-
తాడిపత్రి ఆస్పత్రిలో ఉద్రిక్తత
తాడిపత్రి : తమ పిల్లలను ఎవరో హత్య చేసి, చెరువులో పడేశారంటూ.. వారెవరో గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ పవన్, బాలాజీ బంధువులు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యల్లనూరు మండలం చిలమకూరు సమీపంలోని చిత్రావతి నదిలో విద్యార్థులు పవన్ (8), బాలజీలు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు, సమీప బంధువులు తమ పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఎవరో హత్య చేసి నదిలోని నీటిగుంటలో పడేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు పోస్టుమార్టం నిర్వహించేందుకు వీలులేదని ఆందోళనకు దిగారు. పోలీసులు కొందరిని కాపాండేందుకు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అర్బన్, రూరల్ సీఐలు సురేందర్రెడ్డి, సురేంద్రనాథ్రెడ్డిలు ఆస్పత్రికి చేరుకుని విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. -
ఆస్పత్రిలో గర్భిణి మృతి: బంధువుల ఆందోళన
సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్): వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణి మృతిచెందింది. ఈ సంఘటన ముషీరాబాద్లో జరిగింది. స్థానిక సాగర్లాల్ ఆసుపత్రిలో రేవతి(26) ప్రసవం కోసం చేరింది. సకాలం లో వైద్యం అందించకపోవడంతో గర్భిణితోపాటు శిశువు కూడా మృతిచెందింది. కోపోద్రిక్తులైన ఆమె బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. -
వేధింపులే చంపేశాయి!
ఎస్ఐ ఆత్మహత్యతో గజ్వేల్లో ఉద్రిక్తత బంధువుల ఆందోళన.. ప్రతిపక్షాల సంఘీభావం రహదారిపై రాస్తారోకో.. స్తంభించిన రాకపోకలు సీఎం కేసీఆర్ ఆదేశంతో గజ్వేల్కు చేరుకున్న మెదక్ ఎంపీ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్ఐ ఘటనపై మెదక్ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ: ఎస్పీ గజ్వేల్/గజ్వేల్ రూరల్: గజ్వేల్ పట్టణం ఆందోళనలతో అట్టుడికిపోయింది. కొండపాక మండలం కుకునూర్పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఉదంతం గజ్వేల్లో ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్ నెలకొంది. ఎస్ఐ కుటుంబ సభ్యులు, బంధువులు, గజ్వేల్, కొండపాక మండలాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గజ్వేల్ ఆసుపత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రోడ్లన్నీ స్తంభించిపోయాయి. పోస్టుమార్టం సందర్భంగా శవాన్ని ఇక్కడి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఎస్ఐ బంధువులు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, దీనికి కారకులైన డీఎస్పీ, సీఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పట్టుబట్టారు. ఆసుపత్రి మార్చురీ సమీపంలో బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆసుపత్రి ముందు భాగంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చి గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డుపై ధర్నాకు దిగారు. టీడీపీ నేత బూర్గుపల్లి ప్రతాప్రెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతు పలకడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. టీడీపీ నాయకులు బొల్లారం ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్, చాడ రామరాజు పంతులు, లక్ష్మారెడ్డి, భానుప్రకాష్ సైతం సంఘీభావం తెలిపారు. గజ్వేల్, తూప్రాన్ సీఐలు సతీష్, రమేష్బాబులు ఆందోళనకారులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఆందోళనకారులు చాలాసేపు వారితో వాగ్వాదానికి దిగారు. స్వల్ప తోపులాటలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నేత ప్రతాప్రెడ్డిని అక్కడి నుంచి తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా... ‘మీ కాళ్లు మొక్కుతం... ఎస్ఐ కుటుంబానికి న్యాయం జరగడానికి ఉద్యమం చేస్తున్నాం... సహకరించాలి’ అంటూ గజ్వేల్ సీఐ సతీష్తో వేడుకున్నారు. ఆందోళన కారణంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రహదారి గంటల తరబడి రాకపోకలు స్తంభించిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, అదనపు ఎస్పీ వెంకన్న సైతం ఇక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతికి దారితీసిన పరిస్థితులు, సూసైడ్నోట్ తదితర అంశాలపై విచారణ చేపట్టే బాధ్యతలు మెదక్ డీఎస్పీ నాగరాజుకు అప్పగించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చిన ఎంపీ, అధికారులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఈ ఘటన వివరాలు తెలుసుకునేందుకు గజ్వేల్కు వచ్చారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, కొండపాక జెడ్పీటీసీ సభ్యులు చిట్టి మాధురి, ఎంపీపీ అనంతుల పద్మానరేందర్ తదితరులు కూడా ఇక్కడికి వచ్చి మృతుని కుటుంబీకులను ఓదార్చారు. దేవుడు అన్యాయం చేశాడు రామకృష్ణారెడ్డి ఆత్మహత్యతో అతని భార్య ధనలక్ష్మి శోకసంద్రంలో మునిగిపోయారు. తనను పుట్టింటికి పంపించిన తర్వాత తన భర్త ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడతారని అనుకోలేదంటూ రోదించిన తీరును కలచివేసింది. భర్త మరణవార్త తెలియగానే మునుగోడు నుంచి హుటాహుటిన ఆమె తరలివచ్చారు. తనకు దేవుడు అన్యాయం చేశాడంటూ కన్నీరుమున్నీరయ్యారు. వీరి పెద్ద కుమారుడు శ్రీవర్ధన్రెడ్డి శామీర్పేటలోని శాంతినికేతన్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి, రెండో కుమారుడు ఆశీష్రెడ్డి కొండపాకలోని శ్రీవేద ఇంటర్నేషనల్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. మరోవైపు మృతుడి తల్లిదండ్రులు అంజిరెడ్డి, లక్ష్మమ్మలు రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. విచారణ చేపడతాం.. కుకునూర్పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం. ఈ ఘటనపై స్పందించిన సీఎం స్వయంగా నన్ను ఇక్కడికి పంపారు. వివరాలు తెలుసుకోవడానికే వచ్చాను. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ జరుపుతుంది. బాధ్యులపై కఠిన చర్యలుంటాయి. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. - కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎంపీ సర్కార్ అవినీతికి నిదర్శనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. అందువల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పోలీసు ఉన్నతాధికారుల వేధింపులే కారణం. బాధ్యులను సస్పెండ్ చేయాలి. వారిని అరెస్టు చేసి కేసు విచారణ జరపాలి. - బూర్గుపల్లి ప్రతాప్రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు తొగుటలో కలకలం తొగుట: కుకునూర్పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనలో తొగుట సీఐ రామాంజనేయులు పేరు రావడం మండలంలో కలకలం సృష్టించింది. అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఎస్ఐ సూసైడ్నోట్ రాయడం.. అందులో పలువురు పోలీసు అధికారులతోపాటు తొగుట సీఐ రామాంజనేయులు పేరు ఉండడంతో బుధవారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. రామకృష్ణారెడ్డి గతంలో సుమారు ఏడు నెలలపాటు తొగుట ఎస్ఐగా పనిచేశారు. ఇక్కడ విధులు నిర్వహించిన రోజుల్లో ఆయన ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. క్రమశిక్షణ గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. -
బాలింత మృతితో ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఓ బాలింత మృతి చెందిన సంఘటన శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బాలింత మృతితో ఆమె బంధువులు కోపం కట్టలు తెంచుకుంది. దాంతో ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బంధువు మృతి చెందిందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆందోళనకారులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
అద్దంకిలో తుఫ్యాన్
స్ట్రాంగ్ రూంలకు పటిష్ట భద్రత కల్పించాలి
నేడు మంగళగిరికి సీఎం వైఎస్ జగన్
డీఎంహెచ్ఓ ఆస్పత్రుల తనిఖీ
పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం
అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషిచేయాలి
సాయి సుదర్శన్, గిల్ సెంచరీల మోత.. ఆల్ టైమ్ రికార్డు సమం
గురజాల ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి
ప్రజల నమ్మకం జగనన్న
బెస్ట్ రెసిడెన్షియల్ కాలనీగా తీర్చిదిద్దుతాం
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement