-
అనాథ శవాలు అమ్మబడును!
హైదరాబాద్: ప్రభుత్వ బోధనాస్పత్రులకు ఆర్థిక పరిపుష్టి కల్పించడంతోపాటు అక్కడి విద్యార్థులకు ప్రాక్టికల్ విద్యను అందించేందుకు అనాథ శవాలను అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది! దీనికోసం ఇప్పటికే కెడావర్ సర్టిఫికేషన్ కమిటీని ఏర్పాటు చేంది. అనాథ శవాలను అమ్మేందుకు అవసరమైన నియమనిబంధనలను పారదర్శకంగా రూపొందించే పని ఈ కమిటీకి అప్పగించింది. అనాథ శవాల అమ్మకాలపై ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. తెలంగాణలో సుమారు 25 వరకు ప్రైవేటు, ఐదు ప్రభుత్వ బోధనాస్పత్రులు ఉన్నాయి. వైద్య విద్యార్థులకు ముఖ్యంగా అనాటమీ, ఫోరెన్సిక్ విభాగం విద్యార్థులకు మానవ శరీరంపై అవగాహన కల్పించేందుకు రసాయనాలు పూసిన మానవ మృతదేహాలను వినియోగించేవారు. అయితే పలు అక్రమాలు, అవకతవకలు జరిగి అప్పటి ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో మానవ మృతదేహాల అమ్మకాలు నిలిపివేశారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం అనాథ శవాల అమ్మకానికి పారదర్శకమైన నిబంధనలు రూపొందించేందుకు సిద్ధమైంది. అనాథ మృతదేహాలను ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అమ్మి, వచ్చిన సొమ్ముతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్యసేవలు, వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలని నిర్ణయించింది. ఇవీ నిబంధనలు.... నాన్ మెడికో లీగల్ కేసులకు చెందిన అనాథ మృతదేహాలను మాత్రమే మెడికల్ కాలేజీలకు విక్రయించాలని కెడావర్ సర్టిఫికేషన్ కమిటీ సూచించినట్లు తెలిసింది. మార్చురీకి వచ్చిన వెంటనే అనాథ మృతదేహానికి ఫొటో తీసి అన్ని పోలీస్స్టేషన్లను పంపిస్తారు. 72 గంటలు తర్వాత అనాథ మృతదేహంగా నిర్ధారిస్తారు. మృతదేహం చెడిపోకుండా రసాయనాలతో పూత (ఎంబాంబింగ్) పూస్తారు. నెలరోజులు తర్వాత ఆయా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కెడావర్ సర్టిఫికేషన్ కమిటీ మరోమారు నిర్ధారించుకున్న తర్వాత విక్రయిస్తారు. దీంతో మార్చురీల్లో అనాథ శవాలు కుళ్లి దుర్వాసన వెలువడే అవకాశం ఉండదని కమి టీ అభిప్రాయపడింది. అయితే, అనాథ శవాలను విక్రయించే అంశంపై పోలీస్ శాఖ అంత సుముఖంగా లేదు. ప్రస్తుతం పోలీస్ ఉన్నతాధికారులు ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అవయవాలూ అమ్మకానికి..! ప్రైవేటు మెడికల్ కాలేజీలకు మృతదేహాం రూ.60 వేలకు విక్రయించాలని కెడావర్ సర్టిఫికేషన్ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. మానవ మృతదేహంలోని ఏ అవయవం కావాలన్నా అందించాలని సిఫారసు చేసింది. ఒక్కో అవయవానికి రూ.5 వేలు ధరను నిర్ణయించారు. మృతదేహాలు విక్రయించగా వచ్చిన సొమ్మును ఆస్పత్రి అభివృద్ధి నిధికి జమ చేసి, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని కమిటీ సూచించింది. -
ప్రాక్టికల్ విద్యకు చిరునామా.. ఫ్రాన్స్
ఉన్నత ప్రమాణాలు.. అత్యున్నత సౌకర్యాలు.. అందివస్తున్న అవకాశాల నేపథ్యంలో ఫారెన్ ఎడ్యుకేషన్ దిశగా దృష్టి సారిస్తున్న విద్యార్థులెందరో! ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్మెంట్ ఇలా అన్ని రంగాలకు చెందిన విద్యార్థులు.. ఉన్నత విద్యకోసం విదేశీ వర్సిటీలవైపు చూస్తున్నారు. ఈ క్రమంలో సంప్రదాయ గమ్యాలుగా నిలుస్తున్న అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ కాకుండా ప్రాక్టికల్ విద్యకు చిరునామాగా నిలుస్తోన్న ఐరోపా దేశం.. ఫ్రాన్స్ను ఎంచుకుంటున్నారు.. అక్కడి విద్యా విధానం, ప్రవేశప్రక్రియ తదితర అంశాలపై విశ్లేషణ.. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే తర్వాత అత్యధికంగా విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశం ఫ్రాన్స్. వివిధ దేశాలకు చెందిన 278,000 (మొత్తం విద్యార్థుల్లో 12 శాతం) మంది విద్యార్థులు ఇక్కడి యూనివర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో డాక్టోరల్ కోర్సుల్లో చేరిన వారి సంఖ్య దాదాపుగా 25 వేలు. అవసరాలకనుగుణంగా ఫ్రాన్స్ విద్యా వ్యవస్థకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రభుత్వం విద్య, పరిశోధనలకు ఏటా బడ్జెట్లో 20 శాతం నిధులను కేటాయిస్తోంది. పరిశ్రమ అవసరాలకనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఇక్కడి విద్యా విధానం ప్రత్యేకత. జాబ్ మార్కెట్ కోరుకుంటున్న నైపుణ్యాలను పెంపొందించేలా ప్రాక్టికల్ శిక్షణకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలో యూనివర్సిటీల కరిక్యులంలో ఇంటర్న్షిప్స్ తప్పనిసరి. దీని ప్రకారం ప్రతీ యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ రిఫరల్ సిస్టమ్, కెరీర్ సర్వీసెస్ విభాగం ఉంటుంది. ఈ విభాగం అందుబాటులోని ఇంటర్న్షిప్, ఉద్యోగావకాశాల గురించి విద్యార్థులకు సమాచారాన్ని ఇస్తుంది. ఫ్రెంచ్ ఎడ్యుకేషన్ మరో ప్రత్యేకత.. ఫుల్, పార్ట్ టైమ్ విధానంలో కాలేజీలకు హాజరయ్యే సౌలభ్యం. మరికొన్ని యూనివర్సిటీలు కంప్యూటర్ ద్వారా ఇంటి నుంచి కోర్సును పూర్తి చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఎల్ఎండీ ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్ దేశాలు అనుసరిస్తున్న ఎల్ఎండీ (ఔకఈ) విద్య విధానాన్నే అమలు చేస్తుంది. ఇందులో ఎల్ అంటే లెసైన్స్, ఎం అంటే మాస్టర్, డీ అంటే డాక్టోరల్ కోర్సులు. వీటిని షార్ట్, లాంగ్, డాక్టోరల్ ప్రోగ్రామ్లుగా విభజించారు. షార్ట్ ప్రోగ్రామ్ల వ్యవధి 2-3 సంవత్సరాలు. యూనివర్సిటీలు లేదా స్పెషలైజ్డ్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్న ఇన్స్టిట్యూట్లు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో భాగంగా ఏదైనా సంస్థలో తప్పనిసరిగా ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ ప్రోగ్రామ్లను యూనివర్సిటీలు ఆఫర్ చేస్తాయి. ఇందులో లెసైన్స్, మాస్టర్ అనే రెండు రకాలు కోర్సులు ఉంటాయి. లెసైన్స్ కోర్సు వ్యవధి మూడేళ్లు (ఆరు సెమిస్టర్లు). ఇవి బ్యాచిలర్ కోర్సులు. మాస్టర్ కోర్సుల వ్యవధి ఐదేళ్లు (10 సెమిస్టర్లు). ఇందులో రీసెర్చ్, ప్రొఫెషనల్ అనే రెండు రకాల కోర్సులు ఉంటాయి. రీసెర్చ్ కోర్సులను ఎంచుకున్న వారికి తర్వాత డాక్టోరల్ డిగ్రీ చేసే అవకాశం లభిస్తుంది. కొన్ని మాస్టర్ కోర్సుల వ్యవధి నాలుగేళ్లు కూడా ఉంటుంది. డాక్టోరల్ కోర్సుల వ్యవధి ఎనిమిదేళ్లు (16 సెమిస్టర్లు). సెమిస్టర్-క్రెడిట్లు ఫ్రాన్స్లో విద్యా సంవత్సరం సెప్టెంబర్/అక్టోబర్లో ప్రారంభమై మే/జూన్లో ముగుస్తుంది. క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా మధ్యలో రెండు వారాలు సెలవులు ఉంటాయి. జూలై, ఆగస్టు రెండు నెలలు వేసవి సెలవులు ఉంటాయి. కోర్సు నిర్వహణలో సెమిస్టర్ విధానం అమల్లో ఉంది. ఏటా రెండు సెమిస్టర్లు ఉంటాయి. పూర్తి చేసిన సెమిస్టర్లు, సాధించిన క్రెడిట్ల ఆధారంగా డిగ్రీలను అందజేస్తారు. కావల్సిన అర్హతలు..బ్యాచిలర్ కోర్సులకు ఇంటర్మీడియెట్, మాస్టర్ కోర్సులకు మూడు/ నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ, డాక్టోరల్ కోర్సులకు మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం. ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్) స్కోర్ ఆధారంగా ఇక్కడి యూని వర్సిటీల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇందుకోసం స్కోర్ 6.5 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. మేనేజ్మెంట్ కోర్సులకు జీమ్యాట్ స్కోర్ తప్పనిసరి. క్రెడిట్ పద్ధతిలో మూల్యాంకనం ఉంటుంది. ఇందుకోసం యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అండ్ అక్యూమలేషన్ సిస్టమ్ (ఉఇఖీ) అనే విధానాన్ని అనుసరిస్త్తారు. ఈ క్రమంలో లెసైన్స్ కోర్సులను పూర్తి చేయడానికి 180 క్రెడిట్లు, మాస్టర్ కోర్సులకు 300 క్రెడిట్లు అవసరం. ఫ్రెంచ్ తప్పనిసరికాదు ఫ్రాన్స్లో చదవాలంటే ఫ్రెంచ్ భాష వచ్చి ఉండాలనే నిబంధన ఏమీ లేదు. కాకపోతే అక్కడి సమాజంతో మమేకం కావడానికి ఫ్రెంచ్ భాషపై అవగాహన ఉండటం ప్రయోజనకరం. ఇతర దేశాల మాదిరిగానే ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉంటుంది. ఇక్కడ మొత్తం 917 కోర్సులను ఇంగ్లిష్ మాధ్యమంలో బోధిస్తారు. ఇందులో సైన్స్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, టూరిజం, లా, డిజైన్, ఫ్యాషన్, అగ్రికల్చర్, హోటల్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, హెల్త్ సెన్సైస్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్లు ఉంటాయి. వీటిలో న్యూక్లియర్, స్పేస్, ఏవియేషన్, టీచింగ్, సోషియాలజీ, లింగ్విస్టిక్స్, జాగ్రఫీ, బిజినెస్, ఎకనామిక్స్, ఫ్యాషన్, ఆర్ట్స్, సైన్స్ కోర్సులకు డిమాండ్ ఎక్కువ. ఫీజులు-స్కాలర్షిప్లు ఫ్రాన్స్లో 85 పబ్లిక్ ఫండింగ్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటి నిర్వహణకు ఫ్రెంచ్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. కాబట్టి ఫీజులు స్వల్పంగానే ఉంటాయి. ఇక్కడ 250 ఇంజనీరింగ్ స్కూల్స్, 220 బిజినెస్ స్కూల్స్, 291 డాక్టోరల్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇవే