-
విజయవాడ : తొలకరి తెచ్చిన కోలాహలం.. రైతన్న ముఖంలో చిరునవ్వు (ఫొటోలు)
-
అల్లుడు బియ్యం అదుర్స్!
నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది.. ఔషధ విలువలున్న ఆహారం తీసుకోవడంపై ఆసక్తి పెరిగింది.. సేంద్రియ విధానంలో సాగు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.. పాత కాలం పంటలకు ప్రస్తుతం మరింత గిరాకీ వచ్చింది. ఆ క్రమంలోనే తమిళనాడుకు చెందిన అల్లుడు బియ్యం (మాపిళ్లై సాంబ) వరి వంగడం పలమనేరు మండలంలో సాగులోకి వచ్చింది. అత్యున్నత గుణాలున్న ఈ బియ్యా నికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఏడు నెలల కాల పరిమితితో చేతికందే ఈ పంట రైతుకు కాసులవర్షం కురిపించే అవకాశముంది. అలాగే పురాతన వంగడాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సాక్షి, పలమనేరు: సాధారణంగా మనం తినే బియ్యం తెలుపు రంగులో ఉంటుంది. వరి పంట కాలం కూడా నాలుగునెలలు మాత్రమే. పంట నాలుగడుగుల దాకా పెరుగుతుంది. కానీ అల్లుడు బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. దీని పంటకాలం ఏడు నెలలు. ఆరు నుంచి ఎనిమిది అడుగులు వరకు పెరుగుతుంది. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలుండడంతో విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. గతంలో తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి ప్రాంతంలోని రైతులు శతాబ్దాల నుంచి ప్రకృతి విధానంలో సాగు చేస్తూ వస్తున్నారు. వారు కాపాడుకుంటూ రావడం వల్లే అపురూపమైన మాపిళ్లై సాంబ రకం వంగడాలు నేటి తరానికి అందుబాటులోకి వచ్చాయి. అక్కడి నుంచి విత్తనాలను తీసుకువచ్చి పలమనేరు మండలంలోని కూర్మాయి వద్ద ఓ ఔత్సాహిక రైతు చందూల్ కుమార్ ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. సేంద్రియ పద్ధతులో పంట పండిస్తున్నారు. ప్రస్తుతం పంట ఏపుగా ఎదిగింది. ఒబ్బిడికి సిద్ధంగా తయారైంది. వంగడం చరిత్ర ఇదీ.. తమిళనాడుతోపాటు కేరళలోని పలు జిల్లాల్లో సాగు చేస్తున్న పురాతన వరి వంగడమే మాపిళ్లై సాంబ రకం. తమిళంలో మాపిళ్లై అంటే పెళ్లికొడుకు, అల్లుడు అని అర్థం. పాత కాలంలో అల్లుడు దృఢంగా ఉండాలని పెళ్లికుమార్తె ఇంటి వారు ఈ రకం బియ్యాన్ని వండిపెట్టేవారట. నూతన వధూవరులకు ఈ రకం అన్నాన్నే పెట్టడం ఇప్పటికీ కన్యాకుమారి ప్రాంతంలో ఉంది. ఇందులోని ఔషధ విలువల కారణంగా పురుషులకు వీర్యపుష్టి లభిస్తుందని నమ్ముతారు. ఈ బియ్యాన్ని తింటే కాన్పు సాధారణంగా అవుతుందని విశ్వసిస్తారు. అల్లుళ్లకు ప్రత్యేకంగా వడ్డిస్తారు కనుకే ఈ రకం బియ్యాన్ని మాపిళ్లై సాంబ అని పిలుస్తుంటారు. ఏపీ, తెలంగాణాలో అల్లుడు సాంబ, పెళ్లికొడుకు సాంబ, కేరళలో వరణ్సాంబ, కర్ణాటకలో వర సాంబ, ఉత్తరాది రాష్ట్రాల్లో దుల్హా సాంబగా పేర్లున్నాయి. ఆన్లైన్లో ఈ రకం బియ్యానికి బ్రైడ్గ్రూమ్ రైస్ అని పిలుస్తున్నారు. ఇది రాయలసీమలోని బైరొడ్లును పోలి ఉంటుంది. పలు సమస్యలకు ఔషధమే! ఈ రకం కిలో బియ్యంలో ఓ గ్రాము ఫ్యాట్, 80 గ్రాముల కార్బొహ్రైడ్రేట్, 7 గ్రాముల ఫైబర్, 7 గ్రాముల ప్రొటీన్, 50.8 గ్రాముల కాల్షియం, 90.4 గ్రాముల పోషకాలు, 5.47 గ్రాముల ఐరన్ పోషకాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ బియ్యంతో వండిన ఆహారాన్ని భుజిస్తే రక్తశుద్ధితోపాటు మల బద్దకం, పైల్స్ సమస్యలు తలెత్తవు. అలాగే మధుమేహం బారిన పడినవారికి కూడా మేలు చేస్తుంది. రూ.200 పైమాటే.. దుకాణాల్లో ఈ రకం బియ్యం పెద్దగా అందుబాటులో లేదు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీలు కిలో నుంచి మూడు, ఐదు కిలోల బ్యాగుల్లో వీటిని ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. డీమార్ట్, బిగ్ బాస్కెట్లాంటి మాల్స్లోనూ అందుబాటులో ఉన్నాయి. రూ.160 నుంచి రూ.250 దాకా కంపెనీలను బట్టి ధరలున్నాయి. దేశావాళి వరి వంగడాల్లో అగ్రస్థానం.. హరిత విప్లవం తర్వాత పలు రకాల హైబ్రిడ్ వరి వంగడాలు సృష్టించబడ్డాయి. సుమారు 2వేల దాకా వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం దేశవాళీ రకాలు వంశపారంపర్యంగా సాగులో ఉన్నాయి. అందులో అత్యంత పోషకాలు కలిగినవిగా రత్నబోడి, నవారా, కులాకర్, తాజముడి, కుజిపాటియాలా, మైసూర్మల్లిగె, చిట్టి ముత్యాలు, బర్మాబ్లాక్, బహురూపి, కుంకుమసార, కాలాబాటి, కోతాంబరి లాంటివి పేరు గడించాయి. అయితే వీటన్నింటికీ మించిన రకంగా మాపిళ్లై సాంబ అగ్రస్థానంలో నిలుస్తుంది. అందుకే మార్కెట్లో దీనికంత డిమాండ్ ఏర్పడింది. అధ్యయనం చేసి సాగు చేశా కొన్నేళ్ల నుంచి ప్రకృతి సేద్యం చేస్తున్నా. పలు రకాల దేశీయ వరి వంగడాలను సాగు చేస్తున్నా. గతంలో బ్లాక్రైస్ను సాగుచేశా. కానీ అన్నింటికంటే ఎక్కువ ఔష ధ గుణాలున్న మాపిళ్లై సాంబ సాగు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, బాగా అధ్యయనం చేశా. అనంతరం సాగు ప్రారంభించా. ఈ ప్రాంత రైతులకు ఈ వంగడాన్ని పరిచయం చేసి సాగు పెంచాలని భావిస్తున్నా. – చందూల్కుమార్, రైతు, కూర్మాయి, పలమనేరు మండలం అవగాహన పెరుగుతోంది హైబ్రిడ్ వరి వంగడా ల స్థానంలో దేశవాళీ విత్తనాలపై రైతుల్లో అవగాహన పెరిగింది. ముఖ్యంగా సేంద్రి య సేద్యంపై ఎక్కవ మంది మక్కువ చూపుతున్నారు. అపురూపమైన మాపిళ్లై సాంబకు (ఏంఏపీఎస్ఏఎంబీఏ–1) మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రైతులు ఇలాంటి వరి వంగడాలను సాగు చేసేలా గ్రామాల్లో అవగాహన కలి్పస్తున్నాం. – సంధ్య, వ్యవసాయాధికారి, పలమనేరు మండలం మంచి పోషక విలువలు మన పూరీ్వకులు పండించిన ఎన్నో రకాల దేశీవంగడాలు కనుమరుగైయ్యాయి. కానీ కొందరు ఔత్సాహిక రైతులు మళ్లీ వాటిని సాగుచేస్తున్నారు. వీటిలో ఎన్నో రకాల పోషకాలున్నాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండడంతో మలబద్దకం సమస్య తగ్గుతుంది. అనీమియాతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది. కొలె్రస్టాల్ను కూడా తగ్గిస్తుంది. – యుగంధర్, మెడికల్ ఆఫీసర్, పలమనేరు -
రంగుల బియ్యం రెడీ
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇప్పటివరకు నల్ల బియ్యం, ఎర్ర బియ్యం అనేవి దేశవాళీ రకాల్లోనే ఉన్నాయి. బర్మా బ్లాక్, కాలాబటీ, మణిపూర్ బ్లాక్ రకాలుగా పిలిచే వీటిని అస్సాం, మణిపూర్, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోని రైతులు.. అక్కడక్కడా ఏపీ రైతులు సైతం పండిస్తున్నారు. లావు రకానికి చెందిన ఈ బియ్యాన్ని వండితే అన్నం ముద్దగా ఉంటోంది. ఎకరానికి 10 నుంచి 15 బస్తాలకు మించి దిగుబడి రావటం లేదు. ఎర్ర బియ్యంలో కేరళకు చెందిన నవారా రకం కూడా ఉన్నా.. ఇది ఎకరాకు 10 బస్తాలకు మించి దిగుబడి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్ విధానంలో ఈ రకాలు మన రాష్ట్రంలోనూ అరకొరగా సాగవుతున్నాయి. డిమాండ్ ఉన్నా.. దిగుబడి తక్కువగా ఉండటంతో గిట్టుబాటు కాక రైతులు వీటి సాగు వైపు మొగ్గు చూపటం లేదు. బ్లాక్, రెడ్ రైస్ ధాన్యం పైపొరలో ‘యాంతోసైనిన్’ అనే పదార్థం ఉండటం వల్ల వాటికి ఆ రంగు వస్తుంది. బియ్యాన్ని పైపొరతో కలిపి తినాలి. వీటిలో ఐరన్, జింక్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ రకాలు లావుగా ఉండి అన్నం ముద్దగా వస్తుండటంతో ప్రజలు తినడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. బాపట్ల వరి పరిశోధన స్థానంలో సన్న రకాలుగా రూపొందించిన రెడ్, బ్లాక్ రైస్ బాపట్ల శాస్త్రవేత్తల కృషి ఫలించి.. ఈ రెండింటినీ సన్నరకాలుగా ఉత్పత్తి చేస్తే ప్రజలు తినేందుకు ఆసక్తి చూపిస్తారని బాపట్ల వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు భావించారు. 2019లో పరిశోధనలు చేపట్టి బీపీటీ–2848 రకం బ్లాక్ రైస్ను తొలుత సృష్టించారు. దీనిని మినీ కిట్గా రైతులకు అందించారు. మూడేళ్లపాటు వెయ్యి కిట్లు ఇచ్చి మినీ కిట్ దశ పూర్తి చేశారు. ఈ బియ్యం అచ్చం బీపీటీ–5204 రకం మాదిరిగా సన్నబియ్యంగానే ఉన్నాయి. ప్రయోగం విజయవంతం కావడంతో బీపీటీ–2841, 3136, 3137, 3145 తదితర రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. బ్లాక్ రకంలో ఫైబర్, మాంసకృత్తులు అధికంగా ఉండగా.. రెడ్ రైస్లో బీపీటీ–2858, 3143, 3182, 3140, 3111, 3507 రకాలను సైతం సృష్టించారు. వీటిలో జింక్, ఐరన్, సూక్ష్మపోషకాలు అధికం. ఈ వంగడాలు అధిక దిగుబడులు ఇవ్వడంతోపాటు ప్రజలకు రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యాన్ని ఇస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విత్తనాలను మూడేళ్లపాటు ప్రయోగాత్మకంగా రైతులకు అందించి నాణ్యతా ప్రమాణాలను పరీక్షించారు. తాజాగా ఈ విత్తనాలకు నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (న్యూఢిల్లీ) గుర్తింపు ఇచ్చింది. ఈ ఏడాది ఈ విత్తనాన్ని బాపట్ల వరి పరిశోధన స్థానం పరిధిలోని రైతులతో పాటు ఆసక్తి గల ప్రైవేట్ కంపెనీలకు అందించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. బేబీ ఫుడ్లా బ్లాక్ రైస్ పౌడర్ బీపీటీ–2848 రకం బ్లాక్ రైస్ పౌడర్ రూపంలో పిల్లలకు బేబీ ఫుడ్లా (హార్లిక్స్ తరహాలో) అందించేందుకు వివిధ కంపెనీలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఉప్మా రవ్వ, పౌడర్, జావ, పాయసం, కేకులు, అటుకులు, వడియాలు, మరమరాలు, నూడిల్స్, సేమియా తదితర పదార్థాలుగా తయారు చేయాలని బాపట్ల పరిశోధన స్థానం ఇప్పటికే నిర్ణయించింది. ఈ బ్లాక్ రైస్ వంటకాలు తినడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడటంతోపాటు కళ్ల జబ్బులు పోతాయని, పలు రకాల అనారోగ్య సమస్యలు తొలగుతాయని పరిశోధనలో తేలినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరింతగా పోషకాలు సాధారణ రకం వడ్లను పూర్తి స్థాయిలో పాలిష్ పడితే 6 లేదా 7 శాతం మాంసకృత్తులు మాత్రమే ఉంటాయి. అదే కొత్తగా రూపొందించిన బ్లాక్, రెడ్ రైస్లో 10.5 శాతం మాంసకృతులు ఉన్నాయి. బీపీటీ–2841 రకంలో అత్యధికంగా 13.7 శాతం ప్రోటీన్లు ఉండటం విశేషం. మొత్తంగా ఈ రకాల్లో టోటల్ ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు సాధారణ రకాలతో పోలిస్తే 3 నుంచి 4 రెట్లు అధికం. శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రీరాడికల్స్ను ఇవి సమతుల్యం చేస్తాయి. దీర్ఘకాలిక రోగాలను ఎదుర్కొనే ఇమ్యూనిటీ ఇస్తాయి. ఇవి ఎకరానికి 30 బస్తాలకు తగ్గకుండా దిగుబడి ఇస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 30 బస్తాలకు తగ్గకుండా దిగుబడి బాపట్ల వరి పరిశోధన స్థానంలో బ్లాక్, రెడ్ రైస్ వంగడాలను సన్నరకాలుగా ఉత్పత్తి చేశాం. ఇప్పటికే బ్లాక్ రైస్ మినీకిట్ మూడు సంవత్సరాల దశ పూర్తయ్యింది. దీనికి నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (న్యూఢిల్లీ) గుర్తింపు ఇచ్చింది. ఎకరాకు 30 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వస్తుంది. మనుషుల ఆరోగ్యానికి అత్యంత అనుకూలమైన రకం. చర్మ సౌందర్యంతోపాటు కళ్లకు మంచిదని పరిశోధనలో తేలింది. ఈ ఏడాది నుంచి రైతులతోపాటు ప్రైవేట్ కంపెనీలకు సీడ్ అందజేస్తాం. రెడ్ రైస్ సైతం మొదటి ఏడాది మినీ కిట్ దశ పూర్తయింది. ఆసక్తి ఉన్న రైతులకు ఇవి కూడా అందజేస్తాం. – బి.కృష్ణవేణి, ప్రధాన శాస్త్తవేత్త, బాపట్ల వరి పరిశోధన స్థానం -
‘మైసూర్ మల్లిక’తో ఆదాయం అదుర్స్..
కోదాడ రూరల్: మైసూర్ మల్లిక అనే దేశవాళీ వరి వంగడం సాగుచేస్తూ కళ్లు చెదిరే ఆదాయం ఆర్జిస్తున్నాడు కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంటకు చెందిన రైతు చండ్ర వెంకటేశ్వరరావు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి మైసూర్ మల్లిక దేశవాళీ వరి విత్తనాలను తెప్పించి ఎకరం విస్తీర్ణంలో పంట సాగుచేసేందుకు నారు పెంచాడు. ఎకరానికి 8 నుంచి 10 కేజీల విత్తనాలు సాధారణ వరి సాగు పద్ధతిలోనే నాటు వేశాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తూ ఎలాంటి పురుగు మందులు, దుక్కి మందులు వాడలేదు. అవసరమైనప్పుడు వేరుశనగ చెక్కను డ్రమ్ము నీటిలో నానబెట్టి దానిని బావిలో వదిలి ఆ నీటిని పంటకు అందించాడు. తెగుళ్ల బెడద లేదు.. దేశవాళీ వరి వంగడం కావడం, సేంద్రియ సాగుకు నేల అనుకూలంగా ఉండడంతో పంటకు ఎలాంటి తెగుళ్లు సోకలేదని రైతు చండ్ర వెంకటేశ్వర్రావు తెలిపాడు. అదేవిధంగా ఈ రకం వరికి వ్యాధినిరోధక శక్తి కూడా ఎక్కువ అని, గాలి దుమ్ముకు కూడా పంట నేలవాలలేదని పేర్కొన్నాడు. పైరు మూడున్నర అడుగుల ఎత్తు వరకు పెరిగిందని, ప్రస్తుతం వరి కోత పూర్తయ్యిందని, ఎకరంలో 19క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చిందని తెలిపాడు. ఎకరానికి రూ.లక్ష పైచిలుకు ఆదాయం మైసూర్ మల్లిక రకం బియ్యానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఎకరానికి 19 క్వింటాళ్లు వచ్చిందని, మిల్లు పట్టిస్తే క్వింటాల్కు 65 కేజీల చొప్పున మొత్తంగా 11క్వింటాళ్ల పైనే బియ్యం వచ్చిందని రైతు చండ్ర వెంకటేశ్వర్రావు పేర్కొన్నాడు. ఈ బియ్యాన్ని కేజీ రూ.80 చొప్పున కోదాడలోని తన సేంద్రియ ఉత్పత్తుల షాపులోనే అమ్ముతున్నట్లు తెలిపాడు. ఎకరానికి వచ్చే 19క్వింటాళ్ల వరి ధాన్యాన్ని క్వింటాల్ రూ.8వేల చొప్పున అమ్మినా రూ.1,52,000 ఆదాయం వస్తుందని, పెట్టుబడి ఖర్చు రూ.30వేలు పోగా రూ.1.22లక్షల నికర ఆదా యం తప్పకుండా ఉంటుందని రైతు వివరించాడు. రసాయన ఎరువులు వాడలేదు గత ఐదేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. మైసూర్ మల్లిక దేశవాళీ వరి వంగడం సాగుకు ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు. ఎకరానికి 11 క్వింటాళ్ల బియ్యం దిగుబడి వచ్చింది. ఆ బియ్యాన్ని కోదాడ పట్టణంలోని నా సేంద్రియ ఉత్పత్తుల షాపులో కేజీ రూ.80 చొప్పున విక్రయిస్తున్నాను. చా లా మంది ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. –చండ్ర వెంకటేశ్వరరావు, సేంద్రియ రైతు, రెడ్లకుంట -
జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సృష్టి ‘ఆర్ఎన్ఆర్ 29235’.. సరికొత్త వరి వంగడం
వ్యవసాయ వర్సిటీ విడుదల చేసిన వరి వంగడాల్లో అత్యంత కీలకమైనది ‘ఆర్ఎన్ఆర్ 29235’ రకమే. ఇప్పటివరకు యాసంగిలో వేస్తున్న వివిధ రకాల వరి రకాల్లో నూక శాతం అధికంగా ఉంటోంది. ఇది ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కూడా కారణమైంది. ప్రస్తుతం యాసంగిలో వేస్తున్న వరి రకాలను మిల్లింగ్ చేసినప్పుడు 40% బియ్యం, 60% నూకలు వస్తున్నాయి. అదే తాజాగా విడుదల చేసిన ‘ఆర్ఎన్ఆర్ 29235’ రకం వరి అయితే బియ్యం దాదాపు 62%, నూకలు 38% వస్తాయని.. దీనివల్ల కొనుగోళ్ల వివాదానికి ఫుల్స్టాప్ పడుతుందని వర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్ తెలిపారు. కొత్తగా విడుదల చేసిన అన్ని రకాల వరి వంగడాల ద్వారా అదనంగా 10% దిగుబడి వస్తుందని వివరించారు. ఇక వరి పంటకాలం ఇప్పటివరకు 135 రోజులుగా ఉండగా.. కొత్త రకాలు 125 రోజులకే కోతకు వస్తాయని వెల్లడించారు. సాక్షి, హైదరాబాద్: తక్కువ సమయంలో దిగుబడి రావడంతోపాటు మిల్లింగ్ చేసినప్పుడు నూకలు తక్కువగా వచ్చే సరికొత్త వరి రకాన్ని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ‘ఆర్ఎన్ఆర్ 29235’ పేరిట ఈ సరికొత్త వరి వంగడాన్ని తాజాగా విడుదల చేసింది. ఇతర రకాల వరితో పోలిస్తే దీనిద్వారా దిగుబడి కూడా పది శాతం ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. దీనితోపాటు మరో 9 రకాల వరి వంగడాలు, ఇంకో ఐదు ఇతర పంటల రకాలను వ్యవసాయ వర్సిటీ విడుదల చేసింది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాలను తట్టుకునేలా, తక్కువ కాలంలోనే దిగుబడి వచ్చేలా ఈ వంగడాలను అభివృద్ధి చేసినట్టు తెలిపింది. వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. వచ్చే ఏడాది వానాకాలం సీజన్ నాటికి కొత్త రకాలు రైతులకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. వీటితో రైతులకు లాభసాటిగా ఉండటంతోపాటు వినియోగదారులకూ ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో..: ప్రస్తుతం అభివృద్ధి చేసిన కొత్త వంగడాల్లో ఎనిమిదింటిని జాతీయ స్థాయిలో, ఏడింటిని రాష్ట్రస్థాయిలో విడుదల చేశారు. ఈ ఏడాది జూన్లో ఢిల్లీలో జరిగిన జాతీయ వంగడాల విడుదల, నోటిఫికేషన్ కమిటీ సమావేశంలో.. వరిలో ఐదు, పశుగ్రాస సజ్జలో రెండు, నువ్వుల్లో ఒక రకానికి ఆమోదం లభించింది. ఇక సెప్టెంబర్లో జరిగిన రాష్ట్రస్థాయిలో కొత్త వంగడాల విడుదల ఉప కమిటీ సమావేశంలో ఐదు వరి రకాలు, మినుము, నువ్వు పంటల్లో ఒక్కో రకం చొప్పున ఏడు నూతన రకాలను ఆమోదించారు. మొత్తంగా ఈ 15 వంగడాలను వ్యవసాయ వర్సిటీ తాజాగా విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక 2014 నుంచి ఇప్పటివరకు వ్యవసాయ వర్సిటీ మొత్తంగా 61 కొత్త వంగడాలను అభివృద్ధి చేసింది. ఇందులో 26 వరి రకాలు, 8 కంది రకాలు ఉన్నాయి. రైతుల ప్రయోజనమే లక్ష్యంగా: ఇన్చార్జి వీసీ రఘునందన్రావు రైతులకు మేలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం వ్యవసాయ శాఖ అనేక చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి, వర్సిటీ ఇన్చార్జి వీసీ రఘునందన్రావు, రిజి్రస్టార్ ఎస్.సుధీర్ కుమార్, రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. పత్తిలో నూతన రకాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అధిక సాంద్రత పత్తిపై ప్రయోగాలు జరుగుతున్నాయని.. దానిని 8,500 ఎకరాల్లో సాగు చేస్తున్నామని వివరించారు. కొత్త వంగడాల అభివృద్ధికి గతంలో 8–10 ఏళ్ల సమయం పట్టేదని, స్పీడ్ బ్రీడింగ్ బయో టెక్నాలజీ వినియోగంతో ఐదేళ్లలో ప్రయోగం పూర్తవుతోందని తెలిపారు. ఇక జన్యుమారి్పడి వంగడాలపైనా వర్సిటీ దృష్టి సారించినట్టు తెలిపారు. ఇప్పటికే మొక్కజొన్న, వరిలో ఈ తరహా పరిశోధనలు చేపట్టామని.. పత్తికి సంబంధించి కేంద్రం అనుమతి కోరామని వెల్లడించారు. జాతీయ స్థాయిలో విడుదలైన రకాలివీ.. 1) వరి–1 (ఆర్ఎన్ఆర్ 11718): కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పండించేందుకు సిఫార్సు చేశారు. ఖరీఫ్కు అనుకూలం. పంట కాలం 135 నుంచి 140 రోజులు. హెక్టారుకు 7 వేల నుంచి 8 వేల కిలోలు దిగుబడి వస్తుంది. చవుడు నేలల్లోనూ వేసుకోవచ్చు. 2) తెలంగాణ రైస్ 5 (ఆర్ఎన్ఆర్ 28362): ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలానికి అనుకూలం. పంట కాలం 130–135 రోజులు. దిగుబడి హెక్టారుకు 7,000–7,500 కిలోలు 3) తెలంగాణ రైస్ 6 (కేఎన్ఎం 7048): ఒడిశా, పశి్చమబెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల కోసం సిఫార్సు చేశారు. వానాకాలం అనుకూలం. పంట కాలం 115–120 రోజులే. దిగుబడి హెక్టారుకు 8000–8500 కిలోలు. ఇది దొడ్డురకం. 4) తెలంగాణ రైస్ 7 (కేఎన్ఎం 6965): ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు సిఫార్సు చేశారు. వానాకాలం పంట. 115–120 రోజుల్లో చేతికి వస్తుంది. దిగుబడి హెక్టారుకు 7500–8500 కిలోలు. ఇది పొడవు సన్నగింజ రకం. 5) తెలంగాణ రైస్ 8 (డబ్లు్యజీఎల్ 1487): వానాకాలం పంట. 125–130 రోజుల్లో.. హెక్టారుకు 5,600–6,000 కిలోల దిగుబడి వస్తుంది. మధ్యస్థ, సన్నరకం ఇది. ఫాస్పరాస్ తక్కువగా ఉన్న నేలలకు అనుకూలం. 6) నువ్వులు– తెలంగాణ తిల్–1 (జేసీఎస్ 3202): తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు సిఫార్సు చేశారు. పంటకాలం 91–95 రోజులే. హెక్టారుకు 820–980 కిలోలు దిగుబడి వస్తుంది. 7) తెలంగాణ పశుగ్రాసపు సజ్జ–1 (టీఎస్ఎఫ్బీ 17–7): తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు వానాకాలం సీజన్కు సిఫార్సు చేశారు. పంటకాలం (5౦శాతం పూతదశ) 56–68 రోజులు. 8) తెలంగాణ పలుకోతల సజ్జ–1 (టీఎస్ఎఫ్బీ 18–1): పంటకాలం (5౦శాతం పూత దశ ) 56–68 రోజులు. రాష్ట్రస్థాయిలో విడుదలైన రకాలివీ.. 1) రాజేంద్రనగర్ వరి–3 (ఆర్ఎన్ఆర్ 15459): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలంలో 135– 140 రోజుల పంట. దిగుబడి హెక్టారుకు 4,000– 4,500 కిలోలు వస్తుంది. సువాసన గల అతి చిన్న గింజ రకం ఇది. సాంప్రదాయ చిట్టిముత్యాల రకం వరితో పోలి్చతే చేనుపై పంట పడిపోయే అవకాశం తక్కువ. 2) రాజేంద్రనగర్ వరి–4 (ఆర్ఎన్ఆర్ 21278): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలం, యాసంగి సీజన్లలో వేయవచ్చు. వానాకాలంలో 115–120 రోజుల స్వల్పకాలిక రకం. దిగుబడి హెక్టారుకు 6,500 కిలోలు వస్తుంది. అగ్గితెగులును మధ్యస్థంగా తట్టుకుంటుంది. పొట్టి గింజ రకం, చేనుపై పంట పడిపోదు. 3) రాజేంద్రనగర్ వరి–5 (ఆర్ఎన్ఆర్ 29235): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాల్లో రెండు సీజన్లలో పండించొచ్చు. వానాకాలంలో 120–125 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. దిగుబడి హెక్టారుకు 7,500 కిలోలు. పొడవు, సన్నగింజ రకం. పొడవు గింజ రకాల్లో అధిక దిగుబడి ఇచ్చే రకం ఇదే. చేను పొట్టిగా ఉండి పడిపోదు. యాసంగిలో ఈ రకం ధాన్యం మిల్లింగ్ చేస్తే నూకలు తక్కువగా వస్తాయి. 4) జగిత్యాల వరి–2 (జేజీఎల్ 28545): రాష్ట్రంలోని నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలంలో 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. హెక్టారుకు 7,500 కిలోలు దిగుబడి ఇస్తుంది. 5) జగిత్యాల వరి–3 (జేజీఎల్ 27356): రాష్ట్రంలోని నీటి వసతిగల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలానికి అనుకూలం. పంట కాలం 130–135 రోజులు. దిగుబడి హెక్టారుకు 7000 కిలోలు వస్తుంది. ఇది అతి సన్నగింజ రకం ఇది. 6) మధిర మినుము–1 (ఎంబీజీ 1070): తెలంగాణ రాష్ట్రం అంతటా పండించడానికి అనుకూలం. వానాకాలం, యాసంగి, ఎండాకాలంలలోనూ పండించవచ్చు. పంటకాలం 75–80 రోజులు. హెక్టారుకు దిగుబడి 1,400–1,500 కిలోలు వస్తుంది. మధ్యస్థ దొడ్డు నలుపు గింజ రకం ఇది. 7) జగిత్యాల తిల్ –1 నువ్వులు (జేసీఎస్ 1020): పంటకాలం 85–95 రోజులు. దిగుబడి హెక్టారుకు 1,050–1,100 కిలోలు వస్తుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement