-
కమలం చూపు.. రామన్న వైపు
పీఎంకే అయినా కలసి వస్తుందా? అన్న ప్రయత్నాల్ని కమలనాథులు చేపట్టారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసుతో రహస్యంగా మంతనాల్లో కమలం పెద్దలు మునిగినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తమకు పెద్ద పీట వేసే రీతిలో ఈ మంతనాలు సాగుతుండడంతో నిర్ణయంపై పీఎంకే వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. సాక్షి, చెన్నై : డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయశక్తిగా అవతరించాలని కాంక్షించిన కమలంకు అడుగడుగునా అడ్డంకులే. లోక్ సభ ఎన్నికల్లో తరహాలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ చుట్టూ పార్టీలు తిరుగుతాయని ఆశించి తప్పులో కాలేశారు. విశ్వ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో , చివరకు ఒంటరిగా మిగలాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ తిరిగి, ప్రస్తుతం పీఎంకే వైపు దృష్టి పెట్టే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే , తమ సీఎం అభ్యర్థిగా అన్భుమణి పేరును పీఎంకే ప్రకటించి ఉండడంతో, వారితో మంతనాల్లో మునిగిన పక్షంలో ఎక్కడ విజయకాంత్ తమకు దూరం అవుతారోనన్న బెంగ తొలుత కమలనాథుల్లో ఉండేది. అయితే, తాను ఒంటరి అని విజయకాంత్ ప్రకటించి ఉండడంతో, ఇక ధైర్యంగా పీఎంకేతో మంతనాలకు సిద్ధ పడ్డట్టున్నారు. ఇది వరకే ఓ మారు పీఎంకేతో కమలం పెద్దలు ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టు, ఈ సమయంలో కొన్ని మెళికల్ని రాందాసు పెట్టినట్టుగా సంకేతాలు ఉన్నాయి. ఇందులో అన్భుమణిని సీఎం అభ్యర్థిగా అంగీకరించాలన్న పీఎంకే డిమాండ్ను ఇది వరకు విజయకాంత్ కోసం పక్కన పెట్టి కమలనాథులు, తాజాగా పరిశీలనకు నిర్ణయించినట్టు తెలిసింది. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కోవడం కన్నా, పీఎంకేను అక్కున చేర్చుకుని, ఆ పార్టీ కూటమి వెన్నంటి ఉన్న కొన్ని సామాజిక వర్గాల చిన్న పార్టీలను కలుపుకుంటే, తమ బలం పెరిగినట్టు అవుతుందన్న భావనలో కమలనాథులు ఉన్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ర్ట ఎన్నికల ఇన్చార్జ్ , కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మంతనాలకు సిద్ధ పడ్డట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాందాసు, అన్భుమణిలతో ఆయన ఫోన్లో మాట్లాడినట్టు చెబుతున్నాయి. పీఎంకే తమ ముందు ఉంచిన డిమాండ్లను పరిశీలిస్తున్నామని, త్వరలో చెన్నైలోగానీ, దిండివనంలోగానీ సంప్రదింపులకు తగ్గ కార్యచరణకు నిర్ణయించనట్టు పేర్కొంటున్నాయి. అయితే, బీజేపీ తమతో కలసి వచ్చే ప్రయత్నాల్ని వేగవంతం చేసిన దృష్ట్యా, తదుపరి అడుగుల దిశగా రాందాసు కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం. అందుకే బీజేపీ తమతో పొత్తు ప్రయత్నాలు చేసినట్టు మీడియా ముందు రాందాసు అంగీకరించి ఉండడం గమనార్హం. బీజేపీ తమతో పొత్తు ప్రయత్నాల్ని వేగవంతం చేయడంతో, అన్భుమణి సైతం సర్వం పెంచి ఉండడం విశేషం. డీఎంకే, అన్నాడీఎంకేలకు పతనం ఖాయం అని, పీఎంకే బలం పెరిగిందని, తమకు లభిస్తున్న ప్రజాదరణను చూసి తమ వైపు చూసే వాళ్లు పెరుగుతున్నారని మదురైలో వ్యాఖ్యానించడం గమనార్హం. -
జాబిత సిద్దం
సాక్షి, చెన్నై : ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల జాబితాను పీఎంకే సిద్ధం చేసింది. 120 స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసిన పీఎంకే అధినేత రాందాసు, ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే ప్రయత్నాల్లో పడ్డారు. ప్రతి ఎన్నికల్లోనూ కూటములను మారుస్తూ వచ్చిన పీఎంకే అధినేత రాందాసు, ఈ సారి గతంలో చేసిన తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదన్న నిర్ణయానికి వచ్చారు. కూటములను మారుస్తూ రావడంతో బలహీన పడడంతో, ఇక తమ బలాన్ని చాటుకునేందుకు ఒంటరి పయనానికి సిద్ధ పడ్డారు. అదే సమయంలో కొన్ని సామాజిక వర్గాల పార్టీల్ని కలుపుకుని ఓ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. తన కూటమి సీఎం అభ్యర్థిగా తనయుడు అన్భుమణి రాందాసును ప్రకటించేశారు. అన్ని పార్టీల కన్నా ముందుగా ఎన్నికల ప్రచారంలో పీఎంకే పరుగులు తీస్తోంది. ప్రజాకర్షణకు అన్భుమణి తీవ్రంగానే కుస్తీలు పడుతూ వస్తున్నారు. అయితే, లోక్సభ ఎన్నికల తరహాలో తమతో కలసి రావాలని బీజేపీ, పీఎంకే చుట్టూ తిరుగుతూ వస్తోంది. బీజేపీతో దోస్తీ కట్టడం కన్నా, తమతో చేతులు కలపాలని, అన్భుమణిని సీఎం అభ్యర్థిగా అంగీకరించాలన్న మెళికను రాందాసు పెట్టి ఉన్నారు. దీంతో కమలం వర్గాలు ఆలోచనలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఎవరు తమతో కలిసి వచ్చినా, రాకున్నా, సరే తమ పయనం ఆగదన్నట్టుగా అభ్యర్థులు జాబితాను రాందాసు సిద్ధం చేశారు. తమకు బలం ఉన్న అన్ని నియోజవకవర్గాల్లో బలమైన అభ్యర్థిని ఎంపిక చేసి పోటీకి రంగంలోకి దించనున్నారు. బీజేపీ నిర్ణయంతో తమకు పని లేదన్నట్టుగా ముందుగా 120 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసి ఉన్నారు. ఆశావహుల్ని వచ్చిన దరఖాస్తుల మేరకు కొందర్ని, పార్టీ కోసం శ్రమిస్తూ వస్తున్న నాయకుల్ని ఆయా సీట్లకు ఎంపిక చేశారు. ఈ జాబితా తదుపరి మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టనున్నారు. తొలి జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించేందుకు తగ్గ కసరత్తులతో రాందాసు ముందుకు సాగుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement