-
గవర్నర్తో వివాదంపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే!
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణ గవర్నర్తో వివాదంపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో తమకు ఎలాంటి పంచాయితీ లేదని కేటీఆర్ తెలిపారు. గవర్నర్ అంటే తమకు గౌరవం ఉందని, ఆమెను ఎక్కడా అవమానించలేదని స్పష్టం చేశారు. గవర్నర్ తనకు తానే ఊహించుకోకూడదని సూచించారు. గవర్నర్కు ఎక్కడ అవమానం జరిగిందో వెల్లడించాలని తెలిపారు. తనను ఇబ్బందిపెడుతున్నారని గవర్నర్ అంటున్నారని, అందంతా అవాస్తవమని కేటీఆర్ అన్నారు. ‘కౌశిక్ రెడ్డి విషయంలో రాజకీయ నేపథ్యం ఉందని గవర్నర్ ఆమోదం తెలపలేదని తెలిసింది .గవర్నర్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు కాదా. గవర్నర్ అయ్యేందుకు రాజకీయాలు కావాలి కానీ ఎమ్మెల్సీకి ఎందుకు అడ్డు అవుతాయి. గతంలో నరసింహన్ గవర్నర్గా ఉన్నప్పుడు మాకు ఏ పంచాయితీ లేదు. ఇప్పుడు ఎందుకు సమస్య వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. సంబంధిత వార్త: అమిత్ షాతో ఏం చర్చించానో బయటకు చెప్పలేను: గవర్నర్ తమిళిసై కాగా తెలంగాణలో గత కొంత కాలంగా కేసీఆర్ వర్సెస్ గవర్నర్ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు పంపగా.. గవర్నర్ ఆ ఫైల్ను పెండింగ్లో పెట్టారు. అప్పటి నుంచి రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య వివాదం రాజుకున్నట్లు, గవర్నర్, కేసీఆర్ మధ్య గ్యాప్ పెరిగిపోయిందని సమాచారం. ఆ తర్వాత కూడా ఏ కార్యక్రమంలోనూ ఇద్దరు కలిసి పాల్గొనకపోవడంతో కేసీఆర్ గవర్నర్ను దూరం పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాజ్భవన్లో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లోనూ కేసీఆర్ సహా టీఆర్ఎస్ మంత్రులు ఎవరూ హాజరు కాలేదు. దీంతో వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగినట్లైంది.ఈ విషయంపై గవర్నర్ కూడా పలు సందర్బాలలో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్కి కనీసం ప్రొటోకాల్ మర్యాదలు పాటించకుండా అవమానాలకు గురిచేశారని అన్నారు. తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, రాజ్భన్ను గౌరవించాలన్నారు. ఇక ఇటీవల గవర్నర్ళిసై యాదాద్రి పర్యటనకు వెళ్తే కనీసం ఈవో స్థాయి అధికారి కూడా స్వాగతం పలకకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం.. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించారు. -
గవర్నర్ కీలక సమీక్షలు
సోమవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ఎన్నికలతో పాటు ఏడు కీలకాంశాలపై సమీక్ష జాబితాలో శాంతిభద్రతలు, విద్యుత్ సరఫరా సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల ఏర్పాట్లతో పాటు ఏడు కీలకాంశాలపై గవర్నర్ ఎస్ఎల్ నరసింహన్ సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, ఎస్సీలతో సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు రాజ్భవన్ కార్యాలయం శనివారం ఈ మేరకు నోట్ పంపింది. సాధారణ ఎన్నికల ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిస్థితి, గ్రామీణ తాగునీటి సరఫరా, వాతావరణ పరిస్థితులు, విద్యుత్ సరఫరా, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్ష జరగనుంది. గవర్నర్ ఎన్నికల సమీక్ష నిర్వహించవచ్చా? ఎన్నికల వ్యవహారాలపై సమీక్ష జరుపుతానన్న గవర్నర్ ప్రకటన అధికార వర్గాల్లో చర్చనీయంగా మారింది. సోమవారం ఆయన ప్రధానంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తదితరాలపై నేరుగా సమీక్ష నిర్వహించనుడటం విశేషం. సాధారణంగా ఎన్నికైన ప్రభుత్వం ఉనికిలో ఉంటే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ సమీక్షించరాదు. వారు నిర్వహించే సమీక్షలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల ఉన్నతాధికారులెవరూ నియమావళి అమల్లో ఉండగా వెళ్లరాదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాత్రమే ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి పాలన కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రివర్గం లేనందున గవర్నరే పాలనాధిపతిగా ఉన్నారు. ఓటర్లను ప్రభావితం చేస్తారనే కారణంతో ముఖ్యమంత్రి, మంత్రులనే ఎన్నికల ఏర్పాట్ల సమీక్ష నుంచి ఈసీ పక్కన పెట్టింది. మరిప్పుడు వారి స్థానంలో ఉన్న గవర్నర్ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించవచ్చా అంటూ అధికార వర్గాల్లో చర్చసాగుతోంది. గవర్నర్ను నియమించేది కేంద్రమే గనుక ఆయన ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడమంటే రాజకీయంగానే పరిగణించాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. తక్షణావసరాలు, శాంతిభద్రతల పర్యవేక్షణకే గవర్నర్ పరిమితం కావాలని, అలాగాక ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన మౌలికాంశాల్లోకి వెళ్లడమంటే రాజకీయమే అవుతుందని ఉన్నతాధికారి ఒకరన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక అధికార యంత్రాంగమంతా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్లిపోతుంది. ఈసీ ఆదేశాల మేరకే పని చేస్తుంది. అయితే నియమావళిలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ గురించే ఉంది తప్ప గవర్నర్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. పరిశీలించాలి: సీఈవో కార్యాలయం ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయాన్ని సంప్రదించగా, ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ ఎదురవలేదని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఏం చేయాల్సి ఉంటుందో పరిశీలించాల్సి ఉందన్నారు. గవర్నర్కు నిమ్స్లో వైద్య పరీక్షలు సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వచ్చిన ఆయనకు 11.35 దాకా వైద్యులు పలు పరీక్షలు జరిపారు. నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్తో పాటు డాక్టర్ సుభాష్ కౌల్, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ లిజా రాజశేఖర్ గవర్నర్కు వైద్య సేవలు నిర్వహించారు. నిమ్స్ పాత భవనంలో సీటీ స్కాన్, కొత్తగా కట్టిన స్పెషాలిటీ బ్లాక్ నాలుగో అంతస్తులో పల్మనరి ఫంక్షన్ టెస్ట్ (పీఎఫ్టీ) జరిగాయి. సాధారణ రక్త పరీక్ష తదితరాలు కూడా జరిపారు. సాధారణ ఎన్నికల తరువాత అయితే నే మేలు! సాక్షి, హైదరాబాద్: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సాధారణ ఎన్నికల తరువాత నిర్వహిస్తే బావుంటుందన్న అభిప్రాయంతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉన్నట్లు సమాచారం. సాధారణ ఎన్నికల సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ తలకు మించిన భారంగా మారుతుందన్న అభిప్రాయాన్ని అధికారులతో వ్యక్తం చేసినట్లు తెలిసింది. స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారని, గ్రామాల్లో అనవసర ఆందోళనలు తలెత్తుతాయని గవర్నర్ వ్యాఖ్యానించారని అధికారవర్గాలు వివరించాయి. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాధ్యమైనంత త్వరగా రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికల సంఘానికి ఇవ్వడం ద్వారా తమ బాధ్యత తీర్చుకోవాలని పంచాయతీ అధికారులు, రిజర్వేషన్లు రాగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం అధికారులు ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement