-
'సీఎం నాకు అవకాశం ఇస్తానన్నారు'
విజయవాడ: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీలకు రాజ్యసభ కేటాయిస్తే తనకు అవకాశం ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు మాజీ మంత్రి పుష్పరాజ్ చెప్పారు. సోమవారం సీఎం చంద్రబాబుతో మంత్రి పుష్పరాజ్ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం హామీపై హర్షం వ్యక్తం చేశారు. అయితే రాజ్యసభ అభ్యర్థిగా మాజీ మంత్రి పుష్పరాజ్ పేరు వినిపించిన నేపథ్యంలో ఎస్సీలకు రాజ్యసభ కేటాయిస్తే ఆ సీటు దాదాపు ఆయనకే ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. కాగా, ఏపీ టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థి కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. -
చిట్ ఫండ్ పేరు తో కుచ్చుటోపీ
నమ్మకంగా ఉంటూ చిట్టీలు నడుపుతున్న నిర్వాహకులు.. వినియోగదారులకు సంబంధించిన రూ.కోటి వసూలు చేసుకుని కనిపించకుండా పోయిన ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మారుతి చిట్ఫండ్ సంస్థ కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో చిట్టీలు నిర్వహిస్తోంది. అయితే, ఇటీవల చిట్టీలు పాడుకున్న వారికి నిర్వాహకులు డబ్బులు ఇవ్వలేదు. గత రెండు రోజులుగా నిర్వాహకులు సంస్థ కార్యాలయానికి తాళం వేసి ఉడాయించారు. అనుమానం వచ్చిన బాధితులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో సుమారు 50 మంది బాధితులు నేరేడ్మెట్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిట్ ఫండ్స్ డైరెక్టర్లు సునీల్ కుమార్, పుష్పరాజ్, ప్రదీప్ కుమార్ లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖాతాదారుల వద్ద సుమారు రూ.కోటి వసూలు చేసి ఉంటారని భావిస్తున్నారు. -
మల కబళనం అంటే ఏమిటి?
జంతువుల్లో పోషణ జంతువులు వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకోలేవు. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. అందువల్ల వీటిని పరపోషకాలు అంటారు. పరపోషకాలు రెండు రకాలు అవి.. పూతికాహారులు, జాంతవ భక్షకులు నీటిలో కరిగిన ఆహార పదార్థాలను శరీర ఉపరితలం ద్వారా పీల్చుకోవడాన్ని పూతికాహార విధానం అంటారు. ఉదా: కొన్ని రకాల ప్రోటోజోవన్లు, పరాన్నజీవులు. జంతువుల్లో ఎక్కువశాతం ఘన, ద్రవ, ఆహార పదార్థాలను ప్రత్యేక సేకరణ యంత్రాంగాల సహాయంతో తీసుకుని జీర్ణరసాల ద్వారా జీర్ణం చేసుకుంటాయి. దీన్ని జాంతవ భక్షణం అంటారు. అమీబా మిథ్యాపాదాలు, హైడ్రా స్పర్శకాల ద్వారా ఆహారాన్ని సేకరించి ముక్కలు చెయ్యకుండా ఒకేసారి మింగుతాయి. నత్త రాడ్యులా (నాలుక)తో ఆహారాన్ని చిన్న చిన్న రేణువుల రూపంలో మింగు తుంది. తేళ్లు, సాలీళ్లు భక్షకాన్ని చంపి దాని శరీరంలోకి జీర్ణరసాలను వదిలి జీర్ణమైన ద్రవరూప ఆహారాన్ని తీసుకుంటాయి. సీతాకోకచిలుకలు గొట్టం వంటి తొండంతో పుష్పాల మకరందాన్ని పీల్చుకుంటాయి. జలగ రక్తాన్ని ఆహారంగా తీసుకుంటుంది. రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు కొన్ని పదార్థాలను జీవి రక్తంలోకి విడుదల చేస్తుంది. కొన్ని జీవులు ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటాయి. వీటిని ఏక రక భక్షక జీవులు అంటారు. ఉదా: పట్టుపురుగు (గొంగళిపురుగు దశలో) మల్బరీ ఆకులను మాత్రమే తింటుంది. కొన్ని జంతువుల్లో ఆడ, మగ జీవులు వేర్వేరు ఆహారాన్ని తీసుకుంటాయి.ఉదా: మగదోమ చెట్టు నుంచి రసాలను, ఆడదోమ మనిషి రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఆహారంలో ఉండే క్లిష్టమైన స్థూల ఆహార అణువులను సరళమైన అణువులుగా మా ర్చడాన్ని జీర్ణక్రియ అంటారు.జీర్ణవ్యవస్థ గోడల్లో ఉండే గ్రంథి కణాలు ఎంజైములను విడుదల చేస్తాయి. ఈ ఎంజైములు జీర్ణక్రియ రసాయనిక చర్య లను వేగవంతం చేస్తాయి. ఎంజైములు ఉత్ప్రేరకాల్లా పనిచేస్తాయి. ఉన్నతస్థాయి బహుకణ జీవుల్లో జీర్ణవ్య వస్థ అంతర్భాగాల్లోని కణాల బయట జీర్ణక్రియ జరుగుతుంది. దీన్ని కణబాహ్య జీర్ణక్రియ అంటారు. పోటోజోవా వంటి ఏకకణ జీవుల్లో కణం లోపల ఆహార రిక్తికలోనికి విడుదలైన ఎంజైముల వల్ల జీర్ణక్రియ జరుగుతుంది. దీన్ని కణాంతర జీర్ణక్రియ అంటారు. బహుకణ జీవుల్లో కూడా కణాంతర జీర్ణక్రియ కొంతవరకు జరుగుతుంది. లైసోజోమ్లు ఈ జీర్ణక్రియలో ఎంజైము లను విడుదల చేస్తాయి. ఎంజైములు చైతన్యవంతంగా ఉండాలంటే సరైన పీహెచ్ (హైడ్రోజన్ గాఢత) ఉష్ణోగ్రత అవసరం. పెప్సిన్ చైతన్యరహిత రూపం పెప్సినోజన్. కైమోట్రిప్సిన్ చైతన్యరహిత రూపం కైమో ట్రిప్సినోజన్. నెమరువేసే జంతువుల్లో జీర్ణక్రియ ఆవు, ఎద్దు, గేదె, మేక వంటి పెంపుడు జంతువులు శాకాహారులు. ఇవి మొక్కలను తింటాయి. కాబట్టి వృక్షకణం తయారైన సెల్యులోజ్ను ఆహారంగా తీసు కుంటాయి. సెల్యులోజ్ అనేక గ్లూకోజ్ అణువులతో తయారైన పాలిసాకరైడ్. సెల్యులేస్ అనే ఎంజైము సెల్యులోజ్ను జీర్ణం చేస్తుంది. జంతువుల్లో కొన్ని కశాభజీవులు బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలో ఉండి సెల్యు లేస్ను ఉత్పత్తి చేస్తాయి. అంటే ఈ జంతు వుల్లో కశాభజీవులు, బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో ఉండి సహజీవనం చేస్తాయి. శాకాహారుల్లో కుంతకాలు (కత్తెర పళ్లు) బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. నెమరువేసే జీవుల్లో జీర్ణాశయం పెద్దగా నాలుగు గదుల్లో ఉంటుంది. అవి ప్రథమ అమాశయం, జాలకం, తృతీయ, చతుర్థ అమాశయాలు. {పథమ అమాశయం అతి పెద్ద గది. ఇందులో అతి ఎక్కువ (వేల సంఖ్యలో) సెల్యులోజ్ను ఉత్పత్తి చేసే సూక్ష్మజీ వులుంటాయి. తృతీయ అమాశయంలో నీరు, బై కార్బొనేట్లు శోషణ చెందుతాయి. చతుర్థ అమాశయంలో ఆమ్లం విడుదలై సూక్ష్మజీవులను చంపుతుంది. ప్రొటీన్ల నిర్మాణాన్ని విడగొడుతుంది. దీన్ని విస్వా భావకరణం అంటారు. పేగులో జీర్ణక్రియ పూర్తయిన తర్వాత జీర్ణమైన ఆహారపదార్థాలు శోషణ చెందుతాయి. గ్లూకోజ్ కిణ్వప్రక్రియ చెందడం వల్ల నెమరువేసే జంతువుల్లో ప్రొపియోనిక్, బ్యుటేరిక్ వంటి కొవ్వు ఆమ్లాలు ఏర్పడతాయి. ఈ క్రియలో సూక్ష్మజీవుల శరీర నిర్మాణానికి, ఇతర కార్యకలాపాలకు కావలసిన శక్తి లభిస్తుంది. లాలాజలంలో ఉండే బై కార్బొనేట్ ఆమ్లా న్ని తటస్థీకరణం చేస్తుంది. నెమరువేసే జంతువుల్లో ఇతర జంతువుల రక్తంలో కంటే తక్కువ మొత్తంలో గ్లూకోజ్ కన్పిస్తుంది. కుందేళ్లు శాకాహారులు కానీ, నెమరువేసే జంతువులు కాదు. ఇవి రెండు రకాల మల పదార్థాన్ని విసర్జిస్తాయి. మెత్తగా బూడిద రంగులో ఉండే పాక్షికంగా జీర్ణమైన సెల్యులోజ్ కలిగిన మల పదార్థాన్ని కుందేలు తిరిగి తింటుంది. దీన్ని మల కబళనం అంటారు. కొన్ని శాకాహారుల్లో ఉండూకం (అపెం డిక్స్) సెల్యులోజ్ జీర్ణక్రియకు ఉపయోగ పడుతుంది. కుందేలులో రెండు దవడలపైన, థీకో డాంట్, విషమదంతి, ద్వివారదంతి రకపు దంతాలుంటాయి. కుంతకాలుండవు. 3 రకాల దంతాలు మాత్రమే ఉంటాయి. 1. తేలు, సాలీడు భక్షకానికి సంబంధించి సరైంది? 1) పూతికాహార సేకరణ 2) రాడ్యులాతో ఆహారాన్ని తినటం 3) భక్షకాన్ని చంపి దాని శరీరంలోకి జీర్ణరసాలను వదలడం 4) పొడవైన గొట్టంతో ఆహారాన్ని పీల్చడం 2. జీవుల రక్తాన్ని పీల్చేముందు రక్తం గడ్డకట్ట కుండా దానిలోకి పదార్థాలను విడుదల చేసే జీవి? 1) తేలు 2) మగ ఈగ 3) మగ ఎనాఫిలస్ దోమ 4) జలగ 3. ఏక రక భక్షక జీవులకు ఉదాహరణ? 1) బొద్దింక 2) పట్టుపురుగు(గొంగళిపురుగు దశలో) 3) కప్ప టాడ్పోల్ 4) చిట్టెలుక 4. కణాంతర జీర్ణక్రియలో ఎంజైములు ఉన్న భాగం? 1) రిక్తిక 2) కేంద్రకం 3) లైసోజోమ్ 4) రైబోజోమ్ 5. జీర్ణక్రియలోని ఎంజైములకు సంబంధించి సరికానిది? 1) ఎంజైములు ఉత్ప్రేరకాలుగా పని చేస్తాయి 2) ఎంజైములను హైడ్రోలేసులుగా పిలుస్తారు 3) ఎంజైములు జీర్ణరసాల్లో ఉంటాయి 4) ఎంజైములు జీర్ణక్రియలోని రసాయ నిక చర్యలో పాల్గొంటాయి 6. కిందివాటిలో ఎంజైమ్ చైతన్యరహిత రూపా న్ని తెలియజేసేది? 1) ట్రిప్సిన్ 2) ట్రిప్సినోజన్ 3) పెప్సిన్ 4) కైమోట్రిప్సిన్ 7. జీర్ణక్రియ ఎంజైములను హైడ్రోలేసులు అని కూడా అంటారు. ఎందుకు? 1) జీర్ణక్రియ చర్యల్లో పాల్గొనకుండా చర్యావేగాన్ని పెంచుతాయి 2) సరళసమ్మేళనాలను సంక్లిష్ట అణువులుగా మారుస్తాయి 3) క్లిష్టమైన అణువుల మధ్య ఉండే రసాయన బంధాలను నీటి అణువును చేర్చి విడగొడతాయి 4) రసాయన చర్యలను ఆమ్ల మాధ్య మంలో ఉండే ఆహార పదార్థాల్లోనే జరుపుతాయి 8. ఎమైలేసస్ అనేవి చర్య జరపటానికి కావల సిన అధస్తరం? 1) పిండి పదార్థాలు 2) కొవ్వులు 3) మాంసకృత్తులు 4) విటమిన్లు 9. శాకాహారుల్లో సెల్యులోజ్ జీర్ణక్రియకు సంబంధించి సరైన ప్రవచనం? 1) నెమరువేయడం వల్ల సెల్యులోజ్ జీర్ణక్రియ జరుగుతుంది 2) జీర్ణాశయం నాలుగు గదులుగా ఉండ టం వల్ల సెల్యులోజ్ జీర్ణం అవుతుంది. 3) సెల్యులోస్ జీర్ణక్రియకు కశాభజీవుల, బ్యాక్టీరియా సహాయాన్ని తీసుకుంటాయి 4) సెల్యులోజ్ జీర్ణక్రియలో ఒక శాకాహారి మరొక శాకాహారికి ఉపయోగపడు తుంది 10. ఆవు ఏ జీర్ణాశయ గదిలో విస్వాభావ కరణం జరుగుతుంది? 1) చతుర్ధ అమాశయం 2) తృతీయ అమాశయం 3) ప్రథమ అమాశయం 4) ద్వితీయ అమాశయం 11. ఆవు జీర్ణాశయంలోని తృతీయ అమా శయంలో జరిగే రెండు చర్యలు ఏవి? ఎ) ఎంజైముల వల్ల ప్రొటీన్ల జీర్ణక్రియ జరుగుతుంది బి) ఆహారం బాగా చిక్కగా అవుతుంది సి) నీరు, బైకార్బొనేట్లు శోషణచెందుతాయి డి) ఆహారంలో సెల్యులోజ్, ఇతర పదా ర్ధాల మీద విశ్లేషక చర్యలు జరుగుతాయి 1) ఎ,సి 2) బి, సి 3) ఎ, డి 4) బి, డి 12. ఆవు జీర్ణాశయంలోని సూక్ష్మజీవులకు శరీర నిర్మాణం, ఇతర కార్యకలాపాలకు కావ లసిన శక్తి ఏ ప్రక్రియల ద్వారా లభిస్తుంది? 1) విస్వాభావకరణం 2) శోషణ ప్రక్రియ 3) కిణ్వప్రక్రియ 4) మలకబళనం -
టీడీపీలో ఇంటిపోరు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో ‘ఇంటింటికీ తెలుగు దేశం’ కార్యక్రమం పార్టీలో విభేదాలను పెంచుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీటు ఆశిస్తున్న ముఖ్య నేతలను, వ్యతిరేక వర్గాలను నాయకులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదు. సొంత కార్యక్రమంగా భావిస్తూ కొందరికే పరిమితం చేస్తున్నారు. ముఖ్య నేతలను పిలిస్తే ప్రజల్లో పలుకుబడి పెరిగి రానున్న ఎన్నికల్లో సీటుకు పోటీ అవుతారనే భయంతో సమాచారమే ఇవ్వడం లేదు. పార్టీని పటిష్టం చేసేందుకు అధినేత చంద్రబాబు రూపొందించిన ఈ కార్యక్రమ నిబంధనలను నేతలు పాటించకపోవడం వల్లనే ఇంటిపోరు పెరుగుతోందని అభిమానులు చెబుతున్నారు. తొలి విడత కార్యక్రమం పేలవంగా ముగియడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు డిసెంబరు నెలాఖరులో నాయకులతో సమావేశం నిర్వహించి రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే ప్రారంభించిన పదిరోజుల్లోనే డొల్లతనం బయట పడింది. జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు, 11 మంది నియోజకవర్గ ఇన్చార్జిలు ఇంటింటికీ దేశం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అయితే నియోజకవర్గ ఇన్చార్జిలకు సీటు కేటాయింపుపై అధినేత నుంచి ఎటువంటి భరోసా లేకపోవడంతో మిగిలిన నేతలను కూడా ప్రజలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి ఈ కార్యక్రమాల సమాచారం అందనీయడం లేదు. ఆహ్వానం పంపడం లేదు. ఆహ్వానాలు అందడం లేదు.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇన్చార్జి బాధ్యతలను నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ తన వ్యతిరేక వర్గానికి ఆహ్వానం పంపడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక్కడ ఆయనతోపాటు మరో ఐదారుగురు సీటు ఆశిస్తున్నారు. వీరిలో కొందరికి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. నగర పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ మీరావలి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాసరావులకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన నాయకులను విస్మరించడం ఎంత వరకు సమంజసమనే అభిప్రాయం వినపడుతోంది. పోటీ చేయాలని పుష్పరాజ్పై ఒత్తిడి తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణ్కుమార్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజ లతో మమేకం అవుతుండటంతో ఆయన వ్యతిరేక వర్గం మాజీ మంత్రి పుష్పరాజ్ను కొత్తగా తెరపైకి తీసుకువచ్చి, రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి తమకు ఎటువంటి ఆహ్వానం లేదని శ్రావణ్ వ్యతిరేక వర్గం పేర్కొంటున్నది. మాజీ మంత్రి, నరసరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి కోడెల శివప్రసాద్ ఆత్మీయపాదయాత్ర పేరుతో సొంత కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ పాదయాత్రలో అన్ని వర్గాల నాయకుల ను కలుసుకునే యత్నం చేస్తున్నారు. అయితే ఆయన వ్యతిరేక వర్గమైన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పులిమి వెంకట రామిరెడ్డి, బీసీ విభాగ రాష్ట్ర నాయకులు వెల్లపు నాగేశ్వరరావు తదితరులు దీనికి దూరంగానే ఉంటున్నారు. కోడెలకు సీటు ఇవ్వరాదనే ప్రధాన ఉద్దేశంతో ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సొంత కార్యక్రమానికి రూపకల్పన సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మకాయల రాజనారాయణ అక్కడ సీటు ఆశిస్తున్న మరో నాయకుడు మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులుకు ఎటువంటి ఆహ్వానం పంపడం లేదు. దీంతో వైవీ ఆంజనేయులు సొంతంగా ఓ కార్యక్రమానికి రూపకల్పన చేసుకున్నారు. ప్రతి రెండు రోజులకు ఓ మారు ఒక గ్రామానికి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో సీటు ఆశిస్తున్నానని ప్రజలకు చెబుతున్నారు. మొత్తం మీద ఇంటింటికీ తెలుగుదేశం నియోజకవర్గాల్లో విభేదాలను పెంచుతోందని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement