-
భారీగా తగ్గిన జీవీకే పవర్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.2,395 కోట్ల నుంచి రూ.154 కోట్లకు పడిపోయింది. వ్యయాలు రూ.182 కోట్ల నుంచి రూ.840 కోట్లకు పెరిగాయి. టర్నోవర్ రూ.94 కోట్ల నుంచి రూ.1,012 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో జీవీకే పవర్ షేరు ధర శుక్రవారం 1.43% పెరిగి రూ.2.84 వద్ద స్థిరపడింది. -
ఆటో, బ్యాంకు షేర్లు పడేశాయ్
ముంబై: బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో స్టాక్ సూచీలు బుధవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు క్షీణించి 57,684 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 17,246 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లోనూ మెటల్, ఫార్మా, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. క్రూడాయిల్ ధరలు తగ్గినా.., ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం, యూరప్లో యుద్ధం పరిస్థితులు, పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సెంటిమెంట్ను బలహీనపరిచా యి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.418 కోట్ల షేర్లను కొన్నా రు. దేశీ ఇన్వెస్టర్లు రూ.294 కోట్ల షేర్లను విక్రయించారు. ఆసియాలో ఒక్క ఇండోనేíసియ మార్కెట్ మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు పావు శాతం క్షీణించగా., బ్రిటన్ సూచీ అరశాతం పెరిగింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద ముగింపు ఉదయం సెన్సెక్స్ 209 పాయింట్లు పెరిగి 58,198 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు బలపడి 17,405 ట్రేడింగ్ను ప్రారంభించాయి. మార్కెట్ లాభాలతో మొదలైనా.., గరిష్ట స్థాయి వద్ద కొనుగోళ్లు లేకపోవడంతో సూచీలు క్రమంగా ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. మిడ్సెషన్ నుంచి లాభాల స్వీకరణ మరింత పెరిగింది. ఒక దశలో సెన్సెక్స్ 420 పాయింట్లు పతనమై 57,569 వద్ద, నిఫ్టీ 116 పాయింట్లను కోల్పోయి 17,200 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. చివరకు సూచీలు అరశాతం నష్టంతో దాదాపు ఇంట్రాడే కనిష్టాల వద్ద ముగిశాయి. ‘‘ఒడిదుడుకులు పెరగడంతో కొన్ని రోజులుగా సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవుతున్నాయి. చైనా పెరుగుతున్న కోవిడ్ కేసులను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు రానున్న రోజుల్లో ట్రేడింగ్ను ప్రభావితం చేయవచ్చు. ఉక్రెయిన్– రష్యా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో మరికొంత కాలం సూచీలు ఊగిసలాట ధోరణిని ప్రదర్శించవచ్చు’’ రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అమిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు. ► పేటీఎం షేరు పతనం ఆగడం లేదు. బీఎస్ఈలో నాలుగు శాతం క్షీణించి తాజా జీవితకాల కనిష్టస్థాయి రూ.524 వద్ద ముగిసింది. ► క్యూఐపీ ఇష్యూ ప్రారంభం కావడంతో ఇండియన్ హోటల్స్ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.216 వద్ద స్థిరపడింది. ► గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.2 లక్షల కోట్ల రిటైల్ గృహ రుణాలను కేటాయించినప్పటికీ., హెచ్డీఎఫ్సీ షేరు రెండున్నర శాతం క్షీణించి రూ.2,346 వద్ద ముగిసింది. -
మూడోరోజూ ముందుకే...
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపారు. దీంతో మార్కెట్ ముచ్చటగా మూడోరోజూ లాభాలను మూటగట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ సూచీలకు దన్నుగా నిలిచింది. దేశీయ ఈక్విటీలను కొనేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. అధిక వెయిటేజీ రిలయన్స్తో పాటు ఐటీ షేర్ల అండతో సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంతో 40,616 వద్ద ముగిసింది. నిఫ్టీ 95 పాయింట్లను ఆర్జించి 11,900 పైన 11,909 వద్ద స్థిరపడింది. వరుస మూడు ట్రేడింగ్ సెషన్లలో సెనెక్స్ 1,003 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 266 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడేలో ఫార్మా, ఐటీ, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాల షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, మెటల్, ఫైనాన్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. 617 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్.... అంతర్జాతీయ మార్కెట్లను అనుసరిస్తూ బుధవారం మార్కెట్ లాభాలతో మొదలైంది. అమెరికా అధ్యక్ష పదవి పోరులో ఊహించినట్లుగానే బైడెన్ ముందంజలో ఉన్నాడనే వార్తలతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఉదయం సెషన్లో సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగి 40,693 గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 117 పాయింట్లను ఆర్జించి 11,929 వద్ద ఇంట్రాడే హైని తాకింది. మిడ్ సెషన్లో లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు వెనకడుగు వేశాయి. అయితే యూరప్ మార్కెట్ల పాజిటివ్ ప్రారంభం ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. అలాగే చివరి గంట కొనుగోళ్లు కూడా సూచీల లాభాల ముగింపునకు కారణమయ్యాయి. ‘‘యూఎస్ ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఈక్విటీల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. ఓట్ల లెక్కింపులో మోసం చేయటానికి కుట్ర చేస్తున్నారని, దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్ ప్రకటించడంతో యూరప్ మార్కెట్లు ఆరంభలాభాల్ని కోల్పోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోళ్లకు దూరంగా ఉండటమే మంచిది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ దీపక్ జెసానీ తెలిపారు. సన్ఫార్మా షేరు 4 శాతం జంప్: సన్ఫార్మా షేరు బుధవారం బీఎస్ఈలో 4 శాతం లాభపడింది. ప్రోత్సాహకరమైన క్యూ2 ఫలితాల ప్రకటన షేరును రెండోరోజూ లాభాల బాట పట్టించింది. ఒకదశలో 6.81 శాతం పెరిగి రూ.518 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 4 శాతం లాభంతో రూ.504 వద్ద స్థిరపడింది. నవంబర్ 14న దీపావళి మూరత్ ట్రేడింగ్ దీపావళి పండుగ రోజున ప్రత్యేకంగా గంటపాటు మూరత్ ట్రేడింగ్ను నిర్వహిస్తామని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది నవంబర్ 14 న దీపావళి పండుగ జరగనుంది. అదేరోజు సాయంత్రం 6:15 గంటల నుంచి 7:15 మధ్య ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తామని స్టాక్ ఎక్సే్ఛంజీలు వివరించాయి. హిందూ పంచాంగం ప్రకారం బ్రోకర్లకు, వ్యాపారులకు కొత్త సంవత్సరం దీపావళి రోజున ప్రారంభం అవుతుంది. నవంబర్ 16న (సోమవారం) బలిప్రతిపద పండుగ సందర్భంగా ఎక్సే్ఛంజీలకు సెలవు ప్రకటించారు. దీంతో మార్కెట్లు తిరిగి నవంబర్ 17న ప్రారంభమవుతాయి. -
స్వల్ప లాభాలతో సరి
స్టాక్ మార్కెట్ బుధవారం ఆరంభ లాభాలన్నింటినీ కోల్పోయి స్వల్పలాభాలతో గట్టెక్కింది. కరోనా వ్యాక్సిన్పై ఆశలతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా ఆరంభంలో భారీగా లాభపడింది. మధ్యాహ్నం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఇంట్రాడేలో 777 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్ చివరకు 19 పాయింట్ల లాభంతో 36,052 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 10,618 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్తో రూపాయి మారకం విలువ 27 పైసలు పెరిగి 75.15కు చేరడం ఒకింత సానుకూల ప్రభావం చూపినా, కరోనా కేసులు పెరుగుతుండటం.. ప్రతికూల ప్రభావం చూపింది. ► ఇంట్రాడేలో ఆల్టైమ్ హై, రూ.1,978ను తాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చివరకు 4 శాతం నష్టంతో రూ.1,846 వద్ద ముగిసింది. ఈ కంపెనీ 43వ ఏజీఎమ్ ఆరంభం వరకూ లాభపడిన ఈషేర్లో ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఏజీఎమ్ నిర్ణయాలు ఉండటమే దీనికి కారణం. సెన్సెక్స్ లాభాలను కోల్పోవడానికి ఈ షేరే కారణం. ► ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో విప్రో షేర్ 17 శాతం ఎగసి రూ.263 వద్ద ముగిసింది. ఈ షేర్తో పాలు ఐటీ షేర్లు కూడా లాభపడ్డాయి. మూడు ఐటీ షేర్లు–ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్లు ఆల్టైమ్ హైలను తాకాయి. దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. -
వైరస్ పడగ.. మార్కెట్ ర్యాలీ!
కోవిడ్–19(కరోనా) వైరస్ కల్లోలాన్ని తట్టుకోవడానికి అమెరికా భారీ ప్యాకేజీని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా బుధవారం భారీగా లాభపడింది. మన దగ్గర కూడా కేంద్రం ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదని, ఆర్బీఐ 60 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించనున్నదన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరొక్క రోజులో ముగియనుండటంతో భారీగా షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం కలసివచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 28,000 పాయింట్లు, నిఫ్టీ 8,300 పాయింట్లపైకి ఎగబాకాయి. ఇంట్రాడేలో 2,116 పాయింట్ల మేర ఎగసిన సెన్సెక్స్ చివరకు 1,862 పాయింట్ల లాభంతో 28,536 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 517 పాయింట్లు పెరిగి 8,318 పాయింట్ల వద్దకు చేరాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 6.98 శాతం, నిఫ్టీ 6.62 శాతం మేర లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు లాభపడటం ఇది గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. కాగా గుడిపడ్వ పర్వదినం కారణంగా ఫారెక్స్ మార్కెట్ బుధవారం పనిచేయలేదు. నష్టాల్లోంచి... భారీ లాభాల్లోకి ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నా మన మార్కెట్ నష్టాల్లోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 174 పాయింట్లు, నిఫ్టీ 66 పాయింట్ల నష్టాలతో మొదలయ్యాయి. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చినా, మళ్లీ నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 11 తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చిన సూచీలు ట్రేడింగ్ చివరి వరకూ లాభాల జోరును కొనసాగించాయి. ఒక దశలో 314 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 2,116 పాయింట్లు ఎగసింది. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్ 2,430 పాయింట్ల రేంజ్లో కదలాడింది. కాగా భారత్లో కోవిడ్–19 వైరస్ కేసులు 562కు, మరణాలు 10కు పెరిగాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ కేసులు 4.34 లక్షలకు, మరణాలు 19,600కు, రికవరీలు లక్షకు చేరాయి. మరిన్ని విశేషాలు..... ► సెన్సెక్స్లోని మొత్తం 30 షేర్లలో మూడు షేర్లు–ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐటీసీ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► 200కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అవెన్యూ సూపర్ మార్ట్స్, హెచ్డీఎఫ్సీ, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ భారీగా లాభపడినప్పటికీ, 800కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఏసీసీ, ఏబీబీ ఇండియా, అల్ట్రాటెక్ ఇండియా, జిల్లెట్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ఐఆర్సీటీసీ షేర్ వరుసగా ఎనిమిదో రోజూ 5 శాతం లోయర్ సర్క్యూట్తో రూ.816కు పడిపోయింది. ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. గత ఒక్క నెలలోనే ఈ షేర్ 58 శాతం పతనమైంది. లాభాలు ఎందుకంటే... ► అమెరికా భారీ ప్యాకేజీ... కోవిడ్–19 వైరస్తో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అమెరికా భారీ ప్యాకేజీని ఇవ్వనున్నది. ఈ 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్క అమెరికన్ ఖాతాలో 1,200 డాలర్లు జమ చేస్తారని అంచనా. అమెరికా చరిత్రలోనే ఇదే అత్యంత భారీ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు 2–8% రేంజ్లో లాభపడగా, యూరప్ మార్కెట్లు భారీ లాభాల తో మొదలై, 1–4% రేంజ్ లాభాల్లో ముగిశాయి. ► షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు.... మార్చి నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు నేడు(గురువారం) ముగియనున్నాయి. ఈ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో జోరుగా షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరిగాయి. ► లాక్డౌన్ను మెచ్చిన మార్కెట్ మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్ కారణంగా భారత జీడీపీలో రూ. 5 లక్షల కోట్ల మేర గండి పడుతుందని అంచనా. ఇంత భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ కోవిడ్–19 వైరస్ను ఎదుర్కొనడానికి భారత్ గట్టి చర్యలు తీసుకుంటోందన్న భరోసా స్టాక్ మార్కెట్కు లభించిందని నిపుణులు పేర్కొంటున్నారు. ► ఉద్దీపన చర్యలపై ఆశలు... దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో కుదేలయ్యే ఆర్థిక రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలోనే (సుమారు 1.5 లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదన్న అంచనాలు నెలకొన్నాయి. ► రేట్ల కోత అంచనాలు: ఏప్రిల్లో జరిగే పాలసీ సమావేశంలో కీలక రేట్లను ఆర్బీఐ 50–100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించగలదన్న ఆశలతో వడ్డీ రేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ► హెవీ వెయిట్స్ ర్యాలీ సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో వెయిటేజీ అధికంగా గల రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు 9–15 శాతం రేంజ్లో దూసుకెళ్లాయి.సెన్సెక్స్ లాభాల్లో ఈ మూడు షేర్ల వాటాయే దాదాపు సగంగా ఉంది. సెన్సెక్స్ మొత్తం 1,862 పాయింట్ల లాభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 416 పాయింట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 363 పాయింట్లుగా, హెచ్డీఎఫ్సీ వాటా 232 పాయింట్లుగా ఉన్నాయి. రిలయన్స్కు ‘ఫేస్బుక్’ కిక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం విభాగం, రిలయన్స్ జియోలో 10% వాటాను ఫేస్బుక్ కొను గోలు చేయనుందన్న వార్తలతో రిలయన్స్ షేర్ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో 22% లాభంతో రూ. 1,152ను తాకిన ఈ షేర్ చివరకు 15 శాతం లాభంతో రూ.1,081 వద్దకు చేరింది. సెన్సెక్స్లో బాగా లాభపడిన షేర్ ఇదే. 11 ఏళ్లలో ఈ షేర్ ఇంత గా లాభపడటం ఇదే తొలిసారి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 87,577 కోట్లు పెరిగి రూ.6,85,433 కోట్లకు చేరింది. దేశంలోనే అత్యధిక మార్కెట్ విలువగల కంపెనీ ట్యాగ్ ను మళ్లీ టీసీఎస్ నుంచి చేజిక్కించుకుంది. రూ. 4.7 లక్షల కోట్లు ఎగసిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.4.7 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4.7 లక్షల కోట్లు పెరిగి రూ.108.41 లక్షల కోట్లకు పెరిగింది. మార్కెట్ పతన జోరు ఒకింత తగ్గవచ్చు. అయితే సమీప భవిష్యత్తులో పరిమిత శ్రేణిలోనే సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయి. మార్కెట్ తరువాతి దశ (పెరగడం లేదా తగ్గడం)లోకి ప్రవేశించే ముందు ఇదే రేంజ్లో కొంత కాలం కొనసాగవచ్చు. దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకునేవాళ్లకు, యావరేజ్ చేయాలనుకునేవాళ్లకు ఇది మంచి అవకాశమే. –సహజ్ అగర్వాల్, కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్స్ పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినా, ఉద్దీపన చర్యల ఆశలతో మార్కెట్ లాభపడింది. కోవిడ్–19 వైరస్ కట్టడికి సంబంధించిన శుభవార్తలు వస్తేనే స్టాక్ మార్కెట్లో నిలకడైన ర్యాలీ నెలకొంటుంది. –వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సమీప భవిష్యత్తులో ఒడిదుడుకులు కొనసాగుతాయి. కోవిడ్–19 వైరస్ వ్యాప్తిని ప్రభావవంతంగా అరికట్టగలిగే విష యంపైననే స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆధారపడి ఉంటుంది. –అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement