-
ఈ‘సారీ’ ప్రైవేటు విత్తే!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : విత్తనోత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (తెలంగాణ సీడ్ కార్పొరేషన్) వరుస వైఫల్యాలు చెందుతోంది. జిల్లాకు అవసరమైన సోయా విత్తనాలను ఉత్పత్తి చేయడంలో ఈ సంస్థ ఈసారి కూడా విఫలమైంది. గత ఏడాది (2017) ఖరీఫ్కు అవసరమైన విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేసేందుకు 2016లో చర్యలు చేపట్టింది. ఈ చర్యలు ఫలితాలనివ్వలేదు. దీంతో గత ఖరీఫ్ సోయా విత్తనాలను ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా అదే వైఫల్యం పునరావృతమైంది. ఈసారి సోయా విత్తనోత్పత్తిలో విఫలమైంది. తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ వరుస వైఫల్యాలు ప్రైవేటు విత్తన సంస్థలకు పరోక్షంగా ప్రయోజనం చేకూర్చుతోందనే ఆరోపణలను మూటగట్టుకుంటోంది. జిల్లాలో నెరవేరని ఉత్పత్తి లక్ష్యం.. ఈ ఖరీఫ్ సీజనులో జిల్లాకు అవసరమైన సుమా రు 40 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను నిజామాబాద్ జిల్లాలోనే స్వయంగా ఉత్పత్తి చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. అయితే 1,600 క్వింటాళ్లు మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, బోధన్ తదితర ప్రాంతాల్లో విత్తనాలు పండించే రైతులకు ఫౌండేషన్ సీడ్ ఇచ్చి సోయా విత్తనోత్పత్తి చేయాలని రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. 2017 సెప్టెంబర్ చివరి వారంలో, అక్టోబర్ మొదటి వారంలో కురిసిన వర్షానికి ఈ విత్తనం పనిచేయకుండా పోయిందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చేతులెత్తేసింది. 40 వేల క్వింటాళ్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యానికి గాను కేవలం 1,600 క్వింటాళ్లతో సరిపెట్టి చేతులు దులుపుకుంది. దీంతో జిల్లా విత్తనాల అవసరాల కోసం ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీల వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఈసారి సోయా విత్తనాలు సరఫరా చేసే విత్తన కంపెనీలు ధరను పెంచేశాయి. క్వింటాలుకు సుమారు రూ.400 వరకు అధిక ధరకు సర్కారుకు విక్రయిస్తోంది. కోత దశలో వర్షం కురవడంతో అనుకున్న మేరకు జిల్లాలో విత్తనోత్పత్తి జరగలేదని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ రాజీవ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. తెలంగాణను విత్తన భాండాగారంగా.. తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేయడంతో పాటు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కానీ విత్తనోత్పత్తే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్రవిత్తనాభివృద్ధి సంస్థ జిల్లాలో ఈ విత్తనాలను ఉత్పత్తి చేయలేకపోయింది. ప్రైవేటు.. సోయా పంటను అత్యధికంగా సాగు చేసే జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి. 2017 ఖరీఫ్లో 99 వేలు ఎకరాలు సాగైంది. ఈ ఖరీఫ్లో సుమారు 91వేల ఎకరాల్లో సోయా సాగువుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం 73,586 క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సోయా విత్తనాలను ఉత్పత్తి చేయలేకపోవడంతో ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీపై అందజేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రూ.కోట్లలో నిధులు ప్రైవేటు విత్తన కంపెనీలకు చెల్లించాల్సి వస్తోంది. ఐదు ప్రభుత్వ రంగ సంస్థలకు పంపిణీ బాధ్యతలు ఈ ఖరీఫ్ సీజనుకు అవసరమైన 73 వేల క్వింటాళ్ల సోయా సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసే బాధ్యతలను ప్రభుత్వం ఐదు ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించింది. తెలంగాణ సీడ్ కార్పొరేషన్కు 49 వేల క్వింటాళ్లు అలాట్మెంట్ ఇచ్చింది. అలాగే హాకా, ఆయిల్ఫెడ్, మార్క్ఫెడ్, నేషనల్ సీడ్ కార్పొరేషన్లకు ఈ బాధ్యతలను అప్పగించింది. 102 కేంద్రాల ద్వారా రైతులకు ఈ సబ్సిడీ సోయా విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. -
‘జైశ్రీరాం’ వరికి పెరుగుతున్న డిమాండ్
మోర్తాడ్: సన్నరకంలో మరింత సన్నగా ఉండే జై శ్రీరాం రకం వరికి డిమాండ్ పెరుగుతోంది. ప్రైవేటు విత్తన కంపెనీలు ఐదేళ్ల కింద జై శ్రీరాం రకం వరి విత్తనాలను ఉత్పత్తి చేశాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూ ర్ సబ్ డివిజన్లోని రైతులు దీనిని ఎక్కువగా సాగు చేశారు. సాధారణంగా సన్న రకాల్లో బీపీటీ, హెచ్ఎంటీ రకాలకు భారీగా డిమాండ్ ఉంటుంది. జై శ్రీరాం రకం బీపీటీ, హెచ్ఎంటీల కంటే సన్నగా ఉండటంతో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. బీపీటీ, హెచ్ఎంటీ ల ధర అంతంతమాత్రమే. జై శ్రీరాం రకానికి మాత్రం పెరుగుతోంది. మార్కెట్ ఆరంభమైన మొదట్లో క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,750 పలికిన ధర ఇప్పుడు రూ. 2,200కు చేరింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సన్న రకాలను దాదాపు 70 వేల హెక్టార్ల వరకు సాగు చేశారు. జై శ్రీరాం రకాన్ని ఎనిమిది వేల ఎకరాల వరకు పండించారు. బీపీటీ, హెచ్ఎంటీలు ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి లభిస్తే జై శ్రీరాం రకం 15 నుంచి 25 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వస్తుంది. జై శ్రీరాం క్వింటాల్ ధర రూ. 2,300 ఉంది. ఈ రకం బియ్యం క్వింటాల్కు రూ. 5,200కు పైగా ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement