-
తగ్గిన నిషాచరులు
అమలాపురం టౌన్: మద్యం బ్రాండ్లు, ధరలు, అమ్మకాలు పెంచేసి తాగుబోతులు మరింత మత్తులో తూగేలా ప్రభుత్వం చేస్తోందని విమర్శించే ప్రతిపక్ష నేతల నోళ్లను మద్యం అమ్మకాల గణంకాలు మూయిస్తున్నాయి. దశలవారీ మద్య నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు కూడా సత్ఫలితాలు ఇస్తున్న క్రమంలో వినియోగంలో తగ్గుదల కనిపిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటయ్యాక అమలాపురంలోని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ లిక్కర్ గొడౌన్ (డిపో) నుంచి 2022–23 సంవత్సరంలో జరిగిన మద్యం అమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటే అమ్మకాలు పెరిగాయో తగ్గాయో తెలుస్తుంది. టీడీపీ ప్రభుత్వంలో 2018–19 సంవత్సరానికి సంబంధించి ఇదే అమలాపురం గొడౌన్ నుంచి సాగిన అమ్మకాలను 2022–23 సంవత్సరం గణంకాలతో పోల్చితే మద్యం అమ్మకాలు తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఇవీ లెక్కలు.. కోనసీమ వ్యాప్తంగా ఉన్న 97 దుకాణాలకు అమలాపురం లిక్కర్ గొడౌన్ నుంచి మద్యం సరఫరా అవుతుంది. ఈ గొడౌన్ నుంచి 1918–19 సంవత్సరంలో లిక్కర్ 10.33 లక్షల కేసులను దుకాణాలకు విక్రయించారు. 2022–23 సంవత్సరంలో ఇదే గొడౌన్ నుంచి 8.18 లక్షల కేసుల లిక్కర్ అమ్మకం సాగింది. 2018–19 సంవత్సరంలో ఈ గొడౌన్ నుంచి బీరు 6.77 లక్షల కేసులను దుకాణాలకు విక్రయించగా 2022–23 సంవత్సరంలో సగం కంటే లోపే అంటే కేవలం 2.30 లక్షల కేసుల బీరు విక్రయం అయింది. ఈ అధికారిక గణంకాలు లిక్కర్, బీరు వినియోగం ఏ మేరు తగ్గిందో స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12.61 శాతం మేర తగ్గుముఖం అమలాపురం లిక్కర్ డిపో కోనసీమ వ్యాప్తంగా ఉన్న 97 మద్యం దుకాణాలకు సరఫరా చేస్తుంటే కొత్త జిల్లా ఏర్పాటయ్యాక జిల్లా పరిధిలోకి వచ్చే రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలకు సంబంధించి ఉన్న 49 మద్యం దుకాణాలకు రాజమహేంద్రవరం లిక్కర్ గొడౌన్ నుంచి లిక్కర్, బీరు కేసులు సరఫరా అవుతున్నాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా 2018–19 సంవత్సరం పోల్చితే 2022–23 సంవత్సరంలో 20 నుంచి 25 శాతం వరకూ మద్యం వినియోగం తగ్గింది. గత నెల 21న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల సమీక్షా సమావేశం కూడా 2018–19 సంవత్సరంతో పోల్చితే 2022–23 సంవత్సరంలో లిక్కరు, బీరు వినియోగం ఎంత మేర తగ్గిందో గణాంకాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్, బీరు వినియోగం 12.61 శాతం మేర తగ్గుముఖం పట్టినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు ఇదే సమయంలో రాష్టంలో మద్యం వినియోగాన్ని క్రమేపీ తగ్గిస్తూ మందుబాబుల ఆలోచనలో మార్పు తీసుకుని రావాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దశలవారీ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో వీధివీధికి, సందు సందుకీ, గుడి బడి ఎక్కడ పడితే అక్కడ అధికారిక మద్యం దుకాణాలకు తోడు పుట్టగొడుగుల్లా వెలిసిన మద్యం బెల్ట్షాపులను ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మూయించి వేసింది. ప్రభుత్వమే దుకాణాల సంఖ్యను తగ్గించి ఏర్పాటు చేసింది. వినియోగం తగ్గింది గతంలో పోల్చుకుంటే మద్యం వినియోగం కొంత తగ్గింది. ముఖ్యంగా 2018–19 సంవత్సరంతో పోల్చితే 2022–23 సంవత్సరంలో అమలాపురం లిక్కర్ డిపోలో వినియోగం తగ్గినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. – పొంగులేటి దశమంతరావు, -
'భారత్ అందరికీ గురువు'
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధాన్ని సమర్థనీయంగా అమలు చేస్తుండటం గర్వించదగిన విషయం అన్నారు. బుధవారం నితీశ్తో భేటీ అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేను చాలా ఏళ్లుగా మంచి మిత్రులం. ఆయనను కలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో ప్రజల ఎన్నో సమస్యలతో ఆగ్రహాలతో, ఒత్తిడిలతో, చిరాకులతో ఉంటుంటారు. మద్యపానంపై నిషేదం విధించడం చాలా మంచి విషయం. అది ప్రజలకు మంచి చేస్తుంది. మద్యం తాగడం మంచిది కాదు. అది మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఇందులో నుంచి బయటపడాలంటే మనసుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. భారతదేశమంటేనే అందరికీ గురువు. మనందరం శిష్యులం. భారత్తో సంబంధాలు పెట్టుకున్నవారి మధ్య గురుశిష్య సంబంధమే ఉంటుంది' అని ఆయన మీడియాతో చెప్పారు. ఈ రోజుల్లో ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలు కూడా భారతీయ పురాతన శాస్త్రాలను, తత్వశాస్త్రాన్ని తిరగేస్తున్నారని అన్నారు. -
మానుతారా? లేక రాష్ట్రాన్ని వీడుతారా?
పట్నా: కఠిన మద్యపాన నిషేధ చట్టాన్ని వెనుకకు తీసుకునే ప్రసక్తే లేదని బిహార్ సీఎం నితీశ్కుమార్ స్పష్టం చేశారు. మద్యపాన నిషేధాన్ని బిహార్ ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. మద్యపాన నిషేధ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘మద్యం అలవాటును మానండి లేదా రాష్ట్రాన్ని వీడండి’ అంటూ ప్రజలకు తేల్చిచెప్పారు. మద్యపాన నిషేధ చట్టంలో పలు మార్పులు తెచ్చేందుకు ఈ నెల 22న నితీశ్కుమార్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, మద్యపానంపై నిషేధం విధించడంతో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయిందని, రాష్ట్ర ప్రజలు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు పొందారని పేర్కొన్నారు. ఇప్పటికైనా మద్యం అలవాటును మానుకోలేనివారు నిరభ్యంతరంగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవచ్చునని పేర్కొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓవర్బ్రిడ్జిపై విద్యుత్ సౌకర్యం కల్పించాలి
కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి
రైలు పట్టాలపై రక్త చరిత్ర..!
కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలి
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలి
అక్షరాస్యత కార్యక్రమాన్ని నిరంతరం చేపట్టాలి
పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
చిరుతపులి చర్మం, స్మగ్లర్ల పట్టివేత
ఆ శాఖలో అంతేనా?
అంగన్వాడీ కేంద్రాలు బంద్..!
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement