-
నేను ఎవ్వరికి భయపడనని నీకు మట్టుకే తెలుసు: ఆర్జీవీ ట్వీట్ వైరల్!
అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం వ్యూహం. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వ్యూహం చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. అయితే ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదని వెల్లడించారు. (ఇది చదవండి: నాకున్న జబ్బు ఇదే, ఎక్కువ రోజులు బతకనని చెప్పారు: నటి) ఇప్పటికే ఆర్జీవీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 'అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఎన్ని వ్యూహాలు పన్నినా మా ‘వ్యూహం’ను ఆపలేరు అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప సినిమాలోని ఓ డైలాగ్తో ఆర్జీవీ ట్వీట్ చేశారు. అందులో అల్లు అర్జున్, సునీల్ మధ్య జరిగిన సీన్ మీమ్ను షేర్ చేశారు. అందులో పుష్ప క్యారెక్టర్లో ఆర్జీవీని చూపించారు. ఆర్జీవీ షేర్ చేసిన ట్వీట్లో.. 'శీనప్ప.. నేను ఎవ్వడికి భయపడనని నీకు మట్టుకే తెలుసు. కానీ మార్కెట్ మొత్తం తెలియాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? అన్నో.. ఇది ఒకటి తలలో పెట్టుకో ఎప్పటికీ.. నేను నా వ్యూహంతో నీ కెరీర్ను గెలకడానికి రాలే. నా వ్యూహంతో నీ వ్యూహం బయటపెట్టడానికి వచ్చినా.. తగ్గేదేలే' అన్న డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. త్వరలోనే వ్యూహం మూవీ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వెల్లడించారు. (ఇది చదవండి: దయా వెబ్ సిరీస్ నటి.. మరి ఇంత బోల్డ్గా ఉందేంటి బ్రో!) pic.twitter.com/RehuN6PGPk — Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2023 -
ప్రభాస్ కల్కిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్.. ఇప్పటికే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఇన్ని రోజులు ప్రాజెక్ట్-కె పేరుతో నిర్మించిన ఈ మూవీ టైటిల్ను ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే బాలీవుడ్, కోలీవుడ్ నుంచి అగ్రతారలు సైతం ఈ మూవీలో కీలక రోల్స్ చేస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్ నటించినున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారనేది లేటెస్ట్ టాక్. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: అమ్మాయిగా మారేందుకు సర్జరీ చేయించుకున్న జబర్దస్త్ సాయి?) ప్రభాస్ కల్కి చిత్రంలో టాలీవుడ్ డైరెక్టర్స్ రాంగోపాల్ వర్మ గెస్ట్ రోల్ పోషిస్తున్నరంటూ వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి సైతం నటిస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా ఆర్జీవీ పేరు తెరపైకి రావడం మరింత ఆసక్తిగా మారింది. అంతే కాకుండా ఇప్పటికే వీరిద్దరు తమ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరీ దీనిపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఏదేమైనా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో వైరలవుతోంది. కాగా.. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపిక పదుకొణె నటిస్తోంది. (ఇది చదవండి: 'నేను మీకు వీరాభిమానిని'.. జ్యోతిక పోస్ట్ వైరల్!) #Prabhas & RGV Will be Seen Together in #Kalki2898AD . RGV Has Completed his Shooting Part in @Kalki2898AD pic.twitter.com/ujUlw9OqdP — Team PraBOSS (@Team_PraBoss) September 6, 2023 Rgv & Prabhas will be seen together in #ProjectK https://t.co/suP5MxM1Bj pic.twitter.com/PX7SZIKB4Q — Freaking REBELS (@FreakingRebels) September 6, 2023 -
ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది: రామ్గోపాల్ వర్మ
‘‘సగిలేటి కథ’ సినిమా ట్రైలర్ నాకు చాలా ఎగ్జయిటింగ్గా అనిపించింది. ‘ఏదో జరిగే..’ పాటని అందంగా తీశారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ. రవి మహాదాస్యం, విషికా లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. నటుడు నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించారు. జశ్వంత్ పసుపులేటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఏదో జరిగే..’ వీడియో సాంగ్ని రామ్గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. ‘‘నేను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి వర్మగారే’’ అన్నారు దేవీప్రసాద్ బలివాడ. ‘‘రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్ సుద్మూన్. ‘‘ఏదో జరిగే..’ పాట అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అశోక్ మిట్టపల్లి. సి స్పేస్ కో ఫౌండర్ పవన్ మాట్లాడారు. -
నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ.. సైడ్ ఆర్టిస్ట్గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్!
సినిమా ఇండస్ట్రీలో సొంతంగా ఎదగడం అనుకున్నంత సులభం కాదు. ఓవర్నైట్ స్టార్ గుర్తింపు వచ్చినా గ్లామర్ ఫీల్డ్లో నిలదొక్కుకోవటం అంతా ఆషామాషీ కాదు. కానీ ఏకంగా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ డైరెక్టర్గా ఎదగడమంటే మాటలు కాదు. అంతకుమించిన సక్సెస్ ఉండదు కూడా. అలాంటి అసాధ్యం కానీ విషయాన్ని చేసి చూపించాడు మన టాలీవుడ్ ఆర్టిస్ట్. అతనెవరో కాదు.. పోకిరీ మూవీతో చరిత్ర సృష్టించిన పూరి జగన్నాథ్. (ఇది చదవండి: మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్) అప్పట్లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించిగా.. ఆయన పక్కనే పూరి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా నటించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆర్జీవీ ట్విటర్లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్జీవీ ట్వీట్లో రాస్తూ..' ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా శివ సెట్స్లో సూపర్ స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ . అతని విజయం నిజంగా స్ఫూర్తిదాయకం.' అంటూ శివ సినిమాలోని ఫోటోను షేర్ చేశారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. బద్రి నుంచి లైగర్ దాకా ఆయన ప్రభంజనం కొనసాగింది. తెలుగులో ఇప్పటివరకు ఆయన 33 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు, పోకిరి, చిరుత, గోలీమార్, నేను నా రాక్షసి, బిజినెస్ మేన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించారు. కాగా.. గతేడాది విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమాతో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు సైతం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ముంబయిలో ఉంటున్నారు. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) A would be Super Smart director #PuriJagan on the sets of SHIVA as a background artiste ..His is a truly inspirational RISE ! pic.twitter.com/BPJ6rOfgf1 — Ram Gopal Varma (@RGVzoomin) July 13, 2023 -
కుక్కల దాడిపై స్పందించిన వర్మ.. జీహెచ్ఎంసీ మేయర్పై సెటైర్లు!
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ఏ కామెంట్ చేసిన సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారిపోతుంది. అయితే, తాజాగా తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తనదైన స్టైల్లో వర్మ ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల దాడులు పెరుగుతున్న కారణంగా మేయర్ విజయలక్ష్మి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో భాగంగా మేయర్.. కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై వర్మ స్పందించారు. ఈ సందర్బంగా వర్మ.. కేటీఆర్కు ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సార్.. ఒక్క దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్ను పంపండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని ప్రశ్నించారు. Hey @GadwalvijayaTRS why don’t u resign your post as a mayor and take all the Dog goons into your home and feed them yourself , so that they won’t eat our children ? pic.twitter.com/2dfa426hRv — Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023 అయితే, అంతకుముందు మేయర్.. ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కూడా వర్మ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించడమేంటని మండిపడ్డారు. అంతగా ఉంటే.. మేయర్ గారు కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకువెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా అని కామెంట్ చేశారు. కుక్కలన్నీ మేయర్ ఇంట్లో ఉంటేనే పిల్లలకు రక్షణ ఉంటుందని సెటైర్ వేశారు. అలాగే, కుక్కల విషయంలో సమీక్షలో భాగంగా ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. Hey @GadwalvijayaTRS I WANT TO BITE @KTRBRS @hydcitypolice pic.twitter.com/bXTFqsxzzH — Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement