-
చరణ్ కోసం 264 కిమీ నడిచిన ఫ్యాన్, అతడిని కలిసి మురిసిపోయిన మెగా హీరో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖచిత్రాన్ని ఓ వ్యక్తి ఏకంగా వరి పంటతో తయారుచేసి అభిమానాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. సదరు అభిమానిని తాజాగా చరణ్ తన నివాసంలో కలిశాడు. చరణ్ బర్త్డే సందర్భంగా ఈ అరుదైన కానుక ఇచ్చిన సదరు ఫ్యాన్కు చెర్రి ఆత్మీయ ఆహ్వానం పలికాడు. అయితే ఆ వ్యక్తి చరణ్ను కలిసేందుకు 264 కిలోమీటర్లు నడిచి రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీంతో చరణ్ తన అభిమానికి ఆత్మీయ ఆహ్వానం పలికాడు.కాగా తెలంగాణలోని గద్వాల్ జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి షార్ట్ ఫిలిం డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: F3 First Day Box Office Collections: ఊహించని కలెక్షన్స్.. ఎంతంటే..? గట్టు మండలం ఆరగిద్దలోని ఓ రైతు నుంచి ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని రామ్ చరణ్ ముఖచిత్రం వచ్చేలా మూడు నెలలు శ్రమించి, వరి పెంచాడు. గత మార్చిలో ఈ ఫొటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజగా ఈ ఫొటోలను, తాను పండించిన బియ్యాన్ని ఇచ్చేందుకు జైరాజ్ 264 కిలోమీటర్లు నడిచి రామ్ చరణ్ను కలుసుకున్నాడు. చరణ్ నివాసంలో ఆయనను కలిసి బియ్యం గింజలతో తాను వేసిన చరణ్ బొమ్మ ఫొటోలతో పాటు, వరి వీడియోను కూడా చూపించాడు. జైరాజ్ అభిమానాన్ని చూసి చరణ్ మురిసిపోయాడు. అతడి ఆర్ట్కి ఫిదా అయిన చెర్రి జైరాజ్ను ప్రశంసించాడు. -
Ram Charan: రామ్ చరణ్ బర్త్డే.. అదిరిపోయిన అభిమాని గిఫ్ట్
సాక్షి, గట్టు (మహబూబ్నగర్): సినీనటుడు రామ్ చరణ్ ముఖచిత్రాన్ని ఓ వ్యక్తి వరి పంటతో తయారుచేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. గట్టు మండలం గొర్లఖాన్దొడ్డికి చెందిన సంధ్యాజయరాజ్ షార్ట్ ఫిలిం డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. గట్టు మండలంలోని ఆరగిద్దలోని ఓ రైతు నుంచి ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని అభిమాన నటుడు రామ్ చరణ్ ముఖచిత్రం వచ్చేలా మూడు నెలలు శ్రమించి, వరి పెంచాడు. డ్రోన్తో ఆకాశం నుంచి వరి చేలలోకి చూస్తే ఈ ముఖచిత్రం కనిస్తుంది. రెండు రోజుల క్రితమే అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయు డు ఈ చిత్రాన్ని పరిశీలించి అభినందించారు. కాగా, ఆదివారం రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వరి పంటతో చరణ్ పట్ట తన అభిమానాన్ని చాటుకున్నాడు. చదవండి: అమృత్సర్కి రామ్ చరణ్, ఎందుకంటే..? -
వరి చేనులో అగ్నిప్రమాదం
పాతపట్నం (శ్రీకాకుళం) : వరి చేనులో పంట నూర్పిడి చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రూ.2.75 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం అంగరసింగి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన పాండు తన వరి పొలంలో ట్రాక్టర్తో నూర్పిడి చేస్తుండగా మంటలు చెలరేగి ట్రాక్టర్ సహా వరి పంట కాలిపోయింది. ఈ ఘటనలో రూ.2.75 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు తెలిపాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement