-
చుక్.. చుక్.. చిక్కులు
రైల్వే ప్రయాణికులకు శుక్రవారం చుక్కలు కనిపించాయి. ప్రశాంతి ఎక్స్ప్రెస్ రెండు గంటల పాటు ఆలస్యం కాగా విజయవాడకు వెళ్లే ప్రయాణికులతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. అదేవిధంగా హిందూపురం ప్యాసింజర్ రైలు కూడా మూడు గంటలు ఆలస్యమైంది. అనంతపురం టౌన్ :నిమిషాలు కాదు.. ఏకంగా గంటలపాటు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు అవస్థలు తప్పలేదు. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు రైల్వే స్టేషన్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. జిల్లా కేంద్రం నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఒక్కటే అనుకూలం. అయితే ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనంతపురం రైల్వే స్టేషన్కు సాయంత్రం 6.35 గంటలకు రావాల్సి ఉండగా రెండు గంటలు పైగా ఆలస్యమైంది. దీంతో విజయవాడ వెళ్లే ప్రయాణికులు స్టేషన్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. దీనికితోడు శనివారం ఉదయం విజయవాడలో సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ప్రవేశపరీక్ష ఉండడంతో విద్యార్థులు ప్రశ్రాంతి ఎక్స్ప్రెస్లో వెళ్లేందుకు పెద్ద ఎత్తున స్టేషన్కు చేరుకున్నారు. రైలు రెండు గంటలపాటు ఆలస్యంగా నడుస్తోందని రైల్వే అధికారులు ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ప్రశాంతి ఎక్స్ప్రెస్ విజయవాడకు ఉదయం 7గంటలకు వెళ్లాల్సి ఉంది. రెండు గంటలు ఆలస్యం కావడంతో ఉదయం 9గంటలు వెళ్తుంది. ఉదయం 9గంటలకే పరీక్ష ఉండడంతో విద్యార్థులు ఇతర మార్గాల్లో విజయవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. హిందూపురం ప్యాసింజర్ అంతే.. గుంతకల్లు నుంచి హిందూపురం వెళ్లే ప్యాసింజర్ రైలు (77418) ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. సాయంత్రం 5:10 గంటలకు స్టేషన్కు రావాల్సిన రైలు.. రాత్రి 8గంటలు అయినా స్టేషన్కు చేరుకోలేదు. ముందస్తుగా టిక్కెట్లు తీసుకున్న ప్రయాణికులు గత్యంతరం లేక వేచి ఉండాల్సిన పరిస్థితి. రైళ్లు సకాలంలో స్టేషన్కు చేరే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థులు రైల్వే మేనేజర్ తిప్పానాయక్కు శుక్రవారం రాత్రి వినతిపత్రం అందజేశారు. ఉదయం 9గంటలకు పరీక్ష ఉంది విజయవాడలో కేంద్ర విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష ఉదయం 9గంటలు ఉంది. అయితే ప్రశాంతి రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోందని రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పటికే టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకున్నా. పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే ఇతర మార్గాల్లో విజయవాడకు వెళ్లాలి. – అనిల్కుమార్, విద్యార్థి -
ప్రశాంతి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు
విశాఖపట్నం: విశాఖపట్నం-బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్టుగా బెదిరింపులు వచ్చాయి. దీంతో శనివారం మధ్యాహ్నం దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు ఆపివేశారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి రైల్లో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement