-
రిమ్స్లో భయానక వాతావరణం..
శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భయానక వాతావరణం నెలకొంటోంది. కొందరు సీనియర్లు జూనియర్లను చిత్ర హింసలకు గురిచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజులపాటు ఓ గదిలో బంధించి క్రికెట్ స్టంప్లతో కొట్టడంతో వారు గాయపడ్డారు. వారికి కనీసం తిండి కూడా పెట్టకుండా, దుస్తులు ఊడదీసి చిత్రహింసలకు గురిచేసినట్టు సమాచారం. భయభ్రాంతులైన వీరు సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అందించారు. అలాగే జరిగిన విషయాన్ని రిమ్స్ కళాశాల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు ఇరు వర్గాలను రాజీ చేసే ప్రయత్నాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా దెబ్బలు తిన్న, దాడి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, మాట్లాడి పంపించేసినట్లు కొందరు విద్యార్థులు చెబుతున్నారు. సీనియర్లు కొట్టిన దెబ్బలకు జూనియర్ విద్యార్థుల శరీరంపై గాయాలు రిమ్స్ కళాశాలలోనే చదువుతున్నప్పటికీ హాస్టల్లో ఉండడానికి అనుమతిలేని ఓ విద్యార్థి గడిచిన కొన్నేళ్లుగా హాస్టల్లోనే ఉంటూ కొందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడన్న ఆరోపణలువినిపిస్తున్నాయి. సదరు విద్యార్థి పరీక్షలకు హాజరు కాకుండా, వ్యసనాల బారిన పడినట్లు కూడా తెలియవచ్చింది. ఇదే విషయం రిమ్స్ అధికారులకు కూడా విద్యార్థులు చెప్పగా దానిని కూడా సర్దిచెప్పినట్లు జూనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యార్థి తరచూ ఎవరో ఒకరితో గొడవపడుతూ వారు తిరగబడిన పక్షంలో తన వెనుక రౌడీలు ఉన్నారని బెదిరించినట్లు సమాచారం. కొన్ని సందర్భాల్లో కొందరు యువకులను కూడా హాస్టల్ వద్దకు తీసుకొచ్చి బెదిరించినట్లు జూనియర్లు చెబుతున్నారు. ప్రస్తుత సంఘటనలో.. ఎవరికైనా చెబితే రౌడీలతో కొట్టిస్తానని బెదిరించడంతో బాధితులు హాస్టల్ నుంచి బయటకు వెళ్లి ప్రైవేటుగా ఉంటున్న కొందరు స్నేహితుల ఇంటిలో తలదాచుకుంటున్నారు. రిమ్స్ అధికారులు వారికి కబురుపెట్టి, దాడి చేసిన విద్యార్థి తల్లిదండ్రుల ఎదుట హాజరుపరచి రాజీ ధోరణిలో మాట్లాడినట్లు కొందరు వైద్య విద్యార్థులు చెబుతున్నారు. కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్లో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతమయ్యే ప్రమాదముంటుందని అంటున్నారు. అనధికారికంగా ఓ విద్యార్థి హాస్టల్లో ఉంటున్న విషయం గుర్తించలేకపోవడాన్ని కూడా వారు ఆక్షేపిస్తున్నారు. తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాం ఇద్దరు విద్యార్థులను సీనియర్లు కొట్టిన విషయాన్ని వారి తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నాం. కొట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాం. దాడి చేసిన విద్యార్థిని పంపించేశాం. ప్రస్తుతం విద్యార్థులంతా సంతోషంగానే ఉన్నారు. – డాక్టర్ కృష్ణవేణి, ప్రిన్సిపాల్, రిమ్స్ వైద్య కళాశాల అనధికారికంగా ఉంటున్న విషయం తెలీదు రిమ్స్ వైద్య కళాశాల హాస్టల్లో అనధికారికంగా ఉంటున్న విద్యార్థి విషయం విద్యార్థులు గాని, సిబ్బంది గాని నా దృష్టికి తీసుకురాలేదు. విద్యార్థులు ఫిర్యాదు చేసిన వెంటనే హాస్టల్ నుంచి పంపించేశాం. అతనిని హెచ్చరించాం. ఇక మీదట ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం.– డాక్టర్ బోర ప్రసాద్, వార్డెన్ -
ఎంబీబీఎస్.. మ.. మ.. మాస్!
వారంతా రేపటి ప్రాణదాతలు.. నాడిని పరీక్షించాల్సిన భావి వైద్యులు. రోగులు దైవంగా భావించే వృత్తిని చేపట్టా ల్సిన వారు. కానీ, పరీక్షల సమయంలోనే పెడదారి పట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం దుర్వినియోగపర్చారు. సెల్ఫోన్ల సాయంతో ఎంచక్కా మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారు. నిబంధనలకు కాలదన్ని పరీక్ష హాల్లోకి స్మార్ట్ఫోన్లు తెచ్చారు. వాట్సప్ ద్వారా ప్రశ్నలను స్నేహితులకు పంపి, జవాబులు తెప్పించుకొని మరీ రాస్తున్నారు. ఇది తప్పని చెప్పాల్సిన వైద్య కళాశాల అధికారులే వారికి సహకరించారు. ఒంగోలు రిమ్స్ వెద్య కళాశాలలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ తంతు సోమవారం కొత్త అబ్జర్వర్ రాకతో బట్టబయలైంది. వెంటనే అప్రమత్తమైన కళాశాల అధికారులు విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అజ్జర్వర్ నోటికి సైతం తాళం వేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు ఇలా పరీక్షల్లోనే కాపీ కొడితే ఇక ప్రజల ప్రాణాలేం కాపాడతారు? అనే ప్రశ్న ఉదయిస్తోంది. సాక్షి, ఒంగోలు సెంట్రల్: జిల్లా కేంద్రం ఒంగోలులోని రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో గత నాలుగు రోజులుగా ఎంబీబీఎస్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి మొత్తం మూడు బ్యాచ్ల విద్యార్థులు ఎంబీబీఎస్ థియరీ సప్లిమెంటరీ, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు 19 మంది, సెకండ్ ఇయర్లో ఒక విద్యార్థి, మూడో సంవత్సరం విద్యార్థులు ఏడుగురు తాము ఫెయిల్ అయిన పరీక్షలను రాస్తున్నారు. మొత్తం 27 మంది వైద్య విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలను రాస్తున్నారు. సోమవారం ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫోరెన్సిక్, ఈఎన్టి, పీడియాట్రిక్ పరీక్షలు జరిగాయి. వైద్య కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపల్ వీటిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హెల్త్ యూనివర్సిటీ నుంచి సోమవారం నెల్లూరుకు చెందిన ఒక ప్రొఫెసర్ అబ్జర్వర్గా వచ్చారు. అబ్జర్వర్ రాకతో పట్టుబడిన వైద్య విద్యార్థులు ఈనెల 21వ తేదీ నుంచి వైద్య పరీక్షలు జరుగుతున్నా, ఎక్సటర్నల్ పరీక్షల అబ్జర్వర్ సోమవారం రావడంతో వైద్య విద్యార్థుల కాపీయింగ్ గుట్టు రట్టయింది. ఈ పరీక్షలలో ఫైనల్ ఇయర్కు చెందిన ఎనిమిది మంది కాపీయింగ్కు పాల్పడుతున్నట్లు నెల్లూరు నుంచి వచ్చిన యూనివర్సిటీ అబ్జర్వర్ గుర్తించారు. ఆయన ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని విద్యార్థుల నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫోన్ ద్వారా విద్యార్థులు ప్రశ్న పత్రాలను బయట వారి స్నేహితులకు పంపి, అక్కడి నుంచి సమాధానాలను తిరిగి పొందుతున్నట్లు గుర్తించారు. కొంత మంది విద్యార్థుల వద్ద కాపీయింగ్ స్లిప్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొదట ఓ విద్యార్థి వద్ద సెల్ఫోన్ను చూసిన అబ్జర్వర్, ఇతర విద్యార్థులను తనిఖీ చేయగా ఇంకొందరి వద్ద కూడా సెల్ఫోన్లు ఉన్నాయి. దీంతో అబ్జర్వర్ వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. ఎరేజర్ పై కాపీ రాసిన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి, అప్రమత్తమైన వైద్య కళాశాల అధికారులు అబ్జర్వర్తో మాట్లాడి, కాపీయింగ్కు పాల్పడిన విద్యార్థులను డీబార్ కాకుండా కాపాడారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లా.. సెల్ఫోన్లను పరీక్ష హాలులోకి తీసుకు రాకూడదనే నిబంధన ఉన్నా వైద్య కళాశాల అధికారులు, నిబంధనలను తుంగలో తొక్కారు. సెల్ఫోన్లను పరీక్షల గదిలోకి అనుమతించారు. అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతున్నట్లు సమాచారం. పరీక్షల గదిలో సీసీ కెమెరాలు ఉన్నా కాపీయింగ్ విషయం వాటి కంట పడకుండా అధికారులు మేనేజ్ చేసినట్లు సమాచారం. విద్యార్థుల నుంచి డబ్బు దండుకుని వైద్య కళాశాల అధికారులే ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారే సోమవారం కాపీయింగ్ను గుర్తించిన అబ్జర్వర్ను బతిమాలి చర్యలు లేకుండా చూశారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా జరుగుతున్న పరీక్షల్లో రోజూ ఇదే తంతు కొనసాగిందని వైద్య కళాశాలలోని కొందరు సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. స్పందించని ప్రిన్సిపల్.. పరీక్షల్లో వైద్య విద్యార్థులు కాపీయింగ్ వ్యవహారంపై ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ప్రిన్సిపల్ అందుబాటులోకి రాలేదు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున నగదు చేతులు మారిన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. -
'పల్స్పోలియో' విజయవంతానికి ఏర్పాట్లు
రిమ్స్క్యాంపస్: జాతీయ ఇమ్యూనైజేషన్ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ రెడ్డి శ్యామల తెలిపారు. సోమ, మంగళవారాల్లో కూడా ఇంటింటికీ సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి వారికి కూడా చుక్కలు వేస్తారని చెప్పారు. డీఎంహెచ్వో కార్యాలయంలో పల్స్పోలియో కార్యక్రమ నిర్వహణపై శనివారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 27,48,177 మంది జనాభా ఉన్నారని, వీరిలో ఐదేళ్లలోపు చిన్నారులు 2,42,897 మంది ఉన్నట్టు చెప్పారు. వీరందరికీ పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి ప్రాంతంలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పట్టణ, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 1606 కేంద్రాలు, సంచార కేంద్రాలపై శ్రద్ధ చూపుతున్నట్టు తెలిపారు. పోలియో వ్యాక్సిన్, బ్యానర్ల పంపిణీ 95 శాతం పూర్తయ్యిందన్నారు. హై రిస్క్ ఏరియాను కూడా కవర్ చేసినట్టు చెప్పారు. పోలియో చుక్కలు వేయించుకున్న పిల్లలకు ఏదైనా సమస్య వస్తే ఫోన్ : 08942-229945 నంబరులో వైద్యశాఖాధికారిని, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారుల సెల్ : 9963994336, 9963994337 నంబర్లలో సంప్రదించాలన్నారు. జిల్లాలో పోలియో సమస్యాత్మాక ప్రాంతాల్లో 5,739 మంది బాలబాలికలను గుర్తించినట్టు చెప్పారు. వారికి చుక్కలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ శాఖ ప్రాంతీయ సంచాలకులు గోపాలకృష్ణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ జగన్నాథరావు, ఏడీఎం సీహెచ్ శారద, తదితరులు పాల్గొన్నారు. -
వైద్యమో.. రామచంద్రా!
రిమ్స్ క్యాంపస్: రాత్రి 9 గంటలు: జాతీయ రహదారిపై పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108లో రిమ్స్కు తీసుకొచ్చారు,9:20: డ్యూటీలో ఉన్న క్యాజువాల్టీ డాక్టర్ వారిని పరిశీలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో సంబంధిత వైద్యులను ఫోన్ చేసి పిలిచారు.9:45: వైద్యులు హుటహుటిన రిమ్స్కు చేరుకుని వైద్య సేవలందించి క్షతగాత్రుల ప్రాణాలు కాపాడారు...వారు స్థానికంగానే నివసిస్తున్న రెగ్యులర్ వైద్యులు కావడం వల్లే అత్యవసర సమయంలో క్షణాల్లో ఆస్పత్రిలో వాలిపోయి చికిత్స అందించారు. ప్రాణాలు పోకుండా కాపాడారు. మిగతా వైద్యుల్లో చాలా వరకు విశాఖ, తదితర దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నవారే. ఈ రెగ్యులర్ వైద్యుల సేవలు 20 రోజుల్లో దూరం కానున్నాయి. చుట్టపుచూపు వైద్యమే గత్యంతరం కానుంది. అదేంటి అంటారా.. 785 జీవోతో షాక్ జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఐదేళ్లకుపైగా సర్వీసు ఉన్న వైద్యులను బదిలీ చేయనుండటంతో వైద్యం కోసం డాక్టర్లను వెత్తుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడనుం ది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 785 ప్రకారం రాష్ట్రంలో వైద్య కళాశాలలను ఎ, బి, సి కేటగిరీలుగా విభజించారు. వీటిలో ఐదేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న వైద్యులను బదిలీ చేయాలని ఆదేశించారు. ఆ ప్రకారం చూస్తే పాత జిల్లా కేంద్ర ఆస్పత్రి నుంచి ప్రస్తుత రిమ్స్లోనూ కొనసాగుతున్న 17 మంది రెగ్యులర్ వైద్యులు ఈ కోవలోకి వస్తారు. దాంతో వీరి బదిలీకి రంగం సిద్ధమైంది. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ బదిలీల ఫైల్ను సిద్ధం చేస్తున్నారు. అయితే సెమీ అటానమస్ సంస్థగా ఉన్న రిమ్స్ కళాశాల వైద్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల నుంచి స్ధానికంగా ఉంటూ రాత్రి పగలు అన్న తేడా లేకుండా రోగులకు వైద్యం అందిస్తున్న రెగ్యులర్ డాక్టర్లను బదిలీ చేయాలన్న నిర్ణయం చర్చనీయాంశమైంది. విశాఖ వైద్యులు వస్తే అంతే.. ఈ 17 మంది వైద్యులను బదిలీ చేస్తే వారి స్థానంలో ఎక్కువ మంది విశాఖపట్నం నుంచే వచ్చే అవకాశముంది. విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలల్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వైద్యులను కూడా బదిలీ చేయనుండటమే దీనికి కారణం. వారు తమ అప్షన్గా అత్యంత చేరువలో ఉన్న శ్రీకాకుళం రిమ్స్నే ఎంచుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే విశాఖ నుంచి బదిలీపై వచ్చే వారు స్థానికంగా ఉండే పరిస్ధితి లేదు. విశాఖపట్నంలో ఉన్నవారంతా ప్రైవే ట్ ఆస్పత్రుల్లో పని చేస్తుండటమో.. సొంతంగా క్లినిక్లు నడుపుకోవడమో చేస్తున్నారు. వారు ఇక్కడికి బదిలీ అయినా వాటిని వదులుకోకుండా రోజూ విశాఖ నుంచి రాకపోకలు సాగించడం తథ్యం. ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో రిమ్స్లో పని చేస్తున్న చాలా మంది విశాఖ వైద్యులు స్ధానికంగా ఉండకుండా నిత్యం రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్థానిక వైద్యుల స్థానంలో విశాఖ డాక్టర్లు వస్తే.. దాదాపు వైద్యులందరూ అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు. రోగులకు తిప్పలు తప్పవు. దీర్ఘకాలిక సెలవులు ఖాయం కాగా బదిలీ అయ్యే రెగ్యులర్ వైద్యులు లాంగ్లీవ్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటికీ కాదంటే రాజీనామాలు చేసేందకు కూడా వారు సిద్ధంగా ఉన్నట్లు వైద్య వర్గాల ద్వారా తెలిసింది. తమను బదిలీ చేయడం అన్యాయమన్న భావనలో ఉన్న వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం దారుణం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి స్థానికంగా ఉంటూ ఏ సమయంలోనైనా వైద్య సేవలందిస్తున్న వైద్యులను బదిలీ చేయాలన్న నిర్ణయం ఎంతమాత్రం సమంజసం కాదు. ఇప్పటికే రిమ్స్లో అంతంత మాత్రంగా సేవలందుతున్నాయన్న చెడ్డపేరుంది, ప్రభుత్వ నిర్ణయంతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుని స్థానికంగా ఉంటున్న వైద్యుల బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. -డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ లూకలపు ప్రసన్నకుమార్, ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు -
ఏమిటీ గ‘లీజు’..?
ఈ దుకాణాన్ని చూశారా..శ్రీకాకుళం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉంది. స్వప్న హెయిర్ స్టైల్స్ పేరుతో..ఓ సెలూన్ను నిర్వహిస్తున్నారు. దీనిని..మాజీ కౌన్సిలర్ లండ శ్రీను..మున్సిపాలిటీ నుంచి లీజుకు తీసుకున్నారు. అయితే..దీనిని ఆయన నిర్వహించకుండా..టి.నాగరాజు అనే వ్యక్తికి సబ్ లీజుకు ఇచ్చారు. ఇలా..మున్సిపాలిటీలో..సబ్ లీజుల పర్వం నడుస్తోంది. మున్సిపాలిటీ నుంచి దుకాణాలను తక్కువకు దక్కించుకుని..వాటిని సబ్ లీజులకు ఇచ్చి..అద్దెలు వసూలు చేసుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. సాక్షాత్తూ..మున్సిపల్ కార్యాలయం ఎదురుగానే..సబ్ లీజుల దందా నడుస్తోందంటే..పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రిమ్స్క్యాంపస్: జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీలు,రాజాం, పాలకొండ నగర పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో వందలాది దుకాణాలు ఉన్నాయి. వీటిని..నిరుపేద వ్యాపారుల అభ్యన్నతి కోసం లీజు ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. టెండర్ల ప్ర క్రియ ద్వారా తక్కువ అద్దెలను వసూ లు చేస్తున్నారు. ఇక్కడే కొందరు గలీ జు దారులు తమ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనకు తూట్లు పొడుస్తూ..తక్కువ అద్దెలకు దుకాణాలను అద్దెకు తీసుకుని..సబ్ లీజులకు ఇస్తున్నారు. అధిక మొత్తాల్లో అద్దెలను వసూ లు చేసుకుంటున్నారు. ఇలా..70 శాతం దుకాణాలు సబ్లీజులకిచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి సబ్లీజ్కు దుకాణాలను ఇవ్వటం నిబంధనలకు విరుద్ధం. అయినా..అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదు. 331 దుకాణాలకు గాను..200 వరకు సబ్ లీజులే... శ్రీకాకుళం మున్సిపాలిటీలో..ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 14 షా పింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 402 దుకాణాలు ఉండగా..331 దుకాణాలను లీజ్కు ఇచ్చారు. మిగిలిన 71 ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అయితే..లీజ్కు తీసుకున్న 331 దుకాణాల్లో సుమారు 200 వరకు సబ్లీజులకు వెళ్లినట్టు తెలుస్తోంది.ఇలా సబ్లీజుల వ్యవహారం నడుపుతున్న వారంతా..రాజకీయ పలుకుబడి ఉన్నవారు..మున్సిపల్ కౌన్సిలర్లుగా పనిచేసిన వారే కావడం గమనార్హం. పత్తాలేని గుడ్విల్ ప్రతిపాదనలు లీజు దుకాణాలను సబ్లీజులకు ఇస్తున్న వైనంపై మున్సిపల్ అధికారులు గతంలో గుడ్విల్ ప్రతిపాదనలు చేశారు. లీజు దారుల నుంచి సబ్ లీజుకు తీసుకుని అద్దె చెల్లిస్తున్న వారికే నేరుగా దుకాణాలను కట్టబెట్టే ఆలోచన చేశారు. వారి నుంచి కొంత గుడ్విల్ను మున్సిపాలిటీకి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఒక్కో దుకాణానికి సుమా రు *లక్ష వరకు తీసుకుని..దుకాణాలను కట్టబెట్టాలని ఆలోచన చేశారు. కానీ ఈ ప్రతిపాదనలకు పత్తా లేకుం డా పోయింది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారిం చి..ఈ బాగోతానికి చెక్ చెప్పాలని పలువురు కోరుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement