-
దూరదర్శన్కు కొత్త లోగో: గెలిస్తే బంపర్ ప్రైజ్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్రాడ్ కాస్టింగ్ ఛానల్ దూరదర్శన్ ఐకానిక్ లోగో మారబోతుంది. కాలానుగుణంగా, యువ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి లోగో మార్పునకు దూరదర్శన్ ముందుకు వచ్చింది. ఇందు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను కూడా దూరదర్శన్ ఆహ్వానిస్తోంది. కొత్త లోగో కోసం ఐడియాలు ఇస్తూ దరఖాస్తులను ఆగస్టు 14 వరకు సమర్పించాలని, గెలిచిన వారికి లక్ష రూపాయల వరకు బహుమానం కూడా ఇవ్వనున్నట్టు దూరదర్శన్ వెల్లడించింది. 30 ఏళ్ల కంటే తక్కువ వయసున యువతరాన్ని ఆకట్టుకోవడంతో దూరదర్శన్ విఫలమవుతుందని, ఈ నేపథ్యంలో లోగో మార్పు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చిందని దూరదర్శన్ నడిపే ప్రసారభారతీ సీఈవో శశి శేఖర్ వెంపటి తెలిపారు. దాదాపు 58 ఏళ్ల తర్వాత లోగో మార్చబోతున్నట్టు చెప్పారు. ఇది దేశంలోని యువతరంతో సంభాషించడానికి తాజా ప్రయత్నంగా వెంపటి అభివర్ణించారు. డీడీ బ్రాండును సరికొత్తగా తీసుకొస్తామన్నారు. బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దూరదర్శన్ను 1959లో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీన్ని ఏర్పాటుచేసినట్టు మనుషుల కన్ను రూపంలో ఉండే ఇప్పటి లోగోను ఎంపిక చేశారు. అప్పటి నుంచీ అదే లోగో ప్రచారంలో ఉంది. ప్రస్తుత ప్రజల ఇష్టాలకు అనుగుణంగా, యువతను ఆకర్షించేలా కొత్త లోగో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మనదేశంలో 30 ఏళ్లలోపు యువతీయువకులు చాలామంది ఉన్నారని, వీరంతా దూరదర్శన్ కంటే చాలా చిన్నవారని, అప్పటి ప్రజల మనోభావాలకు, ఇష్టాలకు అనుగుణంగా ఆ లోగోను ఎంచుకున్నారని చెప్పారు. కానీ, ప్రస్తుత యువత ఆసక్తివేరుగా ఉందని, అందువల్ల వారిని అందరినీ ఆకట్టుకునేలా లోగో ఉండాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దూరదర్శన్ నేషనల్, రీజనల్, స్పోర్ట్స్ వంటి 21 చానళ్లను ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 65 శాతం మంది 35 ఏళ్లకు తక్కువగా ఉన్న వారే. -
సునీల్ ఆరోరా నియామకంపై విమర్శలు
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ మాజీ చైర్మన్, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ రిటైర్డ్ కార్యదర్శి సునీల్ అరోరాను ప్రసార భారతి సలహాదారుగా కేంద్రం నియమించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే నీరా రాడియా టేపుల కుంభకోణంలో ఆయన పేరు ఎక్కువగా వినిపించడమే కారణం. రతన్ టాటా, తరుణ్ దాస్లకు ఎయిర్లైన్స్ పరిశ్రమకు సంబంధించిన కావాల్సిన సమాచారాన్ని చేరవేసేందుకు నీరా రాడియాతో అరోరా మాట్లాడిన అంశాలు రాడియా టేపుల్లో రికార్డయి ఉన్నాయి. 1980వ బ్యాచ్, రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి సునీల్ అరోరాను కేంద్ర ప్రభుత్వ ప్రసారాల సంస్థ ‘ప్రసార భారతి’కి సలహాదారుగా నియమించబోతున్నట్లుగా ముందుగానే వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలను నిజయం చేస్తూ ఇప్పుడు ఖరారు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అరోరాను ఎందుకు నియమించాల్సి వచ్చిందో పీఎంవో వివరణ ఇవ్వాలంటూ కొందరు డిమాండ్ చేయగా, దాదా, తమరంటే తమకెంతో గౌరవమని, అలాంటిప్పుడు ఆరోరా మళ్లీ సలహాదారుగా ఎలా తీసుకొచ్చారని మరి కొందరు ప్రశ్నించారు. ఇంతవరకు వచ్చిన వ్యక్తి ప్రసార భారతిలో ఎంతవరకైనా ఎదగగలరంటూ ఇంకొందరు వ్యాఖ్యానించారు. -
డీడీలో ప్రపంచ కప్ మ్యాచ్లు.. తొలగిన అడ్డంకి
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ మ్యాచ్లను ప్రసారం చేయడంలో తలెత్తిన వివాదం విషయంలో దూరదర్శన్కు ఊరట లభించింది. దూరదర్శన్ కేబుల్ ఆపరేటర్లతో కలసి ప్రపంచ కప్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ప్రపంచ కప్ ప్రసార హక్కులు కలిగి ఉన్న స్టార్ స్పోర్ట్స్.. కేబులు ఆపరేటర్లతో సహా దూరదర్శన్ మ్యాచ్లను ప్రసారం చేయడంపై కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని, హక్కుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించామని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం వాదించింది. సుప్రీం కోర్టు ఈ వాదనలను తోసిపుచ్చుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టులో మొదట స్టార్ స్పోర్ట్స్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రసార భారతి ఈ విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించి ఊరట పొందింది. -
ప్రసారభారతిని చిక్కుల్లో పడేసిన యాంకర్
న్యూఢిల్లీ: 'గవర్నర్ ఆఫ్ ఇండియా'- దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారంలో యాంకరమ్మ నోటి నుంచి జాలువారిన మాట ఇది. ఈ మాటే ఇప్పుడు దూరదర్శన్ కు తలనొప్పి తెచ్చిపెట్టింది. అంతేకాదు మహిళా గవర్నర్ ను 'అతడు' గా సంబోధించి ప్రసారభారతిని చిక్కుల్లో పడేసింది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్(ఇఫీ) నవంబర్ 20న గోవాలో ప్రారంభమైంది.ఈ సందర్భంగా దూరదర్శన్ యాంకర్ అతిథులను పలకరిస్తూ అటుగా వచ్చిన గోవా గవర్నర్ మృదులా సిన్హాను చూసి... 'గవర్నర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఆయన అభిప్రాయాలు మనతో పంచుకుంటారు' అని వ్యాఖ్యానించింది. ఈ వీడియా సోషల్ మీడియాకు ఎక్కడంతో దూరదర్శన్ పై విమర్శలు రేగాయి. అయితే పొరపాటును సరిచేసి నాలుగు నిమిషాల తర్వాత పునఃప్రసారం చేశామని డీడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జరిగిన తప్పుకు గల కారణాలు తెలుసుకునేందుకు ఏడీజీ స్థాయి అధికారిని ఆదేశించినట్టు చెప్పారు. 'గవర్నర్ ఆఫ్ ఇండియా' వ్యాఖ్య చేసిన యాంకర్ కాంట్రాక్టు ఉద్యోగిని అని వెల్లడించారు. ఇంతకుముందు కూడా దూరదర్శన్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పేరులోని ఎక్స్ఐ(XI)ని రోమన్ సంఖ్య అనుకుని ఓ యాంకర్ ఎలెవన్ గా పలకడంతో డీడీపై విమర్శలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనకు సంబంధించిన వార్తలు చదువుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేసి ప్రసారభారతి అభాసుపాలైంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement