-
పేటీఎంతో ట్రైన్ టికెట్స్.. ఇంకా చాలా ఫీచర్స్
-
రైల్వే స్టేషన్లలో ‘సింగిల్ విండో’
* టికెట్ల జారీ మినహా ఇకపై అన్ని సేవలూ అక్కడే: దక్షిణ మధ్య రైల్వే జీఎం * రైళ్ల సమాచారంతో ప్రత్యేక యాప్ * టికెట్ ఉన్నవారినే స్టేషన్లలోకి అనుమతించే అంశం పరిశీలిస్తున్నాం సాక్షి, హైదరాబాద్: టికెట్ల జారీ మినహా ఇతర రకాల సేవలన్నీ ఒకే చోట అందేలా రైల్వే స్టేషన్లలో ‘మే ఐ హెల్ప్ యూ’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాత్సవ పేర్కొన్నారు. విచారణ మొదలు ఇతర అన్ని రకాల సేవలు, ప్రయాణికుల ఫిర్యాదులు, చోరీ జరిగినప్పుడు రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ పత్రాల జారీ లాంటివన్నీ ఈ కేంద్రాల ద్వారానే జరిగేలా చూడాలని భావిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని ఈ విధానాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారి ప్రారంభించనున్నామని, స్టేషన్లలో రైళ్ల సమాచారాన్ని ప్రకటించే కేంద్రాన్ని దీనితో అనుసంధానిస్తామని చెప్పారు. సోమవారం రైల్ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీవాత్సవ మాట్లాడారు. ఇటీవల సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్మాది చేతిలో ఓ చిన్నారి హత్యకు గురైన సంఘటనను దృష్టిలో ఉంచుకుని రైల్వేస్టేషన్లలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా చర్యలు తీసుకునే విషయంపై యోచిస్తున్నామని చెప్పారు. ప్రయాణ టికెట్లు, ప్లాట్ఫాం టికెట్లు ఉన్నవారినే లోనికి అనుమతించేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నామన్నారు. జంటనగరాల్లో ఎంఎంటీఎస్ రైళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సెల్ఫోన్లలో చూసుకునేలా ప్రత్యేక స్మార్ట్ ఫోన్ యాప్ను రూపొందించనున్నామని, దీన్ని సులభంగా ఫోన్లలోకి డైన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. దీని ద్వారా రైలు వేళలు, టికెట్ ధరలు సహా ఆలస్యం, రైళ్ల రద్దు, రూట్ మార్పు.. లాంటి సమాచారం సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రస్తుతం స్టేషన్లలో రైళ్ల సమాచారాన్ని చూపుతున్న ఎల్ఈడీ బోర్డులతో ఈ యాప్ను అనుసంధానిస్తామని, దీంతో స్టేషన్లలో అప్లోడ్ అయ్యే సమాచారాన్ని ఫోన్లలో తెలుసుకోవచ్చని అన్నారు. నిధులకు కష్టమే.. ప్రస్తుతం తమ ఆదాయంలో 70 శాతం సిబ్బంది జీతాలకు, 20 శాతం ఇంధనం, ఇతర ఖర్చులకు పోతుండ గా అభివృద్ధి పనులకు 10 శాతం మాత్రమే మిగులుతోందని శ్రీవాత్సవ చెప్పారు. ఇది అభివృద్ధి విస్తరణ పనులకు ఆటంకంగా ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. దీంతో ఇంధనం వృథాను అడ్డుకోవటం, ఇంధన ఖర్చును నియంత్రించే మార్గాలను అన్వేషించి ఖర్చును తగ్గించటం ద్వారా అభివృద్ధి పనులకు నిధులు సమీకరించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగితే దక్షిణ మధ్య రైల్వే జోన్ను కూడా రెండు చేయాలన్న విషయంలో రైల్వే బోర్డు ఇప్పటి వరకు తమ నుంచి ఎలాంటి సమాచారం కోరలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం సగటున గంటకు 50 కి.మీ.గా ఉన్న రైళ్ల వేగాన్ని పెంచటం, స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించటం, కాపలా లేని లెవల్ క్రాసింగుల తొలగింపు, రైళ్ల సమయపాలన, రద్దీకి తగ్గట్టుగా అదనపు బోగీల ఏర్పాటు తదితర అంశాలపై తాము దృష్టి సారించామని శ్రీవాస్తవ తెలిపారు. -
17న రైల్వే సేవలకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: ఐఆర్సీటీసీ ద్వారా రైల్వే టికెట్ రిజర్వేషన్, టికెట్ల రద్దు, 139 నంబర్ ద్వారా విచారణ... తదితర కార్యకలాపాలు ఈనెల 17న (ఆదివారం) ఏడు గంటల పాటు నిలిచిపోనున్నాయి. సాంకేతికపరంగా అనుకోని అవాంతరాలు ఎదురైతే ప్రత్యామ్నాయాలు ఏమేరకు పనిచేస్తాయో తెలుసుకునే క్రమంలో రైల్వే అధికారులు ఈ సేవలను నిలుపు చేయబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (పీఆర్ఎస్)ను నిలిపివేయనున్నట్టు అధికారులు తెలిపారు. ‘డిజాస్టర్ రికవరీ డ్రిల్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పీఆర్ఎస్ ప్రధాన సర్వర్ చెన్నైలో ఉంది. దాని ఆధారంగానే దక్షిణ మధ్య రైల్వేలో ఈ-టికెటింగ్, రైల్వే చార్టుల తయారీ, టికెట్ల రద్దు, టికెట్ మొత్తం చెల్లింపు, 139 నంబర్ ద్వారా విచారణ.. తదితరాలన్నీ జరుగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మరో వ్యవస్థ కూడా దక్షిణ మధ్య రైల్వేకు అందుబాటులో ఉంది. ఏదైనా భారీ సాంకేతిక సమస్య తలెత్తి చెన్నై సర్వర్ సేవలు నిలిచిపోతే, ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏ మేరకు పనిచేస్తుందో పరిశీలించాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా చెన్నై సర్వర్ను షట్ డౌన్ చేయనున్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థలో లోపాలున్నట్టు తేలితే వెంటనే దాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ఆదివారం డ్రిల్ నిర్వహిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా అందే సేవలు నిలిచిపోయినా... రైల్వే స్టేషన్లలో మాన్యువల్ కౌంటర్ల ద్వారా టికెట్ల జారీ కొనసాగుతుందని, అవసరమైన చోట్ల అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి టికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. టికెట్ల రద్దు, డబ్బులు తిరిగి ఇవ్వటం లాంటివి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే క్రమంలోనే ఇది జరుగుతున్నందున దీనికి సహకరించాలని కోరారు.
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
Advertisement