-
ఎమ్మెల్యే కారును ఓవర్ టేక్ చేశారని..
ఆగ్రా: ఎమ్మెల్యే కారును బర్రెలను తీసుకెళ్తున్న ఓ ట్రక్ ఓవర్ టేక్ చేయడం ఆయనకు కోపం తెప్పించింది. స్పీడుగా వెళ్లి ట్రక్ను ఓవర్ టేక్ చేయాల్సిందిగా డ్రైవర్ను ఆదేశించాడు. ఎమ్మెల్యే ట్రక్ను ఆపి అందులో ఉన్న 30 బర్రెలను బయటకు తోలారు. ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రాజ్కుమార్ యాదవ్ చేసిన నిర్వాకమిది. రాజ్కుమార్ రాజస్థాన్లోని కోటా నుంచి తన నియోజకవర్గం సాదార్కు వెళ్తున్నారు. తన కారును ఓవర్ టేక్ చేసినందుకు ట్రక్లో ఉన్న బర్రెలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. వీటిని చూసిన గ్రామస్తులు తొలుత ఆశ్చర్యపోయినా, తమకు దొరికినందుకు సంతోషించి ఇళ్లకు తోలుకుపోయారు. యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామాల్లో ప్రతి ఇల్లూ గాలించి బర్రెలను గుర్తించారు. కాగా బర్రెలను కబేళానికి తీసుకెళ్తుంటే ట్రాక్ను ఆపానని, గ్రామస్తులు వాటిని విడిపించారని ఎమ్మెల్యే చెప్పగా.. స్థానిక డైరీకి తీసుకెళ్తున్నామని యజమానులు చెప్పారు. చివరకు ఎమ్మెల్యే, బర్రెల యజమానుల మధ్య రాజీకుదరడంతో కేసును ఉపసంహరించుకున్నారు. -
వైఎస్సార్ సీపీ గ్రేటర్ అధ్యక్షుడిగా రాజ్కుమార్ యూదవ్
కాజీపేట రూరల్ : కాజీపేటలోని సోమిడికి చెందిన కాయిత రాజ్కుమార్యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా నియమితులయ్యూరు. తన ను గ్రేటర్ అధ్యక్షుడుగా నియమించినందుకు వైఎస్ఆర్ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి, తెలంగాణ శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పరిశీలకుడు కొండ రాఘవరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అప్పం కిషన్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎర్రంరెడ్డి మహిపాల్రెడ్డికి ఈ సందర్భంగా రాజ్కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కాయిత రాజ్కుమార్ యాదవ్ 1990 నుంచి 2009 వరకు ఒక జాతీయ పార్టీలో కొనసాగుతూ మూడు సార్లు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ సీపీని స్థాపించగా ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ సీపీలో చేరాడు. ఈ సందర్భంగా రాజ్కుమార్ యాదవ్ మాట్లాడుతూ నగరంలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలతోపాటు గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తానన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ తదితర పార్టీల కు దీటుగా పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. రాజ్కుమార్ యూద వ్ గతంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. కాజీపేటలో స్వీట్ల పంపిణీ.. రాజ్కుమార్ యూదవ్ నియూమకంపై హర్షం వ్యక్తంచేస్తూ కాజీపేటలో ఆదివారం వైఎస్ఆర్ సీపీ నాయకులు మంచె అశోక్, ముజఫరుద్దీన్ఖాన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు మేకల రాజు, అంచూరి వెంకటే శ్వర్లు, ఎం.రవీందర్, రమేష్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
Sakshi News Cartoon: మన సారే! ఈ మధ్య మరీ దిగజారి మాట్లాడుతున్నారుగా!
KITEX Group: ‘ట్వంటీ20 పార్టీ.. తప్పుడు నిర్ణయాలతోనే ఇబ్బంది’
చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు
Sanjeeda Sheikh: చీరలో అదరగొడుతున్న హీరోయిన్ లుక్స్ (ఫోటోలు)
చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement