-
గర్భగుడికి నడిచొచ్చిన నంది
మాతృత్వం ఒక వరం. అయితే, కొన్ని కారణాంతరాల వల్ల సహజంగా తల్లి అయ్యే భాగ్యానికి నోచుకో (లే)నివారు, సహజసిద్ధంగా తండ్రి కాలేనివారు సరోగసీ అంటే అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందుతున్నారు. చట్టాలు కూడా ఇందుకు అనుమతిస్తున్నాయి. సరోగసీ పద్ధతిలో పేద మహిళలు తమ గర్భాలను అద్దెకిచ్చి, పెద్దింటి వారి బిడ్డలను నవమాసాలు మోసి, కని, కూలి తీసుకుని బిడ్డలను వారి చేతిలో పెడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే– అద్దె గర్భం అయినా, అసలు గర్భమైనా అమ్మతనంలో తేడా ఏముటుంది? అసలు అమ్మ అయినా, నొప్పులు పడాల్సిందే, అద్దె తల్లి కూడా ఆ భారాన్ని మోయాల్సిందే, అన్ని నొప్పులూ పడాల్సిందే. ఆ తర్వాత బాలింతరాలి బాధలు అనుభవించవలసిందే. మరి వీరిని వేరు చేస్తున్నదేమిటి? ఉన్నవారు, లేని వారు అనే తేడానే కదా! ఆ ఒక్క తేడా వల్లే తన కడుపులోంచి భూమి మీద పడిన పిల్లల పట్ల మమతానురాగాలు పెంచుకోడానికి వీల్లేదా? ఇది ఏమైనా న్యాయమా? సరోగసీ తల్లికి తన కడుపు చించుకుని పుట్టిన బిడ్డల పట్ల కనీసపు హక్కులు ఉండాలనుకోవడంలో అభ్యంతరం ఎందుకు? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు. ఇలాంటి ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ... అవసరం అయితే చట్టంలో మార్పులు తెచ్చి అయినా సరే, తల్లితనానికి విలువ ఇవ్వాలని చెబుతూ ప్రముఖ జర్నలిస్టు, కథా, నవలా రచయిత డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు రాసిన నాటికే ‘గర్భగుడి’. అమ్మతనంలోని కమ్మదనాన్ని అద్భుతంగా వివరిస్తూనే, ఆ కమ్మదనానికి ఖరీదు కట్టడం సమంజసం కాదని, అసలు తల్లిదండ్రులు కిరాయి చెల్లించి, బిడ్డను సొంతం చేసుకున్న తర్వాత తన కడుపు చించుకుని పుట్టిన ఆ పసికందును కనీసం కంటినిండా చూసుకోరాదని, ఒడినిండా తీసుకోరాదని, ఆ బిడ్డకు చనుబాలివ్వరాదనీ అనడం సహేతుకం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులోని చట్టబద్ధతపై ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో చూసిన ఒక నిజ జీవిత సంఘటన చింతకిందిని చాన్నాళ్లు ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదు. దాంతో తన మనసులో చోటు చేసుకున్న భావ సంఘర్షణలకు ఓ రూపం ఇచ్చారు. గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన ఆవేదన ఆధారంగా రాసిన చక్కటి ఇతివృత్తంతో కూడిన ఈ నాటికను కళాకారులు ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. ఎంతోమంది కంట తడి పెట్టించి ఎన్నో ప్రదర్శనలను అందుకున్నది ఈ నాటిక. నాటక ప్రియులు, విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతేనా...దాంతోబాటు 2017 రాష్ట్రప్రభుత్వ నాటకోత్సవాలలో ప్రథమ ఉత్తమ నాటికగా నిలిచిందీ నాటిక. ఆ నాటిక రచయితగా నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు చింతకింది.విశాఖపట్నం జిల్లా చోడవరంకు చెందిన చింతకింది చక్కటి ఉత్తరాంధ్ర మాండలికంలో సొగసైన రచనలు చేయడంలో అందె వేసిన చేయి. మానవీయ కోణంతో కూడిన వార్తలు రాయడంలో మేటి. ‘అదిగో ద్వారక’, ‘వికర్ణ’ వంటి పౌరాణిక నవలలు, ‘దాలప్ప తీర్థం’, ‘కాన్పుల దిబ్బ’, ‘కప్పస్తంభం’ కథాసంపుటాలతో అశేష పాఠకాభిమానాన్ని సంపాదించుకున్న చింతకింది, ఇప్పుడు ఈ నాటికతో నంది పురస్కారాన్ని సాధించారు. – డి.వి.ఆర్. -
విదేశీయులకు, ఎన్ఆర్ఐలకు భారత్లో అద్దెగర్భం దొరకదు!
న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) ద్వారా బిడ్డను కనేవారికి భారత్ కేంద్రస్థానంగా మారుతోందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ విషయంలో కఠిన చట్టాన్ని తేవాలని నిర్ణయించింది. విదేశీయులు, ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు... భారత్లో అద్దెగర్భం ద్వారా పిల్లలు కనకుండా పూర్తిగా నిషేధం విధించాలని జాతీయ మహిళాకమిషన్ (ఎన్సీడబ్ల్యూ), ఆరోగ్యశాఖ ప్రతిపాదించా యి. సరోగసీకి సంబంధించిన కొత్తబిల్లుపై ఆరోగ్యశాఖ ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరింది. బిల్లుకు నవంబరు 15 నాటికల్లా తుదిరూపునివ్వనుంది. తల్లి కావాలనుకుంటున్న మహిళ నుంచి అండాన్ని సేకరించి... భర్త లేదా సహజీవన భాగస్వామి వీర్యంతో ఫలదీకరించి...మరో మహిళ గర్భంలో ఫలదీకరించిన పిండాన్ని ప్రవేశపెడతారు. ఆమె నవమాసాలు బిడ్డను మోసి జన్మనిస్తుంది. జన్యుపరమైన తల్లికి బిడ్డకు అప్పగిస్తుంది. గర్భాన్ని మోసిన తల్లికి ప్రతిఫలం ముట్టజెపుతారు. బిడ్డలు పుట్టే అవకాశం లేనపుడు...ఇలా మరో మహిళ గర్భాశయాన్ని అద్దెకు తీసుకోవడంలో తప్పులేదు. కానీ గర్భం దాల్చే శ్రమ లేకుండా పిల్లలను కనాలనుకునేవారి సంఖ్య ఈ మధ్య బాగా పెరుగుతోంది. భారత్లోని పేద మహిళలకు డబ్బు ఆశచూపి సరోగసీకి ఒప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై చట్టాన్ని తెచ్చే ఉద్దేశంతో 2010లో తొలి ముసాయిదాను రూపొందించారు. 2013లో దీనిలో మార్పులు చేశారు. ఇప్పు డు కఠినమైన నిబంధనలతో చట్టం చేయనున్నారు. ఆరోగ్యశాఖ, హోంశాఖ, మానవహక్కుల కమిషన్, ఎన్సీడబ్ల్యు, మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. విదేశీయులు, ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులెవరూ భారత్లో అద్దెగర్భం ద్వారా పిల్లలను కనకుండా నిషేధం విధిం చాలనే తమ సూచనపై ఏకాభిప్రాయం కుదిరిందని ఎన్సీడబ్ల్యు చైర్పర్సన్ లలితా కుమారమంగళం వెల్లడించారు. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి వీలుకల్పించాలనే తమ సిఫారసుకు ఆమోదం లభించిందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement