-
లోకకల్యాణానికి శివుడిని ప్రార్థించా
దామరచర్ల (మిర్యాలగూడ) : లోక కల్యాణం కోసం మహా శివుడిని ప్రార్థించానని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. మంగళవారం శివరాత్రి సందర్భంగా వాడపల్లిలోని పుణ్యక్షేత్రంలోని శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా పూజారులు కలశంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయాల చరిత్రను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ విస్తారంగా వర్షాలు కురియాలని, పంటలు పుష్కలంగా పండి రైతులు, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని శ్రీమీనాక్షి అగస్త్యేశ్వరుడికి పూజలు చేసినట్లు తెలిపారు. వాడపల్లి దేవాలయాల అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. అంతకుముందు మంత్రిని మిర్యాలగూడ నుంచి కార్యకర్తలు బైక్ ర్యాలీతో వాడపల్లి పుణ్యక్షేత్రానికి తోడ్కొని వచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, మాజీ ఎమ్మెల్యే విజయ సింహారెడ్డి, ఎంపీపీ కురాకుల మంగమ్మ, సింగిల్ విండో చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మాజీ చైర్మన్ వీరకోటిరెడ్డి, చల్లా అంజిరెడ్డి, బాలాజీ, ఆర్డీఓ గోపాల్రావు, తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి, సీఐ రమేష్బాబు, ఎస్ఐ రామన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్నే మోరీల్లో వేస్తారు..
నిడమనూరు (నాగార్జునసాగర్) : టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్ను ప్రజలు 2019 ఎన్నికల్లో మోరీల్లో వేస్తారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని గుంటిపల్లి, ఎర్రబెల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి సభలో మంత్రి మాట్లాడుతూ తాగిన మత్తులో చేసుకున్న హత్యను రాజకీయలబ్ధికి కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నాయకులు వాడుకోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల మొండేలతో మోరీలు నిండుతాయని కాంగ్రెస్ నేతలు చెప్పారని.. మా ఆలోచన అలాంటిది కాదని.. అభివృద్ధే ఎజెండాగా పనిచేస్తామని చెప్పారు. ఎక్కువ శాఖలు చేసిన అని గొప్పలు చెప్పుకుంటున్న జానారెడ్డి తన సమక్షంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి మీద ఆరోపణలు చేస్తుంటే ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. జానారెడ్డి నియోజకవర్గంలో సమస్యలు ఉండవనుకున్నానని.. కానీ మిగతా నియోజకవర్గాలతో పోల్చితే ఇక్కడే ఎక్కువ ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో డజను సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంతో పాటు జిల్లాలో ప్రతి గ్రామానికి శుద్ధిచేసిన జలాలను అందిస్తామన్నారు. కేసీఆర్ వెంటే.. సాగర్ నియోజకవర్గం ఉంటదని ఎర్రబెల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో నిరూపన అయ్యిందన్నారు. ఎక్కువ కాలం జానారెడ్డికి ఓటు వేయడంతో నియోజకవర్గ ప్రజల చేతులు కాయలు కాచాయన్నారు. మండలంలోని జంగాలగూడెం, ఎర్రబెల్లిలో రూ.7.5లక్షలతో నిర్మించే రెండు కమ్యూనిటీ హాళ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహయ్య, బడుగుల లింగయ్యయాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు నూకల వెంకట్రెడ్డి, ఎంపీపీ దాసరి నర్సింహ, కేవీ రామారావు, అంకతి వెంకటరమణ, మన్నెం రంజిత్యాదవ్, సర్పంచ్ తాటి సత్యపాల్, ఎంపీటీసీ మన్నెం వెంకటరమణ, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఎంపీడీఓ వెంకటాచారి, మేరెడ్డి వెంకట్రెడ్డి, సూలకంటి వీరారెడ్డి, గడ్డం రవీందర్రెడ్డి, మంజుల సీతారాములు, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సూర్యాపేట కోర్టుకు హాజరైన పొన్నం, జగదీష్రెడ్డి
సూర్యాపేట : రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్పై ఫిబ్రవరి 26న పరువునష్ట దావా వేసిన కేసు విషయంలో విచారణ నిమిత్తం పొన్నం ప్రభాకర్ గురువారం సూర్యాపేట కోర్టుకు హాజరయ్యారు. ఆయనకు న్యాయస్థానం కేసుకు సంబంధించిన కాగితాలు అందజేసింది. ఫిర్యాదు దారుడైన మంత్రి జగదీష్రెడ్డి కూడా ఉదయం 10.30గంటలకు కోర్టుకు హాజరయ్యారు. సూర్యాపేట ప్రథమ శ్రేణి న్యాయమూర్తి డి.కిరణ్కుమార్ జూన్ 3వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఇరువురు కోర్టు హాల్ నుంచి వెళ్లిపోయారు. మంత్రి తరుపున న్యాయవాదులు గ్రంథి వెంకటేశ్వర్లు, గుడిపూడి వెంకటేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ వెంట న్యాయవాదులు టేకులపల్లి శ్రీనివాసరావు, నూకల సుదర్శన్రెడ్డిలు ఉన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
ఈసీ నుంచి రాని అనుమతి.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
ఎన్నికల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement