-
చిరుత దళం; వాళ్లు చంపాలని.. వీరు కాపాడాలని!
చిరుతపులిని రక్షించాలా? మనిషినా? ఏ ప్రాణమూ తక్కువ విలువైనది కాదు అంటారు ఈ ఏడుగురు. అడవి నుంచి ఊళ్లలోకి వచ్చే చిరుతలను పట్టి మళ్లీ అడవిలో వదలడానికి సూరత్ సమీపాన ఉండే మాండ్వి అటవీ ప్రాంతంలో ప్రత్యేక మహిళా దళం పని చేస్తోంది. ఏడుగురు ఉండే ఈ దళం అడవిలోని చిరుతలకు రక్షకులు. కొత్త చిరుత కనిపిస్తే పట్టుకుని వాటికి ‘రేడియో ఫ్రీక్వెన్సీ’ ట్యాగ్స్ను అమర్చడం కూడా వీరి పనే. కాంక్రీట్ అరణ్యంలో తిరగడానికి జంకే కొందరు స్త్రీలు ఉన్న రోజుల్లో కీకారణ్యంలో ధైర్యంగా తిరుగుతూ స్ఫూర్తినిస్తున్నారు వీరు. విధి నిర్వహణలో చిరుత దళ సభ్యులు ప్రభుత్వం చిరుతలను అదుపు చేయడానికి చేయవలసిందంతా చేస్తోంది. ఒక్క అడవులను తెగ నరకడాన్ని సమర్ధంగా ఆపు చేయడం తప్ప. సూరత్ (గుజరాత్) జిల్లాలోని మాండ్వి అంటే భిల్లుల సామ్రాజ్యం. అటవీ ప్రాంతం. భిల్లులు, అడవి మృగాలు కలిసి జీవించిన ప్రాంతం అది ఒకప్పుడు. ఇప్పుడు అరా కొరా అడవి మిగిలింది. వాటిలోని చిరుతలు ఏం చేయాలో తెలియక ఊళ్ల మీద పడుతున్నాయి. మాండ్వి అడవిని ఒరుసుకుంటూ పారే తాపి నది ఒడ్డున ఉన్న పల్లెల్లో ఒకప్పుడు కోళ్లు, గొర్రెలు, పశువులు పెంచేవారు. ఇప్పుడు మానేశారు చిరుతల దెబ్బకు. ఒక ఊరిలో కుక్కలు మాయమయ్యాయంటే చిరుతలు తరచూ దాడి చేస్తున్నట్టు అర్థం. ఆ ప్రాంతంలో ఒకప్పుడు కనిపించిన నెమళ్లు, కోతులు, కుక్కలు అన్నీ పారిపోయాయి. మాండ్వి అడవిలో దాదాపు 50 చిరుతలు ఉన్నట్టు అంచనా. ప్రభుత్వానికి వాటిని కాపాడటం ఎంత అవసరమో మనుషుల్ని కాపాడటం కూడా అంతే అవసరం. మృగానికి మనిషికి మధ్య తకరారు వచ్చినప్పుడల్లా ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగుతుంది. అయితే చిరుత దాడి వల్ల మనిషినో, పశువునో కోల్పోయిన గ్రామస్తులు చాలా కోపంగా ఉంటారు. చిరుతను కొట్టి చంపాలని చూస్తారు. ఆ సమయంలో మగ ఫారెస్ట్ సిబ్బంది మాట వినరు. కాని మహిళా సిబ్బంది అయితే నచ్చ చెప్పే అవకాశం ఎక్కువ. అందుకే ఫారెస్ట్ ఆఫీసర్లు ఏడుగురు మహిళలతో చిరుత దళాన్ని ఏర్పాటు చేశారు. మాండ్వి ప్రాంతంలో చిరుతను పట్టుకోవాలన్నా, దూరంగా తీసుకెళ్లాలన్నా, దాడుల నుంచి కాపాడాలన్నా, వాటిని పట్టి వాటి కదలికల్ని తెలియచేసే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అమర్చాలన్నా అదంతా ఈ ఏడుగురు మహిళా సిబ్బంది పనే. స్థానిక సమూహాల నుంచి ఈ మహిళా సిబ్బందిని తీసుకోవడం వల్ల వారికి అడవి తెలుసు. మచ్చల ఒంటితో హఠాత్తుగా ఊడి పడే చిరుతా తెలుసు. వారు భయపడరు. ‘గత సంవత్సర కాలంలో మేము 22 చిరుతలను పట్టుకుని వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అమర్చాము’ అంటుంది ఈ దళానికి నాయకత్వం వహించే పూజా సింగ్. ‘ఇంకా కనీసం 20 లేదా 30 చిరుతలకు ఈ పని చేయాల్సి ఉంది. కాని చిరుతలు అంత సులువుగా దొరకవు. బోన్లో పడవు. వాటి కోసం వేచి ఉండాలి. అదే సమయంలో అవి ఉత్త పుణ్యానికి దాడి చేయవు’ అంటారు ఈ చిరుత దళ సభ్యులు. ‘ఒకసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. మేము అదుపు చేసే పనిలో ఉన్నాం. అప్పుడు మా సమీపంగా చిరుత వచ్చింది. అలాంటి సమయంలో రెచ్చగొట్టే పనులు చేయకూడదని మేము తర్ఫీదు అయి ఉన్నాం. కనుక మేము ఏమీ చేయలేదు. అదీ ఏమీ చేయకుండా వెళ్లిపోయింది’ అంటారు ఈ సిబ్బంది. కాని అన్నిసార్లు పరిస్థితి ఇంత సులువుగా ఉండదు. విధి నిర్వహణలో చిరుత దళ సభ్యులు మధార్కుయి గ్రామంలో చిరుత దాడి చేసి ఒక నాలుగేళ్ల పాపాయిని చంపేసింది. గ్రామస్తులు అగ్గి మీద గుగ్గిలం అయ్యి చిరుత వెంట పడ్డారు. అది ఊళ్లోనే నక్కింది. చిరుత దళానికి కబురు అందింది. వీరు ఆఘమేఘాల మీద చేరుకున్నారు. గ్రామస్తులు ఆ చిరుతను చంపాలని. వీరు కాపాడాలని. ‘చివరకు గాలిలో కాల్పులు జరిపి చిరుతను ప్రాణాలతో పట్టుకున్నాం. లోపలి అడవిలో దానిని వదిలిపెట్టాం’ అన్నారు ఆ దళ సభ్యులు. మాండ్వి అడవంచు పల్లెల్లో చెరకు పంట వేస్తారు. పెరిగిన చెరకు పంట చిరుతలకు దాక్కోవడానికి అనువుగా ఉంటుంది. కనుక దాడి చేస్తాయి. మరోవైపు అడవిలో ఆహారం దొరక్కపోవడం, వేసవిలో నీటి కుంటలు ఎండిపోవడం వల్ల కూడా ఊళ్ల మీదకు వస్తాయి. ‘వేసవిలో అవి నీరు తాగే చోటుకు నీరు చేర వేసి ఆ కుంటలు నిండుగా ఉండేలా చూస్తాం’ అంటారు చిరుత దళ సిబ్బంది. వీరు చిరుతలను కాపాడటమే కాదు ఉచ్చుల్లో చిక్కుకున్న అటవీ మృగాలను, గాయపడ్డ పక్షులను కూడా కాపాడుతుంటారు. చిరుతల కోసం ఇలా ఏడుగురు స్త్రీలు ప్రాణాలకు తెగించి పని చేయడం ఈ కాలంలో స్ఫూర్తినిస్తున్న గొప్ప విశేషం. స్త్రీల చేతుల్లో అడవి క్షేమంగా ఉంటుంది అనడానికి మరో నిదర్శనం. ‘ఒకసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. మేము అదుపు చేసే పనిలో ఉన్నాం. అప్పుడు మా సమీపంగా చిరుత వచ్చింది. అలాంటి సమయంలో రెచ్చగొట్టే పనులు చేయకూడదని మేము తర్ఫీదు అయి ఉన్నాం. కనుక మేము ఏమీ చేయలేదు. అదీ ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. -
వైఫైతో గోడల్లోంచీ చూడొచ్చు!
వాషింగ్టన్: ఉగ్రవాదులు ఒక భవనంలో దాక్కున్నారు.. చుట్టూ పోలీసులు మోహరించారు. కానీ లోపల ఎంత మంది ఉన్నారు? ఆయుధాలేమున్నాయి? అసలు లోపల గదులు, వస్తువులు ఏమున్నాయో తెలియదు.. పోలీసులు వెంటనే ఒక రోబోను రంగంలోకి దించారు. ఆ భవనాన్ని స్కాన్ చేసిన ఆ రోబో.. గోడల అవతల ఏముందో, ఎక్కడెక్కడ మనుషులున్నారో చూపించేసింది.. అంతే పోలీసులకు తమ పని సులువైపోయింది. అమెరికాకు చెందిన కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన సరికొత్త టెక్నాలజీ మహిమ ఇది. అసలు ఇలా గోడల అవతల ఏముందో స్కాన్ చేసి గుర్తించేందుకు ఉపయోగించేదేమిటో తెలుసా?.. ‘వైఫై’ టెక్నాలజీ. అదేనండీ ప్రస్తుతం స్మార్ట్ఫోన్లన్నింటిలోనూ ఉండే టెక్నాలజీయే! రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల ఆధారంగా గోడల అవతల ఉన్న వస్తువులు, మనుషులను ఇది గుర్తిస్తుంది. అంతేకాదు కలపతో చేసిన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, లోహపు వస్తువులు ఇలా ఏ తరహాకు చెందినవో గుర్తించడంతోపాటు... గోడ అవతల ఎక్కడ, ఎంత దూరంలో ఉన్నాయో కూడా చెప్పేస్తుంది. మరో విశేషం ఏమిటంటే ఈ టెక్నాలజీని కేవలం రోబోలతో మాత్రమే కాకుండా... వైఫైతో పనిచేసే ఇతర పరికరాల్లోనూ వినియోగించుకోవడానికి అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులను గుర్తించడానికి ఈ టెక్నాలజీ ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement