-
డ్రగ్స్కు అలవాటు పడకుండా అడ్డుకుంటున్న ఓ సినిమా
న్యూఢిల్లీ: పొద్దంతా కష్టపడే వ్యక్తికి పొద్దుపోయాక కాలక్షేపానికి, మానసిక ఉల్లాసానికే ఏదో ఒకటి కావాలి. అందులోనూ రెక్కలు ముక్కలు చేసుకునే కష్టపడే రిక్షావాలాలకు మరింత అవసరం. అందుకని వారిలో కొందరు జూదానికి అలవాటు పడుతుంటే మరి కొందరు మద్యానికి, ఇంకొద్దరు వొళ్లు గుళ్లచేసే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. అచ్చం అలాంటి అలవాట్లకు దూరంగా ఉంచేందుకే నగరంలోని యమునా వంతెన కింద వెలసిందీ ఓ తాత్కాలిక సినిమా ప్రదర్శన. ఎదో ఎన్జీవో సంస్థ వచ్చి ఈ సినిమా ప్రదర్శనను ఏర్పాటు చేయడం లేదు. రిక్షా కార్మికులే కొంత మంది కలసి ఓ టీవీ, ఓ వీసీఆర్ను అద్దెకు తీసుకొచ్చి ప్రతిరోజు వారికి నచ్చే సినిమాలను ప్రదర్శిస్తున్నారు. అందుకోసం వంతెన కింద అనువైన చోట వారు పరదాలుకట్టి ఓ చిన్నపాటు తాత్కాలిక సినిమా హాలును ఏర్పాటు చేసుకున్నారు. టీవీ, వీసీఆర్, సినిమా వీసీడీల ఖర్చును భరించేందుకు ఓ పది రూపాయల టెక్కెట్టును కూడా పెట్టారు. బాక్సాఫీసు వద్ద హిట్టయిన భజరంగీ భాయ్జాన్తో పాటు హిందీలోకి డడ్ చేసిన బాహుబలి చిత్రాన్ని కూడా తాజాగా ప్రదర్శించారు. ఇక్కడ ప్రదర్శించే సినిమాలకు తాము బానిసలమయ్యామని, తాగుడు గురించిగానీ, జూదం గురించిగానీ, మత్తు పదార్థాల గురించిగానీ ఏ మాత్రం ఆలోచించడం లేదని ఇక్కడి సినిమాలకు హాజరవుతున్న రిక్షా కార్మికులు తెలియజేశారు. సినిమా అనంతరం ఈ చోటు ఆశ్రయంలేని ఎంతో మంది పేదలకు నైట్ షెల్టర్గా ఉపయోగపడుతోంది. దేశంలో దాదాపు పది లక్షల మంది ఆశ్రయంలేక వీధుల్లో పడుకుంటున్నారని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలింది. డ్రగ్స్కు వ్యతిరేకంగా తీసిన ఉడ్తా పంజాబీ చిత్రం వస్తున్న తరుణంలో ఈ తాత్కాలిక చిత్ర ప్రదర్శన కూడా చర్చనీయాంశం అయింది. లెసైన్స్ లేకుండా ఇలా సినిమాలు ప్రదర్శించడం ఏమిటని ఆగ్రహించిన కొంత మంది నిర్మాతలు, డిస్ట్రి బ్యూటర్లు అది నెరవేరస్తున్న లక్ష్యం గురించి తెలుసుకొని ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కొనసాగడం లేనందున పోలీసులు కూడా ఈ సినిమాల ప్రదర్శనను అనధికారికంగా అనుమతిస్తున్నారు. ఈ సినిమాల ప్రదర్శన గురించి తెలిసిన కేంద్రంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజా ఈ రిక్షా కార్మికుల సినిమా ప్రదర్శనపై ఓ డాక్యుమెంటరీని నిర్మించి ఇప్పుడు విడుదల చేసింది. -
రిక్షావాలాలతో భేటీకానున్న ప్రధాని మోదీ
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో రిక్షావాలాలు, తోపుడుబండ్లు లాగేవాళ్లతో సమావేశం కానున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ నెల 18న మోదీ పర్యటించనున్నారు. వారణాసిలో మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జన్ ధన్ పథకం కింద 501 రిక్షాలు, 101ఈ రిక్షాలు అందజేయనున్నారు. పేదలకు 1000 సౌర విద్యుత్ లాంతర్లు పంపిణీ చేస్తారు. సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా మోదీ స్థానిక బీజేపీ నేతలతో సమావేశమవుతారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. -
రిక్షా తొక్కాలనుకున్నా
రిక్షా కార్మికులతో భేటీలో రాహుల్ వారణాసి: ‘మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి మీతో కలసి ఒక రోజు రిక్షాతొక్కాలనుకున్నా. అయితే మీ కష్టాలను తెలుసుకోవడానికి అది సరిపోదని నాకు తెలుసు. మీ జీవితాలను మెరుగుపరచేందుకు కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుంది’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రిక్షా కార్మికులతో అన్నారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తయారీ కసరత్తులో భాగంగా ఆయన శనివారమిక్కడ కాంట్ రైల్వే స్టేషన్ వద్ద రిక్షా కార్మికులు, ఆటోడ్రైవర్లతో గంటన్నరపాటు ముచ్చటించారు. ‘నా మాటలు వినేందుకు ఒక రోజు సంపాదన వదులుకుని వచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు మళ్లీ ఆత్మగౌరవంతో జీవించేందుకు, మీ జీవితాలు బాగుపడేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తా’ అని హామీ ఇచ్చారు. బలహీన వర్గాల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలు ఆంధప్రదేశ్, కేరళ తదితర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బాగా అమలవుతున్నాయని, ఉత్తరప్రదేశ్లో మాత్రం పేదలకు చేరడం లేదని అన్నారు. సమావేశంలో రిక్షా కార్మికుల కష్టాలు విని ఆయన కదలిపోయారు. పోలీసులు తమను వేధిస్తున్నారని, లంచాలిస్తేనే రైల్వే స్టేషన్లోకి రానిస్తున్నారని రిక్షావాలాలు ఆరోపించారు. ఆటో పర్మిట్ తీసుకోవాలంటే ట్రక్కు పర్మిట్ ఫీజు కట్టాల్సి వస్తోందని ఆటోడ్రైవర్లు ఆరోపించగా, వారి సమస్యలను పరిష్కరిస్తానని రాహుల్ చెప్పారు. ఆయన వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. -
రిక్షావాలాలతో రాహుల్ సమావేశం
లక్నో: ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం వారణాశిలో ఆటో డ్రైవర్లు, రిక్షా వాలాలతో సమావేశమయ్యారు. అనంతరం కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. శివునికి ప్రత్యేకంగా 'రుద్ర అభిషేకం' పూజను నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం రాహుల్ భారీ భద్రత నడుమ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్కు వెళ్లారు. ఆయన వెంట ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ, కేంద్ర మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఉన్నారు. ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి రాహుల్కు స్వాగతం పలికారు. ఆయన 90 నిమిషాల పాటు రిక్షా వాలాలు, ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం, బీమా పథకాల గురించి వాకబు చేశారు. పోలీసుల నుంచి తమకు ఎదురవుతున్న వేధింపుల గురించి వారు రాహుల్కు విన్నవించారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
Advertisement