-
షియోమీ సంచలన ఆఫర్.. ప్చ్!
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ ప్రకటించిన రూపాయి సేల్ వినియోగదారులను ఉసూరు మనిపించింది. రూపాయికే స్మార్ట్ ఫోన్ దక్కించుకోవాలని ప్రయత్నించిన యూజర్లుకు నిరాశే ఎదురైంది. దీపావళి అమ్మకాల్లో భాగంగా రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ను రూపాయికే విక్రయిస్తామని షియోమీ ప్రకటించడంతో కోట్లాది మంది ఎంఐ వెబ్ సైట్ లో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే ఫ్లాష్ అమ్మకాల కోసం ముందుగానే ఎంఐ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి వేచి చూశారు. ఫ్లాష్ అమ్మకాలు మొదలయి సెకన్ సమయం అయినా గడవకుండానే రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్లు అమ్ముపోయాయన్న సందేశం చూసి వినియోగదారులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే కేవలం 30 ఫోన్లు మాత్రమే రూపాయికి విక్రయిస్తామని షియోమీ ముందుగానే ప్రకటించింది. ఫోన్లు తక్కువ, పోటీ ఎక్కువ కారణంగానే అతి తక్కువ సమయంలో అమ్మకాలు పూర్తయినట్టు భావిస్తున్నారు. దీపావళి అమ్మకాలకు ప్రచారం కోసమే షియోమీ రూపాయి ఆఫర్ ప్రకటించిందని వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. అయితే షియోమీ ప్రకటించినట్టుగా 30 మందికైనా ఫోన్లు దక్కాయో, లేదో చూడాలి. కాగా, రెడ్ మీ 3ఎస్(రూ.6,499) , రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ ( రూ.8,499) స్మార్ట్ ఫోన్లను ఈ రోజు లాంచ్ చేసిన వెంటనే ఈరోజుకు అమ్మకాలు పూర్తయినట్టు ఎంఐ వెబ్ సైట్ లో కనబడింది. ఈ రెండు ఫోన్లను దక్కించుకునేందుకు రేపు, ఎల్లుండి కూడా అవకాశముంది. -
రూపాయికే షియామీ స్మార్ట్ ఫోన్!
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ దీపావళి అమ్మకాల్లో భాగంగా వినియోగదారులకు సర్ ప్రైజింగ్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూపాయికే రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీపావళి సందర్భంగా షియోమీ అక్టోబర్ 17-19 మధ్య ఫ్లాష్ అమ్మకాలు నిర్వహించనుంది. ఇందుల్లో భాగంగా రెడ్ మీ 3ఎస్ స్మార్ట్ ఫోన్ ను రూపాయికే విక్రయించనుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫ్లాష్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. అయితే ముందుగా ఎంఐ డాట్ కామ్, ఎంఐ స్టోర్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి. రూపాయికి 30 రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్లు అమ్మకానికి ఉంచుతామని షియోమీ వెల్లడించింది. రూపాయికి ఫోన్ కోలుగోలు చేసిన తర్వాత రెండు గంటల్లో సొమ్ము చెల్లించాలని, లేకుంట్ ఆర్డర్ రద్దవుతుందని షియోమీ తెలిపింది. రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ ఫీచర్లు 5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే మెటల్ బాడీ 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ మెమరీ 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ 13 ఎంపీ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- షుగర్ పేషెంట్స్ పళ్లు తినకూడదా? తింటే ఏవి తినాలి?
- పవన్ కల్యాణ్కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
Advertisement