సూర్యాపేట కోర్టుకు హాజరైన పొన్నం, జగదీష్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

సూర్యాపేట కోర్టుకు హాజరైన పొన్నం, జగదీష్‌రెడ్డి

Published Fri, Apr 17 2015 12:39 AM

సూర్యాపేట కోర్టుకు హాజరైన పొన్నం, జగదీష్‌రెడ్డి

సూర్యాపేట : రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై  ఫిబ్రవరి 26న పరువునష్ట దావా వేసిన కేసు విషయంలో విచారణ నిమిత్తం పొన్నం ప్రభాకర్ గురువారం సూర్యాపేట కోర్టుకు హాజరయ్యారు. ఆయనకు న్యాయస్థానం కేసుకు సంబంధించిన కాగితాలు అందజేసింది. ఫిర్యాదు దారుడైన మంత్రి జగదీష్‌రెడ్డి కూడా ఉదయం 10.30గంటలకు కోర్టుకు హాజరయ్యారు. సూర్యాపేట ప్రథమ శ్రేణి న్యాయమూర్తి డి.కిరణ్‌కుమార్ జూన్ 3వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఇరువురు కోర్టు హాల్ నుంచి వెళ్లిపోయారు. మంత్రి తరుపున న్యాయవాదులు గ్రంథి వెంకటేశ్వర్లు, గుడిపూడి వెంకటేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్ వెంట న్యాయవాదులు టేకులపల్లి శ్రీనివాసరావు, నూకల సుదర్శన్‌రెడ్డిలు ఉన్నారు.
 

Advertisement
Advertisement