కాకుండా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, స్పెషలైజ్డ్ స్కూల్స్ (ప్రత్యేక రంగానికి సంబంధించినవి, ఉదాహరణ-యానిమేషన్, ఫ్యాషన్), కెథలిక్ యూనివర్సిటీలు ఉంటాయి. ఫీజులను ప్రత్యేక చట్టం ద్వారా నిర్ణయిస్తారు. ఈ క్రమంలో లెసైన్స్ కోర్సులకు రూ.11-13 లక్షలు (189,10 యూరోలు), మాస్టర్ కోర్సులకు రూ.15-19 లక్షలు (261,10 యూరోలు), డాక్టోరల్ కోర్సులకు రూ.25-28 లక్షలు (396,10 యూరోలు), మేనేజ్మెంట్ కోర్సులకు రూ.2-8 లక్షలు (3-10 వేల యూరోలు), ఇంజనీరింగ్ కోర్సులకు 610 యూరోలు అవసరం. పబ్లిక్ ఇన్స్టిట్యూట్లతో పోల్చితే ప్రైవేట్ సంస్థల్లో ఫీజులు కొంచెం అధికంగా ఉంటాయి. విదేశీ విద్యార్థుల కోసం పలు రకాల స్కాలర్షిప్లు కూడా అందుబాటులో ఉంటాయి. క్యాంపస్ బోర్సెస్ (ఇ్చఝఞఠట ఆౌఠటట్ఛట) పోర్టల్ ద్వారా స్థానిక సంస్థలు, ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, ఇన్స్టిట్యూట్లు అందజేస్తున్న స్కాలర్షిప్ వివరాలను తెలుసుకోవచ్చు. వసతి ఫ్రాన్స్లో ఆహారం, వసతి, రవాణా తదితరాల కోసం నెల కు రూ.40-55 వేలు (600-800 యూరోలు) అవసరం. వసతి విషయానికొస్తే.. అధిక శాతం విద్యార్థులకు యూనివర్సిటీ రెసిడెన్స్లో నివాస సౌకర్యం కల్పిస్తారు. ఇందుకోసం నెలకు రూ.8-24 వేలు (120-350 యూరోలు) చెల్లించాలి. ఇవికాకుండా ప్రైవేట్ స్టూడెంట్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్, ప్రభుత్వం అందించే హౌజింగ్ సౌకర్యం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా వసతి ఖర్చులను అక్కడి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. పార్ట్టైమ్ జాబ్ విద్యార్థుల అవసరాల మేరకు పార్ట్టైమ్ జాబ్ చేసే సౌకర్యం కూడా ఉంది. ఇందుకు కోర్సు వ్యవధిలో సగం సమయాన్ని పార్ట్టైమ్ జాబ్ కోసం కేటాయించవచ్చు. ఈ క్రమంలో సంవత్సరానికి 964 గంటలు పార్ట్టైమ్ జాబ్ చేయవచ్చు. అయితే ఇందుకు రెసిడెంట్ పర్మిట్ ఉండాలి. ఫ్రాన్స్లో జాతీయ కనీస వేతన చట్టం అమల్లో ఉంది. ఈ మేరకు గంటల చొప్పున వేతనం చెల్లిస్తారు. అంతేకాకుండా యూనివర్సిటీలు, ఇతర ఇన్స్టిట్యూట్లలో విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ జాబ్స్ ఉంటాయి. వీటి కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్టోరల్ కోర్సులను చదివే విద్యార్థులకు నెలకు రూ. లక్ష (1685 యూరోలు) లభిస్తాయి. దీనికి అదనంగా టీచింగ్, కన్సల్టింగ్ వంటి వృత్తులను ఎంచుకుంటే నెలకు రూ. లక్ష 40 వేలు (2025 యూరోలు) సంపాదించవచ్చు. సీఐఎఫ్ఆర్ఈ విధానంలో యూనివర్సిటీతోపాటు ఏదైనా కార్పొరేట్ సంస్థలో సమాంతరంగా రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. మాస్టర్ డిగ్రీ తర్వాత నిబంధనల మేరకు అక్కడే ఉద్యోగం చేసే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకోసం టెంపరరీ రెసిడెంట్ ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు 12 నెలలపాటు ఉద్యోగం చేయవచ్చు. ఒకే మాధ్యమం ద్వారా అడ్మిషన్ ప్రక్రియ, వీసా కోసం ఒకే