-
బల నిరూపణ కోరండి: నితీశ్
మాంఝీ విశ్వాస పరీక్షకు డిమాండ్ 130 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి భవన్లో పరేడ్ ప్రణబ్కు బిహార్ పరిస్థితిని వివరించిన జేడీయూ నేత న్యూఢిల్లీ: బిహార్ రాజకీయ పంచాయతీ రాష్ట్రపతి ముందుకు చేరింది. జేడీయూ నేత నితీశ్ కుమార్ బుధవారం రాష్ట్రపతి భవన్లో తనకు మద్దతిస్తున్న 130 మంది ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించారు. వీరిలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో వేచి ఉండగా, నితీశ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని బిహార్ పరిస్థితిని వివరించారు. జేడీయూ చీఫ్ శరద్ యాదవ్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీల అధినేతలు లాలూ ప్రసాద్, ములాయం సింగ్, కాంగ్రెస్ నేత సీపీ జోషీలను వెంటబెట్టుకుని నితీశ్ రాష్ర్టపతిని కలిశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. బిహార్ సీఎం జితన్ రాం మాంఝీని మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆయనను ఆదేశించాలని కోరారు. ‘గవర్నర్ బలనిరూపణకు ఆదేశంపై జాప్యం చేస్తున్నారు. పరిస్థితిని చెడగొడుతున్నారు. బేరసారాలను ప్రోత్సహిస్తున్నారు’ అని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనను పిలవాలని డిమాండ్ చేస్తూ వస్తున్న నితీశ్.. జేడీయూ ఎల్పీ నేతగా తన ఎన్నికపై పట్నా హైకోర్టు బుధవారం స్టే విధించడంతో వ్యూహం మార్చారు. ‘మాంఝీ బలాన్ని నిరూపించుకోవాలని కోరుకుంటూ ఉంటే గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ ఆయనను బలనిరూపణ చేసుకోవాలని అడగాలి. అయితే సీఎంకు అతితక్కువ గడువు ఇవ్వాలి’ అని అన్నారు. బిహార్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రపతి ఎలా స్పందించారని అడగ్గా, ఆయన తాము చెప్పినవన్నీ విన్నారని, విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారన్నారు. ‘మేం పట్నాలో 130 మంది ఎమ్మెల్యేలతో పరేడ్ చేశాం. వారు ఈ రోజూ నా పక్కన ఉన్నారు. మెజారిటీ ఎక్కడుందో స్పష్టంగా చూడొచ్చు. దీన్ని పట్టించుకోకుండా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం చూపకపోవడం అన్యాయం. ప్రజాస్వామ్యంతో ఆటలాడుకోవడం. అసెంబ్లీలో ఐదు పార్టీలకే ప్రాతినిధ్యం ఉంది. అందులో నాలుగు ఒకేతాటిపై ఉన్నాయి. బీజేపీ ఒంటరి. రాష్ట్ర పరిస్థితిని చెడగొట్టి, గవర్నర్ పాలన విధించాలన్న వారి కుట్రకు ఈ జాప్యం నిదర్శనం’ అన్నారు. నితీశ్ ఎన్నికపై హైకోర్టు స్టే: బిహార్ సీఎం పదవికి పోటీ పడుతున్న నితీశ్ కుమార్కు పట్నా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర జేడీయూ శాసనసభాపక్ష(ఎల్పీ) నేతగా ఆయన ఎన్నికపై హైకోర్టు స్టే బుధవారం విధించింది. నితీశ్ను జేడీయూ ఎల్పీ నేతగా గుర్తిస్తూ అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి జారీ చేసిన లేఖ సంబంధించి న్యాయపరమైన చిక్కులను పరిశీలించాలనుకుంటున్నామని కోర్టు పేర్కొంది. గవర్నర్ తీసుకోబోయే నిర్ణయానికి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇది అవసరమని చీఫ్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, జస్టిస్ వికాస్ జైన్లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. దీనిపై వచ్చే బుధవారం తిరిగి విచారణ జరుపుతామని తెలిపింది. శనివారం జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఏర్పాటు చేసిన పార్టీ ఎల్పీ భేటీలో సీఎం జితన్ రాం మాంఝీ స్థానంలో నితీశ్ను జేడీయూ ఎల్పీగా నేతగా ఎన్నుకోవడం తెలిసిందే. ఈ భేటీ చట్టవిరుద్ధమని మాంఝికి మద్దతిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాజేశ్వర్రాజ్ కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని కోర్టు విచారించి పై ఆదేశాలు జారీ చేసింది. 20న బల నిరూపణ పట్నా: బిహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఫిబ్రవరి 20న అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలంటూ బుధవారం రాత్రి ఆ రాష్ట్ర గవర్నరు కేసరి నాథ్ త్రిపాఠీ ఆదేశించారు. బిహార్ బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన రోజున గవర్నరు ప్రసంగం ముగిసిన వెంటనే మాంఝీ మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుందని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే, రహస్య బ్యాలెట్ నిర్వహించాలన్న మాంఝీ విజ్ఞప్తికి గవర్నరు అంగీకరించారా, లేదా అన్నది వెల్లడి కాలేదు. -
బిహార్లో ముదిరిన సంక్షోభం!
గద్దె దిగేందుకు సీఎం మాంఝీ ససేమిరా అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని వెల్లడి ప్రధాని మోదీతో భేటీ.. బీజేపీ మద్దతిస్తే ఆహ్వానిస్తానని వ్యాఖ్య నితీశ్ది అధికార దాహమని మండిపాటు తమకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న నితీశ్ వర్గం పట్నా/న్యూఢిల్లీ: బిహార్ రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. అటు సీఎం జితన్ రాం మాంఝీ మెట్టు దిగడం లేదు. ఇటు జేడీయూ నాయకత్వం పట్టు వీడడం లేదు. అసెంబ్లీలో బలం నిరూపించుకొని తీరుతానంటూ సవాలు విసిరిన మాంఝీ.. ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అంతకుముందు పట్నాలో జేడీయూ నేతలు రాజ్భవన్కు వెళ్లి నితీశ్కు 130 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. మరోవైపు అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి.. జేడీయూ శాసనసభాపక్ష(ఎల్పీ) కొత్త నేతగా నితీశ్కుమార్ను గుర్తించారు. మాంఝీని మాజీ ఎల్పీ నేతగా పేర్కొంటూ స్పీకర్ కార్యాలయం రాజ్భవన్కు లేఖను పంపింది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నితీశ్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీని కలవనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాంఝీకి బీజేపీ దన్నుగా నిలబడుతుందా? మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున నితిశ్ సీఎం పగ్గాలు చేపడతారా? లేదా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? లేక కొత్త సీఎం కోసం ఎన్నికలు జరుగుతాయా? సోమవారం పశ్చిమబెంగాల్ నుంచి గవర్నర్ త్రిపాఠీ బిహార్కు వచ్చిన తర్వాత ఈ కీలక ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది! కాగా, శనివారం తమ పదవులు వీడిన 20 మంది మంత్రుల(నితీశ్వర్గం) రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: నితీశ్ వర్గం జేడీయూ, దాని మిత్రపక్షాలకు కలిపి 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వీరంతా నితీశ్ వెంట నిలిచినందున ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జేడీయూ ప్రతినిధి బృందం రాజ్భవన్ అధికారులకు విన్నవించింది. ఈ మేరకు ఆదివారం జేడీయూ రాష్ట్ర చీఫ్ వశిష్ట నారాయణ్సింగ్ నేతృత్వంలో నాయకులు రాజ్భవన్ అధికారులకు నితీశ్కు మద్దతిస్తున్నవారి పేర్లతో కూడిన లేఖను అందజేశారు. సోమవారం ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా నితీశ్ స్వయంగా వెళ్లి గవర్నర్ను కోరతారని నారాయణ్సింగ్ తెలిపారు. జేడీయూ ఎల్పీ నేతగా మాంఝీని తప్పిస్తూ నితీశ్ను ఎన్నుకున్నట్లు పార్టీ అధినేత శరద్ యాదవ్ రాసిన లేఖను అధికారులకు అందజేశామన్నారు. నారాయణ్సింగ్ వెంట ఆర్జేడీ, కాంగ్రెస్ ఎల్పీ నేతలు సిద్ధిఖీ, సదానంద్ సింగ్, సీపీఐ నేత జితేంద్ర నారాయణ్, స్వతంత్ర ఎమ్మెల్యే దులాల్ ఉన్నారు. బెంగాల్ గవర్నర్గా ఉన్న త్రిపాఠీబిహార్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. సోమవారం ఉదయమే పట్నా చేరుకుంటానని చెప్పారు. మెజారిటీ నిరూపించుకుంటా: మాంఝీ అసెంబ్లీలో తాను బలం నిరూపించుకుంటానని మాంఝీ స్పష్టంచేశారు. అప్పటిదాకా రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. నితీశ్ అధికారదాహంతో తహతహలాడుతున్నారని మండిపడ్డారు. దళితుడిని అయినందుకే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో మోదీతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు బీజేపీ మద్దతిస్తే తప్పకుండా ఆహ్వానిస్తానన్నారు. మోదీతో రాజకీయ అంశాలపై మాట్లాడలేదని చెప్పారు. ‘‘జేడీయూ ఎల్పీ నేతగా నితీశ్ను ఎన్నుకోవడం చట్ట వ్యతిరేకం. బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలుపుతూ ఇప్పటికే గవర్నర్కు లేఖ రాశా. ఈనెల 19 లేదా 20న అసెంబ్లీలో బలం నిరూపించుకుంటా. నితీశ్కు తగినంత మంది మద్దతు ఉంటే ఎందుకు బాధపడుతున్నారు. ఒకవేళ వాళ్లు బలం నిరూపించుకుంటే గద్దె దిగి పోతా’’ అని చెప్పారు. పార్టీకి చెందిన 111 మంది ఎమ్మెల్యేలలో 97 మంది నితీశ్కు మద్దతిస్తున్నారు కదా, మీవైపు ఎందరున్నారని అడగ్గా.. సమయం వచ్చినప్పుడు తనవైపు ఎందరు నిలబడతారన్నదే కీలకమన్నారు. రబ్బరు స్టాంపుగా ఉండి నితీశ్కు అణిగిమణిగి ఉన్నంత వరకూ సంతోషంగా ఉన్నారని, తనలో ఆత్మగౌరవం మేల్కొని స్వతంత్రంగా ప్రవర్తించేసరికి పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ఆయన మంచివారే కానీ, పదవి లేకపోతే బతకలేరని విమర్శించారు. తనలాంటి దళితనేతలు నోరెత్తే సాహసం చేస్తే వారిని చంపడమో లేదా పక్కకు తప్పించడమో చేశారని, అందుకే ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయానన్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపడతానని, కొత్తగా 16-17 మందిని తీసుకుంటానని చెప్పారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమిస్తానని, వారిలో ఒకరు ముస్లిం ఉంటారని అన్నారు. మాంఝీకి మతి భ్రమించింది: శ్రావణ్ మాంఝీ వెంట 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అయినా మంత్రివర్గాన్ని విస్తరించి 17 మందికి చోటు కల్పిస్తానని చెప్పడం ఆయన మానసిక పరిస్థితిని తెలుపుతోందని జేడీయూ నేత, నితీశ్ మద్దతుదారు శ్రావణ్కుమార్ ఎద్దేవా చేశారు. పార్టీ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాంఝీ రాజీనామా చేయాలని సూచించారు. తమ పార్టీలో సం క్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి ఆరోపించగా.. నితీశ్ అధికార దాహం వల్లే వారి పార్టీ సంక్షోభంలో మునిగిపోయిందని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ మండిపడ్డారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
లారీ– బైక్ ఢీ
లోన్ ఇస్తామంటూ బురిడీ
డీవైఈఓ స్క్రీనింగ్ టెస్టుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
వ్యక్తిపై హత్యాయత్నం
హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
మారెమ్మవ్వ ఆలయంలో చోరీ
ఏపీఎస్ఈబీఈఏ భవన్ ప్రారంభం
26న కురువ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
● వికసించిన ‘మే’ పుష్పం
థైరాయిడ్తో ఆరోగ్యం అయోమయం
తప్పక చదవండి
- మెట్రోలో కొట్టుకున్న మహిళలు
- సెల్యూట్ కొట్టలేదని.. నెలరోజుల జీతం కోత
- SRH vs RR: మా ఓటమికి కారణం అదే.. బుమ్రా తర్వాత అతడే: సంజూ
- మంత్రి ఉత్తమ్ కుమార్పై నమ్మకముంది: బండి సంజయ్
- ఈవీఎంలకు ట్యాగ్లు?.. బీజేపీపై ట్యాంపరింగ్ ఆరోపణలు
- నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్ఫుల్
- ఛత్తీస్గఢ్ ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
- అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్
- AP: తొలి ఫలితం వచ్చేది అప్పుడే!
- Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Advertisement