-
దేశంలో అసమ్మతి సెగ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ రోజు రోజుకూ పెరుగుతోంది. పార్టీలో వర్గ విభేదాలు సమసిపోయేలా చేయాలని సీఎం ఎంత ప్రయత్నించినా సెగ రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఏం చేయాలో పాలుపోక సీఎం తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పశ్చిమ ప్రకాశంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఫార్ములాను అమలు చేయాలనుకున్న సీఎంకు ఇక్కట్లు తప్పడం లేదు. యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు సీఎంకు మరింత తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇక అద్దంకిలో తాజా రాజకీయ పరిణామాలు ప్రధానంగా కరణం బలరాం దూకుడుగా వ్యవహరిస్తుండడం సీఎంను మరింత ఇరుకును పెడుతోంది. పది రోజులుగా ఎమ్మెల్సీ కరణం బలరాం అద్దంకి రాజకీయాల్లో దూకుడు పెంచారు. నియోజకవర్గంలోని సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి, జే పంగులూరు మండలాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో జరిగిన సిమెంటు రోడ్లకు వరుస పెట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అద్దంకి నుంచి రాబోయే ఎన్నికల్లో తామే పోటీలో ఉంటామంటూ కరణం, ఆయన తనయుడు వెంకటేష్లు ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బలరాం తనదైన శైలిలో తాను పార్టీ మారినప్పుడు పదవికి రాజీనామా చేసి వచ్చానని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పదవికి రాజీనామా చేయకుండా పార్టీలు మారడం సరైన సంస్కృతి కాదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్పై పరోక్ష విమర్శలకు దిగుతున్నారు. కరణం, ఆయన తనయుడు వెంకటేష్ల దూకుడుతో సంతమాగలూరు, బల్లికురవ, అద్దంకి, జే పంగులూరు మండలాల్లో వారి అనుచరవర్గం తిరిగి బలరాం చెంతకు చేరుతోంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిన తర్వాత నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు ఆయనకే అప్పగించినట్లు సీఎం ప్రకటించారు. కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి అద్దంకి రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ పరిణామంతో బలరాం వర్గంలో చాలా మటుకు ఎమ్మెల్యే గొట్టిపాటి వైపు వెళ్లింది. ఆ తర్వాత బలరాం కుటుంబం కొద్ది రోజులు అద్దంకి రాజకీయాలకు దూరంగానే ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా బలరాం కుటుంబం అద్దంకి రాజకీయాల్లో జోక్యం పెంచి ఏకంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు దిగడం జిల్లా అధికార పార్టీతో పాటు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలరాం స్పీడు పెంచినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించేందుకు బలరాం సిద్ధమయ్యారు. తాము అద్దంకి నుంచి బరిలో దిగుతామని ఇప్పటికే వారు క్యాడర్కు సంకేతాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే పాత వర్గాన్ని మొత్తం తిరిగి తమవైపు తెచ్చుకునేందుకు దూకుడు పెంచినట్లు తెలు స్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అద్దంకి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గొట్టిపాటి ఉంటారా..? లేక లేక కరణం వెంకటేష్ ఉంటారా..? అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. అధికార పార్టీ క్యాడర్లోనూ ఇదే అనుమానం నెలకొంది. బలరాం దూకుడుతో పాత వర్గాలు తిరిగి ఆయన చెంత చేరుతోంది. అద్దంకిలో బలరాం తిరిగి జోక్యాన్ని పెంచడంపై గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ల దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే బలరాం విషయంలో తెగేదాక లాగడం సరికాదని ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదే అదునుగా బలరాం కుటుంబం సైతం అమీ తుమీకి సిద్ధపడే పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థి గొట్టిపాటా... లేక తామా ... అన్నది తేల్చుకునేందుకు వారు వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ఎవరో ఒకరు పార్టీని వీడతారన్న ప్రచారమూ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎటువైపు మొగ్గుతారన్నది వేచి చూడాల్సిందే. చీరాల నియోజకవర్గంలో అసమ్మతి చాపకింద నీరులా కమ్ముకుంది. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను మాజీ మంత్రి పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆమంచి అవసరం రీత్యా ముఖ్యమంత్రి ఆయనకు ఇటీవల కాలంలో మరింత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే సునీత, పాలేటి రామారావులు ఆమంచికి పూర్తి స్థాయిలో మద్దతు పలికే పరిస్థితి లేదు. కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కదిరి బాబూరావు మార్పు తధ్యమని టీడీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదంటూ టీడీపీ అధిష్టానం ఇప్పటికే బాబూరావుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డికి టికెట్ ఇస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఇదే జరిగితే బాబూరావు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉందన్న ప్రచారమూ ఉంది. నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న కందుల నారాయణరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం టిక్కెట్టు ఇవ్వదన్న ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఈ నియోజకవర్గం నుంచి మరొక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం ఉంది. ఇదే జరిగితే కందుల వర్గం పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉందన్న ప్రచారమూ సాగుతోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన డేవిడ్రాజు అధికార పార్టీలోకి ఫిరాయించారు. టీడీపీ నేత మన్నే రవీంద్రతో పాటు పలువురు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ డేవిడ్రాజుకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదని అధికార పార్టీ వర్గాలే పేర్కొంటుండడం గమనార్హం. దీంతో డేవిడ్రాజు సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ఇక సంతనూతలపాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన నేతలు మాజీ ఎమ్మెల్యే విజయ్కుమార్ను వ్యతిరేకిస్తున్నారు. తమ కనుసన్నల్లో విజయకుమార్ నడవడం లేదన్న అక్కసుతో సదరు నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆయన తనయుడు లోకేషకు సైతం ఇక్కటి నేతలు విజయ్కుమార్ను మార్చాలంటూ పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఇక్కడి పరిణామాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. కొండపి నియోజకవర్గంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, ఆయన సమీప బంధువులు దామచర్ల పూర్ణచంద్రరావు, సత్యతోపాటు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ప్రభావం ఉంది. జనార్థన్ కొండపి ఎమ్మెల్యే స్వామిని వ్యతిరేకిస్తుండగా జనార్థన్ చిన్నాన్న, సోదరుడు స్వామికి మద్దతు పలుకుతున్నారు. దీంతో జనార్థన్ స్వామికి అడ్డుకట్ట వేసేందుకు జూపూడి ప్రభాకర్రావును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్టు ఇస్తారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. కందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు ఆ తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించడంతో పోతుల, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వర్గాల మధ్య సఖ్యత లేదు. ఇరువురు నేతలు బయటకు సఖ్యతగా ఉన్నా క్యాడర్ మధ్య విభేదాలు అలాగే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో పోతుల టీడీపీ టిక్కెట్ ఇస్తే దివి శివరాం వర్గం మనస్ఫూర్తిగా పనిచేసే పరిస్థితి లేదు. -
సయోధ్య సాధ్యమేనా?
► ఒకే ఒరలో రెండు కత్తులా..! ► నియోజకవర్గ బాధ్యతలు ఎమ్మెల్యేలకే అంటున్న సీఎం ► ఫిరాయింపుదారుల పెత్తనాన్ని అంగీకరించని పాత నేతలు ► అద్దంకిలో కరణం అంగీకారం ప్రశ్నార్థకమే ► గొట్టిపాటి పెత్తనాన్ని సహించేది లేదంటున్న బలరాం వర్గీయులు ► చీరాల, గిద్దలూరులోనూ ఇదే పరిస్థితి ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది జగమెరిగిన సత్యం. కానీ టీడీపీ జిల్లా రాజకీయాల్లో ఇది సాధ్యం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఉప్పు నిప్పులా ఉంటున్న నాయకులను తిరిగి ఒకే వరలోకి చేర్చాలనే ప్రయత్నం మాత్రం ఫలించేలా లేదు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో శుక్రవారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ పూర్తిస్థాయి అధికారాలు ఎమ్మెల్యేలకే కట్టబెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యంగా జిల్లాలోని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అధికారాలను అప్పగిస్తున్నట్టుగా చెప్పారని సమాచారం. ఆది నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్న మాజీ ఎంపీ కరణం బలరాం, చీరాల నేత పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, దివి శివరాం తదితరులు బాబు ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తారా..? లేక తమదైన శైలిలో అసమ్మతిపోరు సాగిస్తారా..?అన్నది తేలాల్సి ఉంది. అద్దంకిలో సయోధ్య అసాధ్యం..: అద్దంకి రాజకీయాలను పరిశీలిస్తే ఇక్కడ పాత, కొత్త నేతల మధ్య సయోధ్య సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. నియోజకవర్గాన్ని, తన వర్గీయులను వదులుకుని రాజకీయ సమాధి అయ్యేందుకు కరణం బలరాం ఏ మాత్రం అంగీకరించే పరిస్థితి లేదు. ఆయన మౌనం దాల్చినా.. ఆయన వర్గీయులు ఫిరాయింపు ఎమ్మెల్యేను సహించే పరిస్థితి కానరావడం లేదు. దీంతో ఇక్కడ అధికార పార్టీలో సయోధ్య సంగతి దేవుడెరుగు, వర్గవిభేదాలు మరింతగా పెరగనున్నాయి. ఈ నియోజకవర్గంలో వర్గవిభేదాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్తో కరణం బలరాంకు వర్గవిభేదాలున్నాయి. గొట్టిపాటిని అధికార పార్టీలో చేర్చుకోవడాన్ని కరణం ఆదిలోనే వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు ఆయన్ను ఒక దశలో బాబు కరణంకు చెక్ పెడతారన్న ప్రచారమూ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు సైతం ఇదే ప్రచారం చేశారు. గొట్టిపాటి రాకతో అద్దంకిలో వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరాయి. వీరి గొడవల పుణ్యమా అని ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి–మాఊరు, జనచైతన్యయాత్రలు సైతం అద్దంకిలో జరగలేదు. పింఛన్లు మొదలుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల వరకు ఇరువర్గాలు పోటీ పడటంతో నిలిచిపోయిన పరిస్థితి. ఇక అధికారుల బదిలీల్లోనూ ఆధిపత్య పోరు సాగుతోంది. ఇదే సమయంలో గొట్టిపాటికి లైన్ క్లియర్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కరణం బలరాంకు ఎమ్మెల్సీ కట్టబెట్టినట్లు ప్రచారం ఉంది. అదే సమయంలో ఆయన కుమారుడు కరణం వెంకటేష్కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పెంపు నేపథ్యంలో ఎమ్మెల్యే సీటిస్తానని బాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. బాబు ఎన్ని హామీలిచ్చినా.. కరణం అద్దంకిని గొట్టిపాటికి అప్పగిస్తారా..? కుమారుడి రాజకీయ భవిష్యత్తును ఇందుకు పణంగా పెడతారా..? అన్న ప్రశ్నకు రాజకీయ పరిశీలకులు అలా జరగదని సమాధానమిస్తున్నారు. కరణం నైజం తెలిసిన వాళ్లు అవసరమైతే కరణం సీఎంనైనా ఎదిరిస్తారే తప్ప తలొగ్గేది లేదని చెబుతుండటం గమనార్హం. చీరాలలో సయోధ్య సందేహమే..: ఇక చీరాల, గిద్దలూరులలో అదే పరిస్థితి నెలకొంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధికార పార్టీలో చేరినా ఆమంచిని పార్టీ టీడీపీ నేత పోతుల సునీత వ్యతిరేకించారు. అడుగడుగునా అడ్డుతగిలారు. ఈ పరిస్థితిని గమనించిన బాబు రెండు వర్గాలను సమన్వయం చేసేందుకు పోతుల సునీతకు ఎమ్మెల్సీ కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అద్దంకి తరహాలోనే మున్ముందు సునీత సైతం ఆమంచి దూకుడుకు అడ్డుకట్ట వేస్తారా... లేక సర్దుకుపోతారా... అన్నది వేచి చూడాల్సిందే! ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను చూస్తే వారిద్దరి మధ్య పొత్తు సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. సునీత వర్గీయులు ఆమంచిని అడుగుడుగునా వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్కడ సయోధ్య ప్రశ్నార్థకమే! రగడ ఖాయం..: అద్దంకిలో ఇప్పటికీ కరణంకు గట్టి పట్టు ఉంది. మున్సిపాలిటీలో 20 మంది వార్డు కౌన్సిలర్లతో ఆయన వర్గీయులే చైర్మన్గా ఉన్నారు. బల్లికురవ ఎంపీపీ మొదలుకొని కోరిశపాడు ఎంపీపీ, జడ్పీటీసీ, జె.పంగులూరు ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు ఆయన వర్గీయులే ఇక నియోజకవర్గవ్యాప్తంగా మెజార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు కరణం వర్గీయులే. ఇక కేడర్ పరంగా గ్రామస్థాయి నుంచి కరణంకు బలమైన పట్టు ఉంది. ఈ పరిస్థితుల్లో కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం నియోజకవర్గాన్ని గొట్టిపాటి చేతుల్లో పెట్టి కరణం తన, కుమారుడు రాజకీయ భవిష్యత్తు వదులుకుంటారనుకోవడం పొరపాటే. గొట్టిపాటి పెత్తనం చలాయించాలని చూసేపక్షంలో కరణం ప్రమేయం లేకుండానే అద్దంకి నియోజకవర్గంలో ఆయన వర్గీయులు ఎమ్మెల్యేకు అడుగడుగునా అడ్డుతగిలే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సైతం కరణం వర్గీయులు అడ్డుకున్న సంఘటనలకు కొదువ లేదు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే హోదాలో అద్దంకి పెత్తనం చేయడం గొట్టిపాటికి సాధ్యమయ్యే పని కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా కరణం వర్గీయులు వినే పరిస్థితి కానరావడం లేదు. ఇదే జరిగితే అద్దంకి రగడ మరింత పెద్దది కావడం తప్ప సమసిపోయే పరిస్థితి ఉండదు. ముత్తుములను వ్యతిరేకిస్తున్న అన్నా..: ఇక గిద్దలూరు నియోజకవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డిని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతో మంత్రి రావెల కిశోర్బాబు, శిద్దా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, పలుమార్లు వారిద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించిన ఇది సాధ్యం కాలేదు. అన్నా తన ఉనికిని చాటేందుకు ఇప్పటికే నియోజకవర్గంలో పలుమార్లు కార్యకర్తలతో సమావేశం పెద్ద ఎత్తున నిర్వహించారు. శుక్రవారం ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సైతం అన్నా రాంబాబుతో మాట్లాడి సర్దుబాటు చేయాలని పార్టీ నేతలను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో అటు అన్నాకు సైతం ఏదైనా పదవి కట్టబెట్టి సయోధ్య కుదుర్చుతారా... లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement