-
నా చేతులతో మొదటి భార్య శవాన్ని మోశా.. బిడ్డను కనగానే..: కమెడియన్
తెలుగు సినిమాలో టాప్ కమెడియన్ ఎవరంటే బ్రహ్మానందం అని టక్కున చెప్పేస్తారు. అలాగే బాలీవుడ్లో బడా కమెడియన్ అనగానే చాలామందికి రాజ్పాల్ యాదవ్ గుర్తొస్తారు. 25 ఏళ్లుగా హిందీ ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న అతడు తాజాగా తన జీవితంలో జరిగిన ఓ విషాదకర సంఘటనను వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'అప్పుడు రోజులు ఎలా ఉండేవంటే.. 20 ఏళ్లకే మన చేతిలో ఉద్యోగం ఉందంటే చాలు.. జనాలు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తూ ఉండేవారు. మా నాన్న వారి మాటలు విని నాకు 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశాడు. నా మొదటి భార్య నాకు ఓ బిడ్డను ప్రసాదించి చనిపోయింది. నా చేతులతో ఆమె శవాన్ని.. నేను ఇతర పనులతో బిజీగా ఉండటంతో ప్రసవమైన మరునాడు ఆమెను వెళ్లి చూద్దామనుకున్నాను. ఇంతలోనే ఆమె మరణించిందన్న కబురు అందింది. ఈ చేతులో ఆమె శవాన్ని మోశాను. తనను హత్తుకుని ఏడ్చాను. అయితే నా కుటుంబం నా కూతురికి తల్లి లేని లోటు తెలియనివ్వకుండా పెంచింది. 2003లో నేను రెండో పెళ్లి చేసుకున్నాను. తన ఊరికి వెళ్లినప్పుడు ఆమె వారి సాంప్రదాయం ప్రకారం తన ముఖం కనిపించకుండా ఓ వస్త్రాన్ని కప్పుకుని ఉంది. ఆమె చాలా తొందరగా మా యాసభాషను నేర్చుకుంది. నేను మా అమ్మతో ఎలా మాట్లాడతానో తను కూడా తనతో అలాగే మాట్లాడేది. నా రెండో భార్యకు 5 భాషలు వచ్చు నువ్వు చీర కట్టుకోవాలి లేదంటే ఇలాంటి డ్రెస్లే వేసుకోవాలని నా భార్యకు నేనెప్పుడూ ఆంక్షలు పెట్టేవాడిని కాదు. తనకు ఐదు భాషలు వచ్చు. నా తల్లిదండ్రులు, గురువు తర్వాత నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వ్యక్తి నా భార్యే! నా కూతుర్ని కూడా తన కూతురిలా కంటికి రెప్పలా చూసుకుంది. నా కూతురిప్పుడు పెళ్లి చేసుకుని లక్నోలో సెటిలైంది. తను సంతోషంగా ఉంటోందంటే అందుకు కారణం నా కుటుంబం, నా భార్యే! నేను చేసిందేమీ లేదు, వాళ్లవల్లే ఇదంతా సాధ్యమైంది' అని చెప్పుకొచ్చాడు రాజ్పాల్ యాదవ్. కాగా ఇతడు ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న 'సత్యప్రేమ్ కీ కథ', ఆయుష్మాన్ ఖురానా 'డ్రీమ్ గర్ల్ 2' చిత్రాల్లో నటిస్తున్నాడు. చదవండి: రాజకీయాల్లోకి కీర్తి సురేశ్? -
ట్రాన్స్జెండర్ అవతారమెత్తిన బాలీవుడ్ ప్రముఖ నటుడు
నటుడు, కమెడియన్, దర్శకుడు, రచయిత, నిర్మాత.. మల్టీటాలెంటెడ్ పర్సన్ రాజ్పాల్ యాదవ్. ఈ బాలీవుడ్ నటుడు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'అర్ధ్'. రుబీనా దిలైక్, హితేన్ తేజ్వానీ, కుల్భూషణ్ ఖర్బందా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో రాజ్పాల్ యాదవ్ ట్రాన్స్జెండర్గా కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఇలాంటి పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం మామూలు విషయం కాదని ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా హీరో అవుదామని ముంబైకి వచ్చిన ఓ వ్యక్తి కథే అర్ధ్ అని తెలుస్తోంది. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించిన మేకర్స్ విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. Presenting to you the first look of my next film ARDH! @Palash_Muchhal @RubiDilaik @tentej #ardhmovie pic.twitter.com/thzwnwCYR0— Rajpal Naurang Yadav (@rajpalofficial) February 23, 2022 -
ప్రముఖ హాస్య నటుడికి 6 నెలల జైలు శిక్ష
బాలీవుడ్ హస్యనటుడు రాజ్పాల్ యాదవ్కు ఢిల్లీ కార్కారదుమ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఎమ్జీ అగర్వాల్ దగ్గర నుంచి తీసుకున్న 5 కోట్ల రూపాయల అప్పును తిరిగి చెల్లించనందుకు గాను, కోర్టు ఈ శిక్ష విధించింది. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అమిత్ అరోరా ఈ నటుడికి 6 నెలల జైలు శిక్షతో పాటు, 11.2 కోట్ల రూపాయలు జరిమానాను, అతని భార్య రాధ యాదవ్కు 70 లక్షల జరిమానాను విధించారు. తరువాత రాజ్పాల్కు 50వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. 2010 లో రాజ్పాల్ తొలిసారి తానే నటిస్తూ దర్శకత్వం వహించబోయే సినిమా ‘ఆట పాట లపాట’ కోసం ఢిల్లీకి చెందిని మురళీ ప్రాజెక్ట్ కంపెనీ యజమాని ఎమ్జీ అగర్వాల్ దగ్గర నుంచి 5కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి 2011, డిసెంబర్ 3 నాటికి తిరిగి చెల్లిస్తానని మాట ఇచ్చి సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో ఆ వ్యాపారవేత్త ఈ రాజ్ పాల్ దంపతుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఢిల్లీ హై కోర్టు అప్పు చెల్లించడానికి ఈ దంపతులకి చాలా అవకాశాలు ఇచ్చింది, కానీ వారు అప్పు చెల్లించలేదు. దీంతో సోమవారం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. రాజ్పాల్ హిందీలో ‘భూల్భూలయ్యా’, ‘పార్టనర్’, ‘హంగామా’ వంటి హిందీ చిత్రాల్లోనే కాక తెలుగులో ‘కిక్ -2’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు -
ఇక ఆ హాస్యనటుడు జైలుకేనా?
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ హాస్యనటుడు రాజ్పాల్ యాదవ్ రుణ రికవరీ కేసులో దోషిగా తేలారు. చెక్ బౌన్స్ సహా, ఏడు కేసుల్లో రాజ్పాల్ యాదవ్, అతని భార్య రాధను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఢిల్లీలోని 'కర్ కర్ డూమా' కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ అరోరా ఈ తీర్పును వెలువరించారు. ఈ నెల 23న న్యాయస్థానం వీరికి శిక్షలను ఖరారు చేయనుంది. కాగా 2010లో ఒక హిందీ సినిమా నిర్మాణం కోసం రాజ్పాల్ , అతడి భార్య కలిసి ఢిల్లీకి చెందిన వ్యాపారి ఎం.జి.అగర్వాల్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే ఆ బాకీ తీర్చకపోవడంతో బాధితుడు రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ బాకీ మొత్తం ఇపుడు రూ. 8కోట్లకు చేరినట్టు అంచనా. గతంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాజ్పాల్ యాదవ్, అతని భార్యకు ఆరు రోజుల జైలు శిక్షను విధించింది. దీంతోపాటు ముంబై మలాడ్లోని రాజ్పాల్యాదవ్, అతడి భార్యకు చెందిన యాక్సిస్ బ్యాంక్ జాయింట్ అకౌంట్ను, వారి కంపెనీ అకౌంట్ను సైతం అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇకపోతే బాలీవుడ్ సినిమాలు భూల్ భులయ్యా, పార్టనర్, హంగమా వంటి పలు విజయవంతమైన చిత్రాలతోపాటు, తెలుగులో రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమాకు సీక్వల్ కిక్-2 లో కూడా ఆయన నటించారు. -
స్టార్ కమెడియన్ మళ్లీ జైలుకు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్కు న్యూఢిల్లీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి కోర్టు వారికి వివరాలు అందించని కారణంగా గతంలో 10 రోజుల జైలు శిక్షను విధించింది. అయితే కమెడియన్ 4 రోజుల జైలుశిక్ష తర్వాత ఆయన విడుదలయ్యారు. 10 రోజుల జైలు శిక్షను డిసెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అనుభవించిన రాజ్పాల్ యాదవ్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. జస్టిస్ బీడీ అహ్మద్, విభు బక్రూలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీలును విచారణకు స్వీకరించి శిక్షను నిలుపుదల చేసింది. కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీ విడిచి ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు వెళ్లరాదనే షరతును కూడా రద్దు చేసింది. రాజ్ పాల్ కేసు శుక్రవారం విచారణకు రాగా, మిగిలిన ఆరు రోజుల జైలు శిక్షను ఆయన అనుభవించాలని తీర్పులో పేర్కొంది. తీహార్ జైలులో జూలై 15 లోగా ఆయన లొంగిపోవాలని జస్టిస్ ఎస్ రవింద్ర భట్, జస్టిస్ దీపా శర్మ ధర్మాసనం సూచించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారి మురళి ప్రాజెక్ట్స్ యజమాని ఏంజీ అగర్వాల్ రాజ్పాల్ తన వద్ద 2010లో తీసుకున్న ఐదు కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేదని కోర్టులో కేసు దాఖలు చేశారు. సొమ్ము చెల్లింపునకు సంబంధించి దంపతులు ప్రకటించిన అంగీకారాన్ని పలుమార్లు ఉల్లంఘించారని 2013లో రాజ్ పాల్ కు పది రోజుల జైలు శిక్ష విధించింది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement