-
ఇదేం దా‘రుణం’!
ఖమ్మంమయూరిసెంటర్: ఉపాధి చూసుకునేందుకు, ఆర్థిక స్వావలంబన పొందేందుకు సబ్సిడీ రుణాలిచ్చి చేయూతనిచ్చే రాజీవ్ యువశక్తి పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మూడు సంవత్సరాలుగా దీనిద్వారా ఎలాంటి రుణాలు మంజూరు చేయట్లేదు. అసలు..దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకో పథకం ఏర్పాటు చేశారా? లేక కొనసాగిస్తారా? యువజనుల పరిస్థితి ఏంటి..? అనే అంశాలపై స్పష్టత కరువైంది. రుణాలు పొంది బాగుపడుదామనుకున్న అర్హులు..తీవ్ర నిరాశ చెందుతున్నారు. యువజన సర్వీసుల శాఖ (సెట్కమ్) నిర్వీర్యమైంది. లోన్లు ఇచ్చి సొంత వ్యాపారం పెట్టించే, బతుకుదెరువు చూపించే రాజీవ్ యువశక్తి పథకం ద్వారా చివరిసారిగా 2014–15 లో జిల్లాలోని 296 మంది నిరుద్యోగులకు రూ.2.77 కోట్ల రుణాలను 30శాతం సబ్సిడీపై మంజూరు చేశారు. ఆ తర్వాత మూడేళ్లుగా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి లోన్లు కేటాయించలేదు. యువజ న సర్వీసుల శాఖతోపాటు క్రీడల విభాగాన్ని కూడా అనుసంధానం చేసి డీవైఎస్వోగా మార్చారు. దీంతో యువత కొత్త రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన శాఖ ద్వారా రుణా లు అందుతాయని ఆశించినా ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో రాజీవ్యువశక్తి పథకం ఉందో లేదో తెలియని అయోమయం నెలకొంది. అన్నివర్గాల నిరుద్యోగ యువతకు అండగా నిలిచే శాఖ నుంచి పథకాలు తీసేస్తే తమ పరిస్థితి ఏంటని యువత ప్రశ్నించుకుంటున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆపై చదువులు పూర్తిచేసి, ఉద్యోగాలు లేని అనేకమంది యువత సెట్క మ్ ద్వారా అందించే రుణాల కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు ఆ శాఖ చడీచప్పుడు లేకుండా పడిఉంది. జీఓ వచ్చినా రుణాలు రాలే.. 2016–17 ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సున్న నిరుద్యోగ యువతకు మూడు విభాగాలుగా సబ్సిడీ కోటాను పెంచింది. స్కీమ్–ఏ కింద 7వ తరగతివరకు చదివిన నిరుద్యోగులకు రూ.లక్ష వరకు లోను మంజూరు చేస్తారు. దీనికి 80శాతం సబ్సిడీ ఉంటుంది. స్కీమ్–బీ కింద పదో తరగతి విద్యార్హతపై నిరుద్యోగులకు రూ.2లక్షల రుణం ఇచ్చి, 70శాతం సబ్సిడీని వర్తింపజేయాలి. స్కీమ్–సీ కింద డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు రూ.5లక్షల వరకు 60శాతం సబ్సిడీపై రుణం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జీవో జారీ అయినా..నేటికీ మార్గదర్శకాలు రాలేదు. నిరుద్యోగులకు వెతలు తప్పట్లేదు. నిరుద్యోగుల్లో తీరని వేదన.. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువతను చైతన్య పరచడంతో పాటు వారిలోని కళను వెలికితీయడం, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సబ్సిడీ రుణాలు అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. అందుకోసమే ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖను ఏర్పాటు చేసింది. అయితే ఏ లక్ష్యంతో దీనిని ప్రారంభించారో ఆ శాఖ నుంచి నిరుద్యోగులకు అవసరమైన సాయం మాత్రం అందట్లేదు. కేవలం యువతలోని కళలను మాత్రమే ప్రొత్సహిస్తున్న యువజన సర్వీసుల శాఖ నిరుద్యోగులకు మాత్రం ఉపాధి అవకాశాలు కల్పించలేట్లేదు. ప్రభుత్వ శాఖను క్రీడలశాఖలో విలీనం చేసి, రెండు శాఖలకు ఒకే అధికారిని నియమించింది. దీంతో నిరుద్యోగులు, యువజన సంఘాలు, కళాకారులతో కళకళలాడే యువజన సర్వీసుల శాఖ గత రెండు సంవత్సరాల నుంచి వెలవెలబోతోంది. ఈ శాఖ నుంచి తమకు సాయం అందదని నిరుద్యోగులు నిరాశలో మునిగిపోయారు. -
20, 21తేదీల్లో మెగా జాబ్ మేళా
సాక్షి, సిటీబ్యూరో: రాజీవ్ యువ కిరణాలు పథకం కింద నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 20, 21తేదీల్లో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. ఇందులో 2119 పోస్టుల (597 టెక్నికల్, 1522 నాన్టెక్నికల్)ను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. మల్లేపల్లిలోని అన్వర్ ఉలుమ్ డిగ్రీ కళాశాల్లో జరిగే ఈ మేళాకు టెన్త్ పాస్/ఫెయిల్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఇతర టెక్నిల్ అర్హతలు గలవారు హాజరు కావచ్చు. భారత్ ఇంజినీరింగ్, రెడ్డీస్ ల్యాబ్స్, ఫుడ్వరల్డ్, భారత్ వాల్మార్ట్, మెట్రో, సూర్యవంశీ స్పినింగ్ మిల్స్, వరుణ్మోటార్స్, ఎన్ఆర్బీ బేరింగ్స్, కన్కార్డ్ మోటార్స్, వోక్స్వ్యాగన్, అమృతాంజన్ హెల్త్కేర్, హెరిటేజ్ఫుడ్స్ తదితర సంస్థలు ఇందులో పాల్గొంటాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement