-
సొంతిల్లు కొంటున్నారా?, అదిరిపోయే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా?
పదవీ విరమణ తీసుకున్నారు. ఉండడానికి సొంతిల్లు ఉంది. కానీ, పింఛను సదుపాయం లేదు. ఉద్యోగం లేదా సంపాదనా కాలంలో పెద్దగా పొదుపు చేయలేకపోయారు. చేసిన పొదుపు ఇప్పటి జీవన అవసరాలను తీర్చే స్థాయిలో లేదు. అదనపు ఆదాయం కావాలి. ఇందుకోసం వృద్ధాప్యంలో ఏం చేయాలి..? ఇలాంటి సందిగ్ధత ఎదుర్కొనే ప్రతి ఒక్కరి ముందున్న ఆప్షన్ రివర్స్ మార్ట్గేజ్ లోన్. వృద్ధాప్యంలో జీవన అవసరాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర సర్కారు 2007లోనే దీన్ని తీసుకొచ్చింది. కానీ, మన దేశంలో అంతగా ప్రజాదరణకు నోచుకోలేదు. దీని గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, క్రెడిట్ కార్డుల గురించి ప్రకటనలు ఇవ్వడం గమనించే ఉంటారు. కానీ, ఏ బ్యాంకు కూడా ఎక్కడా రివర్స్ మార్ట్గేజ్ స్కీమ్ గురించి ప్రకటన ఇచ్చినట్టు కనిపించదు. దీనికి కారణం బ్యాంకులకు ఈ ఉత్పత్తిపై ఆసక్తి లేకపోవడమే. వృద్ధాప్యంలో పోషణకు ఎలాంటి ఆదాయం లేని వారిని సొంతిల్లే ఆదుకుంటుంది. ఇంటిని బ్యాంకు తనఖాగా ఉంచుకుని నెలవారీ ఆదాయం సమకూరుస్తుంది. ఈ పథకం ప్రయోజనాలు, అర్హతలపై మరిన్ని వివరాలు అందించే కథనమే ఇది. ఇది ఎలా పనిచేస్తుంది..? రివర్స్ మార్ట్గేజ్ అంటే నివాస యోగ్యమైన గృహంపై తీసుకునే రుణం. మార్ట్గేజ్ అన్నది ఇంటిని సొంతం చేసుకోవడం కోసం తీసుకునే రుణం. దీనికి విరుద్ధంగా ఇంటిపై రుణం తీసుకునేది కనుక రివర్స్ మార్ట్గేజ్ అని పేరు పెట్టారు. ఇంటి కోసం మార్ట్గేజ్ రుణం తీసుకుంటే నెలవారీ ఈఎంఐ ఎలా అయితే చెల్లిస్తారో.. రివర్స్ మార్ట్గేజ్లో బ్యాంక్ కూడా రుణ గ్రహీతకు అదే విధంగా చెల్లిస్తుంది. అద్దె ఇంట్లో ఉండే వారికి ఈ రుణానికి అర్హత ఉండదు. సొంతిల్లు, దానిపై సంపూర్ణ హక్కులు ఉన్న వారే దీన్ని తీసుకోగలరు. ఇంటి విలువ ఎంత, అది ఏ ప్రాంతంలో ఉంది? తదితర అంశాలను చూసిన తర్వాత బ్యాంక్లు ఎంత రుణం ఇవ్వాలన్నది నిర్ణయిస్తాయి. ఇంటి విలువలో రుణంగా (ఎల్టీవీ) 60 నుంచి 80 శాతం మధ్య నిర్ణయిస్తాయి. రివర్స్ మార్ట్గేజ్ కింద చాలా బ్యాంకులు గరిష్టంగా రూ. కోటి రుణ పరిమితిని అమలు చేస్తున్నాయి. అంటే రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా పెట్టే ఇంటి విలువ రూ.2 కోట్లు ఉన్నా సరే గరిష్టంగా రూ.కోటి వరకే పొందగలరు. గరిష్టంగా 20 ఏళ్ల కాలానికి రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి! రుణాన్ని చెల్లించక్కర్లేదు.. వృద్ధాప్యంలో జీవన అవసరాల కోసం ఇంటిని తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారని అనుకుందాం. అలాంటప్పుడు తిరిగి ఎలా చెల్లించగలం? అన్న ప్రశ్న రావచ్చు. నిజమే తీసుకున్న రుణాన్ని తప్పనిసరిగా తిరిగి చెల్లించాలనేమీ లేదు. ఉదాహరణకు వినయ్ (62) 20 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకున్నారని అనుకుందాం. ఆయన 82 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా జీవించే ఉన్నారు. కాల వ్యవధి ముగిసింది కనుక ఆ తర్వాత నుంచి బ్యాంక్ ఎలాంటి చెల్లింపులు చేయదు. అయినా, రుణ గ్రహీత అదే ఇంటిలో నిశ్చింతగా నివసించొచ్చు. ఇంటి యజమాని మరణించిన తర్వాతే అది బ్యాంక్ పరం అవుతుంది. ఒకవేళ భార్యా, భర్త జాయింట్గా రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకుంటే వారిద్దరి మరణానంతరమే బ్యాంకులకు హక్కులు లభిస్తాయి. రుణ గ్రహీత మరణానంతరం రుణం, దానిపై వడ్డీ బకాయిలు చెల్లించే ఆప్షన్ను బ్యాంక్లు వారసులకు కల్పిస్తాయి. వారు ముందుకు రాకపోతే అప్పుడు ఆ ఇంటిని బ్యాంక్ వేలం వేస్తుంది. అన్ని బకాయిలు మినహాయించుకుని ఏమైనా మిగిలి ఉంటే వారసులకు చెల్లిస్తుంది. ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తం బకాయిలు తీర్చేంత లేకపోతే, మిగిలినది బ్యాంక్ నష్టం కింద సర్దుబాటు చేసుకుంటుంది. వారసులకు బాధ్యత ఉండదు. చదవండి👉 హైదరాబాద్: ట్రెండ్ మారింది.. దూరమైనా పర్లేదు, అలాంటిదే కావాలంటున్న నగరవాసులు! రెండు రకాల చెల్లింపులు... రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని రుణ గ్రహీత కోరిక మేరకు బ్యాంక్లు రెండు రకాలుగా చెల్లిస్తాయి. ఒకటి ప్రతి నెలా వాయిదాల రూపంలో అందుకోవచ్చు. లేదంటే త్రైమాసికం, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి చెల్లింపులు చేస్తుంది. రెండు ఏక మొత్తంలో మంజూరు చేస్తుంది. బ్యాంక్ నుంచి రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని ఏక మొత్తంలో ఒకే విడత అందుకున్నా లేక నెలవారీ వాయిదాల రూపంలో అందుకున్నా, ఆ మొత్తంపై పన్ను పడదు. ఎందుకంటే ఆదాయపన్ను చట్టం దీన్ని ఆదాయం కింద పరిగణించదు. రుణంగానే భావిస్తుంది. దీంతో పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. చెల్లింపుల మొత్తాన్ని పెంచుకునే ఆప్షన్ లేదు. ఉదాహరణకు ప్రాపర్టీ విలువ రూ.కోటి ఉందని అనుకుందాం. లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ) 80 శాతం అనుకుంటే అప్పుడు రుణం కింద రూ.80 లక్షలు ఖరారు అవుతుంది. ఇందులో వడ్డీ భాగం కూడా ఉంటుందని మర్చిపోవద్దు. రూ.80 లక్షలను 8.5 శాతం రేటుపై 20 ఏళ్ల కాలానికి తీసుకునేట్టు అయితే, అప్పుడు చెల్లించాల్సిన వడ్డీ రూ.45 లక్షలు అవుతుంది. రూ.80 లక్షల్లో రూ.45 లక్షలు పోను రూ.35 లక్షలను బ్యాంక్ రుణ గ్రహీతకు చెల్లిస్తుంది. ఇది నెలవారీ చెల్లింపులకు సంబంధించి అనుసరించే విధానం. ఏక మొత్తంలో చెల్లింపులు కోరుకుంటే అప్పుడు లోన్టు వ్యాల్యూలో 50 శాతం లేదా రూ.15 లక్షలు ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? ఎప్పుడైనా చెల్లించొచ్చు.. రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని ఎప్పుడైనా తిరిగి చెల్లించొచ్చు. కాల వ్యవధి పూర్తి కాక ముందు చెల్లించినా ఎలాంటి చార్జీలు ఉండవు. ‘‘ఒకవేళ మరో బ్యాంక్కు రివర్స్ మార్ట్ గేజ్ రుణాన్ని బదిలీ చేసుకోవడం ద్వారా పాత బ్యాంకు వద్ద ముందే తీర్చేస్తున్నట్టు అయితే, అప్పటికి మిగిలి ఉన్న రుణ బకాయి మొత్తంపై 0.5–2 శాతం మధ్య పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది’’అని మైలోన్కేర్ డాట్ ఇన్ సంస్థ సీఈవో గౌరవ్గుప్తా తెలిపారు. రుణాలపై వడ్డీ రేట్లు గతేడాది నుంచి 2.5 శాతం మేర పెరిగాయి. ఇక ఇక్కడి నుంచి పెరుగుదల పెద్దగా ఉండదన్నది విశ్లేషకుల అంచనా. అంతేకాదు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు సర్దుకుని, అనిశ్చితులు తగ్గితే తిరిగి రుణ రేట్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని తీసుకునే వారు వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయని వెనుకాడక్కర్లేదని నిపుణులు సూచిస్తున్నారు. రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకోవడానికి అవసరమే ప్రామాణికం. జీవనానికి ఇతరత్రా ఆదాయం లేని వారు, ఉన్నా చాలని వారు, తమ వారసులకు తమ ప్రాపర్టీ అవసరం లేని వారు, మరింత సుఖవంతమైన జీవనం సాగించాలని అనుకునే వారు, అవసరాల్లో రాజీ పడే ఉద్దేశ్యం లేని వారు రివర్స్ మార్ట్గేజ్ రుణానికి వెళ్లొచ్చు. ఎస్బీఐ రివర్స్ మార్ట్గేజ్ రుణంపై రేటును రెపో రేటుతో అనుసంధానిస్తోంది. దాదాపు గృహ రుణం స్థాయిలోనే రేట్లు ఉంటాయి. రెపో రేటుకు అనుసంధానమై ఉండడం వల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు వెంటనే అది రుణాలపై ప్రతిఫలిస్తుంది. విలువ మదింపు.. రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా ఉంచిన ఇంటి విలువను బ్యాంక్లు ఐదేళ్లకోసారి మదింపు వేస్తుంటాయి. తనఖా పెట్టిన ప్రాపర్టీ విలువ రుణం మంజూరు చేసే నాటి విలువ స్థాయిలోనే ఉందా? పెరిగిందా లేక తగ్గిందా? అన్నది సమీక్షిస్తుంటాయి. ఎందుకంటే రివర్స్ మార్ట్గేజ్ రుణాల్లో ఎక్కువ శాతం ఆయా ప్రాపర్టీలు బ్యాంక్ల స్వాధీనం అవుతుంటాయి. రుణం తీసుకున్న వారు లేదా వారి వారసులు తిరిగి చెల్లించే దాఖలాలు తక్కువ. దీంతో బ్యాంక్లు తాము ఇచ్చిన రుణం, దానిపై వడ్డీ బకాయిల వసూలుకు వాటిని వేలం వేస్తుంటాయి. వేలంలో సరైన విలువను పొందేందుకు వీలుగా బ్యాంక్లు రిస్క్ కోణంలో ఇలా ప్రాపర్టీ విలువను ఐదేళ్లకోసారి మదింపు వేస్తాయి. కివర్స్ మార్ట్గేజ్ రుణానికి ఎన్బీఎఫ్సీల కంటే బ్యాంకులే మెరుగైన ఆప్షన్. సమర్పించాల్సినవి ఇవీ.. రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకోవాలని అనుకునే వారు.. గుర్తింపు, నివాస గుర్తింపు పత్రాలు ఇవ్వాలి. ప్రాపర్టీ అసలు పేపర్లు, గడిచిన ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, అప్పటికే ఏదైనా రుణం తీసుకుని ఉంటే దానికి సంబంధించి చివరి ఏడాది స్టేట్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. చదవండి👉వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉద్యోగులు, రాకెట్ వేగంతో పెరుగుతున్న ఇళ్ల ధరలు! ఎందుకు ఆదరణ లేదు..? రివర్స్ మార్ట్గేజ్ గురించి అందరికీ తెలియకపోవడం ఇది పెద్దగా విస్తరించపోవడానికి ఒక కారణం. సాధారణంగా ఇంటితో అనుబంధం ఉంటుంది. అంత సులభంగా దాన్ని తెంపుకోలేరు. తమ గుర్తుగా, వారసత్వంగా పరిగణిస్తుంటారు. బ్యాంకులు దీని గురించి ప్రచారం చేయకపోవడం కూడా ఒక ముఖ్య కారణం. ఎక్కడా ప్రకటనలు ఇవ్వవు. కనీసం వాటి వెబ్సైట్లలోనూ వివరాలను అందుబాటులో ఉంచవు. బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఉదాహరణకు బ్యాంక్ 15 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్గేజ్ రుణం ఇచ్చిన తర్వాత.. ఇంటి యజమాని 30 ఏళ్లు జీవించారని అనుకుందాం. అప్పటి వరకు ఆ ఇంటిని బ్యాంకులు ఏమీ చేయలేవు. ఇచ్చిన రుణాన్ని స్వచ్చందంగా చెల్లిస్తే తప్ప అవి వసూలు చేసుకోలేవు. రుణ గ్రహీత చనిపోయే వరకు ఆగాల్సిందే. నివసిస్తున్న ఇల్లు వారసులకు అవసరం లేనట్టయితే అప్పుడు దాన్ని విక్రయించే ఆప్షన్ను కూడా పరిశీలించొచ్చు. మంచి విలువ పలికే ప్రాంతంలో ఉంటే విక్రయించి, తక్కువ రేటున్న ఇంటిని కొనుగోలు చేసుకోవడం ఒక మార్గం. ఈ రూపంలో మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ పథకాల్లోకి మళ్లించుకుని ప్రతి నెలా ఆదా యం వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. చదవండి👉 మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! వీటిని దృష్టిలో పెట్టుకోవాలి ►60 ఏళ్లు నిండిన ఎవరైనా రివర్స్ మార్ట్గేజ్ రుణానికి అర్హులు. జీవిత భాగస్వామి సహ దరఖాస్తుదారు అయితే ఆమె వయసు 55–58 ఏళ్లకు తక్కువ ఉండకూడదు. బ్యాంకుల మధ్య ఇది వేర్వేరుగా ఉంది. ► గరిష్టంగా రూ.కోటి వరకే రుణం లభిస్తుంది. ఈ మొత్తాన్ని రుణ గ్రహీత ఏ అవసరం కోసం అయినా వినియోగించుకోవచ్చు. ►ఇంటి విలువ, రుణ గ్రహీత వయసు, అమల్లో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా రుణం మొత్తాన్ని, కాల వ్యవధిని బ్యాంకులు నిర్ణయిస్తాయి. ►కనీసం పదేళ్లు, గరిష్టంగా 20 ఏళ్ల కాలాన్ని చాలా బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ► సొంతిల్లు అయి ఉండి, దాన్ని అద్దెకు ఇవ్వకుండా, అందులో నివసిస్తుంటే రివర్స్ మార్ట్గేజ్ చేసుకోవచ్చు. ► ఇంటిపై ఎలాంటి వివాదాలు ఉండకూడదు. ► వాణిజ్య ఆస్తిపై రివర్స్ మార్ట్గేజ్కు అవకాశం లేదు. ►తనఖా పెట్టే ఇంటి జీవన కాలం అక్కడి నుంచి 20 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండకూడదు. ► ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, వీటిపై జీఎస్టీ చార్జీలను చెల్లించాలి. ►పెనాల్టీ లేకుండా ఎప్పుడైనా ఈ రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించొచ్చు. ► ప్రతి ఐదేళ్లకోసారి ప్రాపర్టీ విలువను బ్యాంక్లు మదింపు వేస్తాయి. ►రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా పెట్టిన ఇంటిని నవీకరించాలని అనుకుంటే, బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాలి. ►ఇంటి నిర్వహణకు అయ్యే ఖర్చులను రుణ గ్రహీత (ఇంటి యజమాని) పెట్టుకోవాల్సిందే. అంతేకాదు ఆ ఇంటికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్, ఇతర పన్నులు ఏవైనా ఉంటే అందులో నివసిస్తున్న వారే చెల్లించుకోవాలి. చదవండి👉 తక్కువ ధరకే ప్రభుత్వ ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం! -
పింఛన్ లేకున్నా.. ఇల్లుంటే చాలు!
సీనియర్ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టిన రివర్స్ మార్టిగేజ్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. సొంతింటిలోనే ఉంటూ, ఆ ఇంటిపై ప్రతి నెలా అద్దె రూపంలో (నిజంగా అద్దె కాదు... రుణం) కొంత మొత్తం వచ్చే ఈ రివర్స్ మార్టిగేజ్ పథకం ఇప్పటిదాకా గరిష్టంగా 20 ఏళ్లు మాత్రమే వర్తించేది. ఇపుడు జీవితాంతం వర్తించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆనందరావు ప్రైవేటు ఉద్యోగి. రిటైరయ్యాడు. కొడుకులిద్దరూ ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్లారు. అక్కడే సెటిలయ్యారు. ప్రైవేటు ఉద్యోగి కావటంతో తను ఏర్పాటు చేసుకున్న పింఛన్ చాలా తక్కువ. ఆత్మాభిమానం ఎక్కువ కావటంతో కొడుకుల్ని కూడా అడగలేకపోతున్నాడు. హైదరాబాద్లోని సొంతింట్లో ఉండే ఆనందరావుకు ఏం చేయాలో అర్థంకాలేదు. ధరలు పెరగటంతో చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే విషయాన్ని తన స్నేహితుడు కుటుంబరావుకు చెప్పాడు. ‘‘నువ్వు సంపాదించుకున్న ఇల్లేగా! నీక్కూడా పనికిరాకపోతే ఎలా? అందుకని తనఖా పెట్టు’’ అని సలహా ఇచ్చాడు కుటుంబరావు. ‘మరి నేనెక్కడుండాలి?’ అడిగాడు ఆనందరావు. ‘‘నువ్వు నిక్షేపంలా నీ ఇంట్లోనే ఉండొచ్చు. అలా ఉంటూనే నెలవారీ లేదా మూడు నెలలకోసారి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంత మొత్తం తీసుకోవచ్చు’’ అంటూ రివర్స్ మార్టిగేజ్ పథకాన్ని వివరించాడు. జీవితాంతం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడపటానికి వీలయ్యే రివర్స్ మార్టిగేజ్ పథకం వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... ఎలా పనిచేస్తుంది? మీ పేరుమీద ఉన్న ఇంటిని బ్యాంకు తన వద్ద తనఖాగా పెట్టుకొని ఆ ఇంటి విలువ ఆధారంగా కొంత మొత్తం వెనక్కి ఇస్తుంది. మీ అవసరాలకు అనుగుణంగా ప్రతి నెలా లేదా మూడు నెలలు, ఆరు నెలలు సంవత్సరానికి లేదా ఒకేసారిగా కూడా వెనక్కి తీసుకోవచ్చు.ఈ డబ్బులు మీకు బ్యాంకులు ఉచితంగా ఏమీ ఇవ్వవు. దీనిపై వడ్డీని వసూలు చేస్తాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు రివర్స్ మార్టిగేజ్పై బేసురేటుపైన రెండు నుంచి మూడు శాతం అధిక వడ్డీని వసూలు చేస్తున్నాయి. అంటే 12 నుంచి 13 శాతం వడ్డీ పడుతుందన్న మాట. ఈ స్కీంలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే రుణం కాలపరిమితి తీరేంత వరకు మనం ఒక పైసా కట్టాల్సిన అవసరం ఉండదు. పెపైచ్చు మన ఇంట్లో మనమే ఉండొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మన గృహ రుణాలకు పూర్తి వ్యతిరేకంగా ఈ పథకం పనిచేస్తుంది. అందుకే దీన్ని రివర్స్ మార్టిగేజ్ స్కీంగా పిలుస్తున్నారు. కాలపరిమితి తీరిన తర్వాత మనం వాడుకున్న మొత్తం చెల్లిస్తే ఇల్లు తిరిగి మన చేతికి వచ్చేస్తుంది. లేకపోతే ఆ ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బుల్లో బాకీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని బ్యాంకు మనకు ఇచ్చేస్తుంది. ఒక వేళ రుణం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి మరణిస్తే వారసుడు (నామినీ) రుణం చెల్లించి ఇంటిని తీసుకోవచ్చు. లేకపోతే బ్యాంకు ఆ ఇంటిని అమ్మి బకాయిలు పోగా మిగిలిన మొత్తాన్ని వారసులకు అందచేస్తుంది. ఎంత ఇస్తారు? నేషనల్ హౌసింగ్ బోర్డు నిబంధనల ప్రకారం మీ ఇంటి విలువలో గరిష్టంగా 60 శాతం వరకు రుణం లభిస్తుంది. ఉదాహరణకు మీ ఇంటి విలువ కోటి రూపాయలు అనుకోండి మీకు సుమారు 60 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఇంత మొత్తం అవసరం లేదనుకున్నారనుకోండి.. మీ నెలసరి అవసరాలకు ఎంత డబ్బు అవసరమవుతుందో అంతే మొత్తానికి రుణం తీసుకోవచ్చు. నెలకు ఎంత వస్తుంది అనేది రుణ మొత్తం, ఎంచుకున్న కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. పై ఉదాహరణే తీసుకుంటే 10 ఏళ్ల కాలపరిమితి ఎంచుకుంటే ప్రతి నెలా రూ.25,200 చేతికి వస్తాయి. అదే 15 ఏళ్లు అయితే రూ.11,400, అదే 20 ఏళ్లు అయితే రూ.5,400 వరకు చేతికి వస్తాయి. ఇప్పుడు అమలులోకి వచ్చిన జీవిత కాలం నగదు కావాలనుకుంటే ఈ మొత్తం మరింత తగ్గుతుంది. అదే ఒకేసారి తీసుకుంటే మాత్రం చాలా బ్యాంకులు ఇంటి విలువ ఎంత అధికంగా ఉన్నా గరిష్టంగా రూ.15 నుంచి 20 లక్షల వరకు మాత్రమే ఇస్తున్నాయి. సీనియర్స్కి మాత్రమే.. ఈ పథకాన్ని అందరూ తీసుకోలేదు. సీనియర్ సిటిజన్స్కు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అది కూడా సొంత ఇల్లు ఉండి , 60 సంవత్సరాల వయసు దాటిన వారు మాత్రమే తీసుకోవడానికి అర్హులు. మీకు ఈ అర్హతలు ఉంటే మీ ఇంటిని బ్యాంకు తన దగ్గర తనఖా కింద పెట్టుకొని డబ్బులు ఇస్తుందన్నమాట. కాలపరిమితి కంటే ముందుగానే వాడుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేయొచ్చు. ఒకవేళ ఈ రుణాన్ని వేరే బ్యాంక్ టేకోవర్ చేస్తే మాత్రం రెండు శాతం వరకు పెనాల్టీలను విధిస్తున్నాయి. ఒకసారి రుణం మంజూరు చేసిన తర్వాత బ్యాంకు విధించిన నిబంధనలు నచ్చకపోతే 10 రోజుల్లోగా రద్దు చేసుకోవచ్చు. ఎటువంటి పెనాల్టీలు ఉండవు. అనేక ఆకర్షణలు అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ రివర్స్ మార్టిగేజ్ పథకానికి అర్హులు. మీ స్థిరాస్తి విలువలో గరిష్టంగా 60 శాతం వరకు రుణం లభిస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా నెలసరి వాయిదాలు, లేదా మూడు నెలలు, ఆరు నెలలకు ఒకసారి తీసుకునే సౌలభ్యం ఉంది. మీ స్థిరాస్తి విలువను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మదింపు చేస్తుంటారు. విలువలో ఏమైనా తేడా వస్తే దాని ప్రకారం మీకు చెల్లించే మొత్తంలో మార్పులు జరుగుతాయి. ఇలా ప్రతి నెలా వచ్చే మొత్తాన్ని ఆదాయంగా పరిగణించరు. ఆ మేరకు పన్ను భారం ఉండదు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement