-
చేయి చేయి కలిపి...
బస్తీలో సీసీ కెమెరాల ఏర్పాటు.. ఆదర్శంగా నిలిచిన రాంగోపాల్పేట్ జే లైన్ వాసులు రాంగోపాల్పేట: రాంగోపాల్పేటలోని జే లైన్ ... కాలనీ కంటే చిన్నది.. బస్తీకంటే పెద్దది. 84 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. చిన్న చిన్న వృత్తులు, చిరు వ్యాపారాలు చేసుకొనే వీరంతా ముందు చూపుతో ఆలోచించారు. పోలీసులిచ్చిన చిన్న సలహాతో తమ బస్తీ భద్రత కోసం నడుంబిగించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా నగర పోలీస్ కమిషనర్ ప్రారంభించిన సీసీ కెమెరాల ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చారు. తమ సొంత ఖర్చుతో బస్తీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని నగరంలో ఉండే ఎంతో మంది సంపన్నులు, వ్యాపారులకు ఆదర్శంగా నిలిచారు. అందరూ సాధారణ ప్రజలే... ఈ బస్తీలో ఉండే వారంతా రెక్కాడితేగాని డొక్కాడని వారే. దినసరి కూలీలు, ఫుట్పాత్వ్యాపారులు, కులవృత్తులు చేసు కుంటున్నవారు. 2015 ఆగస్టు 15న ఇక్కడ జెండా ఎగురవేసేందుకు వచ్చిన రాంగోపాల్పేట ఇన్స్పెక్టర్ మహ్మద్ వహీదుద్దీన్ సీసీ కెమెరాల గురించి ఇచ్చిన చిన్నపాటి సందేశం వారిని ఆకట్టుకుంది. గతంలో తమ బస్తీలో జరిగిన చోరీలు, స్నాచింగ్లు, పోకిరీలతో మహిళలు పడే ఇబ్బందులు గుర్తుకు వచ్చాయి. వెంటనే అందరూ కలిసి రాంగోపాల్పేట రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. తమ బస్తీలో సీసీ కెమెరాల ఆవశ్యకతపై చర్చించుకున్నారు. ఒక్కో ఇంటికి రూ.2 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మొత్తం రూ.1.45 లక్షలు పోగైంది. ఈ డబ్బుతో బస్తీలో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మంగళవారం సెంట్రల్జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి, అదనపు డీసీపీ రామ్మోహన్, స్థానిక ఇన్స్పెక్టర్ ఎండీ వహీదుద్దీన్ల సమక్షంలో వాటిని ప్రారంభించుకున్నారు. నాకు ఎంతో సంతోషం కలిగించిన సందర్భం... నేను సెంట్రల్జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మనసుకు ఎంతో సంతోషం కలిగించిన సందర్భం ఇది. జోన్లో 425 సీసీ కెమెరాల ఏర్పాటు ఒకటైతే, రాంగోపాల్పేటలో ఏర్పాటు చేసింది మరోఎత్తు. కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రాజెక్టు సక్సెస్ స్టోరీలో ఇదే కీలకం. కోటీశ్వరులు ఉన్న కాలనీల్లో కూడా సీసీ కెమెరాలు అనగానే వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉండే పేదలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. త్వరలోనే ఇక్కడికి పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డిని తీసుకొచ్చి చూపిస్తా. ఈ బస్తీ వాసులకు అవసరమైన అన్ని సహకారాలు అందిస్తాం. - కమలాసన్రెడ్డి, సెంట్రల్జోన్ డీసీపీ మా ఇంట్లో చోరీ జరగడంతో... గతంలో మూడుసార్లు మా ఇంట్లో దొంగతనం జరిగింది. రెండుసార్లు ఐరన్ బాక్స్లతో పాటు దుస్తులు ఎత్తుకెళ్లారు. అప్పుడు చాలా బాధకలిగింది. సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి మా బస్తీ అసోసియేషన్ వాళ్లు చెప్పగా మొదట మేమే ముందుకొచ్చాం. ఇది మాకు కొంత ఆర్థిక భారమైనప్పటికీ భవిష్యత్లో కెమెరాల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని వెంటనే డబ్బు సమకూర్చి అందించాం. - భాగ్యలక్ష్మి ,కాలనీవాసి నేరాలు తగ్గుతాయి సీసీ కెమెరాలు ఉన్న కాలనీల్లో నేరాలు బాగా తగ్గాయని తెలి సింది. సీసీ కెమెరాల వల్ల పోలీసులకు దొరికిపోతామనే భయంతో నేరగాళ్లు నేరాలు చేసేందుకు రావడంలేదు. సీసీ కెమెరాలు మా భద్రతకు ఎంతో దోహదం చేస్తాయని పోలీసులు చెప్పడంతో వెంటనే కెమెరాల ఏర్పాటుకు డబ్బు ఇచ్చాం. - సత్యనారాయణ, ఫుట్పాత్ వ్యాపారి ఇదే స్ఫూర్తితో అభివృద్ధి సీసీ కెమెరాల ప్రాజెక్టు కోసం ఐకమత్యంతో అందరూ ముందుకొచ్చారు. ఇదే స్ఫూర్తితో మా బస్తీని అన్నింటిలోనూ అభివృద్ధి చేసుకుంటాం. మంచినీరు, డ్రైనేజీ, వీధి దీపాలు ఇలా ఏ సమస్య వచ్చినా ముందుకు వెళ్లి పరిష్కరించుకుంటాం. -సి. శంకర్లాల్, అసోసియేషన్ అధ్యక్షుడు -
బడా బిల్డర్నంటూ బిల్డప్
రాంగోపాల్పేట,న్యూస్లైన్: అందమైన దుస్తుల్లో వస్తాడు.. బడా బిల్డర్నంటూ బిల్డప్ ఇస్తాడు..లక్షల్లో స్టీల్ (ఇనుపచువ్వలు) కొనుగోలు చేస్తాడు..ఇలా రెండుమూడుసార్లు నమ్మకం కలిగించి.. కోట్లు అప్పు చేస్తాడు..చెక్కులిచ్చి తప్పించుక తిరుగుతుంటాడు.. చివరకు గట్టిగా నిలదీస్తే బెదిరి స్తాడు..సుమారు నాలుగైదు దుకాణాల్లో స్టీల్ కొనుగోలు చేసి రూ.13 కోట్ల మేర ముంచిన ఘరానా మోసగాడిని మహంకాళి పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాం డ్కు తరలించారు. సీఐ సత్యనారాయణ వివరాల ప్రకారం..అడ్డగుట్ట తుకారాంగేటుకు చెందిన మురారిశెట్టి లక్ష్మణ్గుప్తా (36) రాణిగంజ్లోని గంజి కాంప్లెక్స్లో అలంకృత స్టీల్ట్రేడర్స్ పేరుతో స్టీల్ సరఫరా చేసే కార్యాలయాన్ని ఏర్పాటుచేశాడు. ఆఫీసును అందంగా ముస్తాబు చేసి బడా బిల్డర్నని బిల్డప్ ఇచ్చుకుంటాడు. పథకం ప్రకారం తాను ఎంచుకున్న స్టీల్ డీలర్ దగ్గరకు వెళ్లి ‘తాను బడా బిల్డర్ను.. పెద్దపెద్ద భవనాలకు స్టీల్ను సరఫరా చేస్తానంటూ’ పరిచయం చేసుకుంటాడు. ఇలా ఒకేసారి పది నుంచి ఇరవై లక్షల రూపాయల స్టీల్ కొనుగోలు చేసి అంతకంటే ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లిస్తాడు. మిగతా సొమ్ము మీ దగ్గరే ఉంచుకోండని చెబుతాడు. ఇలా ఒకటి రెండుమార్లు కొనుగోలు చేసి సదరు వ్యాపారికి నమ్మకం కలిగిస్తాడు. ఇక ఆ తర్వాత డబ్బు అందలేదంటూ కోట్లలో స్టీల్ను అప్పుగా తీసుకొని.. అసలు ధరకంటే తక్కువ ధరకే గుట్టుగా వేరేవారికి విక్రయిస్తాడు. ఇలా రాణిగంజ్లోని దుర్గా ఎంటర్ప్రైజెస్, ప్రొద్దుటూరు స్టీల్స్తోపాటు మరో డీలర్ దగ్గర స్టీల్ కొనుగోలు చేసి సుమారు రూ.3 కోట్లమే బాకీ పడ్డాడు. దీంతోపాటు నేరెడ్మెట్, బాలానగర్, రాజేంద్రనగర్ తదితర పోలీస్స్టేషన్ల పరిధుల్లో పలువురు డీలర్లను ఇదే తరహాలో సుమారు రూ.10 కోట్ల మేర మోసం చేశాడు. లక్ష్మణ్గుప్త ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతోపాటు డీలర్లకు దొరకకుండా తప్పించుక తిరుగుతాడు. ఎవరికైనా దొరికి ప్రశ్నిస్తే వారినే బెదిరిస్తూ బ్లాక్మెయిలింగ్కు పాల్పడటం ఇతని నైజం. మహంకాళి పోలీస్స్టేషన్ పరిధిలో ఆయనపై మూడు కేసులు నమోదు కాగా.. పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టించి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈమేరకు లక్ష్మణ్గుప్తను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్చరణ్ (ఫోటోలు)
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్!?
ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తింది: సజ్జల
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement