితి నెలకొంది. పార్టీ అధినేతలు ప్రచారానికి వచ్చినా.. ఊరూరా ఎన్నికల ప్రచారం చేసినా.. జెండాలు, కండువాలు తప్పని సరి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో నిలిచే అన్ని పార్టీలకు సిరిసిల్ల వస్త్రపరిశ్రమ జెండాలను సరఫరా చేస్తోంది. ఫలితంగా ఊరంతా ఉపాధి పొందుతోంది. బట్ట నుంచి బ్యానర్ల వరకు.. ఎన్నికలు ఏవైనా, పార్టీలేవైనా.. అభ్యర్థి ఎవరైనా ఎన్నికల ప్రచారానికి వినియోగించే జెండాలు, కండువాలు వస్త్రోత్పత్తి ఖిల్లా సిరిసిల్ల నుంచే సరఫరా అవుతాయి. వస్త్ర పరిశ్రమకు నిలయమైన సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 27వేల మగ్గాలపై పాలిస్టర్ వస్త్రోత్పత్తి సాగుతుండగా.. మరో ఏడు వేల మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతోంది. పాలిస్టర్ బట్టపై ఆర్డర్ వచ్చినట్లుగా వివిధ పార్టీల గుర్తులు, రంగులు, అభ్యర్థుల పేర్లు ప్రింటింగ్ చేసి సరఫరా చేస్తారు. పాలిస్టర్ బట్టను పార్టీ రంగుల్లో ప్రాసెసింగ్ చేయించి సరఫరా చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పాటు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సిరిసిల్ల నుంచి ప్రచార సామగ్రి ఎగుమతి అవుతోంది. దేశవ్యాప్తంగా సిరిసిల్లలో తయారైన జెండాలు ఎన్నికల వేళ రెపరెపలాడుతున్నాయి. సిరిసిల్లలోనే చౌక.. దేశంలోని బీవండి, సూరత్, మాలేగావ్ ప్రాంతాల్లో మరమగ్గాలపై పాలిస్టర్ గుడ్డ ఉత్పత్తి అవుతున్నా.. అక్కడ ఉత్పత్తి అయ్యే వస్త్రం సిరిసిల్ల వస్త్రంలాగా చౌకగా లభించదు. దీంతో హైదరాబాద్కు చెందిన మర్వాడీ సేట్లు.. దేశంలోని వివిధ ప్రాంతాల పార్టీల ఆర్డర్లు ముందుగానే తీసుకుని సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ఆర్డర్లు ఇస్తారు. ఒక్క బ్యానర్ను సైజును బట్టి రూ.50 నుంచి రూ.200 వరకు ఉంటుంది. కండువా, జెండాలకు రూ.25 నుంచి రూ.50, టోపీ (క్యాప్)లకు రూ.20 నుంచి 30 వరకు తోరణాల జెండాలు పదివేల జెండాలకు రూ.3000 నుంచి రూ.4000 వరకు అమ్ముతారు. బహిరంగ సభల్లో వినియోగించే భారీసైజు బ్యానర్లను సైతం ఇక్కడే ముద్రించి ఇస్తారు. వీఐపీ కండువాలను రూ.100 ఒక్కటి సరఫరా చేస్తారు. రూ.5కోట్ల మేర వ్యాపారం.. ప్రతి ఎన్నికల సమయంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు రూ. 5 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. ఇక్కడికి ఆర్డర్లు రావడం కొత్తేం కాదు. సిరిసిల్ల నేతన్నలు గత నలుబై ఏళ్లుగా జెండాలు అందిస్తున్నారు. 1978లో తొలుత సిరిసిల్లలో రామ్బలరామ్ స్క్రీన్పింటర్స్ రంగురంగుల పార్టీల జెండాలను ముద్రించడం ఆరంభించింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ, వైఎస్సార్సీపీ, బహుజన సమాజ్పార్టీ, జనసేన, ఇలా ఏ పార్టీ అయినా ఆయా పార్టీల రంగుల్లో జెండాలను ప్రింట్ చేసి అందిస్తారు. అభ్యర్థుల పేర్లు, నినాదాలు సైతం బట్టపై అద్దడం విశేషం. ఎన్ని‘కళ’ సిరిసిల్లలో పాతిక వేల కుటుంబాలు వస్త్రోత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. తరచూ ఆటుపోట్లతో వస్త్రపరిశ్రమ సంక్షోభానికి గురికావడం, ఉపాధి లేక పోవడం వంటి సమస్యలు ఉండేవి. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఉత్పత్తి ఆర్డర్లు, ఎన్నికల ప్రచార సామగ్రి ఆర్డర్లు రావడంతో నేతన్నలకు చేతి నిండా పని లభిస్తోంది. ఎన్నికల సామగ్రి సరఫరాతో 500 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జెండాలను కుట్టుమిషన్లపై కుట్టే పనిలో మరో వెయ్యి మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడే బట్ట తయారు కావడంతో ఇక్కడి కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జెండా ఆర్డర్లు సైతం సిరిసిల్లకు రావడం విశేషం. చేదు అనుభవం.. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తొలిసారి సిరిసిల్లకే వచ్చారు. ప్రజాచైతన్య యాత్రను సిరిసిల్ల నుంచే శ్రీకారం చుట్టడం భారీ ఎత్తున పీఆర్పీ జెండాలు, కండువాల ఆర్డర్లు వచ్చాయి. ఆర్డర్లు ఇచ్చిన ఆ పార్టీ నేతలు ఆర్డర్లకు డబ్బులు ఇవ్వలేదు. ప్రచార సామగ్రిని తీసుకెళ్లలేదు. దీంతో సిరిసిల్ల వస్త్రవ్యాపారులు ఉద్దేర భేరానికి స్వస్తి పలికారు. ‘‘మిషన్పై జెండాలు కుడుతున్న ఈమె మేర్గు లావణ్య. సిరిసిల్లలోని వెంకట్రావునగర్. లావణ్య రోజుకు వెయ్యి జెండాలు కుడుతుంది. ఒక్కో జెండాకు 25పైసల చొప్పున రోజుకు రూ.250 కూలి లభిస్తోంది. నెలకు సగటున లావణ్య ఇంట్లో ఉంటూనే రూ.5వేలు సంపాదిస్తోంది. లావణ్య భర్త శ్రీనివాస్ నేత కార్మికుడు. సాంచాలు నడుపుతూ నెలకు రూ. 8వేలు సంపాదిస్తాడు. ఇంట్లోనే పాపను చూసుకుంటూ లావణ్య ఉపాధి పొందుతోంది’’. ‘‘ఈమె కాటబత్తిని అనిత. సిరిసిల్ల సాయినగర్. అనిత పార్టీల జెండాలు, కండువాల, క్యాప్లు కట్చేస్తూ.. సరిచేస్తూ.. నెలకు రూ.6వేల వరకు సంపాదిస్తోంది. ఆమె భర్త సత్యనారాయణ డయింగ్ కార్మికుడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలను పోషించేందుకు బీడీలు చేసేది. రోజుకు వెయ్యి బీడీలు చేసినా.. నెలకు రూ.3వేలకు మించి రాకపోయేవి. ఈ డబ్బులతో ఇల్లు కిరాయి చెల్లిస్తూ.. పిల్లలను సాకడం కష్టమైంది. దీంతో ఆమె పార్టీల జెండాల తయారీ కార్ఖానాలో పనికి చేరింది. దీంతో ఇప్పుడు రూ.6వేలు వస్తున్నాయి. ప్రభుత్వం వితంతు పింఛన్ రూ.వెయ్యి ఇస్తోంది. పిల్లలను చదివిస్తోంది’’. 16 ఏళ్లుగా ఇదే పని నేను 2002 నుంచి 16 ఏళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నాను. ఎన్నికల సమయంలో కొద్దిగా ఎక్కు వ పని ఉంటుంది. మిగితా రోజు ల్లో స్కూల్, కాలేజీల బ్యా నర్లు, యాగాలు, యజ్ఞాల కండువాలు, జెం డాలు సరఫరా చేస్తాను. ఏడాది పొడువునా ఇ దే పని ఉంటుంది. నా వద్ద 25 మంది కార్మికు లు పని చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. దేశమంతా సరఫరా చేస్తున్నాను. – ద్యావనపల్లి మురళి, వ్యాపారి చదువుకుంటూ.. సంపాదిస్తూ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న. మా అమ్మ నిర్మలతో పాటు నేను జెండాలు కుడుతాను. చదువుకుంటేనే తీరిక వేళల్లో పనిచేస్తాను. రెండు మిషన్లు ఉన్నాయి. అంతకు ముందు మా అమ్మ బీడీలు చేసేది. బీడీల పని కంటే ఈ పని బాగుంది. మంచి ఉపాధి లభిస్తుంది. ఇంటి వద్దనే నీడ పట్టున ఉండి పని చేస్తాం. ఎన్నికల రోజుల్లో పని ఎక్కువగా ఉంటుంది. – సామల దీప్తి, ఇంటర్ విద్యార్థి -
మరమగ్గాల కార్మికులకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: మరమగ్గాల కార్మికులకు రుణమాఫీ అంశాన్ని వచ్చే సెప్టెంబర్ 30లోగా కొలిక్కి తేవాలని చేనేత, జౌళి శాఖ నిర్ణయించింది. చేనేత, జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రుణమాఫీ మార్గదర్శకాలను అధికారులు బుధవారం ఖరారు చేశారు. రాష్ట్రంలో 49,112 మరమగ్గాలుండగా, సుమారు 38 వేల మరమగ్గాలు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే ఉన్నాయి. మరమగ్గాల కోసం రుణాలు తీసుకున్న కార్మికులు.. చాలీచాలని ఆదాయం, మార్కెటింగ్ అస్థిరత వంటి కారణాలతో నష్టాలు చవిచూశారు. బ్యాంకులు, రాష్ట్ర ఆర్థిక సంస్థకు కార్మికులు చెల్లించాల్సిన బకాయిలు రూ.15.86 కోట్ల మేర పేరుకుపోయాయి. దీంతో తమకు రుణమాఫీ చేయాలని మరమగ్గాల కార్మికులు డిమాండ్ చేశారు. గతంలోనే మాఫీ ఉత్తర్వులు మరమగ్గాల కార్మికుల విజ్ఞప్తి మేరకు జనవరిలో రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే మార్గదర్శకాల్లో శాస్త్రీయత లోపించడం, రుణ పరిమితి, వడ్డీ మాఫీ తదితర అంశాలపై స్పష్టత కొరవడింది. దీంతో 2014 మార్చి 31లోపు రూ.లక్షలోపు రుణం ఉన్న వారికి మాఫీ వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించారు. బకాయిలపై వడ్డీని మాఫీ చేసేందుకు బ్యాంకులూ అంగీకరించాయి. గతంలో 5హెచ్పీ విద్యుత్ సామర్థ్యమున్న మరమగ్గాలకే మాఫీ వర్తిస్తుందని పేర్కొనగా, ప్రస్తుతం అంతకంటే ఎక్కువ సామర్థ్యమున్న వాటికీ వర్తింపచేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.5.63 కోట్లు విడుదల చేసింది. -
నేతన్నల రుణ మాఫీకి కసరత్తు
తుది నివేదిక సమర్పించిన జౌళిశాఖ - బడ్జెట్ కేటాయింపులే కీలకం - రూ.11 కోట్లతో ప్రతిపాదనలు - సిరిసిల్లలోనే అత్యధికంగా రూ.10 కోట్లు సిరిసిల్ల : జిల్లాలో నేతన్నల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ మేరకు చేనేత జౌళిశాఖ అధికారులు సేకరించిన వివరాలు, తుది నివేదికను సర్కార్ కు అందించారు. దీంతో మరమగ్గాల కార్మికుల వ్యక్తిగత రుణాల మాఫీకి మార్గం సుగమమైంది. జిల్లావ్యాప్తంగా వ్యక్తిగత రుణాలు రూ.11 కోట్లు ఉండగా.. ఇందులో ఒక్క సిరిసిల్లలోనే రూ.10 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బ్యాంకుల ద్వారా వివరాల సేకరణ జిల్లా వ్యాప్తంగా 38 వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 33 వేల మరమగ్గాలు ఉన్నాయి. వస్త్రపరిశ్రమ సిరిసిల్ల కేంద్రంగా అనేక సమస్యలు ఎదుర్కొంటుండగా నేతన్నలకు రుణభారం ఎక్కువై ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఉన్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సిరిసిల్ల ఎమ్మెల్యేగా నేతన్నల రుణమాఫీకి సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఈ మేరకు సుమారు 20వేల కుటుంబాలు రూ.11కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. ఒక్క సిరిసిల్లలోనే రూ.పదికోట్ల రుణాలు ఉన్నట్లు స్పష్టమైంది. వైఎస్ హామీని నెరవేర్చని పాలకులు దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి నేతన్నల రుణమాఫీ కోసం 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ.312 కోట్లతో బడ్జెట్ కేటాయించారు. నేతన్నలను అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలన్న వైఎస్సార్ హామీని ఆయన మరణానంతరం రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి సర్కార్లు పక్కదారి పట్టించాయి. కేవలం రూ.200 కోట్ల చేనేత కార్మికుల రుణాలు మాఫీచేశారు. చేనేత అనే పదాన్ని అడ్డుపెట్టుకుని మరమగ్గాలకు రుణమాఫీ వర్తించదని మొండిచేయి చూపారు. బడ్జెట్లో కే టాయించిన నిధుల్లో రూ.112 కోట్లు మిగలగా.. వాటి ని మరమగ్గాల కార్మికులకు వర్తింపజేయాలని ఎమ్మెల్యే కేటీఆర్ శాసనసభలో ప్రస్తావించారు. ప్రభుత్వం పట్టిం చుకోకపోడంతో వైఎస్ హామీ అమలుకాలేదు.రుణమాఫీ అమలైతే సిరిసిల్లతోపాటు బోయినపల్లి, చొప్పదండి, నిమ్మపల్లి, గర్షకుర్తి, గన్నేరువరం, కొత్తపల్లి, చామనపల్లి ప్రాంతాలకు చెందిన ఇరవై వేల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
Advertisement