మాధ్యమం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈక్రమంలో ముందుగా యూనివర్సిటీ, సబ్జెక్ట్ను ఎంచుకోవాలి. తర్వాత సీఈఎఫ్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో అడ్మిషన్ నుంచి వీసా వరకు ప్రతి దశకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ముందుగా www.india.campusfrance. org ద్వారా ఆన్లైన్లో పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేసి.. సంబంధిత వివరాలను పూర్తి చేయాలి. ఈ విధానంలోనే యూనివర్సిటీలు దరఖాస్తులను పరిశీలిస్తాయి. అర్హులను ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. అడ్మిషన్ సంబంధిత సమాచారాన్ని విద్యార్థులకు అందిస్తాయి. అంతేకాకుండా రాయబార కార్యాలయం వీసా దరఖాస్తును పరిశీలించడంతోపాటు మంజూరు చేస్తుంది. సాధారణంగా వీసా జారీకి రెండు వారాల నుంచి నెల రోజుల సమయం పడుతుంది. ఎంచుకున్న కోర్సును బట్టి వీసాను మంజూరు చేస్తారు. కోర్సు వ్యవధి 90 రోజుల కంటే ఎక్కువ ఉంటే లాంగ్ స్టే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు కావల్సిన ధ్రువపత్రాలు.. యూనివర్సిటీ ధ్రువీకరించిన అడ్మిషన్ లెటర్ ఫైనల్ అడ్మిషన్ లెటర్ ప్రాన్స్లో వసతి సౌకర్యాన్ని ధ్రువీకరించే ఆధారాలు ఆర్థిక వనరులను సూచించే పత్రాలు ఓవర్సీస్ మెడికల్ ఇన్సూరెన్స్ అకడమిక్ సర్టిఫికెట్లు రెజ్యూమె పాస్పోర్ట్ పరిశ్రమ అవసరాలకనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఫ్రెంచ్ విద్య ప్రత్యేకత. ఇందుకోసం సిలబస్లో ఇంటర్న్షిప్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఫ్రాన్స్లో చదవాలంటే ఫ్రెంచ్ భాష వచ్చి ఉండాలనే నిబంధన ఏమీ లేదు. కాకపోతే అక్కడి సమాజంతో మమేకం కావడానికి ఫ్రెంచ్పై అవగాహన ఉండటం ప్రయోజనకరం. ఇతర దేశాల మాదిరిగానే విదేశీ విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమంంలోనే బోధన ఉంటుంది. ఐఈఎల్టీఎస్ స్కోర్ (6.5 లేదా ఎక్కువ) ఆధారంగా ప్రవేశం పొందొచ్చు. పబ్లిక్ యూనివర్సిటీలతోపాటు ప్రైవేట్ ఫీజులు కొంచెం అధికం. అక్కడి ప్రభుత్వం ఇస్తున్న రాయితీల కారణంగా ఇతర దేశాలతో పోల్చితే ఫ్రాన్స్లో ఫీజలు చాలా తక్కువ. అంతేకాకుండా వసతి ఖర్చులను అక్కడి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. విదేశీ విద్యార్థుల కోసం ఎన్నో మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్లు కూడా అందుబాటులో ఉంటాయి. -వసుధ మురళీకృష్ణ, ఎడ్యుకేషన్ అడ్వైజర్, క్యాంపస్ ఫ్రాన్స్, హైదరాబాద్. గత పదేళ్లలో ఫ్రాన్స్కు వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్య 75 శాతం పెరిగింది. ................................................... ఫ్రాన్స ప్రభుత్వం ఏటా రూ. 7.1 కోట్ల స్కాలర్షిప్లను భారతీయ విద్యార్థులకు అందజేస్తుంది. ................................................... ఫ్రెంచ్ విద్యార్థులతో సమానంగా విదేశీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, హెల్త్ కవరేజ్, హౌజింగ్ అసిస్టెంటెన్స్ వంటి సౌకర్యాలను కల్పిస్తారు. ................................................... యూజ్ఫుల్ వెబ్సైట్స్: www.campusfrance.org www.france.fr www.ambafrance&in.org www.diplomatie.gov.fr -
ప్రాక్టికల్ విద్య అందితే సత్ఫలితాలు
ఎచ్చెర్ల: ఐటీఐల్లో ఏ ఏడాది మెరుగైన ప్రవేశాలు జరిగాయి. అయితే ఐటీఐల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య సక్రమంగా అందితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఐటీఐల్లో ఈ ఏడాది 3226 సీట్లకు గాను 2900 వరకు నిండిపోయాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటి ట్రేడుల్లో ప్రైవేటు కళాశాలల్లో సైతం దాదాపు సీట్లు నిండాయి. జిల్లాలో ఎచ్చెర్ల, శ్రీకాకుళం డీఎల్టీసీ, పలాస, సీతంపేట, రాజాంల్లో ఐదు ప్రభుత్వ ఐటీఐ, మరో 17 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. ప్రస్తుత ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకోవాలంటే విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు, పరిశ్రమల్లో వస్తున్న సాంకేతిక మార్పులు, పరిశ్రమలు అవసరాలు ముందుగా గుర్తించాలి. విద్యార్థులు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుంది. వీరి పని తీరును నిరంతరం ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు. అందుకే ప్రతి ఐటీఐ విద్యార్థి నిరంతరం స్కిల్స్ నైపుణ్యం వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దిశగా ఐటీఐలు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రెండేళ్ల కోర్సుల్లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్మెన్ సివిల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ నిర్వహిస్తుండగా, ఏడాది కోర్సులు వెల్డర్, కోపా, డీజిల్ మెకానిక్, కటింగ్ అండ్ సూయింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ తదితర కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మాజ్యూలరీ ఎంప్లాయ్మెంట్ స్కిల్ సంస్థ ఐటీఐల్లో డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తుంది. ఇప్పటికే ఇటువంటి కోర్సులను నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్ వంటి సంస్థలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో తరగతుల నిర్వహణ, శిక్షణ కొంతవరకు మెరుగ్గా ఉన్నా ప్రైవేటు సంస్థల్లో మాత్రం అనుకున్న స్థాయిలో ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు నైపుణ్యాల్లో వెనుకబడిన సందర్భాలున్నాయి. డీజీఈపీ వంటి సంస్థలు నిరంతరం పర్యవేక్షణ చేస్తేఇక్కడ సైతం శిక్షణ బాగా జరిగే అవకాశం ఉంటుంది. మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ మార్పు, ప్రయోగ విద్యకు ప్రాధాన్యత నివ్వడం, పరిశ్ర మల్లో విద్యార్థులకు ప్రయోగాలకు అవకాశం కల్పించడం, అధీకృత సంస్థల నిరంతర పరిశీలనతో విద్య మరెంత బలోపేతం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐటీఐ అనంతరం విద్యార్థులు డిప్లమో, డిగ్రీ వంటి చదువు లకు ప్రాధాన్యత నిచ్చినా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సెమిస్టర్ విధానంలో... గత ఏడాది నుంచి సెమిస్టర్ పద్ధతిలో ఐటీఐ పరీక్షలు ప్రవేశపెట్టారు. ఏడాది కోర్సు విద్యార్థులు రెండు, రెండేళ్ల కోర్సు విద్యార్థులు నాలుగు సెమిస్టర్ విధానంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పరీక్షలన్నీ ఆప్షన్ల విధానంలో ఉంటాయి. గతంలో థియరీ విధానంలో పరీక్షలు రాసేవారు. పరీక్ష రాసే విధానం సైతం దృష్టి సారించాల్సి ఉంది. విద్యలో రాణించాలంటే మాత్రం ప్రయోగ విద్యకు ప్రాధాన్యతను ఇవ్వాలి. కష్టబడి పనిచేయాలి ఐటీఐలో చేరే విద్యార్థి నిరంతరం శ్రమిం చాల్సి ఉంటుంది. జిల్లాలో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సు ల్లో చేరుతున్నారు. పరిశ్రమల్లో సాంకేతి క మార్పులు గమనించి మెరుగైన విద్యను పొందాలి. ప్రభు త్వ ఉద్యోగాలకు సైతం ఎంపిక కావ చ్చు. -రాడ కైలాసరావు, జిల్లా ఐటీఐల క న్వీనర్ ఉపాధి కోసం చేరా నేను ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకోవాలని ఐటీఐలో చేరాను. తక్కువ వయసులో ఉపాధి అవకాశాలు పొందడం ద్వారా మా కుటుంబానికి ఆర్థికంగా సహాయపడతాను. మా నాన్న కూడా ఐటీఐ చేసి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నారు. -ఎల్.అనూష, సివిల్, ఎచ్చెర్ల ఐటీఐ పరిశ్రమల్లో ఉపాధి కోసం.. నాకు 10 తరగతిలో 9.07 గ్రేడ్ మార్కులు వచ్చాయి. ఇంటర్మీడియెట్ అనంతరం ఉన్నత చదువులు చదివే ఆర్థిక స్థోమత లేదు. అందుకే ఐటీఐలో చేరా. ఐటీఐ అనంతరం ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకోవడమే నా లక్ష్యం. -జె.సంతోష్ కుమార్, ఫిట్టర్ ట్రేడ్, ఎచ్చెర్ల -
నిరుప్రయోగం
కర్నూలు(విద్య): జిల్లాలో ఒక ప్రభుత్వ ప్రాథమికోన్నత, 25 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 11 ప్రాథమికోన్నత, 16 ఉన్నత పాఠశాలలున్నాయి. అలాగే 335 జిల్లా పరిషత్ , 25 ఎయిడెడ్ ప్రాథమికోన్నత, 45 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇవిగాక 32 మోడల్ స్కూళ్లు, 54 కస్తూరిబాగాంధీ పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ను అందించేందుకు విధిగా ప్రయోగశాలలు నిర్వహించాలి. పాఠశాల నిర్వహణకు విడుదలయ్యే స్కూల్గ్రాంట్ నిధుల నుంచి వీటికి అవసరమైన పరికరాలను ఆయా పాఠశాలల హెచ్ఎంలు కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే అధిక శాతం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. వారానికి నాలుగుసార్లు చొప్పున 8, 9, 10వ తరగతి విద్యార్థులకు రసాయన, జీవశాస్త్రాల్లో ప్రయోగ పాఠాలు చెప్పాలి. అయితే జిల్లాలో 450 పాఠశాలల్లో ప్రయోగశాలలకు గదుల్లేవు. ఈ కారణంగా ఆర్ఎంఎస్ఏ ద్వారా కొనుగోలు చేసిన పరికరాలను వారు బీరువాల్లోనే ఉంచేశారు. గత యేడాది 150 పాఠశాలల్లో గదులు నిర్మించినా వాటిని విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపయోగించుకుంటున్నారు. రెగ్యులర్గా ప్రయోగశాలల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం, మరోవైపు ఉపాధ్యాయుల నిరాసక్తత కారణంగా విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య దూరమవుతోంది. అధిక శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులు చార్ట్లలో చిత్రాలు గీసి పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. చాలా పాఠశాలల్లో మైక్రోస్కోప్లు, స్ప్రింగ్ త్రాసులు పనిచేయడం లేదు. ఇప్పటికీ జిల్లాలోని 95 శాతం పాఠశాలల్లో ప్రయోగశాలల దుమ్ముకూడా దులపడం లేదు. ఎక్కడికక్కడ పరికరాలు బీరువాల్లో మూలుగుతున్నాయి. బట్టీకొట్టే చదువుకంటే స్వతహాగా ప్రయోగాల ద్వారా నేర్చుకునే అంశంపై బాగా గుర్తుంటుందన్న విషయాన్ని ఉపాధ్యాయులు మరుస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. పరిశీలన నైపుణ్యం పెరుగుతుంది ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థుల పరిశీలన నైపుణ్యం పెరుగుతుంది. ఒక విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవడానికి, నిర్ధారణకు రావడానికి ప్రయోగాలు ఉపయోగపడతాయి. విద్యార్థుల్లో సర్దుబాటు గుణం, అవగాహన సామర్ధ్యం పెరుగుతుంది. ఉపాధ్యాయులు చేయడమే గాక విద్యార్థులతో ప్రయోగాలు చేయించినట్లయితే భవిష్యత్లో వారు మంచి పరిశోధకులుగా మారే అవకాశం ఉంది. - విజయకుమార్, సైన్స్ ఉపాధ్యాయుడు ప్రత్యేక గదులుండాలి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలలు ఉన్నప్పటికీ చాలా చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం సరఫరా చేసిన ల్యాబ్ పరికరాలు చెడిపోయాయి. దీనికితోడు తరగతి గదిలోనే ప్రయోగశాలలు నిర్వహిస్తున్నారు. ప్రతి పాఠశాలకు ప్రత్యేకంగా ప్రయోగశాలకు అవసరమైన గదిని నిర్మించాలి. దాని నిర్వహణకు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టును క్రియేట్ చేయాలి. - ఇస్మాయిల్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇకపై ప్రయోగశాలలపై దృష్టిసారిస్తాం ఈ ఏడాది నుంచి ప్రయోగశాలల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాం. ప్రయోగశాల నిర్వహణకు ఆర్ఎంఎస్ఏ ద్వారా ఒక్కో పాఠశాలకు సైన్స్ఫేర్, ల్యాబ్ కెమికల్స్, పరికరాల కొనుగోలుకు రూ.20 వేలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ప్రయోగశాలలు బలోపేతం చేయనున్నాం. మూడో విడతలో భాగంగా ఈ యేడాది మరో 150 పాఠశాలల్లో ఆర్ఎంఎస్ఏ నిధుల ద్వారా ప్రయోగశాలలకు ప్రత్యేక గదులు నిర్మించనున్నాం. ఇప్పటికే పూర్తయిన 150 పాఠశాలల్లోని గదుల్లో ప్రయోగశాలలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం. - కె. నాగేశ్వరరావు, డీఈవో
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
చంద్రబాబు వల్లే అన్యాయం
గుడాల గోపికి అడుగడుగునా బ్రహ్మరథం
వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయం
జనసేన, టీడీపీకి రాంరాం
సంక్షేమం సగం బలం
సమస్యలపై నాన్చడం నచ్చదు..
చెల్లెం ఆనందప్రకాష్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు
ముస్లింలకు అండగా జగన్
చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement