-
లౌకిక విలువలకు భంగం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అభివృద్ధి ముసుగు తగిలించుకున్న ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని మతతత్వం వైపు నడిపిస్తూ లౌకిక విలువలకు భంగం కలిగిస్తున్నారని ఢిల్లీ జేఎన్యూ బీఏఎస్వో నేత ఉమర్ ఖలీద్ అన్నారు. ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర 7వ మహాసభల సందర్భంగా వేలాది మంది యువకుల తో బుధవారం నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేష్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మహిళలపై, చిన్నారులపై జరుగుతు న్న దాడులను సమర్థిస్తూ బీజేపీ నేతలు ర్యాలీ లు తీయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. యూపీలో యోగి ప్రభుత్వ పాలనలో 11ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని, దేశ వ్యాప్తంగా నేరస్తులను శిక్షించాలని ఆందోళన చేసిన తర్వాత అక్కడి ప్రభుత్వం నేరస్తులను అరెస్ట్ చేసినట్లు చేసి వదిలేసిందని అన్నారు. అమిత్షాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినందుకే న్యాయమూర్తి లోయాను హత్య చేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని జపం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ నిరంకుశంగా పాలిస్తున్న కేసీఆర్, మోదీ ప్రభుత్వాలను గద్దె దించే వరకు పోరాటాలు సాగుతాయని పేర్కొన్నారు. -
పీవైఎల్ తెలంగాణ కమిటీ ఏర్పాటు
ఖమ్మం: ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని ఎన్నిక గురువారం జరిగింది. ఖమ్మంలో మూడు రోజుల పాటు జరిగిన పీవైఎల్ రాష్ట్ర మహాసభలలో కమిటీ ఎన్నిక జరిగింది. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా వరదయ్య (నిజామాబాద్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎ రాజేందర్ ( వరంగల్), ఉపాధ్యక్షుడిగా తుడుం వీరభద్రం (ఖమ్మం), సహాయ కార్యదర్శిగా మోకాళ్ల రమేష్ (ఖమ్మం), కోశాధికారిగా మోతిలాల్ (నల్గొండ)లను ఎన్నుకున్నారు. వీరితో పాటు తొమ్మిది మంది కార్యవర్గసభ్యులను కూడా ఎన్నుకున్నారు. వీరిలో బాలయ్య (నిజమాబాద్), కృష్ణ (హైదరాబాద్), ఆర్. ఆశోక్, పి. నరేష్, దనసరి కుమారి (ఖమ్మం), బండారి రాజు(ఆదిలాబాద్), గని (కరీంనగర్), వి. మల్లేష్ (నల్గొండ), బి. రాజు(వరంగల్)లు ఉన్నారు. -
యువతకు భరోసానివ్వకపోతే భవిష్యత్ అంధకారమే
‘యువతరం శిరమెత్తితే.. నవతరం గళమెత్తితే... లోకమే మారిపో దా!... చీకటే మాసిపోదా...’ అంటూ ఎన్నో ఆశలతో ప్రగతిశీల శక్తులు యువతరం వైపు చూస్తున్న సందర్భం ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అనేక సమస్యలతోపాటు యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ఉపా ధి లేమి సమస్యలు పరిష్కరించబడతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు భాగాన నిలిచింది. ఎంతో మంది యువకులు ప్రాణాలర్పించారు కూడా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన కేసీఆర్, తనే ముఖ్యమంత్రి అయి 9 నెలలు గడిచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల యువతకు జరిగే ప్రయోజనాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతకు ముఖ్య మంత్రి కేసీఆర్ తద్భిన్నమైన ముఖచిత్రం చూపిస్తున్న, ఆవిష్కరిస్తున్న పరిస్థితి నేటిది. మరోవైపు చాయ్వాలాగా ప్రచార పటాటోపం ప్రారం భించి ప్రధాని పీఠాన్ని అధిష్టించిన మోదీ భారతదేశాన్ని టోకుగా విదేశీ కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న సందర్భం ఇది. ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితిలో ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) తన రాష్ట్ర తొలి మహాసభలను ఖమ్మంలో జరుపుకోబోతున్నది. యువతకు భరోసా ఇవ్వని ప్రభుత్వ విధానాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న యువజన విధానాలు, స్వయం ఉపాధి పథకాలు యువతకు ఏ భరోసా ఇవ్వలేకపోతున్నాయి. గత ప్రభుత్వాలు ప్రకటించిన యువశక్తి గానీ, రాజీవ్ యువకిరణాలు గానీ, నేటి ప్రభుత్వాల మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ తెలంగాణ గానీ యువ తకు ఉపాధి కల్పించటంలేదు. 2004-2014 మధ్య కాలంలో కేవలం భవన నిర్మాణ రంగంలో తప్ప ఏ రంగంలో ఉద్యోగాలు పెరగలేదని, పైగా భారీగా తగ్గాయని ఎన్ఎస్ఎస్వో లెక్కలు తెలుపుతున్నాయి. సినిమాల హీరోలు, మతోన్మాదాన్ని ప్రేరేపించే ఉన్మాదులు, దేశ సహజ వనరులను కొల్లగొట్టి కోట్లు గడించే ధనవంతులు, దొంగ ఓట్లతో, దొంగ నోట్లతో అధికార పీఠాలెక్కి ప్రజల్ని బూటుకాళ్లతో తన్నే నాయకులు, ప్రజాప్రతినిధులు యువతకు ఆదర్శం కారాదు. గుట్కా, మద్యం లాంటి వ్యసనాలకు, ఉత్పత్తులకు, అమ్మకాలకు వ్యతిరేకంగా, మన దేశ సహజ వనరులైన విత్తనాలు, భూమి, నీరు, అడవులు, ఖనిజాలపై ప్రజలకే శాశ్వత హక్కులు ఉండేలా యువత ఉద్యమించాలి. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, పర్యావరణాన్ని కాపాడేందుకు పోరాడాలి. వ్యవసాయాన్ని విషపూరితం చేస్తున్న రసాయనాలకు వ్యతిరేకంగా, గాలినీ, నీటినీ, సముద్రాలనూ విషపూరితం చేస్తున్న పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి. తమ భవిష్యత్ కోసం యువత తెగించి పోరాడకపోతే భవిష్యత్ అంధకారం కాక తప్పదు. (మార్చి 30, 31, ఏప్రిల్ 1 తేదీల్లో ఖమ్మంలో పీవైఎల్ రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగా...) - ఎ.రాజేందర్, పీవైఎల్ రాష్ట్ర కన్వీనర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర
డంప్యార్డ్లో ధనుష్.. ఫ్యాన్స్ అభినందనలు
కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
పెరిగిన రుణాలు.. రెండేళ్లలో రూ.10లక్షల కోట్లు
సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!
గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
మూడు రోజుల పాటు భారత్- నేపాల్ సరిహద్దు మూసివేత!
అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
ప్రపంచకప్కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్
రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement