-
శాస్త్రి మరణంపైనా అనుమానాలు!
ఆయన మృతికి సంబంధించిన ఫైళ్లనూ బయటపెట్టాలి.. - లాల్ బహదూర్ శాస్త్రి తనయుల డిమాండ్ న్యూఢిల్లీ: నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బహిర్గతం చేసిన నేపథ్యంలో.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణానికి సంబంధించిన ఫైళ్లను కూడా వెల్లడి చేయాలన్న డిమాండ్ ప్రారంభమైంది. లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు, కాంగ్రెస్ నేత అనిల్ శాస్త్రి ఆదివారం ఈ డిమాండ్ను ముందుకు తెచ్చారు. నాటి సోవియట్ యూనియన్లోని తాష్కెంట్లో 1966, జనవరి 11న తన తండ్రి ఆకస్మికంగా చనిపోవడం వెనుక అనేక అనుమానాలున్నాయని, అందువల్ల దానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయాలని అనిల్ కోరుతున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి త్వరలో లేఖ రాస్తానన్నారు. 1965నాటి భారత్-పాక్ యుద్ధానంతర శాంతి ఒప్పందంపై సంతకాలు చేసేందుకు తాష్కెంట్ వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రి(61).. సంతకాలు జరిగిన మర్నాడే హఠాత్తుగా కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించారని నిర్ధారించారు. అయితే, తన తండ్రి మృతదేహం నీలంగా మారిందని, తెల్లటి మచ్చలు కనిపించాయని అనిల్ చెప్పారు. తాష్కెంట్లో కానీ భారత్లో కానీ తన తండ్రి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించలేదని, పోస్ట్మార్టం చేసి ఉంటే మరణానికి కారణం తెలిసేదన్నారు. ఆ మరణం వెనుక కుట్ర ఉండి ఉండొచ్చనేది భావిస్తున్నానన్నారు. ‘కచ్చితంగా చెప్పలేను కానీ ఏదో జరిగింది. నాడు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ ఘటనకు సంబంధించి ఎవరికీ శిక్ష పడలేదు. ఒక వెయిటర్ను మాత్రం అరెస్ట్ చేసి, వదిలేశారు. తాష్కెంట్కు వెళ్లినప్పుడు మా అమ్మ ఆ వెయిటర్ను కలవాలనుకుంది. కానీ అతడు ఎక్కడున్నాడో తెలియదని అధికారులు చెప్పారు. మా నాన్న డైరీ మాయమైంది. తాష్కెంట్ ఒప్పందం గురించీ అందులో రాసి ఉండొచ్చు. నాన్నచనిపోయినప్పుడు ఆయన బెడ్ పక్కన ఉన్న థర్మాస్ ఫ్లాస్క్ను భారత్ తీసుకురాలేదు. ఆ థర్మాస్ ఫా్లస్కలో ఉన్న దానివల్లే మరణం సంభవించి ఉండొచ్చు. మృతిపై దర్యాప్తు జరుపుతున్న కమిషన్ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉన్న నాన్నగారి డాక్టర్, సహాయకుడు ఇద్దరూ వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. ఇవ్వన్నీ అనుమానాలకు తావిచ్చేవిలా ఉన్నాయి’ అని అన్నారు. తన తండ్రి మరణానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గత పర్చాల్సిందిగా ఐకే గుజ్రాల్, చంద్ర శేఖర్ సహా ఎందరో ప్రధానులను కోరానని లాల్ బహదూర్ శాస్త్రి మరో కుమారుడు, బీజేపీ నేత సునీల్ శాస్త్రి తెలిపారు. నేతాజీ ఫైళ్లను బయటపెట్టండి: నేతాజీ కుమార్తె కోల్కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించి కేంద్రం వద్దనున్న రహస్య ఫైళ్లను బయట పెట్టాలని ఆయన కుమార్తె అనితా బోస్ పాఫ్ ప్రధానిమోదీని కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టిన 64 రహస్య ఫైళ్ల కాపీలు ఇంకా తనకు చేరలేదని ఆమె ఆదివారమిక్కడ తెలిపారు. అందుకే వాటిల్లో ఉన్న వివరాలు, ముఖ్యంగా నేతాజీ మరణానికి సంబంధించిన ఎలాంటి సమాచారమూ తన వద్ద లేదన్నారు. ఇన్నేళ్లూ రహస్యంగా మూసి ఉంచిన ఫైళ్లను బహిర్గతం చేయాలని స్కాలర్గా, నేతాజీ కుమార్తెగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు 72 ఏళ్ల అనిత చెప్పారు. జపాన్లోని నేతాజీ చితాభస్మానికి డీఎన్ఏ పరీక్షలు చేస్తే, మిస్టరీ వీడే అవకాశముందని అన్నారు. -
చరిత మరువని నటనా చతురత
సందర్భం: ఎన్టీఆర్ వర్ధంతి నటులు చాలామందే ఉండవచ్చు. కానీ, భౌతికంగా కనుమరుగైనా కాలానికి అతీతంగా మనసుల్లో చిరంజీవులుగా నిలిచేవారు కొందరే. ‘నటరత్న’ అని అప్పటి ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి అభివర్ణించిన నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) అచ్చంగా అలాంటి చిరంజీవి. దానికి కారణం లేకపోలేదు. గణాంకాలను బట్టి చూస్తే, ఆయన నటించిన 300 పైచిలుకు చిత్రాల్లో 123 సాంఘికేతర చిత్రాలే. (57 జానపదాలు, 48 పౌరాణికాలు, 18 చారిత్రకాలు). అన్ని విభిన్న సాంఘికేతర చిత్రాల్లో నటించిన ఒకే ఒక్క హీరో ఆయన. ఏ పాత్ర పోషిస్తే, ఆ పాత్రే ఆయన అన్నట్లుగా అందులో ఒదిగిపోవడం ఈ చిత్రాలన్నిటిలో చూడవచ్చు. పౌరాణిక పాత్రలైతే ఇక చెప్పనే అక్కరలేదు. అందుకే, ఇవాళ్టికీ తెలుగు నాట ఏ పండగ వచ్చినా, టీవీల్లో ప్రత్యేకంగా ఆయన చిత్రాలే కనిపిస్తాయి. సాంఘిక చిత్రాల్లో కూడా దర్శకుడిగా తాను చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం, పరమార్థం ఉండేలా చూడడం ఎన్టీఆర్లోని విశిష్టత. మరోపక్క 1940ల చివర నుంచి 1980ల దాకా సుదీర్ఘకాలం స్టార్గా నిలవడంతో, ఏకంగా 7 తరాల వాళ్లు ఆయనకు నాయిక లయ్యారు. అలాగే, తల్లీకూతుళ్లిద్దరికీ హీరోగా నటించిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. తల్లి సంధ్యతో ‘మాయాబజార్’- కూతురు జయలలితతో ‘కథానాయకుడు’, తల్లి అమ్మాజీతో ‘దైవబలం’ - కూతురు జయచిత్రతో ‘బొబ్బిలిపులి’ మచ్చుకు కొన్ని. గమ్మత్తేమిటంటే, ఆయన పౌరాణిక చిత్రాలు ఇటు టీవీల్లోనే కాక, అటు అప్పటి వీడియో క్యాసెట్లు నుంచి ఇప్పటి డీవీడీల దాకా అమ్ముడవుతూనే ఉన్నాయి. ‘దానవీరశూర కర్ణ’ లాంటి ఆయన చిత్రాల డీవీడీలు, డైలాగ్లు ఇవాళ్టికీ హాట్కేకులు. తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ది చెరగని సంతకమనేదందుకే. తెర మరుగైన వెంటనే నటులూ జనం మనసులో నుంచి కనుమరుగయ్యే కాలంలో... కన్నుమూసి 19 ఏళ్ళు నిండిన తరువాత ఇవాళ్టికీ నిత్యస్మరణీయుడిగా మిగలడం ఆయనకే దక్కిన జన నీరాజనం. అందుకే, ‘దానవీర శూర కర్ణ’లోని డైలాగుల ఫక్కీలోనే చెప్పాలంటే... ‘చరిత మరువదు నీ (నటనా) చతురత, జనం మదిలో నిలిచిన నీకే దక్కును ఎనలేని ఘనత!’
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement