-
ఆయనకు ఒంట్లో ఆల్కహాల్!
న్యూయార్క్: బయటకెళ్లి ఆల్కహాల్ కొనకుండా ఇంట్లోనే ఆల్కహాల్ దొరికితే ఎంత బావుండునో అని మద్యపాన ప్రియులు కోరుకుంటారు. అలాంటిది ఏకంగా ఒంట్లోనే ఆల్కహాల్ ఉత్పత్తి అయితే ఇంకెంత బాగుండు అనుకుంటారు కదా! అతడెంత అదృష్టవంతుడోనని ఆశ్చర్యపోతారు. దీన్ని అనుభవిస్తున్న ఓ వ్యక్తి మాత్రం దీన్ని దురదృష్టకరమని భావిస్తున్నాడు. న్యూయార్క్కు చెందిన ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా ఆపి ఆల్కహాల్ స్థాయిని పరీక్షించారు. ఉండాల్సిన స్థాయి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అధికారులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టారు. అయితే ఇలాంటి ఓ కేసు గురించి విన్న అతని బంధువు అతడికి సహాయం చేసింది. ఆహారంలో ఉన్న పిండిపదార్థాలను గ్లూకోజ్గా కాకుండా, ఆల్కహాల్గా మార్చే ఓ ప్రత్యేక సూక్ష్మజీవి కడుపులో ఉండటంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఓ డాక్టర్ పర్యవేక్షణలో అతడిని ఉంచారు. అధిక పిండిపదార్థాలు ఉన్న ఆహారాన్ని అతడు తీసుకున్నపుడు రక్తంలో ఆల్కహాల్ స్థాయి పెరగడాన్ని గుర్తించారు. పిండిపదార్థాలు అధికంగా లేని ఆహారాన్ని స్వీకరించినపుడే ఆల్కహాల్ స్థాయి లేదు. దీంతో అతన్ని కోర్టు మన్నించింది. ఈ అంతుచిక్కని వ్యాధి పరిశీలన దశలోనే ఉందని పరిశోధకులు బార్బరా కార్డెల్ అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు ఆల్కహాల్ సేవించినట్లు కనిపిస్తారు. ఆల్కహాల్ వాసన వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. -
పింఛన్ రాదట!
‘చేతిలో సంచి పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న ఈయన పేరు సుంకర నారాయణరావు. వయస్సు 78 ఏళ్లు. 1963లో సింగరేణిలో జీడీకే-1వ గనిలో ఉద్యోగిగా చేరి వివిధ గనుల్లో 34 సంవ త్సరాలు పనిచేసి 1996లో ఉద్యోగ విరమణ చేశారు. అప్పుడు సీఎంపీఎఫ్లో జమచేసుకున్న రూ. 2.99 లక్షలు, గ్రాట్యూటీ రూ.లక్ష యాజమాన్యం చెల్లించింది. ఈ డబ్బుతో కూతురు పెళ్లి చేశాడు. ఆనాడు కార్మికులకు పెన్షన్ సౌకర్యం లేదు. 2003లో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరితే రూ. 4,254 సీఎంపీఎఫ్ కార్యాలయంలో చెల్లించాడు. అప్పటి నుంచి అతనికి ప్రతీ నెలా రూ. 822 చెల్లిస్తున్నారు. అయితే హైదరాబాద్లో ఉన్న సీఎంపీఎఫ్ కార్యాలయం 2004లో గోదావరిఖనికి వచ్చిన సమయంలో సీఎంపీఎఫ్ అధికారులు అయోమయానికి గురై గతంలో చెల్లించిన బకాయిలను తిరిగి చెల్లించారు. ఆ తర్వాత నాలుక కరుచుకుని వాటిని నెలనెలా రికవరీ చేసుకుంటూ నేడు నారాయణరావుకు రూ.493 పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నారు. పెన్షన్ పెరుగుదల లేకపోవడంతో ఈ మొత్తంతోనే దుర్బర పరిస్థితిలో బతుకుతున్నాడు.’ గోదావరిఖని : సింగరేణిలో రిటైర్డ్ కార్మికుల పరిస్థితి ఆసరా పింఛన్కు నోచుకునేలా లేదు. కోల్బెల్ట్ ప్రాంతంలో దాదాపు ఐదారు వేల మంది రిటైర్డ్ కార్మికుల పరిస్థితి ఇలాగే ఉంది. 1998 వరకు సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు అసలు పెన్షన్ సౌకర్యం లేదు. దాంతో 1998లో 89 జీవోను విడుదల చేసి దాని ప్రకారం కార్మికుడు పొందే వేతనంలో బేసిక్పై 25 శాతం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు రిటైర్డ్ అయిన వారు డబ్బులు చెల్లించాలని కోరడంతో చాలా మంది సీఎంపీఎఫ్ కార్యాలయంలో డబ్బులు జమచేసుకున్నారు. ఆనాటి నుంచి వారికి పెన్షన్ ఇవ్వడం మొదలైంది. ఈ క్రమంలో సీఎంపీఎఫ్ ట్రస్ట్బోర్డును ఏర్పాటు చేసి ప్రతి మూడు సంవ త్సరాలకోసారి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకనుగుణంగా పెన్షన్ పెంపుదల చేయాలని జీవోలో పొందుపర్చారు. నాటి నుంచి నేటి వరకు పెన్షన్లో పెంపుదల చేయకపోవడం మూలంగా చాలా మంది కార్మికులు రూ. 300 నుంచి రూ. వెయ్యి వరకు మాత్రమే పెన్షన్ పొందుతున్నారు. ప్రస్తుతం వీరంతా ఈ పెన్షన్ మీదనే ఆధారపడగా..వయస్సు మీద పడడంతో రోగాలతో ఇబ్బంది పడుడుతున్నారు. అన్యాయం చేస్తున్న ప్రభుత్వం సింగరేణిలో చాలా ఏళ్ల కిందట పనిచేసి ఉద్యోగ విరమణ చేసి తాము సీఎంపీఎఫ్లో జమచేసుకున్న సొంత డబ్బులనే పెన్షన్ రూపంలో పొందుతున్నారు. కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ను కూడా పొందలేని వారు చాలా మంది ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సింగరేణి రిటైర్డ్ కార్మికుల మీద శీతకన్ను వేసింది. సింగరేణిలో పనిచేస్తే చాలు వారికి పెన్షన్ ఇవ్వమంటూ హుకూం జారీ చేసింది. దీంతో చాలా మంది రిటైర్డ్ కార్మికులు ప్రభుత్వ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా...సర్వేకు వచ్చిన అధికారులు వారికి పెన్షన్ రాయడంలో ముందుకు రాలేదు. ఈ విషయమై చాలా ప్రాంతాలలో వృద్ధులు రోడ్లపైకి చేరుకుని ఆందోళన చేశారు. అయినా ప్రభుత్వం కనికరించలేదు. తాము పొదుపు చేసుకున్న సొంత డబ్బులనే తిరిగి పెన్షన్ రూపంలో పొందుతున్నామని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వృద్ధులు గగ్గోలు పెట్టినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. జీవిత చరమాంకంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం తమకు ‘ఆసరా’గా ఉంటుందని భావిస్తే..కేవలం సింగరేణిలో పనిచేశారని వెయ్యి రూపాయల పెన్షన్కు దూరం చేయడం బాధాకరమని.. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించాలని వృద్ధ కార్మికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వానికి నివేదిస్తా.. - గూడూరి శ్రీనివాసరావు, తహశీల్దార్, రామగుండం చాలా మంది రిటైర్డ్ సింగరేణి కార్మికులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొంతమందికి సింగరేణిలో పనిచేసినా వారికి పెన్షన్ రావడం లేదు. మరికొందరికి వెయ్యి లోపే పెన్షన్ ఉంటున్నది. వీళ్ల ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి నివేదిస్తా.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement