-
నడవాలంటే నరకమే..
వీణవంక(హుజూరాబాద్): అడుగు తీసి అడుగు వేద్దామంటే కంకరరాళ్లు ఎక్కడ గుచ్చుకుంటాయోననే భయం... చీకటి పడితే రోడ్డు మధ్యనున్న విద్యుత్ స్తంభాలకు తాకుతామేమో అనే ఆందోళన... వాహనాలు వెళ్తుంటే అంతెత్తు లేస్తున్న దుమ్ము ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో గత ఆరు నెలలుగా వీణవంక – జమ్మికుంట రహదారిపై నడిచే వాహనదారులకు నకరం నిత్యం నరకం కనిపిస్తోంది. ప్రయాణికుల అష్టకష్టాలు.. వీణవంక–జమ్మికుంట ఫోర్లైన్ రోడ్డు పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా ఇంకా సా..గుతూనే ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారి వెంట వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రూ.33 కోట్లతో నిర్మాణం.. సంవత్సరం క్రితం వీణవంక–జమ్మికుంట మధ్య 12.5 కిలోమీటర్ల ఫోర్లైన్ రోడ్డు కోసం రూ.33 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ మొదట వల్భాపూర్–నర్సింగాపూర్ గ్రామాల మధ్య పనులు ప్రారంభించారు. ఆరు నెలల క్రితం కంకరపోసి వదిలేశారు. తర్వాత వల్భా పూర్ నుంచి జగ్గయ్యపల్లి మధ్య కొంతదూరం వరకు కంకరపోసి పోశారు. మిగతా మట్టిపోసి అంతటితో వదిలేశాడు. దీంతో వాహనదారులు దుమ్ముతో పాటు కంకరతో నరకయాతన పడుతున్నారు. కంకరపై వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు... పాత కల్వర్టుల స్థానంలో కొత్త కల్వర్టులు నిర్మించారు. రోడ్డు వెడల్పు కావడంతో రోడ్డును ఆనుకొని వ్యవసాయ బావులు ఉన్నాయి. ప్రమాదకర వ్యవసాయ బావుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. వల్భాపూర్– రంగమ్మపల్లి గ్రామాల మధ్య విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డంగా అతి ప్రమాదకరంగా ఉన్నాయి. రాత్రి సమయంలో స్తంభాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత శనివారం రాత్రి ఓ యువకుడు బైక్పై జమ్మికుంటకు వెళ్తుండగా చీకట్లో స్తంభాన్ని ఢీకొనడంతో గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దుమ్ము ధూళితో సతమతం.. జగ్గయ్యపల్లి– నర్సింగాపూర్ గ్రామాల మధ్య దుమ్ము విపరీతంగా లేస్తోంది. రోడ్డుపై నీటిని సక్రమంగా చల్లించకపోవడంతో దుమ్ములేచి ఇబ్బందులు పడుతున్నారు. ఈ రూట్లో నిత్యం ఆర్టీసీ బస్సులు 16 ట్రిప్పులు నడుస్తుంటాయి. వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు తిరుగుతుంటాయి. కంకర జారడం వల్ల ప్రమాదాలు జరగడంతో పాటు వాహనాల టైర్లు త్వరగా చెడిపోతున్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. బిల్లు మంజూరులో జాప్యం వల్లేనా? పోర్లైన్ రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్కు జరుగుతున్న పనులకు సకాలంలో బిల్లులు రావడం లేదని సమాచారం. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇంకా మూడు నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా.. పనులు అడుగు కూడా ముందుకు కదలకపోవడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే పనులు పూర్తి కావడానికి ఎంకాలం పడుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఆర్అండ్బీ ఏఈ స్వప్నను వివరణ కోరగా దుమ్ము లేవకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రమాదకరంగా ఉన్న స్తంభాల వద్ద రక్షణ చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు -
తాడిపూడి.. అందని తడి
తాడిపూడి ఎత్తిపోతల పథకం మెట్ట ప్రాంత రైతులకు అక్కరకు రావడం లేదు. 2.06 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో రూపకల్పన చేసిన ఈ పథకం ద్వారా కనీసం 60 వేల ఎకరాలకైనా నీరందడం లేదు. ఎగువన దేవరపల్లి ప్రాంతంలో సబ్ లిఫ్ట్ పనులు పూర్తికాకపోవడంతో 20 వేల ఎకరాలు పూర్తిగా బీడువారాయి. దిగువన తాడేపల్లిగూడెం మండలంలో 19 వేల ఎకరాలకు నీరందక వరి ఎండిపోతోంది. తాళ్లపూడి మండలం తాడిపూడిలో దశాబ్దం క్రితం తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అక్కడ గోదావరి జలాలను తోడి గోపాలపురం వరకు పైప్లైన్ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి కాలువల ద్వారా తాడేపల్లిగూడెం మండలంలోని ఆయకట్టు వరకూ కాలువల ద్వారా నీటిని పంపిణీ చేయాల్సి ఉంది. కాలువలను పూర్తిస్థాయిలో తవ్వకపోవడం.. తవ్విన కాలువలు పూడుకుపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. తాడేపల్లిగూడెం/దేవరపల్లి : దేవరపల్లి మండలం బందపురం వద్ద తాడిపూడి కాలువపై తాడిపూడి సబ్లిఫ్ట్ పనులు అసంపూర్తిగా ఉండటంతో ఎనిమిదేళ్లుగా ఇక్కడి ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఆయకట్టు అంతటికీ ఖరీఫ్లో నీటిని విడుదల చేస్తామని రెండేళ్లుగా అధికారులు చెబుతూనే ఉన్నారు. దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో మెరక పొలాలకు సాగునీటి సదుపాయం లేక పొలాలు నిరూపయోగంగా మారాయి. సుమారు 20 వేల ఎకరాలు నీరందక బీడువారాయి. ఈ భూములకు గోదావరి జలాలు ఇవ్వాలనే లక్ష్యంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తాడిపూడి కాలువపై 5వ సబ్లిఫ్ట్ నిర్మాణానికి రూ.48 కోట్లు మంజూరు చేశారు. అనంతరం దేవరపల్లి మండలం బందపురం వద్ద కాలువపై సబ్లిఫ్ట్ నిర్మాణ పనులు చేపట్టారు. 2012 నాటికి పంపుహౌస్ నిర్మాణం పూర్తిచేసి మోటార్లు ఏర్పాటు చేశారు. సబ్లిఫ్ట్ ద్వారా దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం మండలాల్లో 13 వేల ఎకరాలకు నీరు సరఫరా చేయాల్సి ఉంది. కాలువ నిమిత్తం అవసరమైన భూములిచ్చే రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ఇబ్బందులు ఎదురుకావడంతో పనులు నిలిచిపోయాయి. గత ఏడాది పంప్హౌస్ నుంచి బుచ్చియ్యపాలెం వరకు సుమారు 5.30 కిలోమీటర్ల మేర పైపులైన్ వేశారు. అక్కడ నుంచి మూడు డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటు చేసి పొలాలకు సాగునీరు అందించాల్సి ఉంది. 1, 2 డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో కాలువ పనులు పూర్తి కాగా, 3వ డిస్ట్రిబ్యూటర్ పరిధిలో కాలువ తవ్వకం పూర్తికావాల్సి ఉంది. డీ1, డీ2 పరిధిలో పనులు పూర్తి కావడంతో ఈ ఖరీఫ్ సీజన్లో సబ్లిఫ్ట్ ద్వారా మొదటివిడతగా 5 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అధికారులు జూలైలో ప్రకటించారు. దీంతో రైతులు పంటలు వేశారు. ఇప్పటివరకు లిఫ్ట్ ప్రారంభం కాకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అధికారుల మాటలు నమ్మి పంటలు వేసి నష్టపోయామని రైతులు కాట్రు సత్యనారాయణ, కాట్రు భీమరాజు, ఉండవల్లి సుబాష్చంద్రబోస్ తెలిపారు. దిగువన పరిస్థితి ఇదీ ఎత్తిపోతల పథకానికి దిగువన ఉన్న తాడేపల్లిగూడెం మండలంలో 35 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, కేవలం 19 వేల ఎకరాలకు మాత్రమే ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో తవ్విన కాలువలు, బోదెలు పూడుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో బోదెల ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. ఈ పథకం కింద నిరే్ధశించిన ఆయకట్టుకు నీరందకపోగా, కొన్ని చేలు మాత్రం ముంపునకు గురవుతున్నాయి. తాడేపల్లిగూడెం మండలంలోని కడియద్ద, కొమ్ముగూడెం, బంగారుగూడెం, కుంచనపల్లి, మాధవరం, అప్పారావుపేట, ఆరుగొలను, ఆరుళ్ల, జగన్నాథపురం, జగ్గన్నపేట, తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ పరిధిలోని కడకట్ల రెవెన్యూ ప్రాంతం, నందమూరు, నవాబ్పాలెం, కొండ్రుపోలు, వెంకట్రామన్నగూడెం మీదుగా తాడిపూడి కాలువ వెళుతోంది. సగం తవ్విన కాలువలు, అసంపూర్తిగా ఉన్న బోదెల వల్ల వర్షాలు కురిసినప్పుడల్లా ఆయకట్టులోని పొలాలు ముంపుబారిన పడుతున్నాయి. సాధారణ రోజుల్లో నీరందకపోగా.. వర్షాలు కురిసినప్పుడు ముంపు వెంటాడుతోంది. బోదెల్ని బాగు చేయాలి తాడిపూడి బోదెలను పూర్తిస్థాయిలో బాగుచేస్తే సాగునీటికి ఇబ్బంది ఉండదు. నిన్నమొన్నటి వరకూ నీరందక ఇబ్బం దులు పడ్డాం. ఇప్పుడు కాస్త నీరిస్తున్నా సరిపోవడం లేదు. ఇక్కడున్న ఇబ్బందుల్ని పూర్తిగా తొలగించాలి. – గోతం రాజు, వెంకట్రామన్నగూడెం, తాడేపల్లిగూడెం మండలం పూర్తిగా నీరు వదలాలి కాలువకు పూర్తిగా నీరు వదిలితే వ్యవసాయ అవసరాలకు ఇబ్బంది ఉండదు. పూర్తి ఆయకట్టుకు నీరందితే సమస్య తొలగినట్టే.– మరిడి సూర్యచంద్రరావు, వెంకట్రామన్నగూడెం, తాడేపల్లిగూడెం సబ్ లిఫ్ట్ ద్వారా నీరిస్తాం తాడిపూడి 5వ స»Œ æలిఫ్ట్ ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 5వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. డీ–1, డీ–2 పరిధిలో కాలువ పనులు పూర్తయ్యాయి. సబ్ లిఫ్ట్ విద్యుత్కు సంబం«ధించి అనుమతి రావాల్సి ఉంది. భూసేకరణలో జాప్యం వల్ల కాలువ పనులు ఆలస్యమయ్యాయి. వచ్చే ఏడాది పూర్తిగా సాగునీరు ఇచ్చేందుకు కృషి చేస్తాం. – సీహెచ్ దేవప్రకాష్, ఈఈ, తాడిపూడి ఎత్తిపోతల పధకం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement