-
భారతీయ ఆర్మీలోకి ప్రైవేట్ కంపెనీలు
బెంగుళూరు : రక్షణ శాఖలోకి ప్రైవేటు కంపెనీల అడుగుపడబోతోంది. భారతీయ ఆర్మీకి చెందిన ఆర్మీ బేస్ వర్క్షాపు(ఏబీడబ్ల్యూ)లను నిర్వహించేందుకు చేసేందుకు ప్రైవేటు కంపెనీలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో గల ఎనిమిది నగరాల్లోని ఏబీడబ్ల్యూలను ప్రవేటు కంపెనీలు నడపనున్నాయి. ‘ప్రభుత్వ ఆస్తిని కాంట్రాక్టర్ నిర్వహించే మోడల్’ కింద రక్షణ శాఖ దీన్ని ఆమోదించింది. ఈ మోడల్లో ప్రైవేటు కంపెనీలు రక్షణ శాఖలో ఎలాంటి పెట్టుబడులు పెట్టవు. కానీ, కంపెనీలకు కావలసిన భూమి, వస్తువులు, మెషీన్లు తదితర వనరులను ప్రభుత్వమే సమకూర్చుతుంది. నిపుణుల కమిటీ(సీఓఈ) సూచనలతోనే రక్షణ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. ఆర్మీ సామర్ధ్యాన్ని పెంచడం, రక్షణ శాఖ వ్యయాన్ని అదుపులో ఉంచడం తదితరాలను దృష్టిలో పెట్టుకుని సీఓఈ ఈ సూచనలు చేసినట్లు సమాచారం. ఎల్లప్పుడూ యుద్ధం కోసం ఆయుధాలను సిద్ధంగా ఉంచేందుకు ఏబీడబ్ల్యూలను రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆరంభించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఓ వైపు ఆయుధాలను పర్యవేక్షించేందుకు ఉన్నా.. భారతీయ ఆర్మీ ఎన్నడూ దానిపై ఆధారపడలేదు. ఢిల్లీ, కోల్కతా, పుణె, బెంగుళూరు తదితర కీలక నగరాల్లో ఏబీడబ్ల్యూలు ఉన్నాయి. -
ఆ సంస్థల్లో పనిచేసే మహిళలకు ఒత్తిడి ఎక్కువ
న్యూయార్క్: ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఎవరికైనా పనిలో ఒత్తిడి సర్వసాధారణం. ముఖ్యంగా ఒక పక్కన ఇంటిని, పిల్లలను చక్కబెట్టుకుంటూ మరో పక్క వృత్తి బాధ్యతలు నిర్వహించే మహిళలపై సహజంగానే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఆడవాళ్లు ఒత్తిడికి లోనవడానికి మరో కొత్త కారణాన్ని వెల్లడించారు న్యూయార్క్ పరిశోధకులు. పురుషాధిక్యంతో నడిచే సంస్థలు, వృత్తుల్లో పనిచేసే మహిళలు తీవ్ర స్థాయిలో ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని అన్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితుల్లో పనిచేయడం వల్ల చివరికి వాళ్ల మనసులో తాము బలహీనులమని భావించే రుగ్మతకు లోనవుతున్నారని ‘ఇండియన్ యూనివర్సిటీ’కి చెందిన మనాగో చెప్పారు. 85 శాతం కంటే ఎక్కువ మంది పురుషులు సహోద్యులుగా ఉన్న సంస్థల్లో పనిచేసే స్త్రీలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అంచనా వేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో పనిచేసే మహిళలు.. ఒంటిరితనం, పనితీరు, లైంగిక వేధింపులు, చిన్నచూపు చూడటం, తగిన ప్రోత్సాహం లేకపోవడం.. వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement