-
అన్నదాతకు గుండెకోత
వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా ప్రకటనలకే పరిమితమవుతోంది. ఓవైపు తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు మరోవైపు అన్నదాత జీవితంతో ఆటలాడుకుంటున్నారు. రోజుకు కనీసం మూడు గంటల పాటు కూడా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయకపోతుండటంతో నీరు చాలక పొలాలు ఎండుముఖం పట్టాయి. చేతికందే దశలో ఉన్న పంట కళ్ల ముందే నిలువునా ఎండిపోవడం చూసి రైతు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్లైన్: జిల్లాలో ప్రధానంగా వరి, చెరకు, అరటి, నిమ్మ, బత్తాయి, కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. రబీ సీజన్ కావడంతో రైతులు ఎక్కువ విస్తీరణంలో వరి సాగు చేశారు. ఈ పంటల సాగుకు ఎక్కువ మంది రైతులు విద్యుత్ మోటార్లపై ఆధారపడుతున్నారు. విద్యుత్ అధికారులు వ్యవసాయ సర్వీసులను మూడు గ్రూపులుగా విభజించి విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. పగలు, రాత్రి కలిపి మూడు విడతల్లో ఏడు గంటల పాటు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. ఎక్కువ ప్రాం తాల్లో మూడు గంటలకు మించి విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో విడతలో గంటకు మించి విద్యుత్ ఇవ్వకపోతుండటంతో పంటలకు సరిపడా నీటిని అందించలేకపోతున్నారు. విడతల వారీ సరఫరాతో వస్తున్న నీళ్లు కాలువలు తడిచేందుకే సరిపోతున్నాయి. పంటలు ఎండుముఖం వరి, చెరకు, నిమ్మ, అరటి, కూరగాయలు సాగుచేస్తున్న పొలాలకు తరచూ నీరు అందించాలి. అయితే అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో గూడూరు డివిజన్లో వరి, చెరకు, నిమ్మ పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఆత్మకూరు, వెంకటగిరి డివిజన్లోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేస్తున్న పంటకు తగినంత నీరు అందించలేక మధ్యలోనే వదిలేస్తున్నారు. ఉదయగిరి, కావలి డివిజన్లల్లోని రైతుల పరిస్ధితి మరీ ఆధ్వానంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మంది రైతులు మోటార్లపై ఆధారపడి వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు. ఇప్పు డే పరిస్థితి ఇలా ఉంటే ఎండలు ముదిరితే నిమ్మ, బత్తాయి, చెరకు, కూరగాయల తోటలకు నీరు ఎలా అందించాలని వారు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన వినియోగం జిల్లాలో వివిధ కేటగిరిల్లో మొత్తం 11,15,166 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి రోజుకు 85 లక్షల యూనిట్ల విద్యుత్ను కోటాగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 90 లక్షల యూనిట్లకు పైగా వినియోగం జరుగుతోంది. అం దులో 30 శాతం వ్యవసాయానికే ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో 30 శాతం పరిశ్రమలకు, 40శాతం గృహావసరాలతో పాటు ఇతర రం గాలకు వినియోగిస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. రోడ్డెక్కుతున్న రైతన్న వ్యవసాయ విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో గుండె రగిలిన రైతన్న రోడ్డెక్కి నిరసనకు దిగుతున్నాడు. రెండు రోజుల క్రితం బిరుదవోలు, బ్రాహ్మణపల్లి, కళ్యాణపురం, ముత్యాలపాళెం, చెర్లోపల్లి, పార్లపల్లి రైతులు పొదలకూరు సబ్స్టేషన్ను ముట్టడించారు. అంతకుముందు దగదర్తి మండలానికి చెందిన రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. నిత్యం ఏదోక ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగుతున్నా అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వ్యవసాయానికి ఏడు గంటల పాటు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 7 గంటల సరఫరాకు ప్రయత్నిస్తున్నాం : వ్యవసాయానికి 7 గంటల పాటు సరఫరా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రెండు రోజులుగా జిల్లాలో వినియోగం పెరిగింది. 92 లక్షల యూనిట్లకు విద్యుత్ వినియోగం పెరిగింది. వ్యవసాయానికి సరఫరా ఇచ్చేందుకు గృహ అవసరాలకు కోతలు విధిస్తున్నాం. - వెంకటేశ్వరరావు, టెక్నికల్ డీఈ, ట్రాన్స్కో -
కొను‘గోల్మాల్’
తాడిపత్రి, న్యూస్లైన్: అనంతపురం శివారుతోపాటు శింగనమల, తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 514 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకంలో విద్యుత్ మోటార్ల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. రూ.508 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ తాగునీటి పథకం ద్వారా నీరు విడుదల చేసేందుకు చొరవచూపని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మోటార్ల కొనుగోళ్లకు మాత్రం ఉత్సాహం చూపించారు. 850, 650, 175 హార్సపవర్ (హెచ్పీ)ల సామర్థ్యం కలిగిన 19 విద్యుత్ మోటార్లను రూ.10 కోట్లు వెచ్చించి 2009లో హైదరాబాద్లోని శ్రీ వెంకటేశ్వర మోటార్ సర్వీసెస్ సంస్థ నుంచి కొనుగోలు చేశారు. ఈ మోటార్లను బాలప్పకోన, తాడిపత్రి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం, ఇంటెక్వెల్, యర్రగుంటపల్లి, పామిడి, ముచ్చుకోట సంపుల వద్ద అమర్చాల్సి ఉంది. అయితే వాటిని ఎక్కడికక్కడ వదిలేశారు. సంస్థ ప్రతినిధులు మోటార్లను అమర్చకపోయినా అధికారులు మాత్రం రూ.5 కోట్ల బిల్లు మంజూరు చేసేశారు. నీటిని సరఫరా చేసే సమయం ఆసన్నమైనా సదరు కంపెనీ మోటార్లను అమర్చలేదు. మిగిలిన రూ.5 కోట్ల బిల్లును తీసుకునేందుకు కూడా ముందుకు రాలేదు. నోటీసులకూ స్పందించకపోవడంతో ఆ సంస్థ తీరు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇక్కడ తెచ్చి పడేసిన మోటార్లు రూ.5 కోట్ల విలువైనా చేస్తాయా? చేస్తే పూర్తి బిల్లు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రానట్లు? దీని వెనుక మర్మమేంటి? ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక ‘అది మాత్రం అడగొద్ద’ంటూ తల పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా అధికారులు తాత్కాలిక ఏర్పాట్ల పేరుతో రూ.50 లక్షలు ఖర్చు చేసి 12 చిన్న మోటార్లను కొని.. తద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నేతలు, అధికారులకు భారీగా ముడుపులు! స్థానిక ప్రజాప్రతినిధి తన పలుకుబడిని ఉపయోగించి శ్రీ వెంకటేశ్వర మోటార్ సర్వీసెస్ సంస్థ పేరుతో విద్యుత్ మోటార్లు కొనుగోలు చేయించడంలో సక్సెస్ అయినట్లు తెలిసింది. మోటార్లు సరఫరా చేసేందుకు అర్హత లేని ఈ సంస్థ నుంచి నేతలు, అధికారులకు భారీగానే ముడుపులు అందినట్లు సమాచారం. కొనుగోలు చేసిన మోటార్లను అమర్చకుండా మూడేళ్లుగా మూలనపడేశారు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉన్నాయి. అసలు ఇవి ఇప్పుడు పనిచేస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇవి ఎంత విలువ చేస్తాయో కూడా నిర్ధారించలేదు. ఇటీవల ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ అధికారుల పరిశీలనలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. అయితే దీని వెనుక పెద్దల ‘హస్తం’ ఉందని తెలిసి వారు మిన్నకుండిపోయినట్లు సమాచారం. నోటీసులు పంపినా స్పందన లేదు శ్రీ వెంకటేశ్వర మోటార్ సర్వీసెస్ సంస్థకు నోటీసులు పంపినా స్పందించడం లేదు. ఇప్పటి వరకు 19 మోటార్లకు దాదాపు రూ.5 కోట్ల వరకు బిల్లులు ఇచ్చాం. ఇంకా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటి స్థానంలో తాత్కాలిక మోటార్లను వాడుతున్నాం. శ్రీ వెంకటేశ్వర మోటార్ సర్వీసెస్ నుంచి కొన్న మోటార్లలో ఒక మోటార్ను బాలప్పకోన వద్ద ఉపయోగిస్తున్నాం. - ప్రసాద్రెడ్డి, ఈఈ, ఆర్డబ్ల్యూఎస్, తాడిపత్రి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement