-
టైమ్స్ నౌ సర్వేలో ఫ్యాన్ ప్రభంజనం
-
ఇంకో యాభై ఏళ్లలో ఆ దేశం అదృశ్యం!
మరో యాభై ఏళ్లలో ఆ దేశం ఉనికిలో ఉండకపోవచ్చు. పూర్తిగా సముద్రంలో మునిగిపోవచ్చు. ఇప్పటికే ఆ దేశం క్రమంగా సముద్రంలోకి కుంగిపోతోంది. ఆ దేశం ఏమిటి? ఎక్కడుంది అనుకుంటన్నారా? ఫిజీకి ఉత్తరాన వెయ్యి కిలోమీటర్ల దరంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ న్న ద్వీపదేశం పేరు ‘తువాలు’. దీని విస్తీర్ణం 25 చదరపు కిలోమీటర్లు, జనాభా 11,900. ఈ దేశానికి ఒక విమానాశ్రయం ఉంది. వారానికి మూడు విమానాలు మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలు జరుపుతాయి. విమానాల రాకపోకలు లేని సమయంలో పిల్లలు రన్వే మీద ఆటలాడుకుంటూ కనిపిస్తారు. ఈ దేశం పర్యాటకంలో అత్యంత వెనుకబడిన దేశంగా ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రకటించింది. తువాలును ఏటా సందర్శించే పర్యాటకులు సగటున 3,700 మంది మాత్రమే! ఈ దేశంలోని ప్రధాన ద్వీపంలో మనుషులు నివసిస్తుంటారు. ఈ దేశంలో భాగంగా నాలుగు పగడపు దీవులు కూడా ఉన్నాయి. ఈ దేశంలో హోటళ్లు, రెస్టారెంట్ల సంఖ్య కూడా తక్కువే! విత్రమైన ప్రదేశాలను చూడాలనుకునే ఉబలాటం గల కొద్దిమంది తప్ప వినోదయాత్రల కోసం పర్యటనలకు వెళ్లేవారెవరు ఈ దేశంవైపు చూడరు. ఈ దేశంలో ఏటీఎంలు ఉండవు. అందువల్ల డబ్బు కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే! పర్యావరణ మార్పుల కారణంగా సముద్రజలాలు పెరుగుతూ వస్తుండటంతో ఈ దేశం మరో యాభయ్యేళ్లలోగా పూర్తిగా నీట మునిగిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ దేశం చుట్టుపక్కల ఉన్న కొన్ని చిన్న చిన్న దీవులు ఇప్పటికే సముద్రంలో కలిసిపోయాయి. (చదవండి: అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..) -
11 ఏళ్ల కనిష్టానికి జీడీపీ అంచనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికమందగమనంపై ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధిని ప్రభుత్వం అంచనా వేయడం గమనార్హం. కేంద్ర గణాంక కార్యాలయం మంగళవారం విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత నామమాత్రపు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని నమోదు చేయనుంది. గత ఏడాది వృద్ధి రేటు 6.8 శాతంతో పోలిస్తే 5 శాతం వృద్ధికి పరిమితం కానుందని ప్రభుత్వ లెక్కలు తెలిపాయి. ఇది 11 ఏళ్ల కనిష్టం. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షిక ఆర్థిక వృద్ధి 4.5 శాతానికి తగ్గింది. దీంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెలలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో అదనపు ఆర్థిక ఉద్దీపనలకు అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే వ్యక్తిగత పన్నుల్లో రాయితీలను, గత ఏడాది కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించిన తరువాత మౌలిక సదుపాయాల కోసం ఖర్చులను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు, ఆర్థికవేత్తలు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి క్రమంగా పెరుగుతుందని ప్రైవేట్ ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. తాజా వృద్ధి సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను , ప్రభుత్వ వ్యయాన్ని ప్రభావితం చేస్తుందని ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీలో ఆర్థికవేత్త ఎన్.ఆర్. భానుమూర్తి వ్యాఖ్యానించారు.అయితే 2020/21 లో వృద్ధి 6 నుంచి 6.5 శాతానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. 2018-19 లో 6.9 శాతం వృద్ధితో పోలిస్తే 2019-20 లో తయారీ 2.0 శాతం పెరుగుతుందని అంచనా వేసినట్లు గణాంకాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు సంవత్సరం 8.7 శాతంతో పోలిస్తే 2019/20 లో నిర్మాణం 3.2 శాతం పెరిగే అవకాశం ఉండగా, వ్యవసాయ రంగం 2.8 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అంతకుముందు ఏడాది ఇది 2.9 శాతంగా ఉంది. సవరించిన పూర్తి సంవత్సర వృద్ధి అంచనాలతో పాటు, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి డేటాను గణాంక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 28 న విడుదల చేయనుంది. కాగా 2025 నాటికి భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నంలో వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల కోసం 102 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ప్రణాళికను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఫిఫా 2018: తొలి గెలుపు ఆతిథ్య దేశానిదే!
మాస్కో: ఫిఫా ప్రపంచకప్ కొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు రష్యా, సౌదీ ఆరేబియాతో తలపడనుంది. అయితే ఎనిమిది నెలలుగా ఒక్క విజయం లేని రష్యా జట్టుకు, అభిమానులకు ఊరటనిచ్చే వార్త. 2010 ఫిఫా ప్రపంచ కప్లో ఆక్టోపస్ పాల్ మ్యాచ్కు ముందే ఏ జట్టు విజయం సాధిస్తుందో జోస్యం చెప్పి అందరీనీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా 2018 ఫిఫా ప్రపంచ కప్లో ఒక చెవిటి పిల్లి అచిల్లె వార్తల్లో నిలిచింది. మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ముందే చెప్పేలా కొందరు నిర్వాహకులు అచిల్లెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు పాల్గొనే జట్ల జెండాలు, వాటి పక్కన ఆహారంతో నింపిన బాక్స్లు ఉంచుతారు. అచిల్లె ఏ జెండా పక్కన ఉన్న బాక్స్లోని ఆహారం తీసుకుంటే ఆ జట్టు గెలుస్తుందని అభిమానుల నమ్మకం. నేడు జరిగే రష్యా, సౌదీ అరేబియా జెండాలను ఉంచగా అచిల్లె రష్యా జెండా పక్కనున్న బాక్స్లోని ఆహారం తీసుకుంది. దీంతో నిర్వాహకులు నేటి మ్యాచ్ విజేత ఆతిథ్య రష్యా అని జోస్యం చెబుతున్నారు. ఇక నేటి ఆరంభ మ్యాచ్లో రష్యా గెలిస్తే అచిల్లెకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. మరి రాత్రి 8.30 గంటలకు మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ప్రారంభమయ్యే మ్యాచ్లో సౌదీపై రష్యాగెలుస్తుందో లేదో వేచి చూడాలి. -
ఈ రెండు నెలల్లో ట్రంప్కు ముప్పుందా?
న్యూయార్క్: అమెరికా అంతర్జాతీయ ట్రేడ్ సెంటర్పై లోహ విహంగాలు దాడి చేస్తాయని, ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు పెరుగుతారని, సునామీ వచ్చి వేలాది మంది చనిపోతారని కచ్చితంగా జోస్యం చెప్పిన బల్గేరియా ప్రవక్త బాబా వాంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వర్గీయుల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఆఫ్రికన్–అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని మరో నాస్ట్రాడామస్గా పేరుపొందిన బాబా వాంగా వినిపించిన భవిష్యవాణి అంతరార్థం ఎమిటన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆమె చెప్పినట్లుగానే బరాక్ ఒబామా అమెరికా 44వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరీ ఆయన ఆఖరి అధ్యక్షుడవుతారంటే ఏమిటి? 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటికీ ఆయన వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారనే విషయం తెల్సిందే. అప్పటి వరకు బరాక్ ఒబామే దేశాధ్యక్షుడు. అప్పటివరకు దేశంలో ఏమైనా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయా? ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినందున ఇస్లామిక్ టెర్రరిస్టులు ఆయనపై దాడులు చేసే అవకాశం ఉందా? లేక ఆయనే దేశాధ్యక్ష వ్యవస్థను మార్చేసి మరో వ్యవస్థను తీసుకొస్తారా, అందుకు అమెరికా పార్లమెంట్ రాజ్యాంగ వ్యవస్థ అనుమతిస్తుందా ? రష్యాలో కొన్ని వర్గాలు భావిస్తున్నట్లుగా మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందా? అందులో అమెరికా అధ్యక్ష వ్యవస్థ కుప్పకూలి పోతుందా? ఇంకేమీ అనూహ్య పరిణామాలు జరగవచ్చనే సందేహాలు అమెరికన్లతోపాటు పలు దేశాల ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు బాబా వాంగా ఇప్పుడు బతికి లేరు. గుడ్డి బాబాగా కూడా గుర్తింపు పొందిన ఆమె 1996లోనే తన 85వ ఏటా మరణించారు. ప్రపంచ పరిణామాల గురించి 1950 నుంచి ఆమె వినిపించిన భవిష్య వాణిలో 85 శాతం నిజం అయ్యాయి. దాంతో ఆమె వ్యాఖ్యలపై ఎక్కువ మంది ప్రజలకు నమ్మకం కుదిరింది. భూగోళంపైనా శీతల ప్రాంతాలు వేడెక్కుతాయి. అగ్ని పర్వతాలు మేల్కొంటాయని, సముద్ర తీరాన అతి పెద్ద వలలొచ్చి ఇళ్లను, ఊళ్లను ముంచేస్తుందని, ప్రతిదీ నీట మునిగి పోతుందని 1950వ దశకంలో వాంగా జోస్యం చెప్పారు. ఆమె జోస్యం ప్రకారమే 2004, డిసెంబర్ 26నాడు సుమత్రా దీవుల్లో (ఇండోనేషియా) సునామీ వచ్చిందని అంటారు. అప్పుడు 9.3 తీవ్రతతో భూకంపం రావడం వల్ల సముద్రపు అలలు దాదాపు వంద అడుగుల వరకు విరుచుకుపడడంతో 14 దేశాల తీర ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు 2,30,000 మంది మరణించారు. ఇప్పటి వరకు చరిత్రలోనే అదే అత్యంత ప్రళయంగా చరిత్రకారులు కూడా చెబుతున్నారు. ‘అమెరికా సోదరులపై లోహ విహంగాలు దాడి చేస్తాయి. పొదల్లో నుంచి తోడేళ్ల అరుపులు వినిపిస్తాయి. అమాయకుల రక్తపాతం జరుగుతుంది’ అని వాంగా 1989లో జోస్యం చెప్పారు. అమెరికా ట్రేడ్ సెంటర్పై జరిగిన 9–11 దాడుల గురించే ఆమె ప్రస్తావించారని అంటారు. 2016లో యూరప్ దేశాలపై ముస్లింలు దాడులు చేస్తారని కూడా ఆమె చెప్పారు. ‘దశాబ్దం అంతంలో రష్యా జలాంతర్గామిలోకి నీళ్లు జొరబడుతాయి. ప్రపంచ ప్రజలంతా తల్లడిల్లుతారు’ అని వాంగా 1980 దశకంలో జోస్యం చెప్పారు. 2000 సంవత్సరంలో కుర్స్క్ అనే రష్యా అణు జలాంతర్గామిలోకి అన్ని వైపుల నుంచి నీళ్లు జొరబడి మునిగిపోతుండగా, దాన్ని మునగకుండా రక్షించేందుకు అంతర్జాతీయ రిస్క్ టీమ్ తీవ్రంగా కృషి చేసింది. ఈ విషయంలో కూడా ఆమె జోస్యం అక్షరాల నిజమైందని అన్వయించి చెప్పేవాళ్లు, నమ్మే వాళ్లు ప్రపంచంలో ఎక్కువగానే ఉన్నారు. అమెరికా భవిష్యత్ గురించి వాంగా ఒక్కరే కాదు, ‘స్ట్రాట్ఫర్’ అనే ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సంస్థ కూడా భవిష్య వాణిని వినిపించింది. ఇదివరకటిలా అమెరికా ప్రపంచ పరిణామాలపై అంతగా దృష్టిని పెట్టదని దేశ ఆర్థిక, సైనిక అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతుందని ఆ సంస్థ తెలిపింది. ఈ రెండు అంశాలకు తాను ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ చెప్పడం ఇక్కడ గమనార్హం. వాంగా చెప్పినట్లు ట్రంప్ విషయంలో ఏమీ జరుగకపోవచ్చు! ఎందుకంటే ఆమె చెప్పిన వాటిలో 15 శాతం నిజం కాలేదుకదా!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement