-
పీఎఫ్ పేరుతో మోసం - కోట్ల రూపాయలు కోల్పోయిన వృద్ధ జంట
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా డెవలప్ అవుతున్నాయి. ఇలాంటి మోసాలకు సంబంధించిన సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఇందులో బాధితులు ఏకంగా రూ. 4.32 కోట్లు మోసపోయినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముంబైకి చెందిన 70 ఏళ్ల వ్యక్తి ఓ సంస్థలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. అతని భార్యకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎంప్లాయిస్ ప్రాఫిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి.. ఆమె భర్తకు సంబంధించిన చాలా వివరాలను వెల్లడించి, మీ భర్త పీఎఫ్ ఖాతాలో 20 సంవత్సరాలకు కంపెనీ రూ. 4 లక్షలు డిపాజిట్ చేసినట్లు తెలిపింది. కంపెనీ డిపాజిట్ చేసిన డబ్బు ఇప్పుడు రూ. 11 కోట్లుకు మెచ్యూర్ అయిందని, ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి టీడీఎస్, జీఎస్టీ, ఇన్కమ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపాడు. కాలర్ చెప్పినట్లుగా వృద్ద మహిళ పలుమార్లు రూ. 4.32 కోట్లు వారి ఖాతలో జమచేసింది. ఇదీ చదవండి: రిలయన్స్ బోర్డులోకి అంబానీ వారసులు - ఆమోదం తెలిపిన షేర్ హోల్డర్స్ ఎన్ని రోజులకు డబ్బు రాకపోవడం మాత్రమే కాకుండా.. ఇంకా డబ్బు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేయడం, ఐటీ శాఖకు సమాచారం అందిస్తామని బెదిరించడం కూడా స్టార్ట్ చేశారు. చివరికి మోసపోయినట్లు గ్రహించిన ఈ వృద్ధ జంట జరిగిన విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: యువతనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి - ఇలా చేయాల్సిందే అంటూ.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఎక్కువ డబ్బు వస్తుందని అత్యాశ చూపితే ఎవరూ మోసపోవద్దని, బ్యాంకులకు సంబంధించిన వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
‘ఏఎన్యూ’లో పీఎఫ్ ఉఫ్!
► ఈపీఎఫ్ వ్యవహారాలపై పర్యవేక్షణ శూన్యం ► గతంలో ఖాతాల అంకెలు మార్చి లోన్ పొందిన ఉద్యోగులు ► గత ఏడాది వెలుగు చూసిన మరో పీఎఫ్ కుంభకోణం ► తాజాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిధులు స్వాహా చేసిన నిర్వాహకుడు ► కమిటీలతో కాలక్షేపం చేస్తున్న ఉన్నతాధికారులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అక్రమాలకు ఏఎన్యూ నిలయంగా మారుతోంది. ఉద్యోగుల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన పీఎఫ్ నిధులను కొందరు అక్రమార్కులు చేతివాటంతో అడ్డదారిన తమ జేబులు నింపేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఏఎన్యూలో వరసగా పీఎఫ్ కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏఎన్యూ : ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పీఎఫ్ ఖాతాల నిర్వహణను పగడ్బందీగా పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన యూనివర్సిటీ ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండటంతో కుంభకోణాలు వరుసగా జరుగుతున్నాయి. గతంలో పలు కుంభకోణాలు.. యూనివర్సిటీలో పీఎఫ్ ఖాతాలకు సంబంధించి పలు కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. యూనివర్సిటీ ఎకౌంట్స్ విభాగంలో పీఎఫ్ వ్యవహారాలు చూసే ఇద్దరు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లో అంకెలు మార్పు చేసి అధిక మొత్తంలో లోన్ పొందిన ఘటన ఆరేళ్ళ క్రితం వెలుగులోకి వచ్చింది. తమ ఖాతాలో వేలాది రూపాయలను లక్షల్లో చూపి ఆ ఇద్దరు లోన్ పొందటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన అప్పటి వీసీ విచారణ జరిపి బాధ్యులైన ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. కానీ పీఎఫ్ ఖాతాల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలేమీ తీసుకోలేదు. దీంతో గత ఏడాది మరో పీఎఫ్ ఘటన వెలుగులోకి వచ్చింది.దీనిపై అతి కష్టంగా స్పందించిన ఉన్నతాధికారులు కుంభకోణంపై విచారణ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు. వీటితోపాటు యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుల నుంచి పీఎఫ్ మొత్తాలను వసూలు చేస్తూ ఏజెన్సీ నిర్వాహకుడు సకాలంలో వారి ఖాతాల్లో జమ చేయని ఘటనలూ గతంలో జరిగాయి. ఉద్యోగులు నిలదీయటంతో గుట్టు చప్పుడు కాకుండా నిధులను జమ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో కుంభకోణం వెలుగులోకి.. ఈపీఎఫ్కు సంబంధించిన మరో భారీ కుంభకోణం గత నెలలో వెలుగు చూసింది. యూనివర్సిటీ వాటర్ వర్క్స్ విభాగంలో పనులను ఔట్ సోర్సింగ్ ద్వారా నిర్వహించేందుకు అనుమతి పొందిన తెనాలికి చెందిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ఏళ్ళ తరబడి ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయకుండా భారీగా నిధులు మింగేశాడు. తమ పీఎఫ్ మొత్తాలను జమ చేయకుండా నిర్వాహకుడు మింగేస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్లో విధులు నిర్వహిస్తున్న 12 మంది గత నెల 21న గుంటూరులోని ఈపీఎఫ్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో పీఎఫ్ కమిషనర్ వచ్చి పరిశీలించి కుంభకోణం నిజమేనని తేల్చే వరకు యూనివర్సిటీ అధికారులు మిన్నకుండటం విశేషం. కుంభకోణం వెలుగులోకి రావటంతో గత నెల 24న ఏజెన్సీ నిర్వాహకుడు తన తప్పును పీఎఫ్ కమిషనర్ వద్ద లేఖ రూపంలో అంగీకరించాడు. ఫిబ్రవరి 28 లోగా జమ చేస్తానని ఆ లేఖలో పేర్కొన్నాడు. కానీ నేటి వరకు పూర్తి స్థాయిలో జమ చేయలేదని తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యమే కారణం.. వరసగా చోటు చేసుకుంటున్న ఈపీఎఫ్ కుంభకోణాలకు యూనివర్సిటీ ఉన్నతాధికారుల ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యయే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది చోటు చేసుకున్న పీఎఫ్ ఘటనపై విచారణ కమిటీని నియమించి చేతులు దులుపుకున్న ఉన్నతాధికారులు గత నెలలోని కుంభకోణంపై కనీసం స్పందించకపోవటం దీన్ని తేటతెల్లం చేస్తోంది. యూనివర్సిటీ ఉన్నతాధికారులు పీఎఫ్ ఖాతాల నిర్వహణలో పారదర్శకతను పెంచి భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ఉద్యోగులు కోరుతున్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
ప్రత్యేకతలు
టీడీపీ హయాంలో అన్నీ అవకతవకలే...
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement