-
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా
పరకాలకు జరిగిన అన్యాయంపై నిలదీయండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పరకాల : పోరాటాల పురిటిగడ్డ పరకాలను జిల్లాల పునర్విభజనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్లిన లక్ష్మణ పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో రెవెన్యూ డివిజన్ సమితి, బీజేపీ నాయకులు వేర్వేరుగా రెవెన్యూ డివిజన్ కోసం వినతి పత్రాలు అందజేశారు. పరకాలకు జరిగిన అన్యాయాన్ని రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ రేపాల నర్సింహరాములు, బీజేపీ నాయకులు వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ నిజాం పాలన నుంచి విముక్తి కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన పరకాల ప్రాంత ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఉద్యమాలు చేయడం బాధగా ఉందన్నారు. సీఎం దృష్టికి పరకాల సమస్య తీసుకెళ్తానని లక్ష్మణ్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అ«ధ్యక్షులు ఎడ్ల అశోక్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పెసరు విజయచందర్రెడ్డి, సాధన సమితి నాయకులు రేపాల నర్సింహరాములు, ఎడ్ల సుధాకర్, ఆడగాని జనార్దన్రావు, బీజేపీ నగర పంచాయతీ ఫ్లోర్ లీడర్ ఆర్పీ.జయంత్లాల్, బీజేపీ నాయకులు మేకల రాజవీర్, పల్లెబోయిన సురేష్ , కానుగుల గోపినాథ్, వంగాల సంగమేశ్వర్, జయపాల్రెడ్డి, కాచం గురుప్రసాద్, బీజేవైఎం నాయకులు యాట నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఘన స్వాగతం పలికిన బీజేపీ నాయకులు కాళోజీ సెంటర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్కు రూరల్ జిల్లా నేతల ఘనస్వాగతం పలికారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు హైదరాబాద్ నుంచి హన్మకొండ మీదుగా వెళుతున్న సందర్భంగా రూరల్ జిల్లా అ« ద్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ పి.విజయ్చందర్రెడ్డి, జిల్లా నాయకులు డాక్టర్ లక్ష్మణ్ను కలిసి పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు. -
జ్ఞాపకాలు–2016
నిజామాబాద్ అర్బన్ : ఇందూరుకు 2016 ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. జిల్లాల పునర్విభజన, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు వంటి ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.టనాలుగేళ్ల తర్వాత విస్తారంగా వర్షాలు కురియడంతో జిల్లా తడిసి ముద్దయింది. ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలుగా మారాయి. ఆర్మూర్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ►వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో ఆమె బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఓదార్పు యాత్ర ముగింపు సందర్భంగా పైలాన్ను ఆవిష్కరించారు. ►ఏప్రిల్ 29న మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ప్రశాంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ►మే 25న కామారెడ్డి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో విషాదం నింపింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ►మే 26న ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభకు ఎంపికయ్యారు. ►సీఎం కేసీఆర్ ఈ సంవత్సరం రెండు సార్లు జిల్లాలో పర్యటించారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో నిజామాబాద్, బాన్సువాడలలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆగస్టు 28న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేమలు ప్రశాంత్రెడ్డి తండ్రి సురేందర్రెడ్డి మృతి చెందడంతో సీఎం కేసీఆర్ ఆకస్మిక పర్యటన చోటు చేసుకుంది. ►ఇందూరు జిల్లాకు సంబంధించి గతేడాదిలో చోటు చేసుకున్న పరిణామాల్లో కీలకమైనది జిల్లాల పునర్వ్యవస్థీకరణ. 36 మండలాలతో దశాబ్దాలుగా కొనసాగిన నిజామాబాద్ జిల్లా రెండుగా విడిపోయింది. దసరా రోజున కామారెడ్డి జిల్లా పురుడు పోసుకుంది. అదే రోజు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటయ్యాయి. ►జిల్లాలో మరో కీలక పరిణామం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు. జిల్లాలోని అన్ని ఠాణాలను కలిపి కమిషనరేట్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి పోలీస్ కమిషనర్గా కార్తికేయ బాధ్యతలు స్వీకరించారు. ►నవంబర్ 8న ప్రధాని మోడీ నోట్ల రద్దు ప్రకటన ప్రభావంతో ఇందూరు ప్రజా బ్యాంకుల ముందు బారులు తీరింది. కొత్త నోట్లు రాక, నగదు చేతిలో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏటీఎంలు తెరుచుకోలేదు. డబ్బు దొరకక ప్రజలు ఆందోళనకు దిగారు. టనవంబర్ 12, 13 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు జరుగడంతో నిరుద్యోగుల్లో సంతోషం వెలిసింది. -
నవ రాష్ట్రం.. యువ మంత్రం
► జిల్లా కలెక్టర్లుగా యువ ఐఏఎస్లు ► కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన సర్కారు ►జిల్లాల పునర్విభజనతో మారిన పరిస్థితి ఐఏఎస్ బ్యాచ్: జిల్లా కలెక్టర్లు ఇలా.. 2012: 4 2011: 2 2010: 4 2009: 2 2008: 1 2007: 4 2006 నాటి కంటే ముందు: 14 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో పరిపాలన ఇక కొత్త పుంతలు తొక్కనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త జిల్లాలకు యువ అధికారులను కలెక్టర్లుగా నియమించటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సంకేతాలిచ్చింది. పదేళ్లకుపైగా అనుభవమున్న ఐఏఎస్ అధికారులను కలెక్టర్లుగా నియమించే పాత ఆనవాయితీకి స్వస్తి పలికింది. నాలుగేళ్ల జూనియర్లకు సైతం కొత్త జిల్లాల పాలనా పగ్గాలు అప్పగించింది. అందుబాటులో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా 27 మందికి కొత్త జిల్లాల బాధ్యతలను కట్టబెట్టడం గమనార్హం. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేసిన కసరత్తు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అనూహ్యంగా మూడింతలకు పైగా పెరిగిన జిల్లాలకు కలెక్టర్లను సర్దుబాటు చేసేందుకు కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వటం సర్కారుకు అనివార్యమైంది. దీంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్వయంగా కసరత్తు చేసి కలెక్టర్ల నియామకంలో ఆచి తూచి వ్యవహరించారు. కొన్నిచోట్ల సీనియర్లను కొనసాగించటంతోపాటు యువ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఎక్కువ జిల్లాల్లో యువ నవతరం కలెక్టర్లు, ఎస్పీలుగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ చిన్న జిల్లాల్లో కలెక్టర్ల నియామకాలు ఆ ప్రాంత ప్రజల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. నాలుగేళ్ల జూనియర్లకు చాన్స్ జిల్లాల పునర్విభజన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగేళ్ల జూనియర్ ఐఏఎస్లకు సైతం కలెక్టర్లుగా పని చేసే అవకాశం కల్పించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ రోజునే ప్రభుత్వం 27 జిల్లాలకు కలెక్టర్ల నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 2012 బ్యాచ్కు చెందిన జూనియర్ ఐఏఎస్ అధికారులు నలుగురు ఉన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వి.ఎస్.అలగు వర్షిణి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు 2012 బ్యాచ్కు చెందిన యువ అధికారులు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటం, సుపరిపాలన లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టడంతో అనూహ్యంగా వీరికి జిల్లా కలెక్టర్గా పని చేసే అవకాశం లభించింది. వీరితో పాటు 2011 బ్యాచ్కు చెందిన పాటిల్ ప్రశాంత్ జీవన్ను వరంగల్ రూరల్ జిల్లాకు, శ్వేతా మొహంతీని వనపర్తి జిల్లాకు కలెక్టర్లుగా నియమించింది. 2010 బ్యాచ్కు చెందిన మరో నలుగురికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ బ్యాచ్కు చెందిన భారతి హోళికెరిని మెదక్ జిల్లాకు, ప్రీతి మీనాను మహబూబాబాద్ జిల్లాకు, ఆమ్రపాలిని వరంగల్ అర్బన్కు, డి.దివ్యను వికారాబాద్ జిల్లాకు కలెక్టర్లుగా నియమించారు. వీరితోపాటు 2009 బ్యాచ్కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, ఎన్.సత్యనారాయణ, 2008 బ్యాచ్కు చెందిన శ్రీదేవసేన, 2007 బ్యాచ్కు చెందిన కె.సురేంద్రమోహన్, పి.వెంకట్రామిరెడ్డి, ఎంవీ రెడ్డి, రజత్కుమార్ షైనీలు కలెక్టర్లుగా వివిధ జిల్లాల బాధ్యతలు స్వీకరించారు. వీరందరూ పదేళ్ల లోపు సీనియర్లు. వీరిలో ఎక్కువ మందికి కనీసం జిల్లాల్లో పని చేసిన అనుభవం కూడా లేదు. మొత్తంగా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 17 జిల్లాల బాధ్యతలను జూనియర్లకే అప్పగించారు. సీనియర్ రాహుల్ బొజ్జా పునర్విభజన ప్రభావం లేని హైదరాబాద్ జిల్లాకు ప్రభుత్వం ప్రస్తుత కలెక్టర్ రాహుల్ బొజ్జాను యథాతథంగా కొనసాగించింది. ప్రస్తుతమున్న జిల్లా కలెక్టర్లందరిలో ఆయనే సీనియర్. 2000 బ్యాచ్కు చెందిన రాహుల్ బొజ్జా గతంలో వరంగల్, మెదక్ జిల్లాల్లో పని చేశారు. అనుభవమున్న అధికారి కావటంతో ఆయనకు రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉన్న జిల్లా బాధ్యతలను అప్పగించారు. ఆయన తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్రావు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా నియమితులైన జ్యోతి బుద్ధప్రకాశ్, ఖమ్మం కలెక్టర్ లోకేశ్కుమార్ సీనియర్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. గతంలో ఎంతో నిరీక్షణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, జిల్లాల పునర్విభజనకు ముందు తెలంగాణలో జిల్లా కలెక్టర్ పదవి కోసం ఐఏఎస్ అధికారులు కనీసం పదేళ్లు, గరిష్టంగా 12 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చేది. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అసిస్టెంట్ కలెక్టర్గా రెండు నుంచి మూడేళ్లు, అసిస్టెంట్ కలెక్టర్ (డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్)గా మూడేళ్లు చేస్తే గానీ జాయింట్ కలెక్టర్గా అవకాశం వచ్చి ఉండేది కాదు. జాయింట్ కలెక్టర్గా రెండేసి జిల్లాలకు నాలుగు నుంచి ఐదేళ్లు పని చేసిన తర్వాతే జిల్లా కలెక్టర్ అయ్యేవారు. జిల్లాల పునర్విభజన ఫలితంగా తెలంగాణలో నాలుగేళ్ల సర్వీసు ఉన్న అనేక మంది యువ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు కలెక్టర్లు అయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
మీరెన్నయినా చెప్పండీ! కొన్ని ఫేక్ న్యూస్తో వచ్చే కిక్కే వేరు..!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
Advertisement