-
హోరాహోరీ.. పుణే గెలుపు
ఐపీఎల్-10 సీజన్ను పుణే సూపర్ జెయింట్స్ ఘనవిజయంతో ప్రారంభించింది. టాస్ గెలిచిన పుణే బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 184/8 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్మన్లలో హర్ధిక్ పాండ్యా 20వ ఓవర్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత ఛేజింగ్కు దిగిన పుణే ఆది నుంచి లక్ష్యం దిశగా సాగింది. పుణే ఓపెనర్ అజింక్యా రహానే 60(34) సమయోచిత ఇన్నింగ్స్కు తోడు స్టీవ్ స్మిత్ 84(51) నాటౌట్ కెప్టెన్ ఇన్నింగ్స్ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇన్నింగ్స్ మరో బంతి మిగిలివుండగానే 187/3తో గెలుపొందింది. పుణే బౌలర్లలో ఇమ్రాన్ తహీర్కు మూడు వికెట్లు దక్కగా, రజత్ భాటియాకు రెండు వికెట్లు దక్కాయి. ముంబై బౌలర్లలో టిమ్ సౌథీ, హర్ధిక పాండ్యా, మిచెల్ మెక్క్లెనాగన్లకు తలా ఓ వికెట్ దక్కింది. -
విరాట్ గ్యాంగ్ వర్సెస్ ధోని సేన?
హూస్టర్: మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పుణె సూపర్ జెయింట్ జట్లు తలపడబోతున్నాయా?అంటే కొంత వరకూ అవుననే సమాధానమే వస్తుంది. అయితే ఐపీఎల్ నుంచి పుణె సూపర్ జెయింట్స్ నిష్క్రమిస్తే ఎలా బెంగళూరుతో తలపడుతుంది? అనే సందేహం రాక తప్పదు. అయితే ఈ రెండు జట్లు పోటీ పడేది ఐపీఎల్లో కాదులెండి. అమెరికాలో ఈ ఏడాది నిర్వహించే ఐపీఎల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ల్లో ఆర్సీబీ, పుణె జట్లు పాల్గొనబోతున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. అమెరికాలో క్రికెట్ మార్కెట్ ను పరీక్షించేందుకు ఎగ్జిబిషన్ మ్యాచ్ లను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మ్యాచ్ ల నిర్వహణకు హూస్టన్ను తాత్కాలిక వేదికగా అనుకున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఆదివారం బెంగళూరులో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముందుకు దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, భారత క్రికెట్ జట్టు వరుసగా జింబాబ్వే, వెస్టిండీస్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ సిరీస్ ల తరువాత మాత్రమే ఎగ్జిబిషన్ మ్యాచ్ ల షెడ్యూల్ ను ఖరారు చేస్తారు. భారత క్రికెట్ జట్టు ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ లో ఈ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లపై ముంబై ఇండియన్స్ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. -
ధోని రెచ్చిపోయాడు..
విశాఖ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో పుణె సూపర్ జెయింట్స్ సంచలన విజయం సాధించింది. శనివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అద్వితీయంగా ఆడి జట్టుకు మరపురాని గెలుపును అందించాడు. చివరి ఓవర్ లో పుణె విజయానికి 23 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని రెచ్చిపోయాడు. మూడు సిక్సర్లు, ఒక ఫోర్ తో 22 పరుగులు చేసి పుణెకు విజయాన్ని అందించాడు. తొలి బంతికి పరుగేమీ రాకపోగా, రెండో బంతి వైడ్ అయ్యింది. దీంతో పుణె విజయానికి నాలుగు బంతుల్లో 22 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ తరుణంలో మ్యాచ్ విన్నర్ గా పేరుగాంచిన ధోని విశ్వరూపం ప్రదర్శించాడు. రెండో బంతిని సిక్స్ కొట్టిన ధోని, మూడో బంతిని కూడా అంతే వేగంగా కొట్టాడు. అయితే ఆ బంతిని పంజాబ్ ఆటగాడు హషీమ్ ఆమ్లా అడ్డుకోవడంతో పరుగు రాలేదు. ఇక నాల్గో బంతిని ఫోర్ కొట్టగా, ఐదు, ఆరు బంతుల్ని సిక్స్ లుగా మలచడంతో పుణె అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రమే అయినా, ధోని ఆడిన తీరు ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో ధోని(64 నాటౌట్;32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోవడంతో పుణె నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(30), మురళీ విజయ్(59)లు చక్కటి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడీ 60 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన అనంతరం ఆమ్లా తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం సాహా(3) విఫలమైనా, గుర్ కీరత్ సింగ్(51) రాణించడంతో పుణె గౌరవప్రదమైన స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పుణె జట్టులో అజింక్యా రహానే(19), ఉస్మాన్ ఖాజా(30)లు ఫర్వాలేదనిపించారు. ఆపై జార్జ్ బెయిలీ(9), సౌరభ్ తివారీ(17) లు విఫలమయ్యారు. ఆ పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ ధోని జట్టును ఆదుకున్నాడు. తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న ధోని.. చివరి వరకూ క్రీజ్ లో పుణెకు విజయాన్ని సాధించిపెట్టాడు. పంజాబ్ బౌలర్ అక్షర్ పటేల్ వేసిన చివరి ఓవర్ లో ధోని విశేషంగా రాణించి పూర్వపు ఫామ్ ను అందుకున్నాడు. -
పుణె విజయలక్ష్యం 173
విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో పుణె సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా(30), మురళీ విజయ్(59)లు చక్కటి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడీ 60 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన అనంతరం ఆమ్లా తొలి వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం సాహా(3) విఫలమైనా, గుర్ కీరత్ సింగ్(51) రాణించడంతో పంజాబ్ ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగుల గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. పుణె బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, జంపా, తిషారా పెరీరా, అశోక్ దిండాలకు తలో వికెట్ దక్కింది. -
'టీ 20లో ఆ చెత్త రూల్ను మార్చండి'
కోల్కతా:అంతర్జాతీయ క్రికెట్లో వర్షం కారణంగా మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే డక్ వర్త్ లూయిస్ పద్ధతిపై పుణె సూపర్ జెయింట్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మండిపడ్డాడు. మ్యాచ్ ను ఉన్నపళంగా కుదించే ఈ పద్ధతి నిజంగా పనికిమాలినదిగా అభివర్ణించాడు. కనీసం పొట్టి ఫార్మాట్లోనైనా డక్ వర్త్ లూయిస్ పద్ధతికి చరమగీతం పాడాలని ఫ్లెమింగ్ డిమాండ్ చేశాడు. 'డక్వర్త్ లూయిస్ పద్ధతి పనికిమాలినది. ఎప్పుడైతే డక్ వర్త్ లూయిస్కు వెళ్లామో అప్పుడే మ్యాచ్ దాదాపు వన్ సైడ్ అయిపోతుంది. ఇదే విషయాన్నికొన్ని సంవత్సరాల నుంచి చెబుతున్నా ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. కనీసం టీ 20ల్లోనైనా వర్షం వల్ల మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే ప్రస్తుత డక్ వర్త్ లూయిస్ పద్ధతిని మార్చండి' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. శనివారం కోల్ కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీనిపై ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. డక్ వర్త్ లూయిస్ వల్లే తాము పరాజయం చెందినట్లు పేర్కొన్నాడు. పిచ్ టర్న్ అవుతున్న కారణంగానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నామన్నాడు. ఈ వికెట్పై 135 పరుగులను ఛేదించడం చాలా కష్టమని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు. అయితే తమ ఇన్నింగ్స్ చివర్లో ఉండగా వర్షం పడటంతో డక్ వర్త్ లూయిస్ అమలు చేయడంతో పూర్తిగా ఆడకుండానే ఓటమి చెందామన్నాడు. ఎప్పుడైతే డక్ వర్త్కు వెళ్లామో అప్పుడే మ్యాచ్ దాదాపు ముగిసి పోవడం ఎంతవరకూ సరైన పద్ధతని ఫ్లెమింగ్ ప్రశ్నించాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement