-
నాడు పూణే ఫైనల్ చేరడానికి ధోనినే కారణం..స్మిత్ కాదు
న్యూఢిల్లీ: 2017 ఐపీఎల్ ఎడిషన్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు ఫైనల్ చేరడానికి మహేంద్రసింగ్ ధోనినే కారణమని, అందులో నాటి జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ పాత్ర ఏమీ లేదని మాజీ పూణే ఆటగాడు రజత్ భాటియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ విషయంలో స్టీవ్ స్మిత్కు ధోనికి పోలికేంటని, అసలు స్మిత్ను ధోనీతో పోల్చడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. తన దృష్టిలో టాప్ 10 కెప్టెన్లలో కూడా స్మిత్ ఉండడని పేర్కొన్నాడు. గతేడాది స్మిత్కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినప్పుడు తాను ఆశ్చర్యపోయానని, కీలక సమయాల్లో అతను తీసుకునే నిర్ణయాలు సరైనవి కావని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కాగా, రజత్ భాటియా తన ఐపీఎల్ కెరీర్లో ఢిల్లీ డేర్డెవిల్స్, కోల్కతా నైట్రైడర్స్, పూణే సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉండగా, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై 2015లో రెండేళ్లు పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో 2016, 2017 సీజన్లలో ఆయా జట్ల ఆటగాళ్లు నూతన ఫ్రాంఛైజీలైన గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్ల తరఫున ఆడారు. ఈ క్రమంలో పూణే కెప్టెన్గా స్మిత్, వికెట్ కీపర్గా ధోని వ్యవహరించారు. ఆ టోర్నీలో పూణే.. లీగ్ దశలో 9 విజయాలు సాధించి ప్లేఆఫ్కు అర్హత సాధించింది. అయితే ఫైనల్లో ముంబయి ఇండియన్స్తో చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలై, రన్నరప్గా నిలిచింది. చదవండి: అతను టీమిండియా కెప్టెనైనా ఆశ్చర్యపోనక్కర్లేదు: అజహర్ -
పుణేకు షాక్; పీటర్సన్ ఇంటికి
పుణే: ఎంఎస్ ధోని నేతృత్వంలోని పుణే సూపర్ జెయింట్స్ కు షాక్ తగిలింది. గాయం కారణంగా ఇంగ్లండ్ మాజీ స్టార్ బ్యాట్సమన్ కెవిన్ పీటర్సన్ జట్టుకు దూరమయ్యాడు. కాలిపిక్క గాయంతో అతడు ఐపీఎల్ 9 నుంచి వైదొలగాల్సి వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో అతడు గాయపడ్డాడు. ఒక్క బంతి ఆడాక రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. గాయానికి చికిత్స చేయించుకునేందుకు లండన్ వెళ్లిపోయాడు. గాయంతో ఐపీఎల్ కు దూరం కావడం పట్ల సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు. సహచర ఆటగాళ్లను మిస్సవుతున్నానని, నవంబర్ వరకు తనకు సెలవులు దొరికాయని వ్యాఖ్యానించాడు. పీటర్సన్ త్వరగా కోలుకోవాలని పుణే సూపర్ జెయింట్స్ ట్వీట్ చేసింది. దీనికి అతడు థ్యాంక్స్ చెప్పాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement