-
ఎస్సీలకు 18%.. ఎస్టీలకు 12% రిజర్వేషన్లు
చేవెళ్ల: చేవెళ్ల ప్రజాగర్జన సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించింది. మొత్తం 12 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ డిక్లరేషన్లో పేర్కొన్న అంశాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఖర్గే ప్రకటించారు. డిక్లరేషన్లోని అంశాలివీ.. జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12% మేర రిజర్వేషన్ల పెంపు. వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం. అంబేడ్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం. ఐదేళ్ల పాటు ప్రతి బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించి పథకం అమలు. ఎస్సీ, ఎస్టీలకు అన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 18 శాతం, 12 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీల్లో కూడా వారికి రిజర్వేషన్లు ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇంటి స్థలాలు లేని ప్రతి దళిత, గిరిజనులకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల ఆర్థిక సాయం. ఐదేళ్లలో ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఈ పథకం వర్తింపు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అన్ని హక్కులతో తిరిగి అసైనీలకే కేటాయింపు. ప్రజా ప్రయోజనార్థం, భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు సదరు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం. ఎస్సీలకు ఇచ్చిన అసైన్ భూములపై యాజమాన్య హక్కుల కల్పన. అమ్ముకునేందుకు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకునే హక్కులు. ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములపైనా వారికి పూర్తి హక్కులు. అటవీ హక్కుల చట్టం పటిష్టంగా అమలు. సమ్మక్క–సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు రూ.25లక్షల అభివృద్ధి నిధులు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు. మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు ఒక్కో కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.750 కోట్ల నిధులు. గిరిజనుల కోసం మూడు కార్పొరేషన్లు. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు. వాటికి ఏటా రూ. 500 కోట్ల కేటాయింపు. రాష్ట్రంలో ఐదు కొత్త ఐటీడీఏలు, తొమ్మిది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు. మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్లలో ఐటీడీఏల ఏర్పాటు. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. విద్యాజ్యోతుల పథకం కింద పదో తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి రూ.10 వేల నగదు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25వేలు, పీజీకి రూ.లక్ష.. ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5లక్షల నగదు బహుమతులు. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అందరికీ విద్య. గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం. -
జాతీయస్థాయిలో ఉద్యమం
- అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా చలో ఢిల్లీ, జంతర్మంతర్ వద్ద ఆందోళన చేపడతాం - రాష్ట్ర ప్రభుత్వంలోని స్వార్థపర శక్తుల వల్లే సమస్య జఠిలం - అగ్రిగోల్డ్ ప్రజాగర్జన సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అనంతపురం అర్బన్: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ‘చలో ఢిల్లీ’ ద్వారా ఈ సమస్యను జాతీయస్థాయికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలోని స్వార్థపర శక్తులే సమస్య పరిష్కారానికి అడ్డుగా నిలుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల ఒరిస్సా, కర్నాటకలోని అగ్రిగోల్డ్ బాధితులను కలుపుకొని జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని, చలో ఢిల్లీ చేపట్టి జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగుతామని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజులపాటు చేపట్టిన చైతన్యయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ‘అగ్రిగోల్డ్ బాధితుల ప్రజాగర్జన’ సభ నిర్వహించారు. ముందుగా అగ్రిగోల్డ్ సంస్థ కారణంగా అసువులు బాసిన 149 మందికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సభలో నారాయణ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థ చట్టవిరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సంస్థ ఆస్తులను తాకట్టు పెట్టుకుని రూ.5 వేల కోట్లు ఇచ్చి చిన్నమొత్తాల ఖాతాదారులను ఆదుకోవాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. అగ్రిగోల్డ్ మోసం వల్ల 149 మరణించారని, ఇందుకు ప్రభుత్వాన్ని, అగ్రిగోల్డ్ సంస్థను బాధ్యులను చేస్తూ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంఎ.గఫూర్, ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ పోతిన వెంకటరామారావు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి సుందర రామరాజు, అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్రెడ్డి, గౌరవాధ్యక్షుడు ముప్పాళ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి తిరుపతయ్య, జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.జె.చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే మూల్యం తప్పదు
‘ప్రజాగర్జన’ సభలో ఉత్తమ్ ధ్వజం సాక్షి, సంగారెడ్డి: ‘ప్రత్యేక తెలంగాణలో ప్రజాస్వామ్యానికి మనుగడ లేకుండా పోయిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. సర్పంచ్ నుంచి ఎంపీ దాకా ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మారుమూల గ్రామాల్లో వీర సైనికులుగా పోరాడుతున్నారన్నారు. ‘కార్యకర్తల వెంట ఐక్యంగా మేముంటాం. ఎవరిని ఇబ్బంది పెట్టినా మూల్యం చెల్లించక తప్పదు’ అంటూ హెచ్చరించారు. సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్రాల్లో మూడేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలూ కలగలేదనే అంశాన్ని రాష్ట్రమంతటా చాటేందుకే రాహుల్గాంధీ వచ్చారన్నారు. ‘ఆంధ్ర ప్రాంతంలో అధికారం కోల్పోతున్నామని తెలిసినా ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి, చలించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ మూడేళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఏ మేలూ జరగలేదు. విభజన బిల్లులోని ఏ హామీ అమలుకు నోచలేదు. ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, ఎయిమ్స్ వంటివేమీ రాలేదు’ అన్నారు. దాశరథి, కాళోజీ కవితా పంక్తులను ఉటంకిస్తూ.. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. -
ప్రజాగర్జనకు తరలిన కాంగ్రెస్ నాయకులు
నార్నూర్: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో సంగారెడ్డి ప్రజాగర్జనకు నార్నూర్, గాదిగూడ మండలాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు గురువారం భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌహాన్ డిగాంబర్, సత్తార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరిస్తోందని వివరించారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రెండు మండలాల నుంచి మొత్తం 15 వాహనాల్లో కార్యకర్తలు తరలివెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గోవింద్, రాథోడ్ రమేశ్, కైలాష్ ఉన్నారు. -
ఎమ్మెల్యే వీరశివా దౌత్యం....
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థిత్వ ప్రభావం ప్రజాగర్జనపై పడింది. టికెట్ ఆశావాహులు ధిక్కార స్వరం విన్పిస్తున్నారు. సీఎం రమేష్ ఏకపక్ష నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, పీసీసీ మెంబర్ రాంప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. సోమవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవాలని భావించిన నేతలు, ఆ కార్యక్రమానికి దూరం కావడం వెనుక కడప పార్లమెంటు టికెట్ వ్యవహారమే కారణంగా పలువురు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్ లేదని భావించిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, రమేష్రెడ్డి, వీరశివారెడ్డి, రాజంపేట నేత మేడా మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేబాటలో ఎమ్మెల్యేలు డీఎల్ రవీంద్రారెడ్డి, కందుల సోదరులు, పీసీసీ మెంబర్ రాంప్రసాద్రెడ్డి ఉన్నారని ఇదివరకే టీడీపీ నేతలు ప్రకటించారు. వీరందరూ ప్రజాగర్జనలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని భావించారు. అయితే ఊహించని రీతిలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. కడప పార్లమెంటు అభ్యర్థిత్వం ఆశించిన ఆయన ఆ అవకాశం దక్కదని భావించి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఇష్టపడనున్నట్లు తెలుస్తోంది. అనూహ్యంగా కడప పార్లమెంటు అభ్యర్థిగా మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్రెడ్డి తనయుడు శ్రీనివాసులరెడ్డి తెరపైకి రావడంతో కందుల రాజమోహన్రెడ్డి సైతం అలక వహించినట్లు తెలుస్తోంది. కడప పార్లమెంటు సీటుతో మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించిన రాజమోహన్రెడ్డికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఎంపీ రమేష్ వైఖరి కారణంగా అడ్డుచక్రం పడ్డట్లు సమాచారం. ఆమేరకు ప్రజాగర్జనకు సైతం దూరంగా ఉండాలని రాజమోహన్రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వీరశివా దౌత్యం.... కడప పార్లమెంటు టికెట్ ఆశించి భంగపడ్డ కందుల రాజమోహన్రెడ్డి చంద్రబాబు ప్రజాగర్జనకు దూరంగా ఉండాలనే తలంపుతో ఉండిపోయారు. అయితే ఎమ్మెల్యే వీరశివారెడ్డి కందుల ఇంటికి చేరుకుని మంతనాలు నిర్వహించారు. కడప అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆర్. శ్రీనివాసులరెడ్డి నాన్లోకల్ అవుతారు.. మీతోబాటు మేము కూడా చంద్రబాబుకు చెబుతాం.. తొందరపడొద్దు.. ప్రజాగర్జనకు హాజరు అవండి..అభ్యర్థిని మార్చేందుకు అందరం కలిసి ప్రయత్నిస్తాం అంటూ సముదాయించినట్లు తెలుస్తోంది. వీరి చర్చల అనంతరం రాజమోహన్రెడ్డి కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నా, శివానందరెడ్డి మాత్రం దూరంగా ఉండిపోయారు. ఇకపై తాను తెలుగుదేశం పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటానని, నీవు మాత్రమే రాజకీయాలు చేసుకోవచ్చని సోదరుడు రాజమోహన్రెడ్డికి శివానందరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడు రమేష్ ఏకపక్ష వైఖరితో కందుల సోదరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కాగా రాయచోటి కాంగ్రెస్ పార్టీ నేత రాంప్రసాద్రెడ్డి సైతం ప్రజాగర్జనకు దూరమయ్యారు. పాలకొండ్రాయుడికి గాని తనకుగాని టికెట్ ఇవ్వాలని, రమేష్రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై రాంప్రసాద్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేష్ను నియంత్రించాల్సిందే... చంద్రబాబు వద్ద ఎంత పరపతి ఉన్నా సరే జిల్లాలో పోట్లదుర్తి కుటుంబీకుడేనని గుర్తించుకునేలా వ్యవహరించాలని తెలుగుదేశం నేతలు సీఎం రమేష్కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. వర్గ రాజకీయాల్లో సిఎం రమేష్ స్థాయి చాలా చిన్నదన్న విషయాన్ని గుర్తించాలని వ్యతిరేక టీం పేర్కొంటోంది. జిల్లాలోని పార్టీ కేడర్ కారణంగానే ప్రజాగర్జన విజయవంతమైంద ని, ఇందులో సీఎం రమేష్ గొప్పతనం ఏమీ లేదని చంద్రబాబుకు చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి కడప పార్లమెంటు టికెట్ వ్యవహారం తెలుగుతమ్ముళ్ల మధ్య అంతర్గత విభేదాలను తీవ్రతరం చేస